LATEST NEWS
  సికింద్రాబాద్ సృష్టి షెర్టిలిటీ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను సికింద్రాబాద్‌ కోర్టులో గోపాలపురం పోలీసులు హాజరుపర్చారు. కస్టడీలో సంచలన విషయాలను పోలీసులు రాబట్టారు. పిల్లలను అమ్మే గ్యాంగులతో నమ్రత లింకులు పెట్టుకున్నట్టు గుర్తించారు. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రాకు చెందిన గ్యాంగులతో నమ్రతకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు.  అంతే కాకుండా ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్లించి అక్రమాలు జరిపినట్టు నిర్దారించారు. . గతంలో పిల్లల్ని అమ్ముతూ.. అరెస్ట్ అయిన నందిని, హర్ష, పవన్ అనే వ్యక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఒక్కొక్క పిల్లాడిని రూ.3 నుంచి రూ.5 లక్షల రూపాయలకు నమ్రత కొనుగోలు చేసినట్లు పోలీసులు వివరించారు. పిల్లల అమ్మకాలతో పాటు యువతి యువకులను కూడా నమ్రత గ్యాంగ్ ట్రాప్ చేసిందని చెప్పారు.  యువతి , యువకుల వీర్యకణాలు అండాలను సేకరించి అమ్మేవారని పోలీసులు స్పష్టం చేశారు. నమ్రత ఫెర్టిలిటీ సెంటర్‌ నిర్వహణ లైసెన్స్‌ను తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ 2021లో పొడిగించలేదు. దీంతో తాను ఆ వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ కూడా ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని గోపాలపురంలో నాలుగు అంతస్తుల భవనంతోపాటు మరో మూడు చోట్లా అక్రమంగా యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్‌ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్‌ హెడ్స్‌తో కథ నడిపించారు
  దేశంలో పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.  కారు గుర్తును పోలిన సింబ‌ల్స్ దాదాపు 9 వ‌ర‌కు ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు 2019 ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరిలో 5 వేల ఓట్ల‌తో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి గెలిచారు. త‌మ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన బూర న‌ర్స‌య్య ఓడిపోయారు. కారు గుర్తును పోలిన రోడ్డు రోల‌ర్‌కు 27 వేల ఓట్లు వ‌చ్చాయి.  ఇలా ఎన్నో సంద‌ర్భాల్లో మా పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌రిగింది. మొన్న జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో 14 స్థానాల్లో 6 వేల కంటే త‌క్కువ ఓట్ల‌తో ఓడిపోయాం. కారు గుర్తును పోలిన గుర్తుల వ‌ల్లే న‌ష్టం జ‌రిగింది.  ఆ గుర్తులను కేటాయించవద్దని ఈసీకి కేటీఆర్ విన్నవించారు. అమెరికా లాంటి దేశాలు కానీ, యూకే, జ‌ర్మ‌నీ, ఇట‌లీ కానీ, ఇంకా చాలా దేశాలు కొంత‌కాలం వ‌ర‌కు ఈవీఎంల‌ను ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసిన‌ప్ప‌టికీ, ప్ర‌జ‌ల్లో వాటిపై విశ్వాసం లేకుండా పోయింది.  ఈ క్ర‌మంలో ఈవీఎంల‌ను ర‌ద్దు చేసి పేప‌ర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్‌లో దాదాపు 100 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. ఇలాంటి దేశంలో ఈవీఎంల వ‌ల్ల న‌ష్టం జ‌రుగుతున్న‌దని కేటీఆర్ తెలిపారు. పార్టీలు ఎన్నికల వాగ్థనాలు విస్మరిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని కేటీఆర్ కోరారు.  
  మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో 33/11 కేవి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.  వేల కోట్లు దోచుకునే వాళ్ళకే పెద్ద పదవులు కావాలి. నేను అందరిలాగా పైరవీలు చేసి దోచుకునే వాడిని అయితే కాదని హాట్ కామెంట్స్ చేశారు.  తనకు మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా అనేది అధిష్టానం ఇష్టమని ఇంతకంటే దిగజారి బతకలేన్నారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి నన్ను దూరం పెట్టారని  రాజగోపాల్‌రెడ్డి వాపోయారు. పార్టీలు మారిన వాళ్లకు పదవులు ఇచ్చి తనలాంటి సీనియర్‌ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కాళ్లు మొక్కి పదవులు తెచ్చుకోదలచుకోలేదన్నారు. మనసు చంపుకొని బతకడం తన వల్ల కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.   పదవి, పైసలు అన్ని వారే తీసుకుపోతున్నారని, కనీసం పదవి లేకున్నా పైసలు మునుగోడుకు రావాలి కదా అని కామెంట్ చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీపడేది లేదని డిసైడ్ అయ్యానని, మీరు కూడా (ప్రజలు) డిసైడ్ అయ్యారా లేదా అంటూ ప్రశ్నించారు.  
