మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు. కొండా కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.“కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు” అని కొండా మురళి స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  “కొండాను ఢీకొట్టడం ఈ గొర్రెల వల్ల కాదు” అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని గొర్రెలు, గుంటనక్కలు అన్నీ ఒక్కటై కొండాను ఢీకొట్టాలని చూస్తున్నాయని, అయితే అది సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా కార్యక ర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “పులి.. పులి.. పులి.. బెబ్బులి.. కొండా మురళి వేట పులి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొండా కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు తెలిపారు. “మీరు నక్సల్స్‌లోకి వెళ్తే.. మీతోనే నక్సల్స్‌లోకి వస్తాం” అంటూ కొండా మురళికి, కొండా సురేఖకు అభయం ఇచ్చారు. కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. తాజా పరిణా మాలతో స్థానికంగా కొండా వర్గం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.       [ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Telugu One, Telugu News]  
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే కొండా సురేఖను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. మంత్రి పదవిని కోల్పోయిన నాటి నుంచి అసెంబ్లీ జరుగుతున్న ప్రస్తుత వర్షాకాల సమావేశాలకు దూరంగా ఉంటున్న ఆమెతో, తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు.  పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలను పక్కనబెట్టి, వ్యక్తిగత సమస్యలను విడనాడి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాల్సిన ఆవశ్యకతను ఆమెకు వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరుకాకపోవడం కాంగ్రెస్ పార్టీ సర్కిళ్లలో తీవ్ర దుమార రేపింది.  ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించినట్లు సమాచారం. ఫోన్ సంభాషణ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి నేరుగా రావాల్సిందిగా కొండా సురేఖకు పార్టీ పెద్దల నుంచి పిలుపు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది.  మంత్రి పదవిని కోల్పోయి తీవ్ర అసంతృప్తితో రగులుతున్న సురేఖను కూడగట్టే క్రమంలో భాగంగానే హైకమాండ్ ఈ చర్యలు చేపట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఆమెకు త్వరలోనే కేబినెట్ స్థాయి లేదా సముచితమైన మరో ఉన్నత పదవిని అప్పగించే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం గమనార్హం. గతంలో వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఆమె కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, పరకాల అసెంబ్లీ స్థానంపై చెలరేగిన వివాదం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.   తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనను బాధ్యురాల్ని చేసి బలిపశువును చేయడం ఎంతవరకు సమంజసమని సురేఖ గతంలో బహిరంగంగానే ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బీసీ వర్గానికి చెందిన తనపైనే కఠిన చర్యలు తీసుకున్నారని, పార్టీలో కొందరికే ఒక రకమైన న్యాయం, తమలాంటి వారికి మరో న్యాయం జరుగుతోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారకుండా చూసేందుకు హైకమాండ్ వేగంగా పావులు కదుపుతోంది. ఫోన్ కాల్ చర్చల తర్వాత, ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కొండా సురేఖతో పార్టీ పెద్దలు జరిపే సమావేశం తర్వాత ఈ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందనే అంశంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.         [ Konda Surekha, Congress High Command, Meenakshi Natarajan, Telangana Politics, CM Revanth Reddy, Congress Cabinet, Congress party, Parakala assembly, Konda Sushmita Patel, Telugu One, Telugu News ]
  ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..? తెలంగాణ రాజకీయ రంగంలో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకులు అందరూ పాల్గొని, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. గత మూడు రోజులుగా శాసనసభ ప్రాంగణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న హైడ్రామా, నాటకీయ పరిణామాలు మరియు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వైఖరిపై ప్రభుత్వం ప్రజల నాడిని పట్టేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫ్లాష్ సర్వే ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నేతల ముందుంచడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, పాలనా విధానాలకు ప్రజల నుంచి పూర్తి స్థాయి సానుకూలత లభిస్తోందని, కాంగ్రెస్ పరిపాలనపై ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదని సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా జరిగిన పరిణామాలు, ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, స్పీకర్ పదవిని కించపరిచేలా జరిగిన వ్యాఖ్యలు  ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద చోటుచేసుకున్న శుద్ధీకరణ వివాదాస్పద ఘటనలను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల, రాజ్యాంగబద్ధ పదవుల పట్ల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో, అలాగే ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎర్రవల్లి ఘటనపై మంత్రులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని, చట్టపరమైన చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇంచార్జ్‌లు అందరూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించి బలంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియా  డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. ఈ ఫ్లాష్ సర్వే రిపోర్ట్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుండగా, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.       [ CM Revanth Reddy, flash survey, BRS party, CLP meeting, Telangana news, Congress government,Telangana goverment, KCR, KTR, BRS Party, Telugu One, Telugu News ]  
ALSO ON TELUGUONE N E W S
Dr. Rajendra Prasad, Prithviraj, Kedar Shankar, Manichandana, Annapurnamma, Sunny Akhil, Virat, Sai Praneeth, Sreelu, Pratyusha and Rehana play the lead roles in ‘Pithapuram Lo... Ala Modalaindi’, directed by renowned filmmaker Mahesh Chandra, known for ‘Preyasi Raave’. The film is jointly produced by Dundigalla Balakrishna, Akula Suresh Patel and F.M. Murali (Godari Kittayya) under Mahesh Chandra Cinema Team and Ever Green Epic Cinema. Leading production house Prime Show Entertainment will be releasing the film worldwide on September 18. A grand pre-release event was held in Hyderabad on Saturday night. Popular actor Suman unveiled the film’s teaser at the event. Speaking on the occasion, Suman said: "I have shared an association with Chandra Mahesh for more than 25 years. He is a wonderful director who has great clarity in his work. I wish ‘Pithapuram Lo... Ala Modalaindi’ a grand success. I believe this film, made with fresh content and a new subject, will appeal to everyone.” Popular producer Chadalavada Srinivasa Rao said: “Chandra Mahesh is a talented and deserving director, and also a very good person. I wish him great success with this film. Chandra Mahesh is a director who always thinks about the interests of producers. I hope such a fine filmmaker continues to make many more films. It is happy to see Chaitanya Reddy releasing this movie. Everyone associated with ‘Pithapuram Lo... Ala Modalaindi’ should earn a good name through this film. I wish the movie a great success.” Prasanna Kumar said: "Chandra Mahesh is a very good person. He has worked extremely hard to make this film. I wish the producers Dundigalla Balakrishna, Akula Suresh Patel and F.M. Murali good profits. I hope this family-oriented film becomes a big success.” Dr. Rajendra Prasad said: “In my 49-year film career, the greatest fortune I have had is the wonderful roles that came my way. Right here at Prasad Labs Preview Theatre, legendary director K. Viswanath garu watched the preview of ‘Aa Naluguru’ and appreciated me saying, ‘I was looking to see whether you would appear anywhere in the film other than the character of Raghuram. I couldn’t find you anywhere.’ C. Narayana Reddy garu also gave me the title ‘Natakireeti’, saying that I made audiences laugh with one eye and cry with the other. “That was not because of my greatness. It was the greatness of those characters and the greatness of the people who created them. Being fortunate enough to get such roles is a blessing from God. “If you were to seat a Hollywood actor here in this theatre and show him ‘Ladies Tailor’ in the morning and ‘Aa Naluguru’ in the evening, he would ask, ‘Who is this artist? And who is that artist?’ This entire fortune came to me because of those roles. “I already knew what kind of director Chandra Mahesh is. When he narrated this story to me, I immediately understood the depth of my character. This film will show the world what Chandra Mahesh is capable of. He endured many hardships and challenges to make this film. “The content of this movie will connect with Telugu people across the world because it is a story that exists in every household. Every audience member who watches this film will go and speak highly of it to at least ten others. “My heartfelt thanks to Chandra Mahesh. Even the artistes were moved to tears during the climax scene. That is the level of emotion in the film. At the same time, the movie also has all the commercial elements that this generation will enjoy. “As a senior actor, I fold my hands and request everyone: please go to the theatre and watch a good film.” Telangana Chamber Secretary Anantha Giri said: "The moment I saw the title ‘Pithapuram Lo... Ala Modalaindi’, I felt that the film would be a hit. I wish the movie a grand success.” Director Mahesh Chandra said: "I have put my heart and soul into ‘Pithapuram Lo... Ala Modalaindi’. The film has shaped up wonderfully. I thank all my artistes who supported me throughout this journey. Every one of them lived their respective roles. The film has come out very well and I am confident that it will definitely become a hit. I request everyone to watch the film with their families. It will certainly appeal to everyone. Family-oriented films are doing well at present, and audiences always encourage good cinema. Among all the films I have made, ‘Pithapuram Lo... Ala Modalaindi’ will stand on another level.” Director Ram Prasad said: “‘Pithapuram Lo... Ala Modalaindi’ is coming with a strong family sentiment. Films like this should be watched in theatres. I wish the movie a great success.” Director Samudra said: “‘Pithapuram Lo... Ala Modalaindi’ is releasing on September 18. I wish the film a grand success. Love and marriage will always remain relevant. We must always respect our families and parents. I wish this movie tremendous success.” Director Veera Shankar said: “Chandra Mahesh is a very good friend of mine. He has made this film in a way that will appeal to the present generation. Audiences are now coming back to theatres. ‘Pithapuram Lo... Ala Modalaindi’ is a film that the entire family can watch together. The media should extend its support to such a feel-good movie.” Prime Show Entertainment’s Chaitanya Reddy said: "‘Pithapuram Lo... Ala Modalaindi’ beautifully portrays the relationship between a father and his daughters. Children should follow the advice given by experienced elders. We have always stood by small producers and newcomers, and will continue to support them.” Director-writer BVS Ravi said: “As long as the concepts of love and marriage exist, ‘Pithapuram Lo... Ala Modalaindi’ will remain relevant. The film features a wonderful conflict between a father and his daughter. Mahesh Chandra handles drama exceptionally well. Everyone should definitely watch this film.” Producer Dundigalla Balakrishna said: "I wish ‘Pithapuram Lo... Ala Modalaindi’ a great success. This is a film that every mother, father and daughter should watch.” Producer Akula Suresh said: "I have seen many families in my hometown and developed this story from those experiences. I narrated it to Chandra Mahesh garu, and now my story is arriving on screen as ‘Pithapuram Lo... Ala Modalaindi’. The film will appeal to audiences across all sections. It will feel like a story from every household.” Producer F.M. Murali said: "Chandra Mahesh garu shot ‘Pithapuram Lo... Ala Modalaindi’ in our village and even in our own house. After watching the film, I came out emotionally moved. I believe the movie will appeal to both youth and family audiences.” Actress Manichandana said: “‘Pithapuram Lo... Ala Modalaindi’ has a very good story and strong emotional content. I thank Mahesh Chandra garu for giving me such a wonderful role in the film.” Satyam Rajesh said: “Mahesh Chandra garu introduced me as an artiste. I consider him my guru, and I wish the film he has made a grand success. I hope this movie, featuring Rajendra Prasad garu, Prithvi garu and Manichandana garu, will entertain and impress everyone.” Kirrak RP said: “Rajendra Prasad garu spoke very highly of ‘Pithapuram Lo... Ala Modalaindi’. I believe this film, made with so many values, will appeal to everyone. I request all audiences to watch the film in theatres and make it a big hit.” Actor Prithvi said: “Mahesh Chandra garu is going to present a wonderful story through ‘Pithapuram Lo... Ala Modalaindi’. The bond between fathers and daughters has been beautifully written. There are still children who listen to their parents, and I consider myself fortunate to have a daughter like that. This is a story that happens in every family. Everyone will definitely be moved to tears during the climax. I believe women audiences will wholeheartedly embrace this film.” Actor Kedar Shankar said: “‘Pithapuram Lo... Ala Modalaindi’ has wonderful emotional depth. It will appeal to both family and youth audiences.” Actress Sreelu said: '‘Pithapuram Lo... Ala Modalaindi’ is arriving on September 18. It is a film that every family—especially mothers, fathers and daughters—should watch.” Actor Virat said: "Thank you to Mahesh Chandra garu for giving me an opportunity in ‘Pithapuram Lo... Ala Modalaindi’. This is my debut film. I thank everyone who came here today to support us.” Actor Sunny said: "Thank you to Chandra Mahesh garu for giving me an opportunity in ‘Pithapuram Lo... Ala Modalaindi’. Our film is releasing on September 18. I request everyone to watch it and support us.”   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
తమిళ చిత్రసీమలో దళపతి విజయ్, గ్లామరస్ క్వీన్ త్రిష కాంబినేషన్‌కు ఉండే క్రేజే వేరు. వీరిద్దరూ కలిసి ఏ వేదికపై కనిపించినా లేదా ఒకే ఫ్రేమ్‌లో నిలిచినా ఆ వార్త క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా విజయ్ పాల్గొన్న ఒక గ్రాండ్ ఈవెంట్‌లో నటి త్రిష సడన్‌గా ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఊహించని ఎంట్రీతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఈవెంట్ అత్యంత వైభవంగా జరుగుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా త్రిష వేదిక ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ముందుగా ఈ ఈవెంట్ గెస్ట్ లిస్ట్‌లో త్రిష పేరు ప్రచారంలో లేకపోవడంతో ఆమె రాక అందరికీ ఒక బిగ్ సర్ ప్రైజ్‌గా మారింది. గ్రాండ్ లుక్‌లో మెరిసిపోయిన త్రిషను చూడగానే అక్కడున్న అభిమానులు హర్షధ్వానాలతో సందడి చేశారు. సమాచారం ప్రకారం, ఈ స్పెషల్ ఎంట్రీ గురించి ముందే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కేవలం విజయ్ మరియు చిత్రబృందానికి మద్దతుగా నిలిచేందుకే త్రిష ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. విజయ్ కూడా ఆమె రాకను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారని, వేదికపై వీరిద్దరి పలకరింపులు అక్కడి వాతావరణాన్ని మరింత సందడిగా మార్చాయని సమాచారం. గతంలో విజయ్-త్రిష కాంబోలో వచ్చిన ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘కురువి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ చిత్రంలో ఈ జోడీ మళ్లీ సందడి చేసి ప్రేక్షకులను అలరించింది. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి ఉన్న ఆదరణ ఇప్పటికీ కొంచెం కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే ఈ గ్రాండ్ ఈవెంట్‌లో త్రిష ప్రత్యక్షమవ్వడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దళపతికి త్రిష ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ ప్రెజెన్స్ పిక్స్, వీడియోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ హిట్ పెయిర్ మళ్లీ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కలిసి నటిస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.     [Thalapathy Vijay, Trisha Krishnan, Vijay Trisha News, Kollywood Updates, Vijay Upcoming Movie]
  విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ చిత్రంలో రశ్మిక రణబాలి జోడీగా జయమ్మ క్యారెక్టర్ లో నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. షూటింగ్ సెట్ నుంచి చిత్రబృందం ఎమోషనల్ గా ఆమెకు సెండాఫ్ ఇస్తున్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.  "రణబాలి" సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది.  పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ హ్యూజ్  రెస్పాన్స్ తెచ్చుకుంటూ యూట్యూబ్ లో  నెం.1 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది.
డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. ఈ సినిమాని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా  విడుదల చేయనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా… సుమన్ మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్‌తో నాకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఆయన క్లారిటీతో ఉండే అద్భుతమైన దర్శకుడు. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి. కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఆయన తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను.’ అని అన్నారు. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్ యోగ్యుడైన దర్శకుడు. ఆయన మంచి వ్యక్తి. ఈ చిత్రంతో చంద్ర మహేష్‌కి మంచి విజయం దక్కాలి. చంద్ర మహేష్ నిర్మాతల డైరెక్టర్. ఇలాంటి ఉత్తమ దర్శకుడు మరిన్ని సినిమాల్ని తెరకెక్కించాలని కోరుకుంటున్నాను. చైతన్య రెడ్డి గారు ఈ మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలి. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ‘‘చంద్ర మహేష్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని నిర్మించిన దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మాతలకు మంచి లాభాలు దక్కాలి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘‘నా 49 సంవత్సరాల సినిమా జీవితంలో నాకు దొరికిన అదృష్టం ఏమిటంటే, నాకు దొరికిన మంచి పాత్రలు. ఇదే ప్రసాద్ ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్‌లో దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్ గారు ‘ఆ నలుగురు’ ప్రివ్యూ చూసి ‘ఈ సినిమాలో రఘురామ్ పాత్ర కాకుండా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని చూశాను. ఎక్కడా దొరకలేదు’ అని అభినందించారు. సి.నారాయణరెడ్డి గారు కూడా ఒక కంటితో నవ్విస్తూ, ఇంకో కంటితో ఏడ్పిస్తున్నావంటూ నాకు ‘నటకిరీటి’ బిరుదు ఇచ్చారు. అదంతా నా గొప్పతనం కాదు. ఆ పాత్రల తాలూకు గొప్పతనం. తీసినవారి గొప్పతనం. అలాంటి పాత్రలు దొరకడం ఆ భగవంతుడు నాకిచ్చిన వరం. ఎవరైనా హాలీవుడ్ నటుడిని కూర్చోబెట్టి, ఇదే థియేటర్లో పొద్దున ‘లేడీస్ టైలర్’, సాయంత్రం ‘ఆ నలుగురు’ సినిమా చూపిస్తే ఆ ఆర్టిస్టు ఎవరు, ఈ ఆర్టిస్టు ఎవరు అని అడుగుతారు. ఈ అదృష్టమంతా నాకు ఆ పాత్రలవల్లే దక్కింది. చంద్ర మహేష్ ఎలాంటి దర్శకుడో నాకు ముందు నుంచీ తెలుసు. ఈ కథ చెప్పినప్పుడే నా పాత్ర తాలూకు డెప్త్ ఏమిటో అర్థమైంది. చంద్ర మహేష్ అంటే ఏమిటో ఈ సినిమా చూపిస్తుంది. ఎన్నో కష్టనష్టాలు భరించి ఈ సినిమా తీశాడు తను. ప్రపంచంలో వున్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఎందుకంటే, ఇది అందరి ఇళ్లలో వుండే కథ. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. మై హార్ట్ ఫెల్ట్ థాంక్స్ టు చంద్రమహేష్. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అంతటి ఎమోషన్ వుంది. దాంతోపాటే ఈ జనరేషన్‌కి నచ్చే అన్ని మసాలాలూ ఈ సినిమాలో వున్నాయి. ఒక సీనియర్ నటుడుగా మీ అందరికీ దణ్ణంపెట్టి చెబుతున్నా. దయచేసి ఒక మంచి సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడండి’’ అన్నారు. తెలంగాణ ఛాంబర్ సెక్రటరీ అనంత గిరి మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ అని టైటిల్ చూసినప్పుడే సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాకి మనసుతో పాటు ప్రాణం పెట్టి పని చేశాను. మూవీ అద్భుతంగా వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. సినిమా బాగా వచ్చింది. ఈ చిత్రం గ్యారెంటీగా హిట్ అవుతుంది. ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలే నడుస్తున్నాయి. మంచి సినిమాల్ని ఆడియెన్స్ ఆదరిస్తారు. నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మరోస్థాయిలో ఉంటుంది’ అని అన్నారు. దర్శకుడు రాం ప్రసాద్ మాట్లాడుతూ .. ‘’పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం ఫ్యామిలీ సెంటిమెంట్‌తో రాబోతోంది. ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమా సెప్టెంబర్ 18న విడుదలవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేమ, పెళ్లిళ్లు అనేవి ఎప్పుడూ ఉంటాయి. కుటుంబానికి, తల్లిదండ్రులకు ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్ నాకు మంచి మిత్రుడు. ప్రస్తుతం ఉన్న తరానికి నచ్చేలా సినిమాని తెరకెక్కించాడు. ప్రస్తుతం థియేటర్‌లకు ఆడియెన్స్ వస్తున్నారు. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మూవీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని మీడియా సపోర్ట్ చేయాలి’ అని అన్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రంలో తండ్రీ, కూతుళ్ల మధ్య రిలేషన్‌ను అద్భుతంగా చూపించారు. అనుభవం ఉన్న వారు చెప్పే సలహాల్ని పిల్లలు పాటించాలి. చిన్న నిర్మాతలకు, కొత్త వారికి మేం ఎప్పుడూ అండగా ఉంటాం’ అని అన్నారు.   దర్శక రచయిత బీవీఎస్ రవి మాట్లాడుతూ .. ‘ప్రేమలు, పెళ్లిళ్లు అనే కాన్సెప్ట్ ఉన్నంత వరకు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ ఉంటుంది. తండ్రీకి, కూతురికి జరిగే అద్భుతమైన సంఘర్షణ ఇందులో ఉంటుంది. మహేష్ చంద్ర గారు డ్రామాను అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. ఈ సినిమాని అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు. నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రతీ తల్లి, తండ్రి, కూతురు చూడాల్సిన సినిమా’ అని అన్నారు. నిర్మాత ఆకుల సురేష్ మాట్లాడుతూ .. ‘నా ఊర్లో నేను ఎన్నో కుటుంబాల్ని చూసి ఈ కథను రాసుకున్నాను. చంద్ర మహేష్ గారికి ఈ కథను వినిపించాను. ఇప్పుడు నా కథ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ అంటూ రాబోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం నచ్చుతుంది. ప్రతీ కుటుంబంలో జరిగే కథలా ఉంటుంది’ అని అన్నారు. నిర్మాత ఎఫ్.