LATEST NEWS
  విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని హైదరాబాదులోని వారి నివాసానికి వెళ్లి సీఎం చంద్రబాబు   పరామర్శించారు. ఇటీవల సుజనా చౌదరి లండన్ లో ఓ ప్రమాదంలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఇంటికెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. బేగంపేట్‌లోని కిమ్స్-సన్‌షైన్  ఆసుపత్రిలో సుజనాకు చేసిన సర్జరీ విజయవంతమైంది.  మరో రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు ఆయనకు సూచించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం చంద్రబాబు పరామర్శించారు. వైద్యులు ఇచ్చిన మెడికేషన్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతోన్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. 
  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలు తదితర అంశాలపై చర్చించారు. త్వరలో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ బోర్డులో భాగస్వామ్యం కావాలని అభిజిత్‌ బెనర్జీని కోరగా.. అందుకు ఆయన అంగీకరించారు. ఫ్యూచ‌ర్ సిటిలో ఆర్ట్స్ అండ్  క్రాఫ్ట్స్, సృజనాత్మకతను భాగం చేయాల‌ని బెనర్జీ సూచించారు.  సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులు నిర్వహించాలని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రగతికి దోహదపడే పలు సూచనలను అభిజిత్ బెనర్జీ సీఎం రేవంత్‌కి అందించారు. ముఖ్యంగా, ఫ్యూచర్ సిటీ ప్రణాళికలో కళలు, చేతివృత్తులు, సృజనాత్మకతను అంతర్భాగం చేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులను నిర్వహించాలని కూడా సూచించారు.
  ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిశారు.శనివారం సాయంత్రం నారా లోకేశ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి దేశ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. అనంతరం, ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం ప్రధానమంత్రి ఆహ్వానం మేరకే జరిగినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రధాని అమరావతిలో పర్యటించిన విషయం విదితమే. ఆ పర్యటన సందర్భంగా, నారా లోకేశ్‌ను దిల్లీ వచ్చి తనను కలవాల్సిందిగా ప్రధాని సూచించారు.  ఈ నేపథ్యంలోనే, లోకేశ్‌ ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు.ఈ సందర్భంగా ప్రధాని, లోకేశ్ దంపతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుమారుడు, చిన్నారి దేవాన్ష్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముచ్చటించారు. ఫ్యామిలీపరమైన విషయాలతో పాటు, ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా వీరిరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.  
  కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  రైతుబజార్‌లో కూరగాయలు కొని ముఖ్యమంత్రి డిజిటల్ పేమెంట్ చేశారు. అనంతరం కూరగాయలు వ్యాపారి అయిన మహిళను ఫోన్ పే చేశాను అమ్మ  ఒకసారి చెక్ చేసుకో సీఎం చంద్రబాబు అన్నారు. దీంతో సదరు వ్యాపారి సంతోషం వ్యక్తం చేసింది. స్వయనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెజిటేబుల్స్ కొనడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్ధాలతో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్‌లో ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తానే రైతు బజార్‌ లను ఏర్పాటు చేశానని అన్నారు. కర్నూలులోని రైతు బజార్‌ను రూ.6 కోట్లు కేటాయించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో 175 రైతు బజార్‌లు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర, ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు అందిస్తామని సీఎం తెలిపారు.
  కశ్మీర్  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ సైనిక దళం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. సెక్రటరీయట్ నుంచి సైనిక్ ట్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ విద్యాసాగర్, రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు యువత, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాలు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తాయి. దీనిలో భాగంగా  వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘వీరోచిత పోరాటం చేసిన సైనికులందరికీ జై జైలు కొట్టాలని పేర్కొన్నారు.   ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువు, ఆర్థిక శక్తి భారతదేశం. గొప్ప శక్తి ఉన్నప్పటికీ ఏ దేశం పై యుద్ధానికి కాలు తీయలేదు. మన దేశాన్ని కాపాడకోవడానికి ఎదురు దాడికి దిగామని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విలక్షణమైనటువంటి వ్యూహంతో వ్యవహరించారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఇండియా ఉంది. దేశ ఐకమత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. టెర్రరిజాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్ సమస్య కాదు...కశ్మీర్ ఇండియాలో పార్ట్. పీవోకేపై మాత్రమే ఇప్పుడు చర్చ. మధ్యవర్తిత్వం వర్తించడానికి అమెరికా జోక్యం అవసరం లేదు. మన సమస్యను మనం పరిష్కరించుకోగలం’ అని ఆయన స్పష్టం చేశారు.  
ALSO ON TELUGUONE N E W S
విశ్వకథానాయకుడు కమల్ హాసన్(Kamal Haasan)గ్రేటెస్ట్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam)కాంబోలో తెరకెక్కిన మూవీ 'థగ్ లైఫ్'(Thug Life).గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ మూవీపై కమల్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 5 న పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది. శింబు(SImbu) త్రిష(Trisha)అభిరామి, ఐశ్వర్య లేక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తమిళ, తెలుగు భాషలతో సహా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే కమల్, మణిరత్నం ఈ చిత్రం ద్వారా తమ విశ్వరూపాన్ని చూపించబోతున్నారని అర్ధమవుతుంది. కమల్ భిన్నమైన గెటప్ లతో గ్యాంగ్ స్టర్ కి నాయకుడుగా కనిపిస్తున్నాడు. అనాధ అయిన శింబుని కమల్ తన కొడుకుగా చెప్పడం, ఆ తర్వాత ఇద్దరు శత్రువులు మారడం కూడా చూపించడంతో ప్రేక్షకుల్లో మూవీ పై మరింత క్యూరియాసిటీ పెరిగిందని చెప్పవచ్చు. విజువల్ గాను ఐ ఫీస్ట్ కలిగించనుందని కూడా ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది.  ఏ ఆర్ రెహ్మాన్  సంగీత సారధ్యంలో  తెరకెక్కుతున్న ఈ మూవీని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో ప్రముఖ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తన శ్రేష్ఠ్ మూవీస్ పై రిలీజ్ కానుంది.          