ఏంటీ జ‌గ‌న్ మోహ‌న రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌పై ఉన్న 31 కేసుల‌లో 3452 సార్లు.. వాయిదాలు తీసుకుని ప్ర‌పంచ రికార్డు సృష్టించారా? ఇందుకోసంగానూ ఆయ‌న 6904 కోట్ల రూపాయ‌ల మేర ఖ‌ర్చు చేశారా?  ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.   బేసిగ్గా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రిగా త‌న ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో .. సీఎంగా తన హోదా కారణంగా బిజీబిజీ అంటూ వాయిదాల మీద వాయిదాలు తీసుకున్న‌సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆయ‌నిపుడు సీఎం కాదుకదా...  క‌నీసం ప్ర‌తిప‌క్ష  నేత కూడా కారు. ఒక సాధార‌ణ ఎమ్మెల్యే,  అయినా స‌రే ఎందుకు వాయిదాలు తీసుకుంటున్నారో అర్ధం కాలేదంటారు కొంద‌రు. ఒక వేళ ఈ వాయిదాల లెక్క క‌రెక్టే అనుకున్నా.. ఇన్ని కోట్ల రూపాయ‌ల మేర లాయ‌ర్ల కోసం ఖ‌ర్చు చేశార‌న్న‌ది న‌మ్మ‌శ‌క్యం కాలేదంటారు ఇంకొంద‌రు. మామూలుగా అయితే ఈ న్యాయ‌వాదులు ఇంత తీసుకోవాల‌న్న మాన్యువ‌ల్స్ ఉన్నాయ్. ఒక వేళ ఓపెన్ మార్కెట్లో ఆ రేటు ఎక్కువ‌గానే ఉండొచ్చు. కానీ ఇంత భారీ మొత్తం తీసుకుంటారా? అన్న ప్ర‌శ్న త‌లెత్తోంది.   ప్ర‌స్తుతం చెక్క‌ర్లు కొడుతున్న లెక్క ప్ర‌కారం  చూస్తే జ‌గ‌న్ ఒక వాయిదా అడ‌గ‌టానికి త‌న లాయ‌ర్ కి చెల్లిస్తున్న ఫీజు రూ. 2 కోట్ల రూపాయ‌లుగా తెలుస్తోంది. ఇంత డ‌బ్బు ఎక్క‌డిది?  తాను అధికారంలో లేను కాబ‌ట్టి ఆఫీసు రెంటు క‌ట్ట‌డానికే డ‌బ్బుల్లేవంటూ ఏకంగా పార్టీ కార్యాలయాన్నే ఎత్తివేసిన జగన్.. తన కేసులలో ఒక వాయిదా కోరడానికి  లాయ‌ర్ ఫీజుగా అంతంత పెద్ద మొత్తాలు ఎలా ఇస్తున్నారన్నది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.  జ‌గ‌న్ అయితే గ‌త పదేళ్లకు పైగా బెయిలు మీద ఉన్న మాట వాస్త‌వం. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల్సిందిగా గ‌తంలోనే ఈడీ, సీబీఐ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌కు మొర పెట్టుకున్న మాట కూడా వాస్తవమే.   అయినా కూడా  జ‌గ‌న్ మోహ‌న రెడ్డి ఇన్నేళ్ల పాటు బెయిలుపై బ‌య‌ట ఉండ‌టం ఆశ్చర్యం అంటారు పరిశీలకులు.  ఆ మాట‌కొస్తే ఇంత కాలం ఒక వ్యక్తి బెయిలుపై ఉండటం ఒక రికార్డు అంటారు. ఇలా ఇన్నేసేళ్లు బెయిలపై ఉండటం అన్నది   జ‌య‌లలిత, లాలూ ప్ర‌సాద్ వంటి వారికే సాధ్యం కాలేదు. అలాంటిది జ‌గ‌న్ కి ఎలా సాధ్యమౌతోందన్న వ్యాఖ్యలు పుంఖానుపుంఖాలుగా వ్యక్తం  చేస్తున్నారు కూటమి నేత‌లు. కొందరు రాజకీయ విశ్లేషకులు అయితే.. జ‌గ‌న్ , బీజేపీకి మ‌ధ్య చీక‌టి ఒప్పందం ఒప్పందం ఉందంటున్నారు. అందుకు మ‌ద్యం కేసును ఉదాహరణగా చూపుతున్నారు.   ఈ కేసులో చెవిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారు అరెస్ట‌య్యారంటే అది కూట‌మి ప్ర‌భుత్వం వేసిన సిట్ వ‌ల్లనే త‌ప్ప కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లైన ఈడీ, సీబీఐ వ‌ల్ల కానే కాద‌ంటున్నారు. నిజానికి మ‌ద్యం కేసులో ఈడీకి కావ‌ల్సినన్ని సాక్ష్యాధారులు ఉన్నా కూడా  ఇన్వాల్వ్ అయ్యే విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండటానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.  ఇలాంటి ప‌రిస్తితుల్లో జ‌గ‌న్ అరెస్టు, బెయిలు రద్దు అన్నవి అంత సులభం కాదన్న మాట కూడా రాజకీయ వర్గాలలో కాస్లంత గట్టిగానే వినిపిస్తోంది.   ఏది ఏమైనా జగన్ కేసుల వాయిదాలే ఒక రికార్డు అయితే ఇక  ఇన్నేళ్ల పాటు జగన్ బెయిల్ మీద  ఉండటం అన్నది మరో రికార్డు అంటున్నారు నెటిజనులు.  
  హైదరాబాద్‌లో నిన్న కురిసిన భారీ వర్షాలకు నగరం అల్లకల్లోలం అయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబ‌ర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. అటు వచ్చిన వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా దిగబడిపోయింది. దీంతో వాట‌ర్ ట్యాంక‌ర్ డ్రైవ‌ర్‌తో పాటు క్లీన‌ర్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.  ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు.. డ్రైవ‌ర్, క్లీన‌ర్‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. భారీ వ‌ర్షం కార‌ణంగానే రోడ్డు కుంగిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. రోడ్డు కుంగిన ఏరియాలో నాలా పైప్‌లైన్ ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. రోడ్డు కుంగ‌డంతో ఆ ఏరియాతో పాటు స‌మీప ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్ప‌డింది. వాట‌ర్ ట్యాంక‌ర్‌ను బ‌య‌ట‌కు తీసేందుకు ట్రాఫిక్ పోలీసులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.
