తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్న పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ఇటీవల నిర్వహించిన కాపు ఆత్మీయ సమావేశం, సాయికృష్ణ కేసును అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలపై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది. తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడిన   జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్  వైసీపీ యత్నాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు అసలైన కాపు నాయకులు కారని..  వారు కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బానిసలుగా పనిచేస్తున్నారని   శ్రీనివాస్ విమర్శించారు. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌ను, ఆయన కుటుంబాన్ని బూతులు తిట్టించినప్పుడు ఈ నేతల ఆత్మగౌరవం ఎటు పోయిందని  ప్రశ్నించారు. జగన్ హయాంలో కాపు రిజర్వేషన్లను రద్దు చేసినప్పుడు, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలను అణచివేసినప్పుడు నోరు మెదపని వీరు..  ఇప్పుడు హఠాత్తుగా కులప్రేమను ఒలకబోయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు. 14 ఏళ్ల మైనర్ బాలిక కుటుంబానికి అన్యాయం జరిగితే పరామర్శించని వైసీపీ నేతలు..  కేవలం రాజకీయ లబ్ధి కోసమే సభలు పెడుతున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఈ వైసీపీ నేతలంతా ఘోరంగా ఓడిపోయారని, దీన్ని బట్టే కాపు యువత వీరిని నాయకులుగా అంగీకరించడం లేదనేది స్పష్టమవుతోందని  టట శ్రీనివాస్  పేర్కొన్నారు. చారిత్రకంగా కాపు సామాజిక వర్గం నుంచి ఎందరో మహానుభావులు సమాజానికి సేవలందించారని, కానీ కోడిగుడ్డు ఆమ్లెట్ కథలు చెప్పే అంబటి రాంబాబు, బియ్యం కేసుల్లో ఉన్న పేర్ని నాని వంటి వారిని నేటి తరం ఆదర్శంగా తీసుకోబోరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారన్న శ్రీనివాస్  ప్రజాప్రతినిధులు ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు కొందరు ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారని గుర్తుచేశారు. కులాల గోడలు బద్దలు కొట్టి, రాష్ట్ర ప్రగతి కోసం జనరేషన్ జెడ్  ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లడమే కూటమి లక్ష్యమని పునరుద్ఘాటించారు. వైసీపీ ఆడుతున్న ఈ కుల రాజకీయ డ్రామాలను కాపు సామాజిక వర్గం గమనిస్తోందని, భవిష్యత్తులో వారికి తగిన బుద్ధి చెబుతుందని ముగించారు.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకల వేదికగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో క్యాన్సర్ నుండి కోలుకున్న స్వప్న అనే యువతి మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ప్రముఖ నటుడు కిరాక్ ఆర్పీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.    సాక్ష్యాలతో సహా   వీడియోను ఆధారంతో అసలు వాస్తవాలను బహిర్గతం చేశారు. ఇటీవల జరిగిన బసవతారకం ఆసుపత్రి 25 ఏళ్ల వార్షికోత్సవానికి నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో క్యాన్సర్‌తో బాధపడి ఈ ఆసుపత్రిలో ఉచిత వైద్యం పొంది పూర్తిగా కోలుకున్న స్వప్న అనే అమ్మాయి వేదికపైకి  వచ్చి తన కృతజ్ఞతలు తెలిపింది.  నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మా ఊరిలో  జగన్ సార్ మా ఇంటికి వచ్చి, బాలకృష్ణ సార్‌తో మాట్లాడించి నన్ను ఈ ఆసుపత్రిలో చేర్పించారు అని ఆమె పేర్కొంది.అయితే, ఆ అమ్మాయి నోట 'జగన్ సార్' అనే మాట రాగానే..  అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ  సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ అమ్మాయి చెప్పిన  జగన్ సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని, ఆయన అనంతపురానికి చెందిన  అనంతపురం జగన్  అని ఆర్పీ స్పష్టం చేశారు. నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు ఆయన దశాబ్దాలుగా వీరాభిమానిగా ఉన్నారని తెలిపారు.   ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా బాలయ్య చేసే సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటుంటారని వివరించారు.గతంలో అనంతపురం జిల్లాలో సదరు బాలిక క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఈ అభిమాని జగన్.. స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి  పరామర్శించారు. ఆ వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. బాలయ్య చొరవ తీసుకుని ఆ అమ్మాయిని బసవతారకం ఆసుపత్రిలో చేర్పించి ఉచితంగా వైద్యం అందించారు. దీనికి సంబంధించిన పాత ఫోటోలను, బాలయ్య ఆ పాపను ఆసుపత్రిలో పరామర్శించిన విజువల్స్‌ను ఆర్పీ  చూపించారు. సొంత చెల్లిని, కన్నతల్లిని దూరం పెట్టి, బాబాయి మరణంపై రాజకీయం చేసిన వ్యక్తికి.. ఇలాంటి మానవతా కార్యక్రమాలతో ఏం సంబంధం ఉంటుందని ఆర్పీ ప్రశ్నించారు. ఏ చిన్న మంచి పని జరిగినా, వేరే వాళ్లు తెచ్చిన కంపెనీలైనా తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయాలనుకోవడం  వైసీపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రేపు ప్రపంచంలో  జగన్ అనే పేరున్న వాళ్లు ఏ మంచి పని చేసినా అది వైఎస్ జగనే చేశాడంటూ క్లెయిమ్ చేసుకునేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ నిజాలు తెలుసుకోకుండా కేవలం పేరు ఒక్కటే చూసి వైసీపీ సోషల్ మీడియా బృందంక్రెడిట్ చోరీకి పాల్పడటం   సిగ్గుచేటని ఆర్పీ విమర్శించారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ హైప్రొఫైల్ కేసులో తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ మిస్సింగ్ ఉదంతం వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ఇటు లీగల్ వర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు సాయికృష్ణ మిస్సింగ్ వెనుక ఏం జరిగింది, ఒక పోలీస్ అధికారి అరెస్ట్ వరకు ఈ వ్యవహారం ఎందుకు దారితీసింది అనే కోణంలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ పరిణామంపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.  ఈ కేసు తీవ్రతను గమనించిన కోర్టు ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని గట్టిగా నిలదీసింది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం, జూన్ 29వ తేదీ లోపు పూర్తి వివరాలతో కూడిన సమాధానాన్ని సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఈ ఉదంతం దేశ రాజధాని ఢిల్లీకి సైతం చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎంపీలు తనూజ మరియు గురుమూర్తి ఇద్దరూ కలిసి   జాతీయ మానవ హక్కుల కమిషన్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు  స్థానిక పరిధిలోనే కాకుండా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.  దీనిపై భరద్వాజ్.. సిఐ నాగరాజును అరెస్ట్ చేయకుండా తప్పించుకునే పరిస్థితి పోలీసు శాఖకు లేకుండా పోయిందన్నారు.   బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.  మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ సీఐ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన తీరు ప్రజా బాహుళ్యంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందన్నారు. అయితే ఈ సింపతీని పక్కదారి పట్టించడానికి ఒక వ్యూహాత్మక నెరేటివ్ కూడా తెరపైకి వచ్చిందన్న ఆయన.. సాయికృష్ణపై గతంలో ఉన్న 23 క్రిమినల్ కేసుల రికార్డును ఎస్టాబ్లిష్ చేస్తూ, అతనొక ప్రమాదకరమైన గంజాయి పెడ్లర్ అనీ.. అతని వల్ల సమాజానికి ముప్పని ప్రచారం చేయడం ప్రారంభించారు. కృష్ణలంక ప్రాంతంలో మహిళలు రోడ్ల మీదకు వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ సిఐ నాగరాజుకు మద్దతు తెలపడం ప్రత్యేకంగా గుర్తించాలన్నారు. గతంలో సురేంద్రబాబు  హయాంలో బుడ్డ శంతన్, పిల్లి దుర్గాప్రసాద్ ఎన్ కౌంటర్ల సమయంలో ఇలాంటి ప్రజా మద్దతు కనిపించినప్పటికీ, చట్టం ముందు ఇవేవీ నిలబడలేదని గుర్తు చేస్తూ ఇప్పుడూ అదే జరుగుతుందన్నారు. కేవలం ఒక పాత నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యూ) అమలు కోసం తీసుకొచ్చిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌లో ప్రాణాలు పోయేలా కొట్టడం వెనుక ఏదో బలమైన రాజకీయ ఒత్తిడి లేదా మాఫియా ప్రమేయం ఉందని భరద్వాజ్ అన్నారు. సాయికృష్ణ తీవ్రమైన ఇంటరాగేషన్ తట్టుకోలేక మరణించాడని, ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఎక్కడో గుర్తుతెలియని బస్టాప్ సమీపంలో అనాథ శవంగా దహనం చేసేశారని ప్రచారం జరుగుతోందనీ. కనీసం తల్లికి బూడిద కూడా దక్కకుండా సాక్ష్యాధారాలను పూర్తిగా తుడిచిపెట్టేయడం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘోరం వెనుక కేవలం సిఐ నాగరాజు ఒక్కరే లేరని, మొత్తం ఇంటరాగేషన్ టీమ్ కానిస్టేబుళ్లు కూడా ఉన్నారని, అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా సిఐ కేంద్రబిందువు అయ్యారని భరద్వాజ్ అన్నారు.  ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆంధ్రప్రదేశ్‌ను పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ సిండికేట్ లింకులు ఉన్నాయన్నారు. కేవలం నైజీరియన్లు లేదా సినిమా వాళ్లే కాకుండా, స్థానిక పొలిటికల్ లీడర్ల అండదండలతో ఈ డ్రగ్ నెట్‌వర్క్ భారీ ఆర్థిక వనరుగా నడుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో గంగవరం పోర్టులో దొరికిన 4 కంటైనర్ల డ్రగ్స్ ఉదంతం లాగే, ఈ సాయికృష్ణకు కూడా కీలకమైన పొలిటికల్ డ్రగ్ లింకులు ఏమైనా తెలిసి, బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించడం వల్లే ఈ హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం  ఈ కేసును లోతుగా విచారించి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజాలను బయటపెట్టాలని,  సిఐ నాగరాజు నుంచి నేర అంగీకార వాంగ్మూలం (కన్ఫెషన్ స్టేట్‌మెంట్) తీసుకుని, కేసును ఆయనతోనే ముగించేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు భరద్వాజ అనుమానం వ్యక్తం చేశారు. 