Kamal Haasan and Mani Ratnam have given a cult classic for Indian Cinema, Nayakan, that will always be the pride jewel in its crown. Now, they are back together with Thug Life, a tale of gangsters. Simbu is playing another lead role in the film with Trisha Krishnan, Ashok Selvan, Aishwarya Lekshmi in other prominent roles.  The movie trailer is released today and the trailer promises a gritty tale of gangsters. As they say, "You reap what you sow", the trailer seems to showcase how if you make someone too powerful how it can corrupt them from the inside even if you try to showcase humanity and love.    Kamal Haasan and Simbu's performances seem to be the highlight of this film. Also, the performer Kamal Haasan seems to be in full form in the trailer itself. The technical detailing and the exciting conflict between the main characters seem to be the most interesting part of the film.  AR Rahman's score and technical brilliance make it worth of watch. The movie is releasing on 5th June all over and in Telugu, Nithiin's Shresth Movies is releasing it. We have to wait and see, how well would Mani Ratnam handle another chapter in a gangster's live differently from Nayakan.
  జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్' అనే మల్టీస్టారర్ చేశాడు రామ్ చరణ్ (Ram Charan). అలాగే 'ఆచార్య'లో తన తండ్రి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పడు చరణ్ మరో మల్టీస్టారర్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈసారి వెంకటేష్ (Venkatesh)తో తెరను పంచుకోబోతున్నాడట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.   అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మైథలాజికల్ టచ్ ఉన్న భారీ సినిమా చేయాల్సి ఉంది. అయితే బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో ఈ గ్యాప్ లో ఓ మూవీ చేయాలని త్రివిక్రమ్ చూస్తున్నాడు. అది కూడా వెంకటేష్ తో ఆ సినిమా ఉంటుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల అనూహ్యంగా రామ్ చరణ్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో వెంకటేష్, రామ్ చరణ్ లలో ఎవరితో త్రివిక్రమ్ సినిమా ఉంటుందనే చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో మరో ఆశ్చర్యకర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే వెంకటేష్, రామ్ చరణ్ లతో త్రివిక్రమ్ మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్నాడట. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టాక్. అదే నిజమైతే ఇది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో సందేహం.   వెంకటేష్ ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు చరణ్ తో తెరను పంచుబోతున్నట్లు వినిపిస్తున్న వార్త ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ ని అందుకొని వెంకీ మామ ఫుల్ జోష్ లో ఉన్నాడు. మరోవైపు చరణ్ కూడా 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అలాంటిది ఈ ఇద్దరి కలయికలో మల్టీస్టారర్, దానికి త్రివిక్రమ్ డైరెక్టర్ అంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో సందేహం లేదు.  
విజయదేవరకొండ(Vijay Devarakonda)ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ'కింగ్ డమ్'(Kingdom)తో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri)దర్సకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న'కింగ్ డమ్' జులై 4 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, విజయ్ దేవరకొండ లుక్ తో మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఫిలింఫేర్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ జీవిత బాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మిక(Rashmika Mandanna)లో ఉన్నాయా అనే ప్రశ్న విజయ్ దేవరకొండ కి ఎదురయ్యింది. ఈ విషయంపై విజయ్ దేవరకొండ మాట్లాడుతు రష్మిక తో ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. ఆమె ఎంతో మంచి వ్యక్తి తో పాటు చాలా అందమైన నటి. ప్రస్తుతం జీవిత భాగస్వామి గురించి ఏం ఆలోచించడం లేదు. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా పర్లేదు. సినిమాల పరంగాను  లైగర్ పరాజయం తర్వాత నాలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పుకొచ్చాడు. రష్మిక, విజయ్ దేవరకొండ లవ్ లో ఉన్నారనే వార్తలు చాలా కాలం నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ చెప్పిన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్మిక, విజయదేవరకొండ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించి హిట్ ఫెయిర్ గా ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.    