ALSO ON TELUGUONE N E W S
Megastar Chiranjeevi has been asked to be designated elderly figure in Telugu Cinema, after the death of Dasari Narayana Rao. He has been meeting politicians and discussing with Industry bigwigs about problems within and for the support from government. Now, producers have met him at his residence about Workers Strike.  Producers C. Kalyan, Supriya Yarlagadda, Allu Aravind, Mythri Ravi Shankar, and Suresh Babu have met him. After their discussion, C. Kalyan stated that Chiranjeevi asked the producers to not stop shootings immediately. He asked them time to meet Federation and Union representatives. On the other hand, Telangana Cinematography Minister, Komatireddy Venkatreddy supported workers' demands and stated that Hyderabad has been becoming expensive, hence Workers' demands are justifiable. He stated that after Delhi tour, he will talk to producers and workers. He remarked that Government as asked Dil Raju to talk to both parties.  Chiranjeevi might also meet them in one or two days and then, he will take the matters into his hands to solve the issue amicably. With Government supporting workers, it looks like there will be more or less hand twisting for producers from Unions. We have to wait and see, how things will be solved.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచకపోతే షూటింగ్ లకు హాజరయ్యేది లేదని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, ఒకేసారి అంత శాతం పెంచడం కుదరదని నిర్మాతలు చెబుతున్నారు. అవసరమైతే యూనియన్ తో సంబంధం లేకుండా వర్కర్స్ ని తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవితో నిర్మాతలు సమావేశమయ్యారు. చిరంజీవిని కలిసిన వారిలో సి. కళ్యాణ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి రవి శంకర్, సుప్రియ యార్లగడ్డ ఉన్నారు.    చిరంజీవితో భేటీ అనంతరం నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. "మేము చిరంజీవి గారిని కలసి సమస్య చెప్పాము. 'షూటింగ్స్ సడెన్ గా ఆపడం భావ్యం కాదు. మీ సమస్యలు చెప్పారు, అటు వైపు కార్మికుల వెర్షన్ ను కూడా తెలుసుకుంటాను. రెండు మూడు రోజులు చూసి, పరిస్థితి చక్కబడకపోతే నేను జోక్యం చేసుకుంటాను' అని చిరంజీవి గారు చెప్పారు." అని తెలిపారు.    ఇక సినీ కార్మికుల ఆందోళనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించారు. "కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. హైదరాబాదులో బతకాలంటే జీతాలు పెరగాలి. ఢిల్లీ పర్యటన తర్వాత కార్మికులతో నేను మాట్లాడతాను. ఈ అంశాలన్నిటిని కూడా దిల్ రాజు కు అప్పగించాము, ఆయన చర్చిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.. టికెట్ల ధరలు పెంచేందుకు మేము అనుమతులు ఇస్తున్నాం. కార్మికులు అడుగుతున్న డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి." అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.   
  మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం 'మాస్ జాతర'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడు. శ్రీలీల హీరోయిన్. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదలైన 'తు మేరా లవర్' ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ గా 'ఓలే ఓలే' విడుదలైంది. (Mass Jathara)   రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన 'ధమాకా' మూవీ విజయంలో భీమ్స్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు 'మాస్ జాతర' కోసం కూడా ఎనర్జిటిక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ముఖ్యంగా తాజాగా విడుదలైన 'ఓలే ఓలే' సాంగ్ మాస్ ని దృష్టిలో పెట్టుకొని చేసినట్టుగా ఉంది. ఇక భాస్కర్ యాదవ్ అందించిన లిరిక్స్ అయితే సర్ ప్రైజింగ్ గా ఉన్నాయి. "ఓలే ఓలే గుంట. నీ అయ్య కాడ ఉంటా. నీ అమ్మ కాడ తింటా. నీ ఒళ్ళోకొచ్చి పంటా. బుద్ధి లేదు.. జ్ఞానం లేదు.. సిగ్గు లేదు.. శరము లేదు.. మంచి లేదు.. మర్యాద లేదు" అంటూ ఊర నాటు భాషలో ఈ సాంగ్స్ లిరిక్స్ ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరట్ ఎంతో ఎనర్జిటిక్ గా ఈ పాటను ఆలపించారు. ఇక లిరికల్ వీడియోలో వింటేజ్ రవితేజ కనిపించాడు. శ్రీలీల కూడా తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది. మొత్తానికి థియేటర్లలో ఈ సాంగ్ ఒక ఊపేలా ఉంది.   కాగా, 'మాస్ జాతర' చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. రవితేజ తన ల్యాండ్ మార్క్ మూవీతో మాస్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.  
  'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఓ కీలక షెడ్యూల్ పూర్తయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్.   పవన్ కళ్యాణ్ తో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన హరీష్ శంకర్.. "మాటిస్తే నిలబెట్టుకోడం. మాట మీదే నిలబడ్డం. మీరు పక్కనుంటే.. కరెంటు పాకినట్టే" అని రాసుకొచ్చారు. అలాగే, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో విజయవంతంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' షెడ్యూల్ పూర్తయిందని తెలిపారు. అంతేకాదు, "ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని హరీష్ సంతోషం వ్యక్తం చేశారు. హరీష్ శంకర్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   కాగా, ఇటీవల 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్.. సెప్టెంబర్ 25న 'ఓజీ'తో థియేటర్లలో అడుగు పెట్టనున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశముంది.    
  75 ఏళ్ళ వయసులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆగస్టు 14న 'కూలీ'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. అలాగే 'జైలర్-2' చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. శివ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా.. టాలీవుడ్ కి చెందిన బ్యానర్ లో రూపొందనుందని సమాచారం.   తెలుగులో 'శౌర్యం', 'దరువు' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ.. తమిళ్ లో అజిత్ తో చేసిన 'వీరం', 'వేదాళం', 'వివేగం', 'విశ్వాసం' సినిమాలతో మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు పొందాడు. ఆ తర్వాత రజినీకాంత్ తో అన్నాత్తే(పెద్దన్న) చేయగా, అది పరాజయం పాలైంది. ఇక గత చిత్రం 'కంగువా'ను సూర్యతో చేయగా.. అది డిజాస్టర్ అయింది. అయినప్పటికీ శివకి రజినీతో మరో సినిమా చేసే అవకాశం వచ్చిందట.   శివ తనకు ఫ్లాప్ ఇచ్చినప్పటికీ, ఆయనతో మరో సినిమా చేయడానికి రజినీకాంత్ రెడీ అవుతున్నట్లు వినికిడి. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగినట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మించనున్నారని తెలుస్తోంది.  