ఎం. మురళీ మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్ గారు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మా ఊర్లో, మా ఇంట్లో షూట్ చేశారు. సినిమా చూసి భావోద్వేగంతో బయటకు వచ్చాను. యూత్‌కి, ఫ్యామిలీకి ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు. సత్యం రాజేష్ మాట్లాడుతూ .. ‘మహేష్ చంద్ర గారే నన్ను ఆర్టిస్టుగా పరిచయం చేశారు. మా గురురు గారు తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి. రాజేంద్ర ప్రసాద్ గారు, పృథ్వీ గారు, మణిచందన గారు నటించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. నటుడు పృథ్వీ మాట్లాడుతూ .. ‘మహేష్ చంద్ర గారు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’లో అద్భుతమైన కథను చూపించబోతోన్నారు. తండ్రీ, కూతుళ్లు బంధాన్ని గొప్పగా రాసుకున్నారు. తల్లిదండ్రులు చెప్తే వినే పిల్లలు ఇంకా ఉన్నారు. అలాంటి కూతురు నాకు ఉండటం నా అదృష్టం. ప్రతీ కుటుంబంలో జరిగే కథ ఇది. క్లైమాక్స్‌కి అందరూ కచ్చితంగా కన్నీరు పెట్టుకుంటారు. మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడతారు’ అని అన్నారు. డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K A పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి స్టోరీ డెవలప్మెంట్ & డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: B. సత్యనారాయణ, మ్యూజిక్ : G.C క్రిష్, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య), స్క్రీన్ ప్లే- డైరెక్షన్: మహేష్ చంద్ర.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్' (SIIMA 2026) వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. సినీ తారల పలకరింపులు, రంగురంగుల కాంతుల నడుమ తొలి రోజు టాలీవుడ్, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులను అందజేశారు. ఈ ఏడాది సైమా వేడుకల్లో యువ నటీనటుల విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సూపర్‌యోధ కాన్సెప్ట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన 'మిరాయ్' చిత్రంలో అద్భుత నటనకు గాను యంగ్ హీరో తేజ సజ్జా 'ఉత్తమ నటుడు' అవార్డును దక్కించుకున్నారు. మరోవైపు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో మెప్పించిన నటి ఐశ్వర్య రాజేష్ ఉత్తమ నటితో పాటు క్రిటిక్స్ విభాగంలోనూ అవార్డులు అందుకొని డబుల్ ధమాకా సాధించారు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ముందంజలో ఉండే సైమా.. ఈ సారి కూడా కొత్త నీరుకి సరైన గుర్తింపునిచ్చింది. 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' సినిమాతో హర్ష్ రోషన్ ఉత్తమ డెబ్యూ నటుడిగా, శ్రీదేవి ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డులు అందుకున్నారు. అలాగే 'మోగ్లీ' చిత్రానికి గాను సాక్షి మడోల్కర్ డెబ్యూ విభాగంలో అవార్డు గెలుచుకోవడం గమనార్హం. సంగీత విభాగంలో రమణ గోగుల ('గోదారి గట్టు' - సంక్రాంతికి వస్తున్నాం), సమీరా భరద్వాజ్ ('ప్రేమలో' - కోర్ట్) ఉత్తమ గాయకులుగా నిలిచారు. చిన్ననాటి నుంచే బాలనటుడిగా మెప్పించి, 'హను-మాన్' చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఆ తర్వాత 'మిరాయ్'తో కూడా తన మాస్ అండ్ యాక్షన్ ఇమేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లారు. టాలీవుడ్‌లో సరికొత్త తరానికి నాయకత్వం వహిస్తున్న ఈ యువ కథానాయకుడికి సైమా అవార్డు దక్కడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు కన్నడ చిత్ర పరిశ్రమలో 'కాంతార: చాప్టర్ 1' చిత్రంతో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా నిలిచి అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల పండగలో సెప్టెంబర్ 13న జరిగే రెండో రోజు వేడుకలో తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల విజేతలను ప్రకటించనున్నారు.      [SIIMA Awards 2026 Winners Telugu, SIIMA 2026 Telugu Winners List, Teja Sajja Best Actor SIIMA, Aishwarya Rajesh Best Actress SIIMA 2026, Tollywood SIIMA Awards 2026]
తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని దశాబ్దాలుగా మాస్ ఫాలోయింగ్, బాక్సాఫీస్ క్రేజ్‌తో ఏలుతున్న ఇద్దరు అగ్ర కథానాయకులు విజయ్, అజిత్ కుమార్. ఈ ఇద్దరు దిగ్గజ తారలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు పండగే. తాజాగా బ్రిటన్‌లోని ప్రఖ్యాత 'సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్'లో వీరిద్దరూ అరుదుగా భేటీ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. రేసింగ్ ట్రాక్‌పై ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు ఒకరినొకరు కలుసుకున్న దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరూ తమ బిజీ షెడ్యూల్స్ పక్కనపెట్టి సరదాగా గడపడమే కాకుండా తమ మధ్య ఉన్న అన్యోన్య స్నేహబంధాన్ని మరోసారి చాటిచెప్పారు. ఈ అరుదైన కలయికలో నటుడు అజిత్ కుమార్.. విజయ్‌కి ఒక ఊహించని సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ రంగులను పోలి ఉండేలా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన రేసింగ్ సూట్‌ను విజయ్‌కి బహుకరించారు. ఈ స్పెషల్ గిఫ్ట్ చూసి విజయ్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, రేసింగ్ పట్ల విపరీతమైన మక్కువ ఉన్న అజిత్.. స్వయంగా కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుని విజయ్‌ని పక్కన కూర్చోబెట్టుకుని ఆ ట్రాక్‌పై నాలుగు ల్యాప్‌ల పాటు వేగంగా చక్కర్లు కొట్టారు. ట్రాక్‌పై వీరి కార్ రైడ్ అక్కడున్న వారందరినీ మంత్రముగ్ధులను చేసింది. సినిమా పరంగా, బాక్సాఫీస్ రేసులో వీరిద్దరి మధ్య ఎంతటి పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే వెండితెర వెనుక వీరిద్దరి మధ్య ఉన్న బంధం, గౌరవం ఎంత గొప్పదో ఈ సంఘటన నిరూపించింది. పోటీని పక్కనపెట్టి ఇద్దరు అగ్ర హీరోలు ఇలా ఆప్యాయంగా మెలగడం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ కలయికకు సంబంధించిన వార్తలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఈ పిక్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమ నివాసంలో 'ఇరుముడి' చిత్రబృందానికి ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చి ఘనంగా అభినందించారు. ఈ ప్రత్యేక భేటీలో హీరో రవితేజతో పాటు ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ, ఇతర ప్రధాన సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. సినిమా సాధించిన విజయానికి మెగా తండ్రీకొడుకులు ఇద్దరూ చిత్రయూనిట్‌ను ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కొంత సమయం గడిపి చిత్ర విశేషాలను పంచుకున్నారు. అంతకుముందే సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి, ఇప్పుడు నేరుగా యూనిట్‌ను కలవడం టాలీవుడ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రంలో 'త్రినాథ్' పాత్రలో రవితేజ జీవించాడని, తన అద్భుత నటనతో సినిమాను ముందుండి నడిపించాడంటూ మెగాస్టార్ ప్రత్యేకంగా కొనియాడారు. దర్శకుడు శివ నిర్వాణ ఎంతో ఎమోషనల్ మైండ్ సెట్‌తో కథను ఎమోషనల్‌గా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుందని, సినిమాలో నటించిన చిన్నారి నక్షత్ర నటన ప్రతి ఒక్కరినీ మెప్పించిందని చిరు ప్రశంసించారు. పరిశ్రమలో