రాష్ట్రంలోని రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో సోమవారం (ఆగస్టు 10) నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం   పాల్గొని వైసీపీ వైఖరిపైవిమర్శలు గుప్పించారు. నెలనెలా స్వయంగా ప్రజల వద్దకు వచ్చి భూ హక్కు పత్రాలు అందిస్తున్నామన్న చంద్రబాబు జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు. గతంలో నేతల ఫోటోలతో పాసు పుస్తకాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని, తమ ప్రభుత్వంలో నిజమైన యజమానులకే పూర్తి హక్కులు కల్పిస్తున్నామన్నారు. ఆక్వా రంగానికి ఊరటనిస్తూ, పది ఎకరాల పరిమితి, జోన్ నాన్ జోన్ నిబంధనలను ఎత్తివేసి 1.50 కేనామలకే విద్యుత్ సరఫరా చేసే ప్రకటనపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వంపై ప్రతిఏటా రూ.1,150 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. అలాగే కొల్లేరు ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కైకలూరుకు  36 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ఆ పార్టీ చేస్తున్న  డిమాండ్ ను  ఖండించారు. ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఎదురుచూసిన మెగా డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తే..  కోర్టు కేసులతో అడ్డుపడాలని చూశారని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీసేలా ప్రవర్తించిన వారే ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  గత పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, గంజాయి సంస్కృతి, రౌడీయిజం రాజ్యమేలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నా  అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.   ప్రజా సంక్షేమానికి అడ్డుపడే ఏ శక్తినైనా తిప్పికొట్టి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు.  Chandrababu Naidu Speeches, AP CM Kalidindi Visit, AP Land Pattadar Passbooks, Aqua Farmers Subsidy, Mega DSC Andhra Pradesh, TeluguOne
ఒంగోలులో దామచర్ల, బాలినేని వ్యవహారంపై ఇటు తెలుగుదేశం, అటు జనసేన హైకమాండ్ సీరియస్ అయ్యాయి. తెలుగుదేశం హైకమాండ్ దామచర్లకు, జనసేన అధిష్ఠానం బాలినేనికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఒం  మాజీ మంత్రి, జనసేన నాయకుడు   బాలినేని శ్రీనివాసరెడ్డి,   తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ల నడుమ గత కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి.  తాజాగా ఈ ఇరుురు నేతలూ పరస్పరం అవినీతి ఆరోపణలు, విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడటం సంచలనం రేపింది.   ఈ ఇద్దరు కీలక నేతల   వైరం   కూటమి ప్రతిష్టకు భంగం కలిగించేలా మారడంతో తెలుగుదేశం, జనసేన పార్టీలహై కమాండ్ లు  ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై  అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి.  ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దామచర్ల, బాలినేని వ్యహార శైలిపై తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఉమ్మడి సమన్వయ కమిటీ నేతలు  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. కూటమి భాగస్వామ్య పక్షాలుగా కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయంలో, నేతలు ఇలా   పరస్పరం విమర్శలూ, దూషణలతో  రోడ్డెక్కడం ఏమాత్రం సరికాదని కమిటీ పేర్కొంది.   నేతల మధ్య  విబేధాలు, సమస్యలు   ఉంటే వాటిని పార్టీల అంతర్గత వేదికలపై  మాట్లాడటంలేదా,  అధిష్టానం దృష్టి తీసుకురావడం చేయాలే తప్ప..  మీడియా  ఎదుటకు వచ్చి వ్యక్తిగత విమర్శలకు దిగడం కరెక్ట్ కాదనీ, కూటమి ఐక్యతకు ఇది భంగం కలిగిస్తుందనీ కమిటీ దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డిలను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది.  ఈ వివాదానికి వెంటనే స్వస్తి పలకాలని,   ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని  ఇరువురికీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.   ఇరు వర్గాలు రోడ్డెక్కి బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన శ్రేణులలో తీవ్ర అయోమయం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఇటువంటి వర్గపోరు, ఆధిపత్య పోరాటాలు తెరపైకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోవడమే కాకుండా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని రెండు పార్టీల అగ్రనాయకత్వాలు భావించాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఇది రాజకీయ అస్త్రంగా మారే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన హైకమాండ్, ఈ వ్యవహారాన్ని మరింత ముదరకుండా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. కూటమిలో ఏ చిన్నపాటి విభేదాలు వచ్చినా స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవాలి లేదా సమన్వయ కమిటీల దృష్టికి తీసుకురావాలి తప్ప, మీడియాని వేదికగా చేసుకుని పరస్పర బురదజల్లుడు కార్యక్రమాలు చేపడితే ఎవరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు రాజకీయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయనేది ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ సీరియస్ హెచ్చరికల తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్ధన్ తమ విమర్శల దాడిని నిలిపివేసి సంయమనం పాటిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూ, ఇరువర్గాల కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ఈ ఇద్దరు నేతలకు పెద్ద పరీక్షగా మారనుంది. ఒకవేళ అధిష్టానం ఆదేశాలను