  భారతదేశంలో అత్యంత పారదర్శకమైన, ల్యాబ్ టెస్టులు చేసిన, అమెరికా ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన హెల్త్ సప్లిమెంట్లను అందించాలనే లక్ష్యంతో 'ఆల్ఫాలీట్' బ్రాండ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. నగరంలోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన ఈ గ్రాండ్ లాంచ్ వేడుకలో సోనూ సూద్ ముఖ్య అతిథిగా పాల్గొని, 'ఆల్ఫాలీట్' బ్రాండ్‌ను ఆవిష్కరించారు.   ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనూసూద్ తో పాటు మాజీ మిస్ ఇండియా మానస ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. "Authentic - Exclusive - Performance" అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన ఆల్ఫాలీట్, ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అత్యుత్తమ సప్లిమెంట్లను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.   ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. "ఆల్ఫాలీట్ వంటి ఒక అద్భుతమైన బ్రాండ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఫౌండర్లు సురేష్ శుక్లా, శ్రవణ్ ఘంటలకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజుల్లో యువత ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపుతోంది. అయితే, మార్కెట్లో కల్తీ సప్లిమెంట్ల బెడద కూడా అదే స్థాయిలో పెరిగింది. సరైన సప్లిమెంట్స్ తీసుకోకపోతే ఆరోగ్యానికి మేలు జరగకపోగా, తీవ్రమైన హాని కలిగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే ఆల్ఫాలీట్ సంకల్పం ప్రశంసనీయం. ఆల్ఫాలీట్ నాణ్యత విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ, వినియోగదారుల పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తుంది. ఈ బ్రాండ్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను," అని అన్నారు.   ఆల్ఫాలీట్ ఫౌండర్ & సీఈఓ సురేష్ శుక్లా మాట్లాడుతూ, "భారతదేశ సప్లిమెంట్ మార్కెట్‌లో విశ్వసనీయత, పారదర్శకత కొరవడింది. ఈ లోటును పూడ్చేందుకే ఆల్ఫాలీట్‌ను స్థాపించాం. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి, ఫిట్‌నెస్, బాడీబిల్డింగ్‌పై ఉన్న మక్కువతో, భారతీయ వినియోగదారులకు 100% అసలైన, క్యూఆర్-కోడ్ వెరిఫైడ్, యూఎస్ ప్రమాణాలతో కూడిన ల్యాబ్-టెస్టెడ్ సప్లిమెంట్లను అందించాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్‌ను ప్రారంభించాం" అని వివరించారు.   ఆల్ఫాలీట్ కో-ఫౌండర్, సీఎఫ్ఓ శ్రవణ్ ఘంట మాట్లాడుతూ, "సురేష్ శుక్లా ఆలోచన, ఆశయం నచ్చి ఈ ప్రయాణంలో భాగస్వామి అయ్యాను. నాణ్యత విషయంలో రాజీలేని, సమాజ శ్రేయస్సును కాంక్షించే నమ్మకమైన బ్రాండ్‌ను నిర్మించడమే మా ధ్యేయం. ఆల్ఫాలీట్ కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యానికి, సాధికారతకు పాటుపడే ఒక ఉద్యమం" అని పేర్కొన్నారు.   పూర్తిగా ల్యాబ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే తమ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయని, నాణ్యతలో అమెరికా ప్రమాణాలను పాటిస్తామని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫిట్‌నెస్ నిపుణులు, హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు.  
  చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో అతిరథ మహారధుల సమక్షములో కొత్త సినిమా ప్రారంభమైంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం నాడు ఘనంగా జరిగింది.    ఈ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆది శేషగిరి రావు ఘట్టమనేని, కేఎస్ రామారావు, డైరెక్టర్ పి. మహేష్ బాబు, కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి గోపాలకృష్ణ, బి గోపాల్, కోటగిరి వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సురేష్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.   ముహూర్తపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ అక్కినేని స్క్రిప్ట్‌ను అందించగా.. ఆది శేషగిరి రావు క్లాప్ కొట్టారు. కేఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మహేష్ బాబు.పి గౌరవ దర్శకత్వం వహించారు.    నేపాల్ దేశ రాజవంశానికి చెందిన సమృద్ధి ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. స్టీఫెన్, ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా అజయ్ అబ్రహం జార్జ్, ఎడిటింగ్ గా విజయ్ ముక్తవరపు వ్యవహరిస్తున్నారు. కొండల్ జిన్నా సహ నిర్మాత. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.   
The dynamic pairing of Ravi Teja and Sreeleela is back to set the cinematic world ablaze with their latest track, "Ole Ole." This high-energy dance number, following the massive success of "Tu Mera Lover," is quickly establishing itself as a certified dance banger. The song's undeniable appeal lies in the electrifying on-screen chemistry of the lead actors. Ravi Teja delivers his signature vintage moves, while Sreeleela's effortless energy elevates the entire performance, making their combined presence a visual spectacle that's second to none.   The infectious groove of "Ole Ole" is a testament to the musical genius of **Bheems Ceciroleo**, whose signature hook and beats are meticulously crafted to ignite a frenzy among audiences. The track, featuring Bheems's vocals alongside the talented Rohini Sorrat, promises to be a mass celebration. The peppy, catchy lyrics by Bhaskar Yadav Dasari perfectly complement the song's energetic mood. Director Bhanu Bhogavarapu deserves commendation for expertly setting the tone for this mass entertainer. Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, the film, *Mass Jathara*, has been generating significant buzz since its announcement. With the release of "Ole Ole," the anticipation for this full-fledged mass entertainer, scheduled to hit theaters on August 27th, has reached new heights.