  Yamadonga starring Junior NTR, Mohan Babu, Priyamani and Mamatha Mohandas, the iconic 2007 Socio fantasy blockbuster is getting re-released on 18th May to celebrate the birthday of Man of the Masses Junior NTR. This epic socio fantasy film, directed by none other than visionary filmmaker S.S. Rajamouli, created waves upon its original release and continues to enjoy a massive fan following.   As part of this special celebration, Yamadonga has undergone a stunning restoration scanned in 8K and compressed to 4K, delivering a spectacular visual experience like never before. Fans can now witness this cinematic marvel in pristine quality, bringing the grandeur of the original to life with a modern touch.   The excitement surrounding the re-release has taken social media by storm. Adding to the buzz, the film’s leading ladies Priyamani and Mamta Mohandas recently shared their thoughts and memories from the shoot, through heartfelt tweets and engaging video messages, reigniting nostalgia among fans.   With a worldwide release on the cards, expectations are soaring high. Yamadonga is all set to captivate audiences once again with its timeless story, spectacular performances, and unforgettable music by Oscar award winner MM Keeraavani.  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కి మలయాళ చిత్రసీమలో ఉన్న క్రేజ్ ఏ పాటిదో తెలిసిందే. 2004లో విడుదలైన 'ఆర్య'(Arya)నుంచి పుష్ప 2(Pushpa 2)వరకు దాదాపుగా అన్ని చిత్రాలకి మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పుష్ప 2 మలయాళంలో విడుదలైనప్పుడు, అక్కడి సొంత హీరోలు సైతం తమ కొత్త సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకున్నాయి. దీన్ని బట్టి మలయాళ బాక్స్ ఆఫీస్ వద్ద అల్లు  అర్జున్ కి ఉన్న చరిష్మా ని అర్ధం చేసుకోవచ్చు. ఈ ఇరవై ఏళ్లలో ఎంతో మంది అభిమానులు కూడా ఏర్పడటంతో పాటు, వాళ్లంతా మల్లు అర్జున్(Mallu Arjun)అని ప్రేమతో పిలుచుకుంటారు. ప్రముఖ మలయాళీ చిత్ర నిర్మాత 'ఖాదర్ హసన్'(Khader hassan)రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'ఆర్య' సినిమా పాటలు విని అల్లుఅర్జున్ మలయాళ ప్రేక్షకుల్లో పేరు సంపాదిస్తాడని అనిపించింది. తెలుగులో సినిమా రిలీజ్ అయ్యాక దిల్ రాజు ని కలిసి డబ్బింగ్ వర్షన్ అడిగితే ఇవ్వలేదు. ఆ తర్వాత ఒప్పించి ఆర్య హక్కులని పొంది మలయాళీ ప్రేక్షకులకి తగ్గట్టుగా డైలాగులు రాయించాను. మిక్సింగ్ తో పాటు ఇతర సాంకేతిక అంశాలని 'చెన్నై'లోని ప్రతిష్టాత్మక 'భరణి స్టూడియో'లో చేయించాను. మలయాళ చిత్ర సీమలో బాగా పేరు పొందిన సింగర్స్ చేత సాంగ్స్  పాడించాను.  ట్రైలర్, సాంగ్స్ ని విసృతంగా ప్రచారం చేయడానికి ఆసియానెట్ కేబుల్, లోకల్ కేబుల్ టీవీ తో ఒప్పందం చేసుకున్నాను. మూవీ చూడటానికి విద్యార్థులని ఆహ్వానిస్తు కళాశాలల్లోని యూనియన్లని సంప్రదించాను. అల్లు అర్జున్ పేరుతో ఉన్న స్టిక్కర్లు, మాస్క్ లని చిన్న పిల్లలకి చేరువయ్యేలా చేశాను. మూవీ రిలీజ్ అయ్యాక మంచి విజయాన్ని అందుకుకోవడమే కాకుండా ఊహించని విధంగా లాభాలు వచ్చాయి. చాలా ఏరియాల్లో మూవీ వంద రోజులు ఆడింది. ఆర్య విజయం తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు కూడా మలయాళీలని బాగా ఆకట్టుకున్నాయి.ఆ తర్వాత  అల్లు అర్జున్ నటించిన చాలా సినిమాలు విడుదల చేస్తే మంచి విజయాన్ని అందుకున్నాయి. అల్లు అర్జున్ ఇప్పటికి నన్ను ఒక సోదరుడిగా చూస్తాడని ఖాదర్  చెప్పుకొచ్చాడు.  
  'మెంటల్ మదిలో' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వివేక్ ఆత్రేయ (Vivek Athreya).. 'బ్రోచేవారెవరురా', 'అంటే సుంద‌రానికీ', 'సరిపోదా శనివారం' వంటి సినిమాలతో ఆకట్టుకొని ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన మొదటి రెండు సినిమాలను శ్రీవిష్ణుతో, ఆ తర్వాత రెండు సినిమాలను నానితో చేసిన వివేక్.. తన ఐదో సినిమా కోసం ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. (Rajinikanth)   'పుష్ప-2'తో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించిన తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. ఓ వైపు టాలీవుడ్ స్టార్స్ తో భారీ సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇతర భాషలకు చెందిన స్టార్స్ తోనూ సినిమాలు నిర్మిస్తోంది. ఇటీవల అజిత్ కుమార్ తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ', సన్నీ డియోల్ తో 'జాట్' సినిమాలు చేసింది. ఇప్పుడు రజినీకాంత్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రజినీకాంత్ ఇమేజ్ కి తగ్గ కథ వివేక్ ఆత్రేయ దగ్గర ఉందట. ఇప్పటికే రజినితో కథా చర్చలు జరగగా.. ఆయన ఈ ప్రాజెక్ట్ చేయడానికి సుముఖుత వ్యక్తం చేసినట్లు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.  
హాలీవుడ్ అగ్ర హీరో 'టామ్ క్రూజ్'(Tom Crusie)నటించిన 'మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకనింగ్'(Mission Impossible The Final Reckoning)మూవీ ఈ రోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ 'యూకే'(UK)లో జరగగా,  ఎవరు ఊహించని విధంగా పలు దేశాలకి చెందిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ ని ప్రీమియర్ కి ఆహ్వానించడం జరిగింది. ఈ క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సుర్(Social Media Influencer)'నీహారిక'(Niharika)కూడా ప్రీమియర్ షో లో పాల్గొని  టామ్ క్రూజ్ తో  కలిసి ఫోటోలు దిగింది. స్వయంగా టామ్ క్రూజ్ నే నీహారిక చేయి పట్టుకొని ఫోటో షూట్ కి తీసుకెళ్లడంతో ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది. ఈ విషయంపై రీసెంట్ గా నీహారిక ఇనిస్టా వేదికగా స్పందిస్తు'వరల్డ్ వైడ్ గా ఉన్న యాక్షన్ ప్రియులు ఎంతగానో అభిమానించే టామ్ క్రూజ్ ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. అది నిజమని నమ్మడానికి చాలా కాలం సమయం పట్టింది. పైగా కలలో కూడా ఇలాంటిది ఊహించలేదంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారగా పలువురు నెటిజన్లు నీహారిక ని అభినందిస్తున్నారు.  మార్చి 14 న తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెరుసు'(Perusu)అనే మూవీలో హీరోయిన్ గా చేసిన నీహారిక ప్రస్తుతం పలు కొత్త రకాల సినిమాలు చేస్తు బిజీగా ఉంది. పెరుసు మూవీ తెలుగులో కూడా ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్ హీరోగా కూడా చేసాడు.  