తుచ్ఛంగా భావించి మళ్లీ బహిరంగ విమర్శలకు దిగితే, పార్టీల నాయకత్వాలు క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో ఇటువంటి అనవసర వివాదాలు పక్కనబెట్టి ఐక్యంగా పనిచేయాలని అధిష్టానం కోరుతోంది. మొత్తానికి, ఒంగోలులో రగిలిన పొలిటికల్ కాకను చల్లార్చేందుకు తెలుగుదేశం, జనసేన ఉన్నత నాయకత్వాలు తీసుకున్న శీఘ్ర నిర్ణయం కూటమి వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాలనలో క్రమశిక్షణ, భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య ఎంత ముఖ్యమో ఈ హెచ్చరిక ద్వారా స్పష్టమైంది. భవిష్యత్తులో జిల్లా స్థాయిలోనే సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి ఇరు వర్గాల మధ్య ఉన్న అపోహలను, ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని నాయకత్వం భావిస్తోంది. నామినేటెడ్ పదవులు, స్థానిక అభివృద్ధి పనుల కేటాయింపుల్లో అందరికీ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. మరి హైకమాండ్ విధించిన గీతను దాటకుండా ఈ ఇద్దరు కీలక నేతలు కలసి పనిచేస్తారా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. Balineni Srinivasa Reddy,  Damacharla Janardhan, Ongole Alliance Dispute, TDP Jana Sena Warning, Andhra Pradesh Politics, TeluguOne
రాజ మహూంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ను  కారుతో ఢీకొట్టి దారుణ హత్యకు గురి చేసిన సంఘటన   రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి విదిమే.   ఈ కేసును ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిండానికి వైసీసీ అధినేత చేస్తున్న ప్రయత్నం వెనుక ఉన్న  ఈ కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకడైన న ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఒక పాపస్టర్ కుమారుడు కావడమేనంటున్నారు.వాస్తవానికి విషయంతో సంబంధం లేకుండాప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం వైసీపీ ఎకోసిస్టమ్లో భాగంగా మారిపోయింది.  రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో  నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది. రెండుసంఘటనల్లోనూ ఆయన   స్పందన వేరువేరుగా ఉంది. కాశీబుగ్గ ఘటనలో నిందితులకు అనుకూలంగా, రాజమహేంద్రవరం సంఘటనలో మరోలా మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లోని వైరుధ్యాన్నీ, ప్రభుత్వంపై నిందలు మోపుతున్న తీరునూ గమనిస్తే.. జగన్ నిందితులకు  మద్దతుగా మాట్లాడుతూ, రాజకీయంతోనూ, ప్రభుత్వంతోనూ ఏమాత్రం సంబంధం లేని సంఘటనలకు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని చెప్పకతప్పదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఈ రెండుసంఘటనల్లోనూ కూడా నిదితులు మద్యం మత్తు, నిర్లక్ష్యం, అహంకారంతో వాహనం నిర్లక్ష్యంగా నడిపి నిండు ప్రాణం బలితీసుకున్నారు. ఈ విషయంలో పోలీసుల వైఫల్యం కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ ఇసుమంతైనా లేదు.   ముందుగా కాశీబుగ్గ సమీపంలో సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్ విషయానికి వస్తే..  ఆ సంఘటనలో ఒక పేద గొర్రెల కాపరి దానయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ సందర్భంగా  వైసీపీ అధినేత జగన్  వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. తొలుత  సొంత పార్టీ నేత కుమారుడిని రక్షించేందుకు వేరొక అనామకుడిపై నింద మోపే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో నడిరోడ్డుపై పడి ఉన్న దానయ్యను కాపాడే ప్రయత్నం చేయలేదు. దానయ్య కుటుంబాన్ని ఆదుకోలేదు. కుమారుడిని కాపాడేందుకు, కేసును తప్పుదోవపట్టిచేందుకు ప్రయత్నించిన   సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే..  దాన్ని రాజకీయ కక్ష సాధింపు గా జగన్ రెడ్డి  అభివర్ణించి విమర్శల పాలయ్యారు.  బాధితుడైన గొర్రెల కాపరి కుటుంబం ఆవేదనను పక్కనపెట్టి, కేవలం తమ పార్టీ నేత, కుల సమీకరణాలకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. సీదిరి అప్పలరాజు, అతడి కుమారుడిపై కేసు పెట్టడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా, మత్స్యకార నాయకుడ్ని వేధించడంగా  అభివర్ణించారుర.  ఇక తాజాగా రాజమహేంద్రవరం ఘటనలో డాక్టర్ ప్రియాంక మరణానికి కారణమైన  వారిలో ఒక నిందితుడు..  తనకు కీలకమైన  ఓటు బ్యాంకువర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఈ ఘటనలో మరణించిన ప్రియాంక వైద్య విద్యార్థిని కావడంతో  ఏం మాట్లాడాలో తెలియక డైలమాలో పడిన జగన్ చివరికి ప్రభుత్వాన్నినిందిస్తూ ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు.  జోసెఫ్ ఎడ్వర్డ్స్ కుటుంబం సామాజికంగా, మతపరంగా వైసీపీకి సాంప్రదాయకంగా మద్దతు ఇచ్చే వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో రాజమమేంద్రవరం కేసులో  నిందితులకు కఠిన శిక్ష పడాలని, వైసీపీ చేస్తున్న డిమాండ్లు మాటవరసేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే..  కాశిబుగ్గ కేసులో అప్పలరాజు కొడుకుపై చట్టం చర్యలు తీసుకుంటే వ్యతిరేకించిన జగన్.. ప్రియాంక విషయంలో  అందుకు భిన్నంగా స్పందిస్తారని ఎలా భావించగలమని అంటున్నారు.    ప్రియాంక తండ్రి కడుపు కోతతో మాట్లాడుతున్న మాటలను  రాజకీయం చేసి లబ్ధి కోసం పాకులాడుతున్నారు. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు, ఒక నిందితుడు తమ పార్టీ నేత కొడుకైనా, లేక ఓటు బ్యాంకుకు చెందిన ప్రముఖుడి కొడుకైనా శిక్ష ఒకేలా ఉండాలి.. జగన్ డిమాండ్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి కదా అంటున్నారు.   బాధితురాలైన డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్ ఏపీవ్యాప్తంగా మిన్నంటుతున్న వేళ, వైసీపీ ద్వంద్వ వైఖరి ఆ పార్టీ విశ్వసనీయతను మరింత మరింత మసకబారుస్తోందనడంలో సందేహం లేదు. సీదిరి అప్పలరాజు కుమారుడి కేసులో బాధితుడికి ఒక న్యాయం, రాజమహేంద్రవరం ప్రియాంక కేసులో మరో న్యాయం అన్నట్లుగా జగన్ రాజకీయాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  Jagan double standards, Politics, Hit and Run, Sidiri Appalaraju Son, Doctor Priyanka