ALSO ON TELUGUONE N E W S
  శంకరాభరణం(sankarabharnam).. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అత్యంత విలువైన ప్రాపర్టీ. స్టార్ హీరో, స్టార్ కాస్టింగ్ లేకుండా ఓన్లీ కథ, కథనాన్ని, సంగీతాన్ని మాత్రమే నమ్ముకొని వచ్చిన శంకరా భరణం అమరత్వాన్ని నింపుకున్న మూవీగా కూడా నిలిచింది. అసలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే రోజుల్లో 'శంకరాభరణం'. వచ్చి ఉండి, సదరు బ్రిటిష్ వాళ్ళు మూవీని వీక్షించి ఉంటే కనుక స్వాతంత్య్రాన్ని ఇచ్చి వెళ్లే వాళ్ళు అనే మాట కూడా శంకరాభరణం మూవీ లవర్స్ లో ఉంది. గత కొన్నిరోజులుగా సినీ మార్కెట్ లో  ఏ ఇద్దరు సినీ ప్రియులు కలిసినా 'శంకరాభరణం' గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో 'శంకరా భరణం లాంటి మూవీ మళ్ళీ వస్తుందా!   మన ఇండస్ట్రీ ఆ దిశగా ఏమైనా ఆలోచనలు వేస్తుందా! అలాంటి మూవీ రావాలంటే ఎవరు పూనుకోవాలి!. ఒక వేళ పూనుకొని శంకరాభరణం లాంటి కథ, కథనంతో కూడిన చిత్రాలు వస్తే సినీ ప్రేమికులంతా అదృష్టవంతులు ఉండరని మాట్లాడుకుంటున్నారు. Also read: డైరెక్ట్ తెలుగు మూవీలో ప్రదీప్ రంగనాథన్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఈల వేస్తారు  ఫిబ్రవరి 2 1980 న అంటే నాలుగున్నర దశాబ్దాల క్రితం 'శంకరాభరణం' మూవీ రిలీజ్ అయ్యింది. శాస్త్రీయ సంగీతానికి ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పడంతో పాటు ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే ప్రేమ, త్యాగం అనేవి శారీరక సుఖం కోసమే ఏర్పడవనే సత్యాన్ని సమాజానికి చాలా బలంగా చాటి చెప్పింది. ఆ మూగ, దైవ ప్రేమే 'శంకరాభరణం' చూసిన  ప్రతి తెలుగు వాడి హృదయంలోకి చొరబడి  నేటికీ  తిష్ట వేసాయి. టీవీల్లో చూసిన  వాళ్ళు, చూస్తున్న పరిస్థితి కూడా అదే.  ఎన్నో రికార్డులు, అవార్డులు సొంతం చేసుకున్న  శంకరా భరణంకి సంబంధించిన అందరు తెలుగు ప్రేక్షకుల బంధువులే.  
After building a strong market among Telugu audiences with back-to-back successful releases in the Telugu states, Tamil actor-director Pradeep Ranganathan now appears to be preparing for his first straight Telugu film. Industry reports suggest that the young star is in discussions to headline a project to be directed by filmmaker Chandrasekhar Yeleti. What makes the reported development interesting is the contrast in styles. Pradeep has become popular for his youthful energy, humour and contemporary storytelling, while Yeleti has built a reputation for crafting intelligent, concept-driven films such as Aithe, Anukokunda Oka Roju, Sahasam and Manamantha. According to circulating reports, the project is being planned as an action thriller and could be backed by Mythri Movie Makers. If materialised, the film is expected to be mounted as a bilingual venture targeting both Telugu and Tamil markets. However, an official confirmation from the production house or the team is still awaited. The timing also makes the speculation noteworthy. Pradeep’s popularity has expanded beyond Tamil cinema following the performance of films like Love Today, Dragon and Dude, turning him into one of the most watched young actors in the South market. If the project goes on floors, it would mark Yeleti’s return with a fresh-age leading man and also open a new phase in Pradeep Ranganathan’s career with a direct entry into Telugu cinema. For now, all eyes are on whether this unusual but exciting combination becomes official.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  పాన్ ఇండియా అగ్ర సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers)తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep ranganathan)తో డ్యూడ్ మూవీ చేసిందంటే ప్రదీప్ స్టామినాని అర్ధం చేసుకోవచ్చు. ప్రదీప్ కూడా తన పెర్ఫార్మ్ తో సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకొని ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. టాలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ క్రేజీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నే  నిర్మించబోతోంది. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులని  ఎంతగానో అలరించిన ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న మొదటి 'స్ట్రెయిట్ తెలుగు సినిమా' (Straight Telugu Debut) ఇదే కావడం విశేషం. ప్రదీప్ రంగనాథన్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రైటర్‌గా తన ప్రతిభను నిరూపించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఇంతా కాదు. 'లవ్ టుడే' (Love Today), 'డ్రాగన్' (Dragon), మరియు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ. 114 కోట్లకు పైగా వసూలు చేసిన 'డ్యూడ్' (Dude) చిత్రాలతో వరుసగా మూడు సార్లు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి తిరుగులేని హిట్స్ అందుకున్నారు. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ మూడు బ్యాక్-టు-బ్యాక్ రూ. 100 కోట్ల మైలురాళ్ళు ప్రదీప్‌ను సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యాంకబుల్ యంగ్ స్టార్‌గా నిలబెట్టాయి. ఇప్పుడు అదే జోష్‌తో తెలుగు మార్కెట్ పై కన్నేసిన ఈ యంగ్ హీరో, చంద్రశేఖర్ యేలేటి లాంటి కల్ట్ డైరెక్టర్‌తో చేతులు కలపడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రశేఖర్ యేలేటి అంటేనే తెలుగు సినిమాలో ఒక ప్రత్యేకమైన బ్రాండ్. 'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు', 'సాహసం', 'మనమంతా' వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మైండ్ గేమ్‌లు, విభిన్నమైన సస్పెన్స్ స్క్రీన్‌ప్లేలకు ఆయన పెట్టింది పేరు. కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటూనే ప్రేక్షకులను థ్రిల్ చేసే యేలేటి మార్క్ సరికొత్త స్క్రిప్ట్‌కు, ప్రదీప్ రంగనాథన్ మార్క్ యూత్‌ఫుల్ ఎనర్జీ మరియు కామెడీ టైమింగ్ తోడైతే థియేటర్లలో వినోదాల విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడానికే మెగా క్రేజీగా ఉంది. ఈ చిత్రం ఒక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపుదిద్దుకోబోతున్నట్లు సమాచారం. Also read: Og 2: ఓజి 2 లో ఉండబోయే కథ ఇదే   ఈ భారీ ప్రాజెక్ట్‌కి  సంబంధించిన కథా చర్చలు, ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులు పూర్తిగా లాక్ అయ్యాయని, మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇద్దరు విలక్షణ ప్రతిభావంతులను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కానుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ ఎనర్జీ, చంద్రశేఖర్ యేలేటి ఇంటెలిజెన్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు.. ఈ ముగ్గురి కలయిక బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.    
   పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'OG' (og)సృష్టించిన  సంచలనం  తెలిసిందే. ఎంటైర్ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు 300 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. ఈ భారీ విజయంతో పవర్ స్టార్ అభిమానుల్లో పూనకాలు తెప్పించిన దర్శకుడు సుజీత్, ఇప్పుడు అంతకు మించిన విధ్వంసానికి తెరలేపారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలకి  తెరదించుతూ ఈ రోజు  ‘OG 2’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ హై ఎనర్జీ వీడియోని  విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో టాలీవుడ్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. "తుఫాను రావడానికి ముందు.. అక్కడ కొంత నిశ్శబ్దం ఉంటుంది. ఓజాస్ గంభీర యొక్క అన్‌టోల్డ్ స్టోరీ ఇప్పుడు విప్పబడటానికి సిద్ధంగా ఉంది" అంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ వేదికగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాని  షేక్ చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని పవన్ కళ్యాణ్ స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పతాకంపై నిర్మిస్తుండటం గమనార్హం. ఈ ప్రత్యేక వీడియోలో దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్‌కు ‘OG 2’ స్క్రిప్ట్ లైన్ మరియు సరికొత్త ‘OG Universe’ ఐడియాలను వివరిస్తూ కనిపించారు. సుజీత్ చెప్తున్న పవర్‌ఫుల్ సీక్వెన్స్‌లని పవన్ ఎంతో ఆసక్తితో వింటూ ప్రశ్నలు అడుగుతూ, చర్చల్లో మునిగిపోయారు. ఈ వీడియో చివర్లో పవన్ కళ్యాణ్ దర్శకుడితో మాట్లాడుతూ "నా వైపు నుండి నువ్వు ఏం కోరుకున్నా నేను రెడీగా ఉన్నాను (Whatever from my side will be ready)" అని చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అంతేకాదు, సుజీత్ రాసుకున్న ఒక నిర్దిష్ట సీన్‌ని  విన్న పవన్.. అది వెండితెరపై ఒక ఐకానిక్ విజువల్‌గా నిలిచిపోతుందని ప్రశంసించారు. ఈ సీక్వెల్‌లో కథ కేవలం పార్ట్ 2 కి మాత్రమే పరిమితం కాకుండా, ఒక భారీ ‘OG సినిమాటిక్ యూనివర్స్’గా విస్తరించబోతోందని స్పష్టమైంది. ఈ చిత్రంలో మంచు క్రమంగా రక్తంగా మారే ఒక అద్భుతమైన సీన్‌తో పాటు, ఒక రహస్యమైన ‘అవుట్‌సైడర్’ పాత్ర మరియు ఓజీ పెట్ (పెంపుడు జంతువు) ప్రాధాన్యత గురించి సుజీత్ ప్రత్యేకంగా వివరించారు. సినిమా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘OG 2’ చిత్రం కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, ఓజాస్ గంభీర గతానికి సంబంధించిన ఒక ఇంటెన్స్ ప్రీక్వెల్ బ్యాక్‌డ్రాప్‌ని  కూడా కలిగి ఉండబోతోంది. ముఖ్యంగా జపాన్ నేపథ్యంలో గంభీర సృష్టించిన అసలు రక్తాక్షరాల విద్వంసం ఏమిటి? అతను ముంబై అండర్‌వరల్డ్‌ను శాసించే అంత పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? అనే కోణాల్లో ఈ కథ నడవనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా తన రాజకీయ బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రానికి కాల్షీట్లు సర్దుబాటు చేయనున్నారు. నవంబర్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.    