భారతీయ సినీప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'దీపికా పదుకునే'(Deepika padukone). బాలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించి తనకంటు ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న 'దీపికా' గత ఏడాది ప్రభాస్, నాగ్ అశ్విన్ ల కల్కి 2898 ఏడి' తో తన సత్తా చాటింది.ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో చేస్తుంది. దీపికా క్యారక్టర్ కి సంబంధించి, మేకర్స్ రిలీజ్ చేసిన  వీడియోతో, దీపికా ఒక శక్తీ వంతమైన పాత్రలో కనిపించబోతున్న విషయం అర్ధమవుతుంది. కొన్ని రోజుల క్రితం ఒక అంతర్జాతీయ హోటల్ చైన్ తో కలిసి ‘ఇట్ మ్యాటర్స్ వేర్ యు స్టే'(It Maaters where you stay)ప్రచారంలో భాగంగా ఒక రీల్ ని దీపికా 'ఇన్ స్టాగ్రామ్'(Instagram)లో పోస్ట్ చేసింది. ఎనిమిది వారాల క్రితం చేసిన ఆ  రీల్ ఇప్పటి వరకు 190 కోట్ల వ్యూస్ ని రాబట్టింది. దీంతో ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తరుపున ఉన్న అత్యధిక వ్యూస్ రికార్డుని దీపికా అధిగమించి,ప్రపంచంలోనే అత్యధికంగా చూసిన రీల్ గా రికార్డు సృష్టించింది. దీపికాకి ఇన్ స్టాగ్రామ్ లో  80 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.  దీపికా ఇటీవల హాలీవుడ్ కి చెందిన 'వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటిగా నిలిచిన విషయం తెలిసిందే. 2006 లో ఉపేంద్ర హీరోగా కన్నడంలో తెరకెక్కిన  ఐశ్వర్య మూవీతో  దీపికా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 2007 లో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్(Shah Rukh Khan)తో కలిసి చేసిన 'ఓం శాంతి ఓం' తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.    
  సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి రకరకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి వంటి విషయాల గురించి ఎన్నో వార్తలు పుట్టుకొస్తుంటాయి. నిప్పు లేనిదే పొగ రాదు అనే మాటను ఫాలో అవుతూ.. ఆ వార్తలను నమ్మేవారు ఎందరో ఉంటారు. ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా విషయంలోనూ అదే జరిగింది. (Tamannaah Bhatia)   పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ను తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తలను తాజాగా తమన్నా ఖండించండి. ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కోసం వెళ్ళినప్పుడు అబ్దుల్ రజాక్ ను కలిశాను తప్ప.. తమ మధ్య వ్యక్తిగత పరిచయం లేదని తమన్నా తెలిపింది. ఒక ఈవెంట్ లో కనిపించినంత మాత్రాన.. పెళ్లి రూమర్స్ రావడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పింది.   ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో తమన్నా డేటింగ్ లో ఉన్నట్లు కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. దీనిపై కూడా తమన్నా స్పందించింది. తాను విరాట్ ను కలిసిందే ఒకసారని, అయినా డేటింగ్ రూమర్లు వచ్చాయని, ఆ సమయంలో తాను మానసికంగా ఇబ్బంది పడ్డానని తమన్నా చెప్పుకొచ్చింది.   ఇదిలా ఉంటే, కొంతకాలం క్రితం నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ లో ఉంది. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఏవో కారణాల వల్ల వీరికి బ్రేకప్ అయింది.  
  నేటికాలంలో దాదాపు ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉపయోగించబడుతుంది. ఆహారాన్ని తాజాగా ఉంచడానికి లేదా ఐస్ క్రీమ్ తినడానికి లేదా ఏవైనా పదార్థాలు కోల్ట్ గా  తినడానికి అయినా, చల్లని నీటి కోసం అయినా.. ఇలా   ఫ్రిజ్ చాలా విషయాలను సులభతరం చేసింది. ఫ్రిజ్ ఎక్కువగా వంటగదిలోనే ఉంచబడుతుంది.  కొన్ని వస్తువులు ఫ్రిజ్ పైన పెరుగుతాయి. కొన్ని వస్తువులను ఫ్రిజ్ పైన,  ఫ్రిడ్జ్ కు  సమీపంలో ఉంచడం వల్ల ఫ్రిజ్ దెబ్బతింటుంది. ఈ వస్తువులు ఫ్రిజ్  శీతలీకరణను తగ్గిస్తాయి. అలాగే  కంప్రెసర్ పై అదనపు ప్రత్తిడిని కలిగిస్తాయి. ఫ్రిజ్ పదే పదే పాడవుతుంటే లేదా దాని శీతలీకరణ బలహీనంగా ఉంటే ఇలాంటి తప్పులు కారణం కావచ్చు. ఫ్రిడ్జ్ విషయంలో చేయకూడని పనులేంటంటే.. ఫ్రిజ్ పక్కన ప్లాస్టిక్ డబ్బాలు లేదా క్రేట్లను ఉంచకూడదు.  ప్లాస్టిక్ డబ్బాలు లేదా క్రేట్లను ఫ్రిజ్ పక్కన లేదా పైన కూడా  ఉంచకూడదు. అవి ఫ్రిజ్  సహజ వెంటిలేషన్ను  అడ్డుకుంటాయి. గాలి ప్రవాహ బ్లాక్ కారణంగా ఫ్రిజ్ వేడెక్కడం ప్రారంభమవుతుంది.  దీని కారణంగా   వ్యవస్థ నెమ్మదిస్తుంది. ఫ్రిజ్ న్ను గుడ్డతో కప్పకూడదు.  దుమ్ము, ధూళి నుండి రక్షించడానికి  తరచుగా ఫ్రిజ్ను గుడ్డ లేదా ప్లాస్టిక్ షీట్తో కప్పి ఉంచుతారు. దీని కారణంగా ఫ్రిజ్  వెంటిలేషన్ కూడా ప్రభావితమవుతుంది. నిజానికి, కవర్ కారణంగా, ఫ్రిజ్ పైభాగం మూసుకుపోతుంది. అక్కడి నుండి వేడి గాలి బయటకు వస్తుంది. దీని కారణంగా ఫ్రిజ్  శీతలీకరణ కూడా ప్రభావితమవుతుంది. ఫ్రిడ్జ్ కు సమీపంలో ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉంచకూడదు. చాలా సార్లు ప్రజలు ప్రిజ్ చుట్టూ లేదా పైన ఎక్స్ టెన్షన్ బోర్డును ఉంచుతారు. కొన్ని సార్లు మొబైల్ ఫోన్ లు కూడా పెడుతుంటారు.  ఫ్రిజ్ యొక్క  అధిక వోల్టేజ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ను దెబ్బతీస్తుంది. ఎక్కడి నుంచో నీరు పడితే లేదా తేను పేరుకుపోతే షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఉంటుంది. ఫ్రిజ్ దగ్గర చెత్త డబ్బాను ఉంచకండి.  ఫ్రీజ్ చుట్టూ చెత్త డబ్బాను ఉంచడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. చెడు వాసనలు, తేమ,   బ్యాక్టీరియా..  ఫ్రిజ్ లోకి ప్రవేశించి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. చెత్త డబ్బాను ఉంచడం వల్ల ఫ్రిజ్ దగ్గర మురికి,  తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల కంప్రెసర్ అధికంగా పనిచేస్తుంది.                         *రూపశ్రీ.
  వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇళ్లలో దోమల సంఖ్య  పెరగడం మొదలవుతుంది. అవి కుట్టడం వల్ల దురద, దద్దుర్లు వంటివి   కలిగించడమే కాకుండా డెంగ్యూ,  మలేరియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. సాధారణంగా  దోమలను తరిమికొట్టడానికి కాయిల్స్ లేదా లిక్విడ్స్  ఉపయోగిస్తారు. కానీ వాటిలో ఉపయోగించే రసాయనాల కారణంగా ఇవి అనారోగ్యానికి దారి తీస్తాయి.  వీటి మీద అవగాహన ఉన్న వారు రసాయనాలను వదిలి సహజమైన పద్దతిలో దోమలు పారద్రోలడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. పాత రోజుల్లో దోమలను తరిమికొట్టడానికి  వేప ఆకులను పొగబెట్టేవారు. కానీ ఈ కాలంలో ఈ  పొగ వల్ల కూడా  సమస్యలను ఎదుర్కొంటారు. అలా కాకుండా దోమలను తరిమికొట్టేందుకు  వేపను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. వేపనీరు.. ఇది సులభమైన మార్గం.. . కొన్ని వేప ఆకులను తీసుకొని నీటిలో బాగా మరిగించాలి. నీటి రంగు మారి ఆకులు మృదువుగా మారినప్పుడు నీటిని చల్లబరిచిన తర్వాత ఫిల్టర్ చేయాలి.  ఇప్పుడు ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంటి మూలల్లో, కర్టెన్లలో,  దోమలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో స్ప్రే చేయాలి. దోమలు దాని వాసన కారణంగా పారిపోతాయి. వేప ఆకులు.. వేప ఆకులను ఉంచడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా  సహజ అవరోధంగా పనిచేస్తుంది . తాజా వేప ఆకులను తీసుకొని వాటిని మెష్ చేసిన కిటికీలు, తలుపులు లేదా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలపై వేలాడదీయాలి లేదా ఉంచాలి. వేప వాసన దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. కావాలంటే  వాటిని బాత్రూమ్ కిటికీపై కూడా ఉంచవచ్చు. వేప పేస్ట్.. వేప పేస్ట్ తయారు చేయడం వల్ల చర్మాన్ని దోమల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. తాజా వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి.  కావాలంటే దానికి కొంచెం కొబ్బరి నూనె కూడా జోడించవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్‌ను పడుకునే ముందు చేతులు, కాళ్ళు,  మెడపై రాయాలి. దీని బలమైన వాసన దోమలను దగ్గరికి రానివ్వదు.   పొగ.. నేరుగా వేపాకు పొగ వేయడానికి ఇబ్బంది పడేవారు వేపాకును పొగలో ఉపయోగించడానికి సులభమైన చిట్కా ఉంది. అదే సాంబ్రాణి పొగ.. ప్రతి రోజూ సాయంత్రం కొన్ని బొగ్గులను కాల్చి అందులో సాంబ్రాణితో  పాటూ కాసింత వేపాకుల పొడిని కూడా వేస్తే ఆ పొగకు దోమలు పరార్ అవుతాయి.                            *రూపశ్రీ.  
ఒక మనిషి వ్యక్తిత్వం ఆ మనిషి జీవితంలో ఎదుగుదలను,   ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కరూ తాము కరెక్టే అనుకుంటూ ఉంటారు. ఇలా కరెక్టే అనుకోవడం ఆ మనిషికి తన మీద తనకు నమ్మకం ఉండటం కావచ్చు. కానీ.. కొన్నిసార్లు ఇట్లాంటి నమ్మకాలు,  వ్యక్తిలో ఉండే కొన్ని గుణాలు వ్యక్తిని దెబ్బతీస్తాయి.  వాటిని సరిగా అర్థం చేసుకోలేని పక్షంలో అవి వ్యక్తిని పాతాళానికి తొక్కేస్తాయి కూడా.  ఆ అలవాట్లేంటో తెలుసుకుంటే.. ఆధిపత్యం.. ప్రతిసారీ  అభిప్రాయాన్ని చెప్పే అలవాటు ఉందా? వాదనలో ఎదుటి వ్యక్తి మాట వినకుండా నిర్ణయం తీసుకుంటారా? అలా అయితే తెలియకుండానే ఆధిపత్య వ్యక్తిత్వంలో భాగమయ్యే అవకాశం ఉంది.  ఇది క్రమంగా సంబంధాలలో దూరాన్ని సృష్టించవచ్చు. ప్రతి పరిస్థితిలోనూ నాయకత్వం వహించడం అవసరం కావచ్చు, కానీ అది అహం,  నియంత్రణగా మారినప్పుడు అది సంబంధాలకు ,  స్వంత వ్యక్తిత్వానికి హాని కలిగిస్తుంది. సంబంధంలో కనెక్షన్ ముఖ్యం, నియంత్రణ కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. సంభాషణలో అంతరాయం.. సంభాషణ మధ్యలో  ఎవరినైనా పదే పదే అంతరాయం కలిగిస్తే లేదా ఎల్లప్పుడూ మీ అభిప్రాయాన్ని ముందుగా తెలియజేస్తే, అది ఆధిపత్య ప్రవర్తన. ఇతర వ్యక్తులు ఈ రకమైన ప్రవర్తనను ఇష్టపడరు.  వారు మీతో మాట్లాడకుండా ఉంటారు. దీన్ని సరిచేసుకోవాలంటే..  ఇతరులు మాట్లాడటం ముగించిన తరువాత   సమాధానం ఇవ్వాలి.  మీరు మాట్లాడిన తరువాత వారి సమాధానం వినాలి. సొంత నిర్ణయాలు.. స్నేహం, సంబంధం లేదా ఆఫీసులలో  ప్రతిసారీ "ఏమి చేయాలో" ఎవరికి వారు  నిర్ణయించుకోకూడదు.  ఒక వేళ అలా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే  ఎదుటి వ్యక్తి ఆలోచనలకు స్థలం ఇవ్వడం లేదని అర్థం. ప్రతి విషయాన్ని ఇతరులకు ఒక ఆర్డర్ లాగా సొంతంగా నిర్ణయం తీసుకుని అధికారం చూపిస్తే అది చాలా తప్పు. దాన్ని సరిదిద్దుకోవాలి.  