ALSO ON TELUGUONE N E W S
King Nagarjuna turned emotional while speaking about Pallaburusu at the film's pre-release event, expressing his happiness and pride in producing a story rooted in genuine human emotions. Produced by Annapurna Studios and EPIC Studios, the film is directed by Uday Chauhan and is set against the backdrop of rural Telangana. It is gearing up for its theatrical release on August 14. He revealed it is special because it is releasing on his mother Annapurnamma's birthday and stated that it will always remain special for him and Annapurna as they are making it in their golden jubilee year.  Speaking at the event, Uday Chauhan revealed that he was deeply moved by the way the younger generation is sometimes neglecting their parents, which inspired him to make Pallaburusu. He said the film explores a fractured father-son relationship through a seemingly small issue, highlighting how even the smallest incidents can expose the biggest cracks within a family. He also expressed his gratitude for getting an opportunity to narrate the story to his idol Nagarjuna and make the film under the prestigious Annapurna Studios banner. Nagarjuna became emotional while remembering his parents ANR and Annapurnamma. He said he considers himself fortunate to have had the opportunity to take care of his parents, while also admitting that he misses them. He urged the younger generation to understand the importance of caring for their parents and preserving family bonds. Nagarjuna also revealed that his father ANR used to take care of his mother Annapurnamma with immense affection, even putting her needs ahead of his own. Interestingly, August 14 is Annapurnamma's birthday, making the release of Pallaburusu on the same day particularly special for the Akkineni family. He further revealed that the idea to make a film reflecting Telangana culture came from Telangana Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, and the team developed it into a story showcasing the simplicity and emotional depth of rural Telangana. Having watched the film himself, Nagarjuna said its genuine emotions touched his heart. He expressed confidence that audiences will laugh throughout the film while also leaving theatres with their hearts filled with happiness. He believes Pallaburusu will be remembered for its genuine emotions and is confident that the film will emerge as a big success. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించిన ప్రధాన తారాగణానికి అందిన పారితోషికాల వివరాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బాలీవుడ్ మ్యాజిక్, సౌత్ స్టార్‌డమ్ కలయికలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం మేకర్స్ కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నటిస్తున్న లీడ్ ఆక్టర్ల పారితోషికాలు పరిశీలిస్తే, హీరోగా నటించడంతో పాటు ఈ కథకు సహ రచయితగా వ్యవహరించిన యశ్ అత్యధికంగా దాదాపు రూ. 50 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక కథానాయికల విషయానికి వస్తే, నాడియా పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ భామ కియారా అద్వానీకి ఊహించని రీతిలో భారీ ఆఫర్ దక్కింది. ఈమెకు ఏకంగా రూ. 15 కోట్ల వరకు పారితోషికం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. 'లేడీ సూపర్ స్టార్' నయనతార గంగా అనే కీలక పాత్రలో కనిపించనుండగా, ఆమెకు రూ. 12 కోట్ల నుంచి రూ. 18 కోట్ల పరిధిలో రెమ్యూనరేషన్ లభిస్తున్నట్లు టాక్. వీరితో పాటు ఈ చిత్రంలో నటించిన ఇతర ప్రముఖ నటీనటులైన రుక్మిణి వసంత్‌కు రూ. 3 నుంచి 5 కోట్లు, హుమా ఖురేషి మరియు తారా సుతారియాలకు చెరో రూ. 2 నుంచి 3 కోట్ల వరకు లభించినట్లు ప్రచారం జరుగుతోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ ఖర్చుతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. భారీ క్యాస్టింగ్ మరియు క్రేజీ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.   Yash Toxic Movie, Kiara Advani Remuneration, Nayanthara Toxic Remuneration, Toxic Movie Cast Fees, Geetu Mohandas Toxic
మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను కేవలం ఆరాధకులుగానే కాకుండా సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తారని మరోసారి నిరూపితమైంది. ఓ సాధారణ సినిమా టెక్నీషియన్ తనపై, తన కుమారుడిపై చూపించిన అమితమైన ప్రేమకు ముగ్ధుడైన మెగాస్టార్.. ఆ అభిమాని కుటుంబాన్ని ప్రత్యేకంగా తన నివాసానికి ఆహ్వానించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ అరుదైన మరియు ఆత్మీయమైన సంఘటన ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. రామ్ చరణ్ కూడా ఈ భేటీలో పాల్గొని ఆ అభిమాని కుటుంబంతో కాసేపు సరదాగా సమయాన్ని గడిపారు. ప్రస్తుతం చిరంజీవి ‘మెగా 158’ సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ సెట్స్‌లో కెమెరా విభాగంలో పనిచేస్తున్న నివాస్ అనే టెక్నీషియన్‌ను చిరంజీవి ఆప్యాయంగా పలకరించారు. ఆ సంభాషణలో నివాస్ తాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు వీరాభిమానని, ఆ ప్రేమాభిమానంతోనే తన కొడుక్కి ‘జస్వంత్ రామ్ చరణ్’ అని పేరు పెట్టుకున్నట్లు చెప్పారు. తన కుటుంబంపై ఒక సాధారణ టెక్నీషియన్ చూపిస్తున్న నిష్కల్మషమైన ప్రేమను చూసి చిరంజీవి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే నివాస్ ఫ్యామిలీని తన ఇంటికి రావాల్సిందిగా ప్రేమగా ఆహ్వానించారు. మెగాస్టార్ నుంచి పిలుపురావడంతో ఆనందంతో మునిగిపోయిన నివాస్, తన కుటుంబంతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ కుటుంబానికి ఊహించని సర్‌ప్రైజ్ లభించింది. స్వయంగా రామ్ చరణ్ కూడా అక్కడకు వచ్చి, చిన్నారి జస్వంత్ రామ్ చరణ్‌ను ఎంతో ఆప్యాయంగా ఎత్తుకుని కాసేపు ముచ్చటించారు. అనంతరం నివాస్ కుటుంబ సభ్యులతో కలిసి చిరు, చరణ్ ఫొటోలు దిగి ఆ క్షణాలను మరచిపోలేని జ్ఞాపకంగా మార్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమవ్వడంతో మెగా అభిమానులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. తమ అభిమాన కథానాయకుల సంస్కారం, ఆత్మీయత పట్ల ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు. సాధారణ టెక్నీషియన్‌కు మెగా కుటుంబం ఇచ్చిన ఈ గౌరవం, అభిమానులతో వారికి ఉండే అవినాభావ బంధానికి నిదర్శనమని ఇండస్ట్రీ వర్గాలు కొనియాడుతున్నాయి.   Chiranjeevi, Ram Charan, Mega 158, Mega Fan Nivas, Jaswanth Ram Charan
    హీరో.. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకొని ఉంటే గాని హీరో అవ్వరు అనే సామెత అభిమానుల్లో, సినీ ప్రియుల్లో చాలా బలంగానే ఉంది. యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల జోనర్స్ లో నవరసాలని ప్రదర్శిస్తూ అభిమానులు, ప్రేక్షకులని అలరించడమే ద్యేయంగా ఉంటాడు. అసలు నవరసాలు ప్రదర్శించాలంటే నరాలు తెగిపోతాయి. నటన అనేది అంత కష్టం.  తాజాగా ఫిలిం సర్కిల్స్ లో ప్రజలు డబ్బుతో సినిమా టికెట్ కొంటేనే హీరోలకి డబ్బులు అనే చర్చ జరుగుతుంది. దీంతో ఈ విషయంపై అభిమానులు, సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. వాళ్లంతా మాట్లాడుతు హీరోలకి ప్రజలు సినిమా చూస్తేనే డబ్బులు వస్తాయనేది నిజం. ఈ విషయంలో సినిమానే కాదు. ఆటో నడుపుకునే వ్యక్తి దగ్గర నుంచి అంబానీ దాకా ప్రతి వ్యక్తి సంపాదన ఇంకో వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆ గవర్నమెంట్ ని నడిపే రాజకీయనాయకుడు అందరు ప్రజలు కట్టిన   పన్నునే జీతాలుగా తీసుకుంటారు. మరి ఆ అందరకి హీరోకి ఉన్న తేడా ఏంటంటే తమ ప్రజలకి ప్రకృతి విపత్తు సంభవించి బాధపడుతుంటే వెనక, ముందు చూడకుండా కోట్ల రూపాయల డబ్బులని ఇస్తున్నారు. ఎంతలా అంటే వెన్నెముఖ లేనంతగా..   Also Read: పాలిటిక్స్ ఖాయమా!: జార్ఖండ్ విద్యార్థులకి అండగా పుష్ప ఇక హీరోల పుట్టిన రోజులతో పాటు సినిమా రిలీజ్ రోజు, రికార్డు కలెక్షన్స్ సాధించినప్పుడు అభిమానులు చేసే సేవాకార్యక్రమాలు అయితే నభూతో నభవిష్యత్. మరి దీన్ని బట్టి హీరోలు ప్రజల ద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ప్రజలకే ఇస్తున్నారు. ఈ విషయంలో దర్శకులు, నటులు, హీరోయిన్స్, నిర్మాతలు కూడా పోటీ పడుతూ కోట్ల రూపాయల డబ్బుని అందచేస్తున్నారు. కాబట్టి సినిమా వాళ్ళు ఉన్నది ప్రజల కోసం, ప్రజలు ఉన్నది సినిమా వాళ్ళ కోసమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రియులు స్పందిస్తున్నారు. Hero, Chirnajeevi, Balakrishna, Nagarjuna, Ntr, Pawan kalyan  
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'రాకా'తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే తన ఫ్యాన్స్ తో హైదరాబాద్ లో ఫ్యాన్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్లందరికీ పలు విషయాలపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసాడు. ఈ మీటింగ్ ఏర్పాటుతో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడనే న్యూస్ కూడా వైరల్ గా మారింది. ఇప్పుడు అంతకు మించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) నియామక పరీక్షల్లో జరిగిన తీవ్ర అక్రమాలు, అవకతవకలకు నిరసనగా వేలాది మంది నిరుద్యోగ యువకులు, విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే, ఈ భారీ పోరాటంలో అందరి దృష్టిని ఆకర్షించి, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఒక ప్రత్యేక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'పుష్ప'లోని ఐకానిక్ లుక్‌లో ఓ యువకుడు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచాడు. మెడలో బంగారు గొలుసులు, చేతి వేళ్లకు మెరిసే ఉంగరాలు, పుష్ప రాజ్‌కు సరిపోయేలా హెయిర్ స్టైల్, గెటప్‌తో మహారాష్ట్ర నుంచి రాంచీకి వచ్చిన సదరు యువకుడు విద్యార్థుల నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాడు. 