  సమంత(Samantha)మా ఇంటి బంగారం సక్సెస్ జోష్ లో ఉంది. ఐదు రోజులకే 50 కోట్ల క్లబ్ లోకి కూడా చేరడంతో సమంత కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ ఏ పాటిదో మరో సారి  అర్ధమవుతుంది. ఈ మూవీ సక్సెస్ మీట్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరగగా, సదరు ఈవెంట్ లో సమంత మాట్లాడిన రిలేషన్‌షిప్స్, బంధాలు, ఒక వ్యక్తికి  ఉండాల్సిన ఆత్మవిశ్వాసంపై చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు నేరుగా అక్కినేని నాగచైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ గతంలో చేసిన కొన్ని స్టేట్‌మెంట్స్‌కి  కౌంటర్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఈ సక్సెస్ మీట్ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతు 'ఒక బంధం నిలబడాలంటే ఇద్దరి భాగస్వామ్యం సమానంగా ఉండాలి. మన కెరీర్, మన రిలేషన్‌షిప్ అనేవి మన చేతుల్లోనే ఉన్నా కూడా  కొన్ని బంధాలు చాలా సంక్లిష్టంగా మారుతుంటాయి. ఒక బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు కావాలి. అందుకే కొన్నిసార్లు అది మన చేతుల్లో ఉండదు. ముఖ్యంగా మహిళలు వేరొకరిపై ఆధారపడకుండా తమపై తాము నమ్మకం కలిగి సంపూర్ణమైన వ్యక్తిగా ఎదగాలి. జీవితంలో ఎదురయ్యే అతి తక్కువ స్థాయి లేదా కష్ట సమయాల్లో మనకి  మనమే బెస్ట్ ఫ్రెండ్‌గా నిలబడాలి. వేరొకరు వచ్చి మన జీవితాన్ని భర్తీ చేస్తారని ఆశించడం వల్ల బంధాలపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుందని సమంత  పేర్కొంది. Also read: Ajay Devgn: అజయ్ దేవ్‌గన్ కొత్త మూవీ చౌహన్.. పఠాన్ లతో చెప్పండి సమంత చేసిన ఈ కామెంట్స్ బయటకు రాగానే నెటిజన్లు, అభిమానులు .ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన నాగచైతన్య, శోభిత ధూళిపాళ(Sobhita dhulipala)వెడ్డింగ్ వీడియోలోని శోభిత వ్యాఖ్యలతో దీనిని పోల్చడం ప్రారంభించారు. ఆ వీడియోలో శోభిత మాట్లాడుతూ ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అసంపూర్ణంగా ఉంటాడని, మరొకరు జీవితంలోకి వచ్చి ఆ వెలితిని పూరించినప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుందని నేను నమ్ముతాను. చైతు తన జీవితంలో లేకపోతే తాను సంపూర్ణంగా ఉండలేనని పేర్కొంది. సరిగ్గా ఈ వ్యాఖ్యలకు భిన్నంగా సమంత.. "ఎవరికి వారు ఒంటరిగానూ సంపూర్ణులే, వేరొకరి వల్ల మనం పరిపూర్ణమవ్వాల్సిన అవసరం లేదు" అనే కోణంలో మాట్లాడటంతో ఇరు వర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కౌంటర్ల యుద్ధం నడుస్తోంది.    
  బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్( Ajay Devgn)చిరకాలం నుంచే తెలుగు ప్రేక్షకులకి సుపరిచయస్తుడు. ఆర్ ఆర్ ఆర్ తో అయితే తెలుగు వారి అభిమాన నటుడుగా మారాడు. యాక్షన్ హీరో అనే టాగ్ లైన్ తో దూసుకుపోతున్న అజయ్ దేవ్ గన్   ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ తో తన కొత్త మూవీ చేస్తున్నాడు.  ఇప్పుడు ఆ  చిత్రానికి 'చౌహాన్' (Chauhaan) అనే టైటిల్‌ని  అధికారికంగా ప్రకటించారు. జియో స్టూడియోస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఉంది. దిగ్గజ స్టంట్ కొరియోగ్రాఫర్, అజయ్ దేవ్‌గన్ తండ్రి దివంగత వీరూ దేవ్‌గన్ జయంతి సందర్భంగా ఈ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేస్తూ మేకర్స్ ఆయనకి  ఘన నివాళులు అర్పించారు. . అజయ్ దేవ్‌గన్ రగ్గడ్, ఇంటెన్స్ లుక్, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వార్ ఎలిమెంట్స్  అంచనాలని ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లాయి. కథాంశం విషయానికి వస్తే  2018 పుల్వామా ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశ రక్షణ కోసం పోరాడే పవర్‌ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా అజయ్ దేవ్‌గన్ కనిపించనున్నాడు  .  వీడియో టీజర్‌లో దేశ భద్రతకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన గణాంకాలని  ప్రస్తావించారు. దేశంలో దాదాపు 15 లక్షల మంది సైనికులు ఉన్నప్పటికీ, రక్షణ రంగం కోసం సుమారు 35,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నప్పటికీ, సరిహద్దుల్లో ఉగ్రవాదులని , తిరుగుబాటుదారులని  అణచివేయడం ఎంత కష్టమైన సవాలుగా మారిందో వాయిస్ ఓవర్ ద్వారా వివరించారు. కన్నీటి వాయువు (Tear Gas), వాటర్ కెనాన్లు, పెల్లెట్ గన్స్ వంటి సాధారణ శాంతిభద్రతల చర్యలు విఫలమైన చోట 'చౌహాన్' ఎలా రంగంలోకి దిగాడనేది కథాంశంగా చూపించబోతున్నారు. Also read: vishnu vishal: ఫేస్ మారిపోయే వ్యాధితో బాధపడుతున్న హీరో విష్ణు విశాల్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్ వీడియో చివర్లో అజయ్ దేవ్‌గన్ తన ట్రేడ్‌మార్క్ గంభీరమైన గొంతుతో చెప్పిన డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఐకానిక్ సాంగ్ 'జుమ్మా చుమ్మా దే దే' మ్యూజిక్ వినిపిస్తుండగా, "పఠాణ్‌లతో చెప్పండి.. చౌహాన్ వస్తున్నాడు. అజయ్ దేవ్‌గన్ చెప్పిన పవర్ ప్యాక్డ్ పంచ్‌లైన్ సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. నీరజ్ యాదవ్ కథని అందిస్తూ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జ్యోతి దేశ్‌పాండే, ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్ కీ రోల్ లో చేస్తున్నాడు.అజయ్ దేవ్‌గన్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ డ్రామాగా నిలిచిపోతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 2027 అక్టోబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.  