  Cast: Tom Cruise, Hayley Atwell, Ving Rhames, Simon Pegg, Henry Czerny, Angela Bassett, Esai Morales, Pom Klementieff, Rolf Saxon Crew:  Based on Mission: Impossible by Bruce Geller  Written by Christopher McQuarrie, Erik Jendresen Cinematography by Fraser Taggart Edited by Eddie Hamilton Music by Max Aruj, Alfie Godfrey Directed by Christopher McQuarrie Produced by Tom Cruise, Christopher McQuarrie   Tom Cruise is the only global superstar who commands huge fan following for his daredevil stunts and stylised elaborate action set pieces. His Mission: Impossible series from past three decades has been delivering such thrills, chills and frills without any compromise for mortality. Let's discuss about the "supposed final chapter" of the franchise Mission: Impossible The Final Reckoning Movie, in detail.    Plot:  After the events of Mission: Impossible Dead Reckoning, Gabriel (Esai Morales) is able to overpower Ethan Hunt (Tom Cruise) and run away to implement next part of his mission. He kills Luther (Ving Rhames) and takes the poison pill. Now, Ethan has to improvise and put an end to Entity's dangerous nuclear warfare plan to eliminate the human kind. What would he do to achieve this impossible mission? Watch the movie to know more.    Analysis:  As a plot, Mission Impossible films never really offered something solid except for Ghost Protocol and Rogue Nation. After heavy on stunts and style films like the second and third, they brought some teeth to the characters. But the Dead Reckoning and Final Reckoning are prolonged action set pieces with a wafer thin plot.  The all high power AI doesn't really have the stakes to enter US security system that is deemed to be the most powerful. If AI learns from Humans and improvises, it should start from eliminating the biggest threat and strategies to take over the nuke dump that US, sits on. Rather it just hopes for Ethan to accomplish improbable missions to help it.  This feels like a far fetched stretch where an AI doesn't have a back up plan that too combat ready one. We just find it as an elaborate excuse for Tom Cruise to find new stunts to perform. Here, everything is too elaborated and stretched that even the best stunts doesn't throw us on to the edge of our seats.  We end up feeling like some daredevil man performing stunts rather than being able to feel the gravitas. Also, Tom Cruise has again put his life on line and in balance but the direction, editing feels like narrative has been over stretched to show every minute detail in stunts which gives an experience but doesn't really make it worthwhile.  Characters of Hayley Atwell, Ving Rhames, Simon Pegg, Return of Rolf Saxon everything on paper sounds great but execution drags the life out of it all. On the whole, Tom Cruise's mission to keep his life on line and make Mission Impossible films seems to have overpowered his sense of tight script. Rather than finding excuses to cheat death, he needs clever hacks to find better scripts for these ensemble of stunts to matter.    Bottomline:  Stunts galore but over stretched to bits.    Rating: 2.5/5    Disclaimer: This Review represents the personal opinion and views of the reviewer and organisation takes no liability. Viewers discretion is advised.  
ఎన్టీఆర్(Ntr),జాన్వీకపూర్(Janhvi Kapoor)కొరటాల శివ(Koratala Siva)కాంబోలో గత ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవర(Devara). ఎన్టీఆర్ కెరిరీలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవగా, ఈ చిత్రంలోని అన్ని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, జాన్వీకపూర్ మధ్య తెరకెక్కిన 'చుట్టమల్లే' సాంగ్ పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ లో ఆ ఇద్దరు వేసిన స్టెప్స్  ప్రేక్షకులని మెస్మరైజ్ చేసాయి. యూట్యూబ్ లో వీడియో సాంగ్ కి ఇప్పటి వరకు 126 మిలియన్ల వ్యూస్ దక్కాయంటే ఈ సాంగ్ సృష్ఠ్టిస్తున్న ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్(Bosco Martis)నేతృత్వంలో ఈ సాంగ్ తెరకెక్కడం జరిగింది. రీసెంట్ గా బోస్కో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు చుట్టమల్లే సాంగ్ కి నాకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. మూవీ ప్రమోషన్స్ సమయంలో నా గురించి ఎవరైనా మాట్లాడతారేమో అనుకున్నాను. కానీ ఎవరు మాట్లాడలేదు. జాన్వీ కపూర్ అయినా మాట్లాడుతుందేమో అని అనుకున్నాను. ఏదైనా పాటలు పాపులర్ అయినప్పుడు కొరియోగ్రాఫర్ కి సరైన గుర్తింపు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చాడు.  2000 వ సంవత్సరంలో సంజయ్ దత్, హృతిక్ రోషన్, జాకీష్రఫ్ హీరోలుగా తెరకెక్కిన 'మిషన్ కాశ్మీర్' తో  బోస్కో సినీ రంగ ప్రవేశం జరిగింది. ఇప్పటి వరకు సుమారు డెబ్భై ఐదుకి పైగా చిత్రాల్లో రెండువందల పాటలకి దాకా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసాడు. అనేక అవార్డులు కూడా గెలుచుకున్న బోస్కో నుంచి రీసెంట్ గా బడే మియాన్ చోటా మియాన్, ఫైటర్, ఇండియన్ 2 ,బాడ్ న్యూస్ వంటి చిత్రాల్లోని పాటలు వచ్చాయి.  