'పుష్ప' చిత్రంలో "పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్!" అని చెప్పినట్టుగానే, అతడు కూడా విద్యార్థుల తరఫున గట్టి స్వరంతో నినదించాడు. "జార్ఖండ్‌ విద్యార్థులు జూకరు.. ఆగరు.. వారికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గరు" అంటూ పుష్ప స్టైల్లో డైలాగ్ చెబుతూ ఆందోళనకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాడు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన వివిధ ఆందోళనలకు పెద్ద ఎత్తున ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మద్దతు తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, జార్ఖండ్ విద్యార్థులు పడుతున్న వేదన కూడా జాతీయ మీడియా దృష్టికి వెళ్లాలని, ఇక్కడి నిరుద్యోగులకు తక్షణమే పూర్తిస్థాయిలో ఆమోదయోగ్యమైన న్యాయం జరగాలని అతడు పిలుపునిచ్చాడు. Also read: గోల్డెన్ ఛాన్స్: కల్కి 2 కాస్టింగ్ కాల్: ప్రభాస్ సినిమాటిక్ యూనివర్స్‌లో మీరు ఉండవచ్చు దీంతో సినిమా పాత్రలు కేవలం వెండితెరపై వినోదాన్ని పంచడానికే పరిమితం కావు. కొన్నిసార్లు సమాజంలో జరిగే పోరాటాలకి, అన్యాయాలపై గొంతెత్తే ఉద్యమాలకు అవి శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయనే విషయం అందరకి అర్థమైంది.     Alli Arjun, Pushpa, jharkhand  
  సోషల్ మీడియాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు, మూవీ లవర్స్ , సినీ రంగంలో వివిధ రంగంలో స్థిర పడాలనే అనుకునే వారి వల్ల సైక్లోన్ తుపాన్ సంభవించింది.  ప్రభాస్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ "కల్కి 2898 AD పార్ట్ 2 . పార్ట్ 1 లో ఉన్న ఎన్నో డౌట్స్ కి క్లారిఫై కూడా ఇస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆశగా పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల్లో ప్రభాస్ పై ఉండే క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. ఇప్పుడు ఆ అభిమానులకి, సినిమాపై ఆసక్తి ఉన్న వాళ్ళకి కల్కి మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.  కల్కి సినిమాటిక్ యూనివర్స్ (KCU) ను మరింత విస్తృతం చేసేందుకు వైజయంతీ మూవీస్ అధికారికంగా భారీ కాస్టింగ్ కాల్ (Casting Call) ప్రకటించింది. ఈ కాస్టింగ్ కాల్ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ నాగ్ అశ్విన్ టీమ్ మాత్రం ప్రతిభ కలిగిన కొత్త నటీనటులకు, డ్యాన్సర్లకు, మోడళ్లకు, మార్షల్ ఆర్ట్స్ నిపుణులకు ఏకంగా ప్రభాస్ నటించే భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లో అవకాశం కల్పించేందుకు డోర్స్  ఓపెన్ చేసింది. ఇందులో ఎలాంటి వయోపరిమితి లేకపోవడం విశేషం. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతిభ ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ప్రొఫైల్స్ పంపవచ్చని స్పష్టం చేశారు.  ఈ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు స్పందనతో నెట్టింట సైక్లోన్ తుపాన్ మాదిరిగా పరిస్థితి ఉంది. దాదాపు వేలాది మంది ఔత్సాహిక కళాకారులు తమ ఆడిషన్ వీడియోలు, ఫోటో గ్రాఫ్‌లు ప్రొడక్షన్ హౌస్ మెయిల్ ఐడీకి పంపుతున్నారు. also read: నా కులం అదే.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ Prabhas, Kalki 2898ad, Nag ashwin  
గత కొన్నేళ్లుగా స్టార్ హీరోల సినిమాలు అంటే చాలు.. అవే రక్తం చిందించే గ్యాంగ్‌స్టర్ డ్రామాలు.. అవే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు.. అవే లార్జర్ ద్యాన్ లైఫ్ స్టోరీలు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేయడమే దాదాపు స్టార్స్ మర్చిపోయారు. ఇలాంటి టైంలో కోలీవుడ్ స్టార్ సూర్య రూట్ మార్చి చేసిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ సినిమాతో మళ్ళీ మునుపటి రోజులు వస్తాయా అని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు సౌత్ సినిమాలో కుటుంబ బంధాలు, స్వచ్ఛమైన ప్రేమకథలు థియేటర్లలో నవ్వులు, కన్నీళ్లు పూయించేవి. కానీ గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ ట్రెండ్ మొత్తం రక్తపాతం వైపే వెళ్లిపోయింది. గన్స్, బాంబులు, డార్క్ షేడ్ గ్యాంగ్‌స్టర్లు లేకుండా అసలు స్టార్ హీరోల సినిమాలు రావడమే అరుదైపోయింది. కానీ ఇప్పుడు సూర్య చేస్తున్న ఈ బోల్డ్ అటెంప్ట్ చూస్తుంటే.. 'బ్లడ్‌షెడ్ నుంచి బ్లడ్ రిలేషన్స్' వైపు మళ్లీ మన సౌత్ హీరోలను మళ్లించేలా ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోలంతా భారీ పాన్ ఇండియా యాక్షన్ ప్రాజెక్ట్ ల వెనుకే పడుతున్నారు. కానీ సూర్య మాత్రం అందుకు భిన్నంగా, ఒక ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామాని ఎంచుకున్నారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' కథలో సూర్య ఒక ఇంటర్నేషనల్ పిస్టల్ షూటర్‌గా, 40 ఏళ్ల వయసులో కూడా తన కలలను వదులుకోకుండా పోరాడే పాత్రలో కనిపిస్తున్నారు. తండ్రీ కొడుకుల అనుబంధం, చిన్నారి కోసం పడే ఆరాటం, హృదయాలను హత్తుకునే ఎమోషన్స్, మమితా బైజుతో ఏజ్-గ్యాప్ లవ్ స్టోరీ.. ఇవన్నీ కలిపి కుటుంబ సమేతంగా ఆస్వాదించేలా వెంకీ అట్లూరి రూపుదిద్దారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైంలో 'విశ్వనాథ్ అండ్ సన్స్' వస్తుండటంతో.. ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కట్టే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మిగతా స్టార్ హీరోలు కూడా తమ రూట్ మార్చుకునే ఛాన్స్ ఉంది. స్టార్ హీరోలు ఎప్పుడూ యాక్షన్ సినిమాలే కాకుండా.. మధ్య మధ్యలో ఇలా ఫ్యామిలీ సినిమాలు కూడా చేస్తే.. అన్ని వర్గాల ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడతాయి. ఒకవేళ 'విశ్వనాథ్ అండ్ సన్స్' విజయం సాధిస్తే.. భారీ యాక్షన్ సినిమాల నడుమ.. అప్పుడప్పుడు ఫ్యామిలీ సినిమాలు చేయడానికి మిగతా స్టార్స్ మొగ్గు చూపే అవకాశముంది.      Suriya, Vishwanath and Sons, Venky Atluri, Mamitha Baiju  