ఒక మంచి సినిమా విజయం సాధిస్తే అది అందరికీ పండుగలాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. రవితేజ, చిరంజీవి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై సృష్టించిన సంచలనం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రపోతోనే చిరు మరోసారి తన 'తమ్ముడు' రవితేజ విజయాన్ని తన సొంత విజయంగా భావించి సత్కరించడం గమనార్హం. ఈ సక్సెస్ మీట్‌కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ మరియు మాస్ మహారాజాలను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ కాంబో మళ్లీ రిపీట్ కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతున్న 'ఇరుముడి' త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు కూడా సిద్ధమవుతుండటంతో, ఓటీటీ వేదికగా ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Lady Gaga has reportedly entered a new chapter in her personal life, welcoming her first child with fiancé Michael Polansky. The couple was recently spotted with a newborn during a private stroll in Northern California, with Gaga seen carrying the baby close to her chest. The singer and Polansky have largely kept their relationship away from the spotlight. They began dating in 2020 and got engaged in 2024, with Gaga previously speaking openly about her desire to start a family. Gaga had even described motherhood as the role she most wanted to take on next. In a 2025 appearance, she spoke about wanting to become a mother and giving her future children the freedom to discover their own identities. For now, the couple has not publicly revealed details about the newborn, including the baby's name, sex or exact date of birth. Gaga has also maintained a low public profile since wrapping her Mayhem Ball tour in April. The arrival of her first child marks a deeply personal new phase for the global pop star. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
The makers of Crazy Kalyanam have released the energetic lyrical song "Kaaka Dhoom Dhamaka" from the film. Starring Naresh VK, Anupama Parameswaran, Tarun Bhascker, and Raj Weds Rambai fame Akhil Uddemari in lead roles, the film is being produced by passionate producer Boosam Jagan Mohan Reddy under the Arrow Cinemas banner as Production No. 2. The film is directed by Badrappa Gajula. "Kaaka Dhoom Dhamaka" has been designed as a high-energy mass wedding celebration song packed with vibrant dance moves and festive vibes. Composer Suresh Bobbili has delivered a catchy mass tune, while Kasarla Shyam has penned the lyrics.  The song is sung by Jangi Reddy, with Suresh Bobbili also lending his rap vocals. Choreographer Eswar Penti has created energetic dance steps that perfectly match the celebratory mood of the track. The song instantly grabs the attention of music lovers with its festive beats and lively lyrics, making it a perfect wedding anthem. One of the biggest highlights of "Kaaka Dhoom Dhamaka" is Anupama Parameswaran's energetic dance performance. Her stylish dance moves are expected to go viral across social media.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేష్ వీకే, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కళ్యాణం". యారో సినిమాస్ బ్యానర్ పై బూసం జగన్ మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి 'కాకా ధూమ్ ధమాకా' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.  పెళ్లి భరాత్ లో చేసే ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఈ సాంగ్ ను ఆడియెన్స్ కు నచ్చేలా రూపొందించారు. ఈ  పాటను సురేష్ బొబ్బిలి మాస్ ట్యూన్ తో కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా జంగి రెడ్డి పాడారు. సురేష్ బొబ్బిలి ర్యాప్ వోకల్స్ అందించారు. ఈశ్వర్ పెంటి అదిరే స్టెప్పులతో కొరియోగ్రఫీ చేశారు.  'కాకా ధూమ్ ధమాకా.. లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక. మూడు ముళ్ల సంబరాల ఢోలు బాజా కొట్టు.. కొంగు ముళ్ల సంతోషాల లొల్లే సూపెట్టు..' అంటూ ఈ పాట ఇన్ స్టంట్ గా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. 'కాకా ధూమ్ ధమాకా' పాటలో అనుపమ పరమేశ్వరన్ చేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఆమె చేసిన స్టెప్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఉన్నాయి.       [Kaaka Dhoom Dhamaka Song, Crazy Kalyanam Movie, Anupama Parameswaran, Tharun Bascker, Suresh Bobbili Songs, Telugu Songs, Telugu Film News]  
  ప్రశాంతమైన నిద్ర మానవ ఆరోగ్యానికి అత్యంత ఆవశ్యకమైన నిధి. రాత్రంతా హాయిగా, ఎటువంటి ఆటంకం లేకుండా నిద్రపోతేనే మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా, చురుగ్గా పనులు చేసుకోగలుగుతాం. అయితే చాలామందికి రాత్రివేళల్లో హఠాత్తుగా మెలకువ రావడం, ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం వంటి తీవ్రమైన సమస్య వేధిస్తుంటుంది. రాత్రి సమయం ముఖ్యంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ వచ్చి మళ్లీ గంటల తరబడి నిద్ర కోసం తల్లడిల్లడం మనం చాలామందిలో గమనిస్తుంటాం. దీనిని కేవలం ఒక సాధారణ అలవాటుగానో లేదా ఏదో చిన్న నిద్రలేమి సమస్యగానో భావించి నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. నిద్ర మధ్యలో పదే పదే మెలకువ రావడానికి మన జీవనశైలితో పాటు శరీరంలో అంతర్గతంగా ఉండే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణాలు కావచ్చు. ఈ సమస్యకు మొదటి మరియు అత్యంత ప్రధానమైన కారణం విపరీతమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్) మరియు ఆందోళన. మనసులో ఏవైనా ఆందోళన కలిగించే ఆలోచనలు ఉన్నప్పుడు, మన శరీరంలో  కోర్టిసాల్  అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు రాత్రి సమయంలో ఒక్కసారిగా పెరుగుతాయి. సాధారణంగా నిద్రపోతున్నప్పుడు తగ్గే ఈ హార్మోన్, మానసిక ఒత్తిడి వల్ల అర్ధరాత్రి వేళ హెచ్చుతగ్గులకు లోనై మెదడును తక్షణమే మేల్కొలిపేస్తుంది. అంతేకాకుండా, రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ ఉన్న పదార్థాలను తీసుకోవడం కూడా నిద్ర భంగానికి ప్రధాన కారణం. కెఫిన్ ప్రభావం శరీరంలో దాదాపు 6 నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను దెబ్బతీసి, గాఢ నిద్రలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. మరొక ముఖ్యమైన కారణం నిద్రపోయే ముందు భారీగా ఆహారం తీసుకోవడం లేదా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు. రాత్రి వేళ ఆలస్యంగా, ముఖ్యంగా కొవ్వులు మరియు కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిని వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లేదా అసిడిటీ సమస్య తలెత్తుతుంది. కడుపులోని ఆమ్లాలు పైకి రావడం వల్ల గుండెల్లో మంట, అసౌకర్యం కలిగి రాత్రిపూట ఉలిక్కిపడి లేస్తుంటారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్ లెవల్స్) హఠాత్తుగా పడిపోవడం వల్ల కూడా నిద్ర మధ్యలో మెలకువ వస్తుంది. రాత్రి సమయంలో రక్తంలో గ్లూకోజ్ తగ్గగానే, దాన్ని సరిచేయడానికి శరీరం అడ్రినలిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది గుండె వేగాన్ని పెంచి మనకు మెలకువ వచ్చేలా చేస్తుంది. రాత్రివేళ పదే పదే మెలకువ రావడానికి  స్లీప్ ఆప్నియా  అనే భయంకరమైన శ్వాసకోశ సమస్య కూడా కారణం కావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో నిద్రపోతున్నప్పుడు గొంతు కండరాలు సడలిపోవడం వల్ల గాలి పీల్చుకోవడం కొన్ని సెకన్ల పాటు నిలిచిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, ఊపిరి ఆడక మెదడు రక్షణ చర్యగా శరీరాన్ని వెంటనే మేల్కొలుపుతుంది. వీటితో పాటు రాత్రిళ్లు తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం (నాక్టూరియా), పడుకునే గదిలో ఎక్కువ వెలుతురు ఉండటం, తీవ్రమైన ఉష్ణోగ్రత లేదా ధ్వనులు ఉండటం కూడా నిద్రకు విఘాతం కలిగిస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే రాత్రి పూట లలితమైన ఆహారం తీసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం మరియు తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందడం చాలా అవసరం.         [Sleep Problems, Sleep Disorders, Night Waking, Insomnia, Stress and Anxiety, Caffeine, Acid Reflux, Blood Sugar, Sleep Apnea, Healthy Sleep]  
మన వంటింట్లో సులభంగా మరియు తక్కువ ధరకు లభించే ఆకుకూరల్లో పాలకూర అత్యంత విలక్షణమైనది. మార్కెట్లో అత్యంత చవకగా లభించినప్పటికీ, ఇది శరీరానికి అందించే పోషక విలువలు మాత్రం ఎంతో అమూల్యమైనవి. నేటి ఆధునిక జీవనశైలిలో విపరీతమైన కాలుష్యం, పోషకాహార లోపం మరియు రసాయన ఆహారాల కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. ఈ క్రమంలో నిత్యం మన ఆహారంలో పాలకూరను భాగం చేసుకోవడం వల్ల ఎటువంటి ఖరీదైన మందులు లేకుండానే పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందే వీలుంది. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, ఫోలేట్, కాల్షియం మరియు పొటాషియం వంటి అపరిమితమైన పోషకాలు దాగై ఉన్నాయి. దీనితో పాటు శరీర కణాలను దృఢంగా మార్చే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. పాలకూరను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల లభించే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన ప్రయోజనం కంటి చూపు మెరుగుపడటం. పాలకూరలో ల్యూటిన్ మరియు జియాజాంతిన్ అనే రెండు ప్రధాన యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను అరికట్టడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ల ముందు గంటల తరబడి పనిచేసే వారికి ఇది డిజిటల్ స్క్రీన్ల వల్ల కంటిపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. కంటి చూపు మందగించకుండా కాపాడటంతో పాటు దృష్టిని మరింత స్పష్టంగా మారుస్తుంది. అలాగే విటమిన్ ఏ పుష్కలంగా ఉండటం వల్ల రేచీకటి వంటి సమస్యలను కూడా ఇది నిరోధిస్తుంది.   రక్తహీనత లేదా ఎనీమియాతో బాధపడే వారికి పాలకూర ఒక అద్భుతమైన దివ్యౌషధం. ఇందులో ఐరన్ శాతం సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల (RBC) ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడి నీరసం, అలసట మరియు తల తిరగడం వంటి సమస్యలు మాయమవుతాయి. అంతేకాకుండా, పాలకూరలోని నైట్రేట్లు రక్తనాళాలను విస్తరించి రక్తప్రసరణ సులభంగా జరిగేలా చేస్తాయి. దీనివల్ల అధిక రక్తపోటు (బిపి) అదుపులోకి వచ్చి, గుండెపోటు మరియు పక్షవాతం వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో మరియు బరువు అదుపులో ఉంచడంలో పాలకూర ఎంతో తోడ్పడుతుంది. ఇందులో కరిగే మరియు కరగని నార పదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారించడమే కాకుండా, పేగుల ఆరోగ్యాన్ని క్షణాల్లో మెరుగుపరుస్తుంది. పాలకూరలో కేలరీలు అత్యంత తక్కువగా మరియు నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ డైట్ ఫుడ్. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా అడ్డుకుంటుంది. చర్మ సౌందర్యం మరియు ఎముకల దృఢత్వానికి కూడా పాలకూర ఒక వరప్రసాదంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కే మరియు కాల్షియం ఎముకల సాంద్రతను పెంచి, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. పాలకూరలోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. కాబట్టి రోజువారీ పప్పులు, సూప్‌లు, స్మూతీలు లేదా కూరల రూపంలో పాలకూరను క్రమం తప్పకుండా తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఖాయం.       [Spinach, Spinach Benefits, Eye Health, Iron Rich Foods, Anemia, Heart Health, Blood Pressure, Digestive Health, Bone Health, Healthy Diet]
  నేటి వేగవంతమైన జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం మరియు పెరిగిన కాలుష్యం కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరినీ తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. తల దువ్వుకున్న ప్రతిసారీ గుప్పెడు జుట్టు చేతికి రావడం, వెంట్రుకలు పల్చబడిపోవడం లేదా కాలక్రమేణా కుదుళ్లు బలహీనపడటం చాలామందిలో ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే ఖరీదైన కెమికల్ షాంపూలు, నూనెలు లేదా రకరకాల హెయిర్ ట్రీట్‌మెంట్ల వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ, ఇవన్నీ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి మరియు కొన్నిసార్లు జుట్టుకు మరింత హాని కలిగిస్తాయి. అయితే మన సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎటువంటి పార్శ్వ ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) లేకుండా ఇంట్లోనే జుట్టును సహజంగా ఒత్తుగా, బలంగా