నలుగురు పాల్గొనే ఒక విషయంలో నలుగురి నిర్ణయాలు,  నలుగురి ఆలోచినలు, నలుగురి వ్యక్తీకరణలు కూడా ఉండాలి. వాదనలో గెలవాలనే తత్వం..  చర్చ సమయంలో ఎల్లప్పుడూ వాదనలో గెలవడానికి ప్రయత్నిస్తే లేదా వాదనలో గెలిచిన తర్వాత  అభిప్రాయాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే.. ఇది కూడా ఆధిపత్యానికి సంకేతం. వాదనలో గెలవడం కాదు, అర్థం చేసుకోవడం ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ప్రతిసారీ వాదనలో గెలవడానికి ప్రయత్నించకూడదు.  ఇతరులు ఏమి చెబుతారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. విషయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప.. నష్టం చేకూరినా సరే.. తన మాటే నెగ్గాలి అనే స్వభావం పనికిరాదు. అందరూ తనకు నచ్చినట్టు ఉండాలని అనుకోవడం.. ప్రతి ఒక్కరికీ ఒక ఆలోచన,  ఒక అభిప్రాయం,  కొన్ని ఇష్టాఇష్టాలు.. ఉంటాయి.  వాటికి తగినట్టే వారి ప్రవర్తన కూడా ఉంటుంది. కానీ ఇతరులను మార్చడానికి ప్రయత్నించేవారు లేదా వారి అభిప్రాయమే ఫైనల్ అని కోరుకునే వ్యక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని అర్థం.  మీ ఇష్టానుసారం ఇతరులను మార్చడానికి ప్రయత్నించే బదులు, వారి ఆలోచనలు, జీవనశైలి,  ప్రవర్తనను స్వీకరించడమే ఉత్తమమైన వ్యక్తిత్వం.  ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం వల్ల ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావు. అట్లాగే.. తన వ్యక్తిత్వ గౌరవాన్ని నిలబెట్టుకుంటూనే.. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించడం చేసినట్టు అవుతుంది.                               *రూపశ్రీ.
  పసుపులో ఉన్న ఔషద గుణాలు మరిదేనిలోను లేవని అంటున్నారు యు నాని వైద్యులు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ పసుపు లోనే కాదు పసుపు చెట్టు ఆకుల లోను ఔషద గుణాలు ఉన్నాయని అంటున్నారు సత్య. సహజంగా అందరికి తెలిసింది పసుపు కేవలం కూరలలోనే వాడతారని, లేదా సంప్రదాయంగా  పసుపు ను పూజా కార్య క్రమాలలో వాడతారు. సంప్రదాయ పద్దతిలో జరిగే  పెళ్లి లోను పసుపుదే కీలక పాత్ర,సహజంగా గ్రా మీణ ప్రాంతాలలో చిన్న పాటి గాయం అయితే రక్త శ్రావం ఆగడానికి ముందుగా వాడేది పసుపే అని అంటారు యునాని వైద్యురాలుఅక్కడ పసుపు యాంటి బాయిటిక్  గా పనిచేస్తుందని అన్నారు.   ఎస్ జి వి సత్య. ముఖ్యంగా పసుపు మొక్క నుండి తీసిన పసుపు కొమ్ము ను ఆరగ దీసి పెట్టుకుంటే దద్దుర్లు వాపులు  తగ్గుతాయి. పసుపు ఆకును డికాక్షిన్  తో స్నానం చేస్తే దద్దుర్లు తగ్గుతాయి. పసుపును డ వేడి వేడి పాలలో వేసి తీసుకుంటే జలుబు దగ్గు తగ్గుముఖం పడుతుంది. పసుపు ఆకుల రసాన్ని  డికాక్షిన్ రూపం లో తీసుకుంటే శరీరం లో ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. ఇక సాంప్రదాయానికి వస్తే వివాహానికి సంబంధించి పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు కి సంబంధించి చేసే మంగళ స్నానాలలో పసుపు వాడడం అనావాయితిగా వస్తుంది. పసుపు కాళ్ళకు రాసుకుంటే  యాంటీ బాయిటిక్ గా పనిచేస్తుంది. కాళ్ళ పగుళ్ళు ఉన్న వారికి పసుపు రాసుకుంటే పగుళ్ళు తగ్గుతాయి.  ఇక ముఖం పై పసుపు రాసుకుంటే ముఖం పై వచ్చే ముడతలు తగ్గి ముఖం లో  గ్లౌ వస్తుంది.అలాగీ మీ ముఖం మరింత సౌందర్యం కావాలంటే తేనె, పసుపు ఆకు రసం కలిపిన  లేపనాన్ని కలిపి రాస్తే ముఖం మరింత కాంతి వంతంగా మెరుస్తుందని యునాని హెల్త్ క్లినిక్  కు చెందిన డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. పసుపు ఆకు ఇమ్యునిటీ  బూస్టర్ గా పని చేస్తుంది.పసుపు ఆకు డికాక్షిన్ ను క్యాన్సర్ వచ్చిన రోగులకు వారానికి ఒక సారి ఇస్తే  నీరసం తగ్గి కొంచం కోలుకుంటారని డాక్టర్ ఎస్ జి వి సత్య వివరించారు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  జామకాయను పేదవాడి యాపిల్ అంటారు. యాపిల్ పండులో ఉండే పోషకాలకు సమానమైన పోషకాలు ఉండటం వల్ల,  యాపిల్ పండు కంటే తక్కువ ధరలో దొరకడం వల్ల జామకాయను పేదవాడి యాపిల్ అంటారు. జామపండు పోషకాల నిధి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జామపండు మధ్యలో విత్తనాల భాగం అంటే చాలామందికి నచ్చదు.   ఈ విత్తనాల భాగాన్ని తొలగించి కండ భాగాన్ని తింటుంటారు.  అయితే జామపండులో నిజమైన బలం దాని మధ్యలో ఉంటుందట. పరిశోధకులు దాని విత్తనాలపై పరిశోధన చేసి ఇందులో చాలా  శక్తి ఉంటుందని స్పష్టం చేశారు.  