  ఈ కాలంలో అమ్మాయిలు బాగా అప్డేట్ అయ్యారు. వాళ్ళు ప్రతి విషయంలో ప్లానింగ్ గా ఉంటారు. ముఖ్యంగా చదువు, ఉద్యోగం, భాగస్వామి, ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా వ్యక్తిగత విషయాలలో ఏ మాత్రం తగ్గకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. భారతీయ జనాభాలో అమ్మాయిలు, అబ్బాయిలా సగటు నిష్పత్తి చూస్తే అమ్మాయిల శాతం తక్కువగా, అబ్బాయిల శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగా పెళ్లి కావాల్సిన అబ్బాయిలకు అమ్మాయిలను వెతకడం కాస్త కష్టమవుతోంది. మొదటే అమ్మాయిల కొరత అంటూ ఉంటే, ఇంకా అమ్మాయిల గట్టి నిర్ణయాల వల్ల అబ్బాయిలు, అబ్బాయిలు తల్లిదండ్రులు కిందామీదా అయిపోతున్నారు పెళ్లి విషయంలో. వాటికి తగ్గట్టు ఈకాలంలో ఆడపిల్లలు తల్లిదండ్రుల్ని బాగా చేసుకుంటున్నారని బుద్ధి సగటు తల్లిదండ్రులకు కలిగినప్పటి నుండి అడపిల్లల్ని కూడా ఏమాత్రం తక్కువలేకుండా చదివించడం చేస్తున్నారు. అందుకే అబ్బాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు వేటలో ఉన్నారు అమ్మాయిల కోసం. వధువు కావలెను అనే బోర్డ్ పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. వధువులు ఓకే చెప్పడానికి అబ్బాయిలలో కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవేంటి మరి?? చదువు! సాధారణంగా ఈ కాలంలో విద్యావంతురాళ్లు అయిన అమ్మాయిలే ఎక్కువ. కనీసం గ్రాడ్యుయేట్ అయినా పూర్తి చేసినవాళ్ళు ఉంటారు. ప్రభుత్వ పథకాలు, రీయింబర్స్మెంట్స్ పుణ్యమా అని అమ్మాయిలు కూడా ఇంజనీరింగ్, పీ.జీ, పీ.హెచ్.డి పట్టాలు చక్కగా అందుకుంటున్నారు. ప్రతి అమ్మాయి తనకంటే విద్యాధికుడిని భర్తగా కోరుకుంటుంది. అంటే అమ్మాయి కంటే అబ్బాయి మరింత విద్యాధికుడు అయి ఉండాలి.  ఉద్యోగం! ప్రభుత్వ ఉద్యోగస్తుడిని చేసుకుంటాను అని గిరి గీసుకుని కూర్చునే అమ్మాయిలు ప్రస్తుతమైతే లేరు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు అయితే అటువైపు ఆలోచన చేస్తారు. ఈ కాలంలో మంచి విద్యార్హతకు ప్రయివేటు సంస్థలలో చాలా మంచి అవకాశాలే ఉంటున్నాయి. కాబట్టి సంపాదన బాగా ఉంటే ఉద్యోగానికి వంక పెట్టడం అమ్మాయిలు చెయ్యరు.  ఆర్థిక విషయాలు! చాలామంది అంటూ ఉంటారు మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి అని. నిజం చెప్పాలంటే ఈ కాలంలో డబ్బు లేకుండా బతికే మహానుభావుడు ఎవరూ ఉండరు. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండేవాడికే జీవితంలో కాసింత ఆర్థిక లోటు లేకుండా సమస్యలను డీల్ చేయగలిగే సత్తా ఉంటుంది. ఎందుకంటే 99% సమస్యలు అన్నీ ఆర్థికంగా ఎదురవుతున్నవే ఉంటున్నాయి ఈ కాలంలో. అందుకే ఆర్థిక విషయాలలో సరైన ప్లానింగ్ ఉన్నవాళ్లకు అమ్మాయిలు  పెద్ద పీట వేస్తుంటారు. ప్రైవేట్ అండ్ పర్సనల్ స్పేస్! ప్రతి వ్యక్తికి కాసింత స్పేస్ అవసరం. భార్యాభర్తల మధ్య దాచాల్సిన పర్సనల్స్ ఏమి ఉంటాయి. భర్తకు తెలియకుండా బయట పనులు ఏమి ఉంటాయి అనేది కొందరి వాదన. అయితే గూడాఛారిలాగా ప్రతి విషయం మీద నిఘా పెడుతూ ఉంటే మాత్రం ఏ అమ్మాయి కూడా భరించలేదు. ప్రతి విషయాన్ని ఇంట్లో అత్తకు, మామకు, భర్తకు చెప్పి తీరాలి అనే డిమాండ్స్ కు అమ్మాయిలు చాలా వ్యతిరేకం. కాసింత స్వేచ్ఛను గనుక అమ్మాయిలకు ఇవ్వగలిగితే వాళ్ళు చేసే ప్రతి పనిని తమకు తామే ఇంట్లో వాళ్లకు చెబుతారు. ఇక్కడ ఒక చిన్న ఇగో అండ్ డామినేషన్ లైన్ ఉంటుంది దాన్ని చెరుపుకోవడం లేదా ఆ చిన్న గీతను పెంచి పెంచి పెద్ద గోడలాగా మార్చడం ఆ కుటుంబంలో అందరి ప్రవర్తన మీదా ఆధారపడి ఉంటుంది. ప్రాధాన్యతలు! అమ్మాయిల ప్రాధాన్యతలు ఎప్పుడూ ఫ్యూచర్ ప్లాన్స్ మీదనే ఉంటాయి. అలాగని ప్రస్థుతాన్ని అసలు విస్మరించేవాళ్లేమి కాదు. భర్త తన తల్లిదండ్రులకు ఎంత ఇంపార్టెన్స్ అయినా ఇవ్వచ్చు, కానీ భార్యకు అంతకంటే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇంకా సమస్యలను నలుగురి ముందు చెప్పి, చుట్టాలు పక్కాల మధ్య పంచాయితీలు పెట్టించి బాపతు అబ్బాయిలకు, భార్యాభర్తల వ్యక్తిగత విషయాలలో వేరే ఎవరో జోక్యం చేసుకోవడం వంటి వాటికి అమ్మాయిలు విరుద్ధం మరి. వీటన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అబ్బాయిలు ఏ పనిని అయినా సొంతంగా చేయడం, సొంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ప్రతి విషయానికి ఇతరుల నిర్ణయాల మీద డిపెండ్ అయ్యేవాడు అయితే అసలు భరించలేరు.  అమ్మాయిలు ఒకే చెప్పాలంటే కొంచం చూసుకోండి మరి!!                                 ◆వెంకటేష్ పువ్వాడ.    
   ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం. చాలా మంది కొన్ని రోజుల రిలేషన్ లో ఉన్న  తర్వాత విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసే కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మధ్య  సంబంధం బలహీనపడుతుంది. ఈ తప్పుల వల్ల  రిలేషన్  లోతును,  దాని బాధ్యతలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రేమ అయినా, పెళ్లి అయినా, స్నేహం అయినా.. ఇలా ఏ రిలేషన్ అయినా సరే.. కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.  ఆ నియమాలను తెలుసుకోకపోతే ఎంత మందితో కొత్తగా రిలేషన్ మొదలుపెట్టినా సరే.. అది తొందరగా బ్రేకప్ అవుతుంది.  ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తలు వారి రిలేషన్ లో ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించాలి. నమ్మకం.. సంబంధంలో నమ్మకం లేకపోతే దాని పునాది బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో  భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకూడదు. ఇద్దరి  మధ్య ఏదైనా అపార్థం ఉంటే ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడి, అపార్థాన్ని తొలగించుకోవాలి. ఏ సంబంధంలోనైనా ఓపెన్ గా మాట్లాడటం,  సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఇద్దరి మధ్య  సమన్వయం కూడా పెరుగుతుంది. స్వేచ్ఛ.. ప్రతి సంబంధంలో ఎదుటి వ్యక్తికి స్పేస్  ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది తమ హక్కులను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు, ఎదుటి వారి స్వేచ్ఛను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా సంబంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. అందుకే భార్యాభర్తలు తమ భాగస్వాములకు  స్పేస్ ఇవ్వాలి. వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు వారికి ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది చేయకపోతే భాగస్వామి సంబంధంలో ఊపిరాడకుండా పోవడం ప్రారంభిస్తాడు. దీని వల్ల బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు  సంభాషించకపోతే, సంభాషణలో పారదర్శకత ఉండదు. మాట్లాడకపోవడం వల్ల ఇద్దరి మధ్య  అపార్థాలు ఏర్పడతాయి. దీని కారణంగా సంబంధం  పునాది బలహీనపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి. శ్రద్ద.. చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఏం తింటావని అడగడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, నచ్చిన చోటకు వెళ్లడం, గొడవను పెద్దవి చేసుకోకుండా ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వంటివి చేస్తుంటే భాగస్వామికి  ఖచ్చితంగా నచ్చుతుంది. వారు ఎల్లప్పుడూ బంధంలో ఉండాలని అనుకుంటారు.  ఏవైనా గొడవలు జరిగినా వాటిని పరిష్కరించుకుని బంధం నిలబెట్టుకోవాలి అనుకుంటారు. పోలిక.. భార్యాభర్తలు ఇద్దరూ ఎవరూ ఎవరిని ఇతరులతో పోల్చకూడదు.  బయట సంబంధంలో ఉన్నవారిని,  ఇతరులను చూసి వాళ్లు బాగున్నారు, వాళ్లు మంచివారు,  నువ్వు చెడ్డ.. ఇలాంటి కోణంలో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇలా పోలిస్తే అది వారి మనసును బాధపెడుతుంది.  తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చిన్న చూపు చూస్తున్నారని భావిస్తారు.  దీనివల్ల బంధంలో అప్యాయత తగ్గుతుంది.                                                   *రూపశ్రీ.  
  నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి. సైలెంట్ డైవోర్స్ అంటే నిశ్శబ్ద విడాకులు. ఈ రకమైన విడాకులలో చాలా సార్లు దంపతులకు తమ సంబంధం నిశ్శబ్ద విడాకుల వైపు కదులుతోందని లేదా వారు ఇప్పటికే సైలెంట్ డైవర్స్   తీసుకున్నారని వారి కూడా  తెలియదు. తమ మధ్య సైలెంట్ గా విడాకులు  జరిగాయని ఆ జంట గ్రహించినప్పుడు వారు చట్టబద్ధంగా విడిపోతారు. ఇది విడాకుల చట్టపరమైన ప్రక్రియకు ముందు దశ కావచ్చని ఫ్యామిలీ కౌన్సిలర్లు అంటున్నారు. సైలెంట్ డైవర్స్ అంటే.. సైలెంట్ డైవర్స్  అంటే భార్యాభర్తలు చట్టబద్ధంగా కలిసి ఉండే వైవాహిక పరిస్థితి. అంటే విడాకులు తీసుకోలేదు కానీ భావోద్వేగ, మానసిక,  కమ్యూనికేషన్ స్థాయిలో ఒకరి నుండి ఒకరు పూర్తిగా విడిపోతారు. ఇద్దరూ ఒకే ఇంట్లో  నివసిస్తుంటారు కానీ వారి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదా సంభాషణ ఉండదు. వారి మధ్య భౌతిక దూరం కూడా ఉండవచ్చు. ఇది బంధం నిశ్శబ్దంగా అదృశ్యమవడాన్ని సూచిస్తుంది. సైలెంట్ డైవోర్స్ లో ఇద్దరి మధ్య సంబంధం సజీవంగా ఉంటుంది.  కానీ బంధంలో ఆత్మ,  జంట మధ్య పరస్పర అనుబంధం చనిపోతుంది. సైలెంట్ డైవర్స్ సిగ్నల్స్ ఇవే.. భార్యాభర్తల మధ్య బంధం సైలెంట్ డైవోర్స్ వైపు వెళుతోందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి.  వాటి ద్వారా దీన్ని గుర్తించి జాగ్రత్త వడవచ్చు. సంభాషణ ఉండదు.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సాధారణ విషయాలే కాదు.. ఒకరితో ఒకరు ముఖ్యమైన విషయాల గురించి కూడా మాట్లాడుకోరు. వారి మధ్య దాదాపుగా కమ్యూనికేషన్ ఉండదు. రోజువారీ విషయాలు కేవలం లాంఛనాలుగా జరుగుతూ ఉంటాయి. ఎమోషనల్ డిస్టెన్స్.. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు పట్టించుకోరు. ఇద్దరి మధ్య ఎమోషన్ డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఒకరి సుఖదుఃఖాలను ఒకరు పంచుకోరు.  