మంచు మనోజ్.. ఈ పేరుకి తెలుగు సినిమాకి ఉన్న అనుబంధం తెలిసిందే. హీరోగానే కాదు నెగిటివ్ రోల్ లోను తన మానియా స్పషంగా చాటగలనని మిరాయ్ తో నిరూపించిన మనోజ్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ రోజు హైదరాబాద్ లోని  AAA సినిమాస్‌లో 'గజ' చిత్ర టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఎంతో ఘనంగా జరిగింది. మంచు మనోజ్, సునీల్ చలమలశెట్టి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి  తమ శుభాకాంక్షలు అందించారు. .  ఈ వేదికపై మంచు మనోజ్ మాట్లాడుతు సినిమా పరిశ్రమకి కులం, గోత్రం అనేవి ఉండవు.  మతం అసలే లేదు! సినిమా తీసే వాళ్లకు, థియేటర్లలో ఆదరించే ప్రేక్షకులకు, అలాగే వార్తలని  మోసుకెళ్లే మీడియా సోదరులకి ... మనందరికీ ఉన్నది ఒకటే కులం, అది సినిమా కులం!   జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే ప్రతి ఒక్కరూ ధైర్యంగా రిస్క్ తీసుకోవాలి. అలాగే తీసుకున్న నిర్ణయంపై సంపూర్ణమైన నమ్మకంతో కష్టపడి పని చేయాలి. ఈ చిత్రంలోని  సతీష్ జై ఒకేసారి హీరోగా, దర్శకుడిగా మరియు నిర్మాతగా త్రిపాత్రాభినయం తరహాలో 3 కీలక బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఒక కొత్త టీమ్‌ని నడిపిస్తూ ఇలాంటి సాహసోపేతమైన ప్రయత్నం చేయడానికి సతీష్ జై చూపించిన తెగింపు, పట్టుదల అభినందనీయం. అంతేకాకుండా, ఈ చిత్రానికి స్వరాలు అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా  తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుంచి వచ్చిన  'రాయలసీమ రామన్న చౌదరి' కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను.ఆ సమయంలో ఆయన  అందించిన ఐకానిక్ టైటిల్ సాంగ్ కంపోజిషన్‌ను దగ్గరుండి చూసే అరుదైన అవకాశం లభించింది. ఇటీవల మణిశర్మ సంగీతం అందించిన 'చెన్నై లవ్ స్టోరీ' మంచి విజయాన్ని సాధించిందని, అదే విజయ పరంపరను ఈ 'గజ' సినిమాతో కూడా కొనసాగించాలని మనోజ్ ఆకాంక్షించారు.  Also read: సంచలన నిర్ణయం: ఆ ఇన్స్టాగ్రామ్ పేజీకి సినిమా టికెట్ పంపించండి.. డబ్బులు తీసుకోండి    సతీష్ జై మరియు ఫర్నాజ్ శెట్టి జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అనేక 'వావ్ ఫ్యాక్టర్స్' ఉన్నాయని, కచ్చితంగా అందరికీ నచ్చేలా రూపొందించామని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది. సంచలన వ్యాఖ్యలు మరియు అద్భుతమైన టీజర్‌తో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచిన 'గజ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ఘన విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది  Manchu Manoj, Gaja teaser launch, Tollywood  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
 పిల్లలు సక్సెస్ కావాలంటే ఈ లక్షణాలు అలవాటు చెయ్యాలి..! "నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని వారి నడవడికను తెలియజేయడానికి, పిల్లల భవిష్యత్తు గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు.  ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, తమకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటారు.  అయితే ఇవన్నీ జరగాలన్నా, పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలన్నా.. పిల్లలకు కొన్ని లక్షణాలు అలవాటు చేయాలి.  దీని వల్ల పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయాల్సినవి ఏమిటో తెలుసుకుంటే.. జ్ఞానం, తెలివితేటలు.. జ్ఞానం , తెలివితేటలు  పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా బలాలుగా మారతాయి. నేర్చుకోవాలనే తపన, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న పిల్లలు జీవితంలో విజయ మార్గంలో సులభంగా పయనిస్తారు. అటువంటి పిల్లలు తమ వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలరు. తెలివైన పిల్లలు తమ భవిష్యత్తును గొప్పగా మార్చుకోవడమే  చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రుల ప్రతిష్టను కూడా పెంచుతారు. అందుకే చిన్నతనం నుండే పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వాలి.   ప్రవర్తన.. మంచి ప్రవర్తన, నీతి, నిజాయితీ వంటి విలువలు గొప్ప ఆస్తిగా పరిగణించాలి. పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన పిల్లలు కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి పిల్లలు ఇంట్లో శాంతి, సంతోషాన్ని నెలకొల్పి, సమాజంలో కుటుంబానికి గౌరవాన్ని తెస్తారు. అందుకే పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి.  దీని వల్ల పిల్లల ప్రవర్తన కూడా ఉన్నతంగా మారుతుంది. నిజాయితీ.. అబద్ధాలు చెప్పడం, మోసం, వంచనలకు దూరంగా ఉండే పిల్లలు సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. పిల్లలు అయినా పెద్దలు అయినా.. వారి వ్యక్తిత్వాన్ని బలంగా ఉంచేది నిజాయితీనే..  ఇది  చుట్టూ ఉన్న వ్యక్తుల నమ్మకాన్ని పొందడంలో సహాయపడుతుంది. అటువంటి పిల్లలకు జీవితంలో విజయం సాధించడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. అందుకే వారి తల్లిదండ్రులు కూడా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. దయ.. దయ కలిగి ఉండటం,  సహాయపడే గుణం ఉన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు.  పేదలకు సహాయం చేస్తూ, ఇతరుల పట్ల సున్నితంగా ఉండే పిల్లలు సంతోషం, శాంతితో కూడిన జీవితాన్ని గడుపుతారు. అలాంటి పిల్లలకు  తల్లిదండ్రుల ఆశీర్వాదం, మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది.   పిల్లలలో ఉండే ఈ దయ, జాలి, కరుణ, సహాయం చేసే గుణం వంటివి సమాజంలో గప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.                                *రూపశ్రీ.  