దీని  గురించి తెలుసుకుంటే.. జామ గింజలు ఎందుకు పారేస్తారు? కిడ్నీలో రాళ్లు వస్తాయనే భయంతో చాలా మంది జామ గింజలను పారేస్తుంటారు. కానీ జామ విత్తనాల గురించి చేసిన పరిశోధనలు చాలా షాకింగ్ ఫలితాలను వెల్లడించాయి. ప్రయోజనాలు.. జామ గింజలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. అంతే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రమాదకరమని నిరూపించే ALT,  AST ఎంజైమ్‌ల స్థాయిలు కూడా తగ్గుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది . జామ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి ఇవి పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు  వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో సహాయపడతాయి. అంటే జామ పండ్లను బాగా తినేవారికి వృద్దాప్యం తొందరగా రాదు. జామ గింజల్లో కాల్షియం, జింక్, కాపర్ , ఫాస్పరస్ ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకలకు చాలా అవసరం. లేకపోతే బలహీనత మొదలవుతుంది. ఇది తీవ్రంగా మారితే  బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. . ఈ వ్యాధిలో ఎముకలు చాలా బలహీనంగా మారతాయి, సులభంగా విరిగిపోతాయి. జామపండు మొత్తం ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది రెండు రకాల ఫైబర్‌లను అందిస్తుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. సరైన జీర్ణక్రియ ఉంటే  ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, పైల్స్ మొదలైన సమస్యల ప్రమాదం దానికదే తగ్గుతుంది. ఈ లాభాలతో  పాటు శరీరానికి ప్రోటీన్ కూడా లభిస్తుంది. విత్తనాలను ఇలా కూడా.. జామ విత్తనాలను నేరుగా జామ పండుతో తినడం ఇష్టం లేకపోతే..  జామ విత్తనాలను పండు నుండి వేరు చేయాలి.  వీటిని ఎండబెట్టాలి.  తరువాత వీటిని దోరగా వేయించి నిల్వచేసుకోవాలి.  వీటిని అప్పుడప్పుడు తినవచ్చు. అంతే కాకుండా ఈ విత్తనాలను స్పైసీ పౌడర్ లా కూడా తయారుచేసుకుని తీసుకోవచ్చు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  నేటి బిజీ జీవితంలో మానసిక ఒత్తిడి దాదాపు ప్రతి వ్యక్తి లైఫ్ లో  భాగంగా మారింది. పని ఒత్తిడి, సామాజిక అంచనాలు, సంబంధాల సమస్యలు,  భవిష్యత్తు గురించి అసంతృప్తి.. మొదలైనవన్నీ  మానసిక ఆరోగ్యంపై నిరంతరం ప్రభావం చూపుతున్నాయి. ఒత్తిడి మరియు ఆందోళన మీ మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా, నిద్ర లేకపోవడం, జీర్ణ సమస్యలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ,   అలసట వంటి  శారీరక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి.  దినచర్యలో కొన్ని చిన్న,  సులభమైన మార్పులు చేయడం ద్వారా  ఒత్తిడి,  ఆందోళన నుండి బయటపడవచ్చని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండి మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయపడే మూడు మార్పుల గురించి తెలుసుకుంటే.. వ్యాయామం, శారీరక శ్రమ.. ఒత్తిడిని తగ్గించడానికి మొదటి సులభమైన మార్పు క్రమం తప్పకుండా వ్యాయామం. ప్రతిరోజూ 20-30 నిమిషాలు వేగంగా నడవడం, యోగా లేదా స్ట్రెచింగ్  వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అనులోమ-విలోమ వంటి  ప్రాణాయామం,  ధ్యానం మనస్సును ప్రశాంతపరుస్తాయి. ఇంట్లో తేలికపాటి ఏరోబిక్స్ లేదా డాన్స్  కూడా ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. సమతుల ఆహారం,  హైడ్రేషన్.. సమతుల్య ఆహారాన్ని స్వీకరించడం వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన కంట్రోల్ లో ఉంచవచ్చు. చేపలు, వాల్‌నట్‌లు,  అవిసె గింజలు వంటి ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. విటమిన్ బి,  మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు, ఆకుపచ్చ కూరగాయలు, అరటిపండ్లు,  బాదం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. చక్కెర,  కెఫిన్ అధికంగా తీసుకోవడం ఆందోళనను పెంచుతుంది. కాబట్టి వాటిని తీసుకోవడం పరిమితం చేయాలి. ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగడం వల్ల డీహైడ్రేషన్ నివారించవచ్చు.  ఇది ఒత్తిడిని నియంత్రిస్తుంది. మైండ్ఫుల్నెస్.. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడానికి మూడవ మార్పు  మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయడం,  బాగా నిద్రపోవడం. 5-10 నిమిషాల లోతైన శ్వాస పద్ధతులు వంటి మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. నీలి కాంతి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి, నిద్రవేళకు ముందు స్క్రీన్ సమయాన్ని (మొబైల్, టీవీ) తగ్గించాలి. ప్రతిరోజూ 7-8 గంటల గాఢ నిద్ర ఒత్తిడిని తగ్గిస్తుంది.  మెదడును రీఛార్జ్ చేస్తుంది. నిద్రవేళకు ముందు గోరువెచ్చని నీరు త్రాగడం లేదా పుస్తకం చదవడం నిద్రను మెరుగుపరుస్తుంది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..