మార్చే అద్భుతమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా మన వంటింట్లో నిత్యం లభించే నల్ల నువ్వులు జుట్టు ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తాయి. మన పూర్వీకుల కాలం నుంచి నల్ల నువ్వులను ఆరోగ్యానికి మరియు కేశ సంరక్షణకు ఒక మహోన్నతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. నల్ల నువ్వులలో కేవలం ఆకలిని పెంచే గుణాలు మాత్రమే కాకుండా జుట్టుకు అవసరమైన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తలలో రక్త ప్రసరణను గణనీయంగా పెంచి, కుదుళ్లను లోపలి నుంచి దృఢంగా మారుస్తాయి. ముఖ్యంగా జుట్టు విరిగిపోకుండా అడ్డుకోవడంలోనూ, చివర్లు విడిపోకుండా చూడటంలోనూ నల్ల నువ్వులు అద్భుతంగా తోడ్పడతాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా అర టీస్పూన్ నల్ల నువ్వులను నమలి తినడం లేదా రాత్రి వేళ నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో పాటు నువ్వులను తీసుకోవడం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు అంతర్గతంగా లభిస్తాయి. నల్ల నువ్వులను కేవలం ఆహారంగా తీసుకోవడమే కాకుండా, వాటితో ప్రత్యేకమైన హెయిర్ ఆయిల్ తయారుచేసి తలకు పట్టించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. దీని కోసం గుప్పెడు నల్ల నువ్వులను తీసుకుని శుభ్రమైన కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో వేసి చిన్న మంటపై బాగా వేడెక్కించాలి. నువ్వులలోని సారం మొత్తం నూనెలోకి దిగి, నూనె రంగు మారేంత వరకు మరగబెట్టాలి. ఆ తర్వాత ఆ నూనెను చల్లార్చి వడకట్టి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పవిత్రమైన మూలికా నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు తలకు రాసి, చేతి వేళ్లతో తలపైన కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు తేలికపాటి మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల మాక్యులేషన్ పెరిగి వెంట్రుకల కుదుళ్లకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. ఈ నూనె మసాజ్ చేసిన గంట తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం రసాయనాలు లేని కుంకుడుకాయలు లేదా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా ఈ చిట్కాను రెండు నుంచి మూడు నెలల పాటు పాటిస్తే జుట్టు రాలడం గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, పల్చబడిన చోట కొత్త వెంట్రుకలు రావడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా నల్ల నువ్వులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు చిన్న వయస్సులోనే తెల్లబడకుండా కాపాడతాయి. సహజమైన కాంతిని, నిగనిగలాడే నలుపును జుట్టుకు ప్రసాదిస్తాయి. కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే లభించే ఈ నల్ల నువ్వుల ఉపాయాన్ని పాటించి, ఆరోగ్యకరమైన, దృఢమైన మరియు ఒత్తైన జుట్టును మీ సొంతం చేసుకోండి.       [Black Sesame Seeds, Hair Fall, Hair Growth, Hair Care, Hair Loss Remedies, Ayurvedic Hair Care, Hair Oil, Healthy Hair, Scalp Massage, Natural Hair Care]
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు. ఇది సాధారణ కీళ్ల నొప్పులతో పోలిస్తే భిన్నమైన ఆటో ఇమ్యూన్ సమస్య. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదం పనిచేస్తుందా? ఇంగ్లీష్ మెడిసిన్ తప్పనిసరా? కొన్ని సందర్భాల్లో సంప్రదాయ వైద్య చికిత్స అవసరం లేదా? ఆటో ఇమ్యూన్ కీళ్ల సమస్యల్లో ఆయుర్వేదాన్ని ఎందుకు కొందరు నిపుణులు సిఫారసు చేయరు? ఫంక్షనల్ మెడిసిన్ విధానం ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ వీడియోలో Acupuncture మరియు Functional Medicine నిపుణులు డా. పి.ఎస్. సాగర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సంబంధించిన వివిధ చికిత్సా విధానాల గురించి వివరిస్తున్నారు. ఆయుర్వేదం, కన్వెన్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్ మధ్య ఉన్న తేడాలు, వాటి విధానాలు, పరిమితులు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో చికిత్సను ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన అంశాల గురించి తెలుసుకోండి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య పరిస్థితికి సరైన చికిత్సను నిర్ణయించుకునే ముందు అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు. బొజ్జ గణపయ్యకు పెట్టే ప్రసాదాలు కేవలం సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు, వాటి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు ఆ కాలానికి తగినట్లుగా, శరీరానికి మేలు చేసే పదార్థాలనే వినాయకుడి ప్రసాదాలుగా మార్చారు. ఆ ప్రసాదాలు ఏమిటి, వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. కుడుములు , ఉండ్రాళ్ళు.. వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కుడుములు, ఉండ్రాళ్ళు. వీటిని నూనె లేకుండా కేవలం ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తారు. ఆవిరి మీద ఉడికే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉంటాయి. బియ్యపు పిండి, పెసరపప్పు లేదా శనగపప్పు, బెల్లం, కొబ్బరి కలగలిపి వీటిని తయారుచేస్తారు. బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆవిరి వంటకం కావడం వల్ల జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పొట్టలో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. కొందరు కుడుములను మైదా పిండితో నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తారు. ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు.   బెల్లం , పప్పుధాన్యాల కాంబినేషన్.. అన్ని రకాల ప్రసాదాలలో బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. కుడుముల్లో వాడే శనగపప్పు, పెసరపప్పుల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వర్షాకాలంలో పెరిగే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి బెల్లం, పప్పుధాన్యాల కాంబినేషన్ శరీరానికి మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది. జిల్లేడు కాయలు , మోదకాలు.. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలను బియ్యపు పిండిలో బెల్లం, కొబ్బరి పూరకంతో చేస్తారు. కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు చర్మానికి, జుట్టుకు చాలా మంచివి. అంతేకాకుండా కొబ్బరి శరీరానికి అవసరమైన శక్తిని త్వరగా అందిస్తుంది. కొబ్బరి , బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు, వాత రోగాల నివారణకు  ఈ కాంబినేషన్ చక్కగా తోడ్పడుతుంది. పాయసం , పరమాన్నం.. పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే పాయసం నివేదనలో ముఖ్యమైనది. పాలల్లో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. ఇందులో వేసే యాలకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పాయసంలో వాడే నెయ్యి శరీరానికి కావలసిన విటమిన్లు ఎ, డి లభించేలా చేస్తుంది , కీళ్ళకు అవసరమైన నూనెను అందిస్తుంది. పులిహోర.. ఏ పండుగైనా పులిహోర లేకపోతే నివేదన పూర్తికాదు. వినాయక చవితి నాడు నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను ప్రసాదంగా పెడతారు. చింతపండు, నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో విటమిన్ సి లభించడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పుల వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. పులిహోర తాళింపులో వాడే పసుపు సహజమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపులోని కుర్కుమిన్ అనే అంశం శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇందులో వేసే అల్లం, మిరియాలు జీర్ణరసాలను ఉత్పత్తి చేసి ఆకలిని పెంచుతాయి. చలిమిడి , వడపప్పు.. వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత ఇచ్చే ముఖ్యమైన ప్రసాదం చలిమిడి ,   పచ్చి పెసరపప్పును నీటిలో నానబెట్టి వడపప్పుగా ఇస్తారు. నానబెట్టిన పెసరపప్పులో పీచు పదార్థం, ప్రోటీన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి చేసిన బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసే చలిమిడి శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో కలిగే అలసటను నివారించడంలో ఈ  కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. పండ్ల నివేదన , పత్రీ ప్రభావం.. స్వామివారికి ప్రసాదాలతో పాటు రకరకాల పండ్లను సమర్పిస్తారు. ముఖ్యంగా వెలగపండు, నేరేడు పళ్ళు, అరటిపళ్ళు నివేదిస్తారు. వెలగపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపులోని క్రిములను సంహరిస్తుంది. నేరేడు పళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటితో పాటు పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి కూడా ఒక రకమైన ఔషధ గని. పూజ చేసే సమయంలో ఆ పత్రి తాకిడి, వాటి సువాసనల వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విధంగా వినాయక చవితి ప్రసాదాలు కేవలం నైవేద్యం మాత్రమే కాకుండా, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధాలుగా పనిచేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ ప్రసాదాలను తిని, పండుగను భక్తితో పాటు ఆరోగ్యకరంగా జరుపుకోవడం ఆ వినాయకుడు ఇచ్చే అదృష్టం.. !                          *రూపశ్రీ.  
ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. బిజీ జీవనశైలి, వేళపాళ లేని తిండి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది అనతికాలంలోనే అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే, బరువు తగ్గడానికి గంటల తరబడి జిమ్‌లో కష్టపడాల్సిన పనిలేదు లేదా కఠినమైన ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. మన రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.  అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని సులభమైన ఆహార నియమాలు , చిట్కాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. ప్రోటీన్ ఫుడ్.. ప్రోటీన్ లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. రోజూ తీసుకునే ఆహారంలో గుడ్లు, పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పనీర్, లేదా చికెన్ వంటి వాటిని చేర్చుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీనివల్ల అనవసరంగా చిరుతిళ్లు తినే అలవాటు తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలో కండరాల నిర్మాణానికి , జీవక్రియ రేటును పెంచడానికి తోడ్పడుతుంది. మంచినీరు మ్యాజిక్.. భోజనం చేసే సమయానికి కనీసం అర్ధగంట ముందు ఒక పెద్ద గ్లాసు మంచి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది , భోజనం చేసేటప్పుడు అతిగా తినకుండా నిరోధించవచ్చు. రోజూ సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి , మెటబాలిజం వేగవంతమవుతుంది. దాహం వేసినప్పుడు శీతల పానీయాలు లేదా ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడానికి బదులుగా సాధారణ నీరు లేదా నిమ్మరసం, మజ్జిగ తీసుకోవడం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫైబర్.. రోజువారీ ఆహారంలో పీచు పదార్థం లేదా ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ , ఓట్స్ వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా ఫైబర్ నిరోధిస్తుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు. కనుక ప్రతిరోజూ  తినే భోజనంలో సగం భాగం కూరగాయలు లేదా సలాడ్లు ఉండేలా చూసుకోవడం మంచిది. తినేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి.. ఆహారం తినేటప్పుడు టీవీ, మొబైల్ ఫోన్లు చూడటం వంటి పనులు మానుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమలి తినడం చాలా ముఖ్యం. ఆహారాన్ని బాగా నమిలి తిన్నప్పుడు జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది , కడుపు నిండిందనే సంకేతం మెదడుకు త్వరగా అందుతుంది. తొందరపడి తింటే తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తినేసే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్స్.. ప్యాక్ చేసిన ఆహారాలు, బేకరీ తిళ్లు, వేపుళ్లు, , ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీటిలో కేలరీలు, ఉప్పు , ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి ప్రధాన కారణమవుతాయి. అలాగే పంచదార , తీపి పదార్థాలను పూర్తిగా తగ్గించడం వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు చక్కెర కలిపిన స్వీట్లకు బదులుగా ఖర్జూరాలు లేదా తాజా పండ్లను ఎంచుకోవచ్చు. వ్యాయామం ముఖ్యమే.. ఆహార నియమాలతో పాటు రోజుకి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీనివల్ల అనవసరమైన ఆకలి పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణం, కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి సాధన చేయాలి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.. బరువు తగ్గడం అనేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు. దీనికి సహనం, నిలకడ చాలా అవసరం. కఠినమైన డైటింగ్స్ చేసి అనారోగ్యం పాలవడం కంటే, ఇటువంటి చిన్న చిన్న మార్పులను జీవనశైలిలో భాగం చేసుకుంటే సులభంగా , శాశ్వతంగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు.                        *రూపశ్రీ.