ఒకరి సమస్యలను లేదా ఆలోచనలను ఒకరు పట్టించుకోరు. శారీరక దూరం.. సైలెంట్ డైవర్స్ దిశగా వేళ్లే భార్యాభర్తల బంధంలో  వారి శారీరక  సంబంధాన్ని కోల్పోతారు. కలిసి కూర్చోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, కౌగిలించుకోవడం,  కలిసి పడుకోవడం వంటివి దూరం అవుతాయి.   గదిని పంచుకోవచ్చు కానీ రూమ్‌మేట్ లాగా ఎవరికి వారు ఉంటారు. సమయం ఇవ్వకపోవడం.. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం ఇవ్వనప్పుడు సమయాన్ని కలిసి  గడపాలని అనుకోరు . కలిసి తినాలనే కోరిక, బయటకు వెళ్లాలనే కోరిక లేదా సెలవు దినాల్లో కలిసి సమయం గడపాలనే కోరిక తగ్గినప్పుడు వారు సైలెంట్ డైవోర్స్ వైపు  ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆసక్తి.. సాధారణంగా భార్యాభర్తలు  ఒకరి జీవితం గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటారు. వారు గొడవ పడినా, తమ భాగస్వామి రోజు ఎలా గడిచిందో, ఏం చేశారో, తమ స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసుకోవడంలో   ఆసక్తి కలిగి ఉంటారు. కానీ వారి మధ్య అలాంటి సాధారణ విషయాలు కూడా  అదృశ్యమైనప్పుడు, వారి మధ్య సైలెంట్ డైవర్స్ పరిస్థితి ఏర్పడుతుంది. గొడవలు.. కొన్నిసార్లు వాదనలు లేదా విభేదాలు లేకపోవడం మంచిదని అనిపించవచ్చు. కానీ వాటి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదని కూడా ఇది సూచిస్తుంది. వారికి ఒకరి నుండి ఒకరు ఎటువంటి ఆశలు ఉండవు. కాబట్టి వారు ఒకరితో ఒకరు గొడవ పడటానికి కూడా ఇష్టపడరు. సైలెంట్ డైవోర్స్ గురించి కొన్ని నిజాలు.. భార్యాభర్తలు చాలా మంది తమ పిల్లలను పెంచడానికి మాత్రమే కలిసి ఉంటారు. వారు భార్యాభర్తలుగా తమ సంబంధంలో సంతోషంగా లేరు కానీ తమ పిల్లల కోసం చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా ఉంటారు విడాకులు సమాజంలో అవమానానికి కారణమవుతున్నాయి. సామాజిక కళంకం, కుటుంబ ఒత్తిడి,  విమర్శల భయాన్ని నివారించడానికి, జంటలు విడాకులు తీసుకోరు,  అందుకే ఇద్దరి మధ్య సైలెంట్ వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే సైలెంట్ డైవోర్స్ అంటారు. భర్తలు డైవోర్స్ వల్ల ఆర్థికంగా లాస్ అవుతారు. దీని వల్ల విడాకులు ఇవ్వకుండా  ఆర్థిక లక్ష్యాల  కోసం రాజీగా  సైలెంట్ డైవోర్స్ ఎంచుకుంటారు. బంధంలో ప్రేమ, గౌరవం,  అవగాహన కాలక్రమేణా ముగిసినప్పుడు ప్రజలు బాధ్యతల కోసం మాత్రమే కలిసి ఉంటారు.                                         *రూపశ్రీ.  
శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. అయితే ఈ పోషకాల విషయానికి వస్తే, చాలా మందికి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ లేదా ఫైబర్ గురించి మాత్రమే తెలుసు. ఇవన్నీ శరీరానికి చాలా అవసరం. కానీ వీటికంటే ప్రభావవంతమైనది, శరీరానికి తప్పనిసరిగా కావాల్సినది మరొకటి  ఉంది, ఇది శరీరం  మెరుగైన పనితీరుకు అవసరం. ఇది లోపిస్తే శరీరం అంతా నీరసంగానూ, ఏ చిన్న పనిచేసినా అలసటగానూ అనిపిస్తుంది. ఎన్ని పోషకాలు తీసుకున్నా, ఎంత బలవర్థకమైన ఆహారం తీసుకున్నా ఈ ఒక్కటి తక్కువై శరీరం నిలదొక్కుకోలేదు. అంతటి శక్తివంతమైన   పదార్థం  మెగ్నీషియం. మెగ్నీషియం కేవలం శారీరక బలానికే కాదు అనేక మానసిక భావోద్వేగాలకు కూడా  ఇది ఎంతో  అవసరం. ఇది  శరీరంలో కండరాలను నిర్మించడానికి  నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపం  ఏర్పడితే  కండరాల తిమ్మిరి, నరాల  బలహీనత, కండరాలు మెలితిప్పినట్లు, శరీరంలోని వివిధ ప్రాంతాల్లో  తిమ్మిరి లేదా జలదరింపు వంటి అనేక లక్షణాలను కనిపిస్తాయి. శరీరంలో మెగ్నీషియం లోపం ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంది.  విటమిన్ డి లోపం  వల్ల మెగ్నీషియం లోపిస్తుంది, యాంటాసిడ్‌ల మితిమీరిన వినియోగం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, తీవ్రమైన విరేచనాలు, ఆహారంలో తక్కువ మెగ్నీషియం గల ఆహారాలను చేర్చకపోవడం వంటి అనేక కారణాల వల్ల శరీరంలో ఈ ముఖ్యమైన మూలకం లోపం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా, గర్భధారణ సమయంలో మెగ్నీషియం లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం లోపాన్ని నివారించడానికి  ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఈ కింది ఆహారాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  బాదంపప్పులో మెగ్నీషియం ఉంటుంది.  10గ్రాముల బాదం పప్పులో  రోజువారీ శరీరానికి కావలసిన  మెగ్నీషియంలో 20% (76 mg) లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి,  మెగ్నీషియం శరీరానికి అందడానికి  ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం మంచి మార్గం. గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది  తమ ఆహారం ద్వారా మెగ్నీషియం  తగినంతగా పొందలేరు. ప్రతి 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటూ ఉంటే ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు. అరటిపండ్లు  ఎముకలను బలపరిచే పొటాషియం అధికంగా ఉండే పండు. ఒక మధ్యస్థ అరటిపండు 10.3 mg విటమిన్ సి,  32 mg మెగ్నీషియంను  అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. పాలకూర అందరికీ అందుబాటులో ఉంటే ఆకుకూర. పాలకూరలో మెగ్నీషియం మాత్రమే కాదు ఐరన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కాబట్టి ఐరన్, మెగ్నీషియం లోపంతో ఇబ్బంది పడేవారు పాలకూరను తప్పనిసరిగా తీసుకోవాలి.   