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.  అయితే రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.  పక్కన ప్రయాణికుల నుండి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రైల్వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక "నైట్ జర్నీ కండీషన్స్" అమలు చేసింది. ప్రతి రైలు ప్రయాణికుడు ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే.. శబ్దం చేయకూడదు.. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నిశ్శబ్ద వాతావరణాన్ని పాటించడం ప్రధాన నియమం. ఈ సమయంలో మొబైల్ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు, లేదా ఇయర్‌ఫోన్‌లు లేకుండా స్పీకర్‌లపై వీడియోలు లేదా సంగీతాన్ని ప్లే చేయకూడదు. ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు, స్నేహితులతో గుంపులుగా బిగ్గరగా నవ్వడం , జోకులు వేయడం కూడా నిషేధించబడింది. లైట్స్ ఆఫ్.. కొన్నిసార్లు ప్రయాణికులు ఎవరైనా రాత్రి పొద్దుపోయే వరకు  ఏదో ఒక కారణంతో మెయిన్ లైటును ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల ఇతర ప్రయాణికులు నిద్రపోలేరు. పక్క వారి నిద్రకు ఇబ్బంది అవుతుంది.  రైల్వే నిబంధనల ప్రకారం, రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన కోచ్‌లోని లైట్లన్నీ తప్పనిసరిగా ఆపివేయాలి. రాత్రిపూట కేవలం నైట్‌లైట్ బల్బులు మాత్రమే ఆన్ చేసి ఉండవచ్చు. ఎవరైనా  అవసరం అనిపిస్తే వారు  తమ సీటులోని పర్సనల్ రీడింగ్ లైటును ఉపయోగించుకోవచ్చు. మధ్య బెర్త్ లకు రైల్వే నియమాలు.. లోయర్ బెర్త్  , మధ్య బెర్త్ ప్రయాణీకుల మధ్య సీట్ల తగాదాలను నివారించడానికి, రైల్వే ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టింది. మధ్య బెర్త్ ప్రయాణీకుడు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే తన సీటును విప్పి నిద్రపోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత, ఇతరులు దిగువ బెర్త్‌లో కూర్చోవడానికి వీలుగా  మధ్య బెర్త్‌ను దించాలి. అదేవిధంగా, రాత్రి 10 గంటల తర్వాత, లోయర్ బెర్త్ ప్రయాణీకుడు తన సీట్ లో ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదు. వారు తమ పక్కన కూర్చోమని ఎవరినీ బలవంతం చేయలేరు. టికెట్ చెకింగ్.. ప్రయాణికుల నిద్రను దృష్టిలో ఉంచుకుని, రైల్వే తన టికెట్ చెకింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల మధ్య  టికెట్‌ను తనిఖీ చేయడానికి ఏ టిటిఇ మిమ్మల్ని నిద్రలేపకూడదు. వారు రాత్రి 10:00 గంటల లోపు తమ పనిని పూర్తి చేసుకోవాలి. అయితే, రాత్రి 10:00 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులు ఈ సమయంలో తమ టికెట్లను తనిఖీ చేయించుకోవచ్చు. ఇది కాకుండా రాత్రి 10 గంటల తర్వాత రైలులో వీధి వ్యాపారులు లేదా విక్రయదారులు గట్టిగా అరుస్తూ ఎలాంటి వస్తువులను అమ్మకూడదు.  కానీ ఎవరైనా ఈ-క్యాటరింగ్ ద్వారా ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకుని ఉంటే, అది ఖచ్చితంగా వారి సీటుకే తెచ్చిస్తారు. నియమాలు ఉల్లింఘిస్తే.. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికుడు ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారితో వాదించాల్సిన అవసరం లేదు.  వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), TTE, లేదా రైలులోని కోచ్ అటెండెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.  రైల్వే అధికారిక యాప్ 'రైల్‌మదాద్' లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. నియమాలను ఉల్లంఘించిన వారిపై రైల్వే జరిమానాలు కూడా విధించవచ్చు. కాబట్టి రైలు ప్రయాణం చేసేటప్పుడు పై నియమాలు గుర్తుంచుకుని,  వాటిని అనుసరిస్తూ ప్రయాణించడం మంచిది.                                      *రూపశ్రీ.  
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం. అయితే రక్తంలో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉన్నా (Hyperkalemia), తక్కువగా ఉన్నా (Hypokalemia) ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అసలు పొటాషియం అంటే ఏమిటి? రక్తంలో పొటాషియం ఎందుకు పెరుగుతుంది? పొటాషియం తగ్గడానికి కారణాలు ఏమిటి? పొటాషియం ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ సమస్యను నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేయాలి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ వైద్యులు డా. N. Papa Rao సులభంగా వివరిస్తున్నారు. పొటాషియం ఎక్కువైతే ఏమవుతుంది? రక్తంలో పొటాషియం సాధారణ స్థాయికి మించి ఉండటాన్ని Hyperkalemia అంటారు. కొన్ని సందర్భాల్లో కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం, కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని మందుల కారణంగా పొటాషియం స్థాయి పెరగవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు కండరాల బలహీనత, అలసట, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా గుండె పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పొటాషియం తగ్గితే? రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉండటాన్ని Hypokalemia అంటారు. వాంతులు, విరేచనాలు, అధికంగా చెమట పట్టడం, కొన్ని మందుల వాడకం వంటి కారణాలతో శరీరంలో పొటాషియం తగ్గే అవకాశం ఉంటుంది. పొటాషియం తక్కువగా ఉన్నప్పుడు నీరసం, కండరాల బలహీనత, కండరాలు పట్టేయడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? పొటాషియం స్థాయి ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది కేవలం లక్షణాల ఆధారంగా నిర్ణయించలేం. అవసరమైతే వైద్యుల సూచనతో రక్త పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా కొన్ని మందులు క్రమం తప్పకుండా ఉపయోగించేవారు వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. పొటాషియం ఎక్కువగా ఉందని లేదా తక్కువగా ఉందని అనుమానం వచ్చినప్పుడు సొంతంగా మందులు తీసుకోవడం, పొటాషియం సప్లిమెంట్లు వాడటం లేదా ఆహారంలో పెద్ద మార్పులు చేయడం చేయకండి. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పొటాషియం ఎక్కువైనా ప్రమాదమే.. తక్కువైనా సమస్యే. కాబట్టి శరీరంలో పొటాషియం స్థాయి ఎందుకు మారుతుంది, దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాలపై పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల వ్యక్తిగత సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా అనుమానాలు ఉంటే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది. కంటి సమస్యలు అంటే చాలామంది కంటి శుక్లాలు రావడం,  కంటికి ఏదైనా దెబ్బ తగలడం... వీటి గురించి చెబుతుంటారు. కానీ వర్షాకాలంలో పిలవని అతిథి గా వచ్చేది కంటి ఇన్ఫెక్షన్ల సమస్య. కంటి ఇన్ఫెక్షన్లు వస్తే కన్ను ఎర్రబడటం,  కంటి నుండి నీరు కారడం, కళ్లు మసకగా మారడం, కళ్ల మంటలు వంటి సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో వచ్చే ఈ కంటి ఇన్ఫెక్షన్ల సమస్య.. ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది కూడా. అసలు కంటి ఇన్పెక్షన్ సమస్యలు ఎందుకు వస్తాయి? కారణాలు ఏంటి?  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  కంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు చికిత్స ఏంటి?  తెలుసుకుంటే.. వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి? వర్షపు నీరు నేరుగా కంటి ఇన్ఫెక్షన్లకు కారణం కాదు.. అయినప్పటికీ ఈ కాలంలో బ్యాక్టీరియా , వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం, మురికి చేతులతో కళ్లను తాకడం, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి వాడిన టవల్ లేదా చేతి రుమాలును ఇతరులు వాడటం, కాంటాక్ట్ లెన్స్‌లను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటివి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ సోకిన కంటిని తాకిన తర్వాత  డోర్‌నాబ్, మొబైల్ ఫోన్, టేబుల్ లేదా ఇతర వస్తువులను తాకితే, అక్కడ ఉన్న వైరస్‌లు లేదా బ్యాక్టీరియా ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు. కంటి ఇన్పెక్షన్ లక్షణాలు.. కళ్లు ఎర్రబడటం, ఆగకుండా నీరు కారడం,  దురద లేదా మంట.  కళ్ల నుండి జిగటగా లేదా పసుపు-తెలుపు రంగులో స్రావం రావడం. కనురెప్పలు వాపు. కళ్లలో ఇసుక గుచ్చుతున్నట్లు అనిపించడం. ఉదయం నిద్రలేచినప్పుడు కనురెప్పలు జిగటగా ఉండటం.. వంటివి కంటి ఇన్పెక్షన్ లక్షణాలు. కన్ను ఎర్రబడితే ఇన్పెక్షన్ వచ్చినట్టా? వర్షాకాలంలో అలర్జీలు, దుమ్ము, కాలుష్యం లేదా ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల తరచుగా కళ్ళు ఎర్రబడవచ్చు. అందువల్ల,  కన్ను ఎర్రబడగానే అది  కంటి ఇన్పెక్షన్ అనుకోవడం పొరపాటు.   కొందరు ఇలా సందేహం రాగానే  సొంతంగా యాంటీబయాటిక్ కంటి డ్రాప్స్ వంటివి   వాడతారు,  ఇలా చేయడం మంచిది కాదు.  నొప్పి తీవ్రంగా ఉంటే, దృష్టి మసకబారితే, లేదా లైటింగ్ కు కళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే  వెంటనే కంటి వైద్య నిపుణుడిని సంప్రదించాలి. వీళ్లకు ఎక్కువ జాగ్రత్త అవసరం.. కాంటాక్ట్ లెన్స్ వాడేవారు,  చిన్న పిల్లలు,  వృద్ధులు కంటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మాత్రమే కాకుండా.. మధుమేహ వ్యాధిగ్రస్తులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఈ మధ్యనే  కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కంటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో కళ్లను ఎలా కాపాడుకోవాలి? చేతులను సబ్బు ,  నీటితో బాగా కడుక్కోవాలి. మురికి చేతులతో  కళ్ళను తాకకూడదు. బయటి నుండి వచ్చిన తర్వాత  ముఖాన్ని, చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి.  కళ్ళలోకి దుమ్ము లేదా మురికి నీరు వెళితే, వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. తువ్వాళ్లు, చేతి రుమాళ్లు లేదా దిండులను సెల్ఫ్ గా ఉంచుకోవడం, సెల్ఫ్ గా వాడుకోవడం మంచిది. ఇతరులకు ఇవ్వడం లేదా ఇతరులవి వాడటం మంచిది కాదు. కంటి అలంకరణ వస్తువులైన కాటుక,  ఐ లాషెస్,  ఐ లైనర్ వంటివి ఇతరులకు ఇవ్వడం, ఇతరులవి తీసుకోవడం మంచిది కాదు.  ఇన్ఫెక్షన్ సోకినట్లయితే కళ్లను అలంకరించుకోవడం మానెయ్యాలి. కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు.. వర్షాకాలంలో కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని పెట్టుకునే ముందు  చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లెన్స్‌లను గానీ, వాటి కేస్‌ను గానీ కుళాయి నీటితో ఎప్పుడూ శుభ్రం చేయకూడదు. కళ్ళు ఎర్రబడటం, నొప్పి లేదా చీము కారడం వంటివి కనిపిస్తే, వెంటనే  లెన్స్‌లను తీసివేసి, వైద్యుడిని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లెన్స్‌లు ధరించడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. కంటి ఇన్ఫెక్షన్ వస్తే ఏం చేయాలి?  కళ్ళు ఎర్రబడినా లేదా నీరు కారుతున్నా, మొదటగా  వాటిని పదేపదే రుద్దడం ఆపాలి. శుభ్రమైన దూదితో లేదా మెత్తని గుడ్డతో వాటిని శుభ్రం చేసుకోవాలి. తక్కువ మంట లేదా వాపు ఉంటే చల్లటి కాపడం ఉపశమనాన్ని ఇస్తుంది.  డాక్టర్ రికమెండ్  చేస్తే కృత్రిమ ఐ డ్రాప్స్ ఉపయోగించవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా డాక్టర్‌ను సంప్రదించకుండా యాంటీబయాటిక్ లేదా స్టెరాయిడ్ కంటి చుక్కలను ఉపయోగించకూడదు. అన్ని రకాల ఇన్ఫెక్షన్లకు చికిత్స ఒకేలా ఉండదు. కానీ సొంత ప్రయోగాలు చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.                                *రూపశ్రీ.