The excitement surrounding Allu Arjun and Lokesh Kanagaraj’s ambitious collaboration, tentatively titled AA23, appears to be entering a new phase. Industry reports suggest that the team has planned a large-scale trial shoot in Mumbai, with Allu Arjun expected to travel to the city to participate in the exercise. The development comes amid increasing curiosity around one of Indian cinema’s most anticipated combinations. Unlike a conventional look test or promotional photo session, the reported activity is being described as a full-fledged trial shoot designed to test the visual grammar, styling approach and technical scale envisioned for the project. Sources indicate that the exercise is being mounted in a much bigger format than standard pre-production rehearsals. AA23 has already generated enormous anticipation ever since the collaboration between Allu Arjun and Lokesh Kanagaraj was officially announced. Backed by Mythri Movie Makers with music by Anirudh Ravichander, the film is positioned as one of the biggest projects currently in development. Interestingly, this update also arrives after recent speculation surrounding the project’s status, with multiple reports reiterating that the film remains active and continues to move ahead through scripting and pre-production stages. If the Mumbai schedule indeed goes as planned, fans may finally get the first indications of the scale and visual identity Lokesh Kanagaraj is preparing for Allu Arjun’s next cinematic chapter. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ #AA23 కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. సాధారణంగా ఏ సినిమాకైనా షూటింగ్ ప్రారంభించే ముందు లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ముందు నటీనటులపై సాధారణ ఫోటోషూట్ నిర్వహిస్తుంటారు. కానీ ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం సరికొత్తగా సరిహద్దులను బ్రేక్ చేస్తూ చిత్ర బృందం ఏకంగా ఒక భారీ ట్రయల్ షూట్‌కు ప్లాన్ చేసింది. బాలీవుడ్ హబ్ అయిన ముంబై నగరంలో ఈ స్పెషల్ ట్రయల్ షూట్ రేపటి నుంచే ప్రారంభం కానుండడం విశేషం. ఈ అప్‌డేట్ ప్రకారం, ఇది కేవలం నటీనటుల లుక్స్ చెక్ చేయడానికి చేసే మామూలు ఫోటోషూట్ మాత్రం కాదు. లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. అందుకే ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్, లైటింగ్, క్యారెక్టర్ మేకోవర్‌ను అత్యున్నత స్థాయిలో పరీక్షించేందుకు ఒక బిగ్గర్ స్కేల్ ట్రయల్ షూట్‌ను ముంబైలో డిజైన్ చేశారు. ఈ ట్రయల్ షూట్‌లో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారని, ఆయన మేకోవర్ ఫ్యాన్స్‌ను థ్రిల్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. లోకేష్ కనగరాజ్ తన విలక్షణమైన మేకింగ్ స్టైల్‌తో ఈ సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కించేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ పక్కాగా సిద్ధం చేసుకుంటున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో సౌత్ ఇండియాలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న లోకేష్ కనగరాజ్ కలిసి పని చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలో జరగబోయే ఈ భారీ స్కేల్ ట్రయల్ షూట్ ద్వారా ఈ సినిమా విజువల్ వండర్‌గా నిలవబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ముంబై ట్రయల్ షూట్ ముగిసిన తర్వాత సినిమాకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.  
అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ (Lenin) ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ జూలై 10న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అఖిల్ కెరీర్ లోనే ఇది ఒక వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ మొదటి నుండి ఎంతో నమ్మకంగా చెబుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. థియేటర్లలో అక్కినేని అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించే రేంజ్ లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ని మేకర్స్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా కథను మలుపు తిప్పే కీలకమైన సెకండాఫ్ లో ఈ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఉండబోతోందని సమాచారం. దాదాపు 10 నుండి 15 నిమిషాల పాటు సాగే ఈ అతిథి పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని, థియేటర్లలో ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయమని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ గెస్ట్ రోల్ కి సంబంధించిన వివరాలను చిత్రబృందం ఎంతో రహస్యంగా ఉంచినప్పటికీ, అక్కినేని అభిమానుల్లో మాత్రం ఈ సర్ప్రైజ్ గెస్ట్ ఎవరై ఉంటారా అనే ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ ఒక్క ఎలిమెంట్ సినిమా రేంజ్ ని మార్చేస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా అఖిల్-భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా యూత్ ని ఆకట్టుకునే లవ్ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయట. సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌పై చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ పవర్‌ఫుల్ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ తో అఖిల్ అక్కినేని ఈసారి బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ దక్కించుకుంటాడేమో చూడాలి.  
    -హీరో విష్ణు విశాల్ షాకింగ్ ట్వీట్  -ఫేస్ మారిపోవడానికి కారణం అదే  -మూడు సంవత్సరాలపై నుంచే ఆ వ్యాధితో బాధపడుతున్నాను  వెరీ టాలెంటెడ్ తమిళ హీరో విష్ణు విశాల్(vishnu vishal).. తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడు. ఆయన నటించిన ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు తెలుగులోకి అనువాదమై మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా దగ్గుబాటి రానాతో కలిసి చేసిన  'అరణ్య' సినిమాతో పాటు, సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎఫ్‌ఐఆర్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలను ప్రేమించి వివాహం చేసుకోవడంతో ఆయన తెలుగు రాష్ట్రాల అల్లుడిగా ఇక్కడి ఆడియెన్స్‌కి  మరింత చేరువయ్యారు. కొన్ని రోజులుగా విష్ణు విశాల్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు షికారు చేస్తున్నాయి. ఆయన శారీరక రూపం మారిపోవడం, ముఖంలో తీవ్రమైన అలసట కనిపించడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకి పుల్ స్టాప్ వేస్తూ విష్ణు విశాల్ ఈ రోజు సోషల్ మీడియా వేదికగా  ఒక ఎమోషనల్ నోట్‌షేర్ చేశాడు.  తన పోస్ట్‌లో పేర్కొంటూ, "అందరికీ హాయ్.. అన్నిటికంటే ముందుగా మీ కామెంట్స్, మెసేజుల ద్వారా మీరు చూపిన అపారమైన ప్రేమకి , నా ఆరోగ్యం పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధకి  నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మీ నుంచి లభిస్తున్న ఈ మద్దతు నాకు నిజంగా ఎంతో విలువైనది. అందుకే ఏ విషయాన్నీ దాచకుండా నా ఆరోగ్య పరిస్థితిని మీ అందరితోను నేరుగా పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నా ముఖం చాలా అలసిపోయినట్లు, కాస్త వాచినట్లు కనిపిస్తోందని మీలో చాలామంది గమనించి మెసేజ్‌లు చేశారు. ఆ మార్పులకు గల అసలు కారణాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. నేను గత మూడు నుంచి నాలుగు సంవత్సరాలుగా 'ఆటో ఇమ్యూన్' (Autoimmune) అనే  వ్యాధితో పోరాడుతున్నాను. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా వైద్యులు నాకు కొన్ని ప్రత్యేకమైన మందులని  సూచించారు. దాంతో వాటిని వాడుతు ఉన్నాను. అయితే, ఆ బలమైన మందుల వాడకం వల్ల నా శరీరంలో కొన్ని స్పష్టమైన సైడ్ ఎఫెక్ట్స్  కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నా ముఖంలో కనిపిస్తున్న ఉబ్బరం, విపరీతమైన నీరసం ఆ మందుల ప్రభావం వల్ల వచ్చినవే. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యపరంగా ఈ చికిత్సని  కొనసాగించడం నాకు ఎంతో అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా నా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది" అని విష్ణు విశాల్ భావోద్వేగానికి లోనయ్యారు. Also read: khushbu: గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్ 'నా జీవితంలో ఎదురైన ఈ క్లిష్ట సమయంలో మీరంతా చూపిస్తున్న ప్రేమ, అభిమానం నన్ను మానసికంగా  ముందుకు నడిపిస్తున్నాయి. నా తదుపరి చిత్రం 'గట్ట కుస్తీ 2' (తెలుగులో మట్టి కుస్తి 2) కోసం రాత్రింబగళ్లు అవిశ్రాంతంగా పనిచేసిన చిత్ర యూనిట్ సభ్యుల పట్ల నాకు ఎంతో బాధ్యత ఉంది. వారి కష్టాన్ని గౌరవిస్తూ, నా ఆరోగ్యం సహకరించకపోయినా సరే  ప్రమోషన్లలో  పాల్గొంటున్నాను. నా బాధ్యతని  సక్రమంగా నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే అలసటను సైతం లెక్కచేయకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. త్వరలోనే నా ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుందని నమ్ముతున్నాను. నాపై మీకున్న భయం, ఆందోళన నన్ను నేను మరింత జాగ్రత్తగా చూసుకోవడానికి ఎంతో ప్రోత్సహించాయి. వచ్చే జూలై 3వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న 'గట్ట కుస్తీ 2' ని  మీ అందరితో కలిసి చూడటం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అంటూ తన  ట్వీట్ లో తెలిపాడు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువుగా  కుళ్ళిపోతాయి.  ఇది చాలా మంది ఎదుర్కునే  సాధారణ సమస్య. వాటిని సరిగ్గా నిల్వ చేయడం ద్వారా పాడవకుండా నివారించవచ్చు. అందుకోసం టమాటాలను ఎలా నిల్వ చేయాలి తెలుసుకుంటే.. పచ్చి టమాటాలు.. టమాటా పూర్తిగా పండకపోయినా, ఇంకా కొంచెం గట్టిగా ఉంటే, దానిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవచ్చు. పండని టమాటాలను డైరెక్ట్ సన్ లైట్ కు  దూరంగా ఉంచాలి. పచ్చి గా ఉన్నవి, పూర్తీగా  పండని టమాటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి  రుచిని కోల్పోయి, సరిగ్గా పండకుండా ఉంటాయి. పండిన టమోటాలు.. టమోటాలు పూర్తిగా పండి, ఎర్రగా ఉంటే, అవి గట్టిగా ఉంటే..  వాటిని గది ఉష్ణోగ్రత వద్ద కౌంటర్‌పై నిల్వ చేయాలి.  ఈ టమోటాలను 1 నుండి 2 రోజుల వరకు ఉపయోగించవచ్చు. టమోటాలను కాడ భాగం కిందికి ఉండేలా నిల్వ చేయాలి. దీనివల్ల కాడ చుట్టూ ఉన్న తేమ బయటకు పోతుంది , అవి త్వరగా వాడిపోకుండా  ఉంటాయి. టమోటాలను ఒకదాని మీద ఒకటి కాకుండా అన్నింటికి పక్కన పక్కన ఉంచి నిల్వ చేయాలి. బాగా పండిన టమోటాలు.. టమోటాలు బాగా పండితే పాడైపోతాయని చాలామంది భయపడతారు. వాటిని రిఫ్రిజిరేటర్‌లోని చల్లదనంలో ఉంచడం వల్ల పండే ప్రక్రియ నెమ్మదిస్తుంది. రిఫ్రిజిరేటర్ నుండి తీసిన వెంటనే టమోటాలను తినకూడదు. అవి గది ఉష్ణోగ్రతకు వచ్చినప్పుడు మాత్రమే తినాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. టమోటాలను కడగకుండా, ఆరబెట్టకుండా ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి. టమోటాలు పండినప్పుడు, అవి ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల, బాగా పండిన టమోటాలను ఎక్కువగా ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. టమోటాలను అతి చల్లని ఉష్ణోగ్రతలలో నిల్వ చేయడం వాటి రుచిని పాడు చేస్తుంది. దీనివల్ల వాటి తొక్క బలహీనపడి, మరింత త్వరగా పాడైపోతాయి.                                         *రూపశ్రీ.
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా అనుకోవచ్చు. కానీ  కొందరు ప్రేమలో పదేపదే మోసపోతుంటారు. ఇలా పదే పదే  జరిగే మోసాలు దురదృష్టం వల్ల కాకుండా మనిషి చేసే  పొరపాటు వల్ల జరుగుతాయి. కొన్నిసార్లు, మనం తెలియకుండానే చేసే పొరపాట్లు పదేపదే మోసాలకు దారితీయవచ్చు. ప్రేమలో పదే పదే మోసపోయే వారు చేసే పొరపాట్లు ఏమిటో.. ఎందుకు జరుగుతాయో.. వివరంగా తెలుసుకుంటే.. హెచ్చరికలు.. ప్రేమలో మోసపోతున్నారని చెప్పడానికి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ తెలుస్తూ ఉంటాయి.  అబద్దాలు చెప్పడం, వింతగా ప్రవర్తించడం,  విషయాలు దాచడం,కేవలం మాటలు చెప్పడం,  చేతల్లో ఏమీ ఉండకపోవడం వంటివి ప్రేమలో మోసపోవడానికి హెచ్చరికలు. ఇవన్నీ చేసే వ్యక్తి ఏదో ఒకరోజు మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రాధాన్యత.. భాగస్వామిని సంతోషపెట్టాలనే కోరికలతో ఆత్మగౌరవాన్ని వదిలి  తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటే, అవతలి వ్యక్తి  తేలికగా తీసుకుంటారు. అందుకే తమను తాము ఎప్పుడూ  ప్రేమించుకుని, గౌరవించుకోవాలి. అది జరగనంత వరకు  అవతలి వ్యక్తి  విలువ ఇవ్వరు.  భాగస్వామి  విలువ ఇవ్వనప్పుడు,  ఎప్పుడైనా మోసం చేయగలరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ చాలా కీలకం. తొందరపాటు నిర్ణయాలు.. చాలాసార్లు, గతంలో  విడిపోవడం వల్ల కలిగిన బాధను తగ్గించుకోవడానికి లేదా తుడిచివేయడానికి,  ఆలోచించకుండా కొత్త సంబంధాలను వెతుక్కుంటారు.  సంబంధంలోకి వెళ్లడానికి  ఎప్పుడూ తొందరపడకూడదు, ఎందుకంటే ఇది  అవతలి వ్యక్తిపై మానసికంగా ఆధారపడేలా చేస్తుంది. గుడ్డి నమ్మకం..  భాగస్వామిని గుడ్డిగా నమ్మడం సరికాదు. ఒక సంబంధంలో ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా అవసరం.  భాగస్వామిని గుడ్డిగా కాకుండా, తార్కికంగా నమ్మాలి. ఏ సంబంధంలోనైనా నమ్మకం కాలక్రమేణా ఏర్పడుతుంది. భాగస్వామిని గుడ్డిగా నమ్మితే, మోసపోవచ్చు.                                     *రూపశ్రీ.
ఈ రోజుల్లో ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు ఎక్కువగా విఫలమవుతున్నాయి? ప్రేమలో నమ్మకం, పరస్పర అవగాహన, స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఈ వీడియోలో సి. కళ్యాణ్ వివరంగా చర్చించారు. బ్రేకప్‌