జీడిపప్పులో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా జీడిపప్పులో ఉంటాయి. ప్రతిరోజూ కాసింత జీడిపప్పు తీసుకోవడం వల్ల ఇది మెగ్నీషియంతో పాటు, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా పొందవచ్చు.  ఇవి కాకుండా, వోట్మీల్, బ్రౌన్ రైస్, వేరుశెనగ నూనె, చియా గింజలు,  బీన్స్‌లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ.  పేరుకు ఇది కూరగాయ కానీ ఇది  అన్ని రకాలుగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. కూరల్లో అయినా, బజ్జీలలో అయినా, వేపుళ్లలో అయినా,  చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నోరూరించే తినుబండారాలలో అయినా బంగాళదుంప చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఏ కూర చేస్తున్నా సరే..అందులో బంగాళదుంప ముక్కలు జోడిస్తే కూరలకు రుచి రెట్టింపు అవుతుంది. ఎంతో రుచిగా ఉండే బంగాళదుంపను తినడానికి చాలా మంది చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే బంగాళదుంపలను ఎడా పెడా తింటే మాత్రం కొంపలు ముంచుతుందట.  ఇంతకీ బంగాళదుంపలు ఆరోగ్యానికి చేసే చేటు ఏంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారట.  బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి అదనపు కేలరీలుగా పొట్టలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. దీని కారణంగా బరువు ఈజీగా పెరుగుతారు. రక్తపోటు.. రక్తపోటు లేదా బీపీ ఇప్పట్లో చాలామందికి వస్తున్న సమస్య.  చిన్న వయసులోనే బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఉంటున్నారు.  ఇలాంటి వారు బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోకూడదట.  బంగాళదుంపలు  బీపీ సమస్యను మరింత పెంచుతాయట. ఆర్థరైటిస్.. ఆర్థరైటిస్ సమస్య చలికాలంలో చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సాధారణ రోజులలో కూడా ఆర్థరైటిస్ సమస్య కారణంగా  ఎముకలు, కీళ్ల సమస్యలు పెరుగుతాయి.  బంగాళదుంపలు తింటే ఆర్థరైటిస్ సమస్య మరింత తీవ్రం అవుతుంది.  ఇందులో కార్బోహైడ్రేట్లు ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతాయి. జీర్ణసమస్యలు.. బంగాళదుంపలలో పిండి పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది గ్యాస్, ఉబ్బరం,  మలబద్దకం వంటి సమస్యలు సృష్టిస్తుంది.  బంగాళదుంపను అతిగా తింటే పై సమస్యలు అధికం అవుతాయి. మధుమేహం.. మధుమేహం ఉన్నవారికి నిషేధించిన ఆహారాలలో బంగాళదుంప కూడా ఒకటి.  బంగాళదుంపలు తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య మరింత పెరుగుతుంది.  బంగాళదుంపలలో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. కంటి సమస్యలు.. బంగాళదుంపలలో సోలనిన్ అనే రసాయనం ఉంటుంది.  ఇది కంటి సమస్యలను కలిగిస్తుంది.  బంగాళదుంపలను ఎక్కువగా తీసుకునేవారు తొందరగా కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  పసుపు,  తేనె భారతీయ వంటగదిలో రెండు ప్రధాన పదార్థాలు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పసుపులో  కుర్కుమిన్ ఉంటుంది, అలాగే తేనెలో  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులు , చర్మ వ్యాధులు,  జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది . సహజ తీపి, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన తేనె గొంతు నొప్పి, దగ్గు,  గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. పసుపు మరియు తేనె కలయిక ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దానిని తీసుకునే ముందు సరైన మోతాదు,  దాని దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించి తెలుసుకుంటే.. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.. పసుపులో ఉండే కర్కుమిన్,  తేనెలోని యాంటీఆక్సిడెంట్లు కలిసి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కలయిక కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్,  ఇతర శోథ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. రోగనిరోధక శక్తి.. పసుపు,  తేనె రెండూ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ కలయిక ముఖ్యంగా సీజన్ మారే సమయంలో  ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ.. పసుపు,  తేనె మిశ్రమం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం,  ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అధిక వినియోగాన్ని నివారించాలి. చర్మ ఆరోగ్యం.. మొటిమలు, మచ్చలు,  మంట వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పసుపు,  తేనెను ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి..? పసుపు,  తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి, టీగా లేదా పాలతో కలిపి వివిధ రకాలుగా తీసుకోవచ్చు. అయితే, దాని పరిమాణం,  తీసుకునే సమయం వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి ఉండాలి. గర్భిణీ స్త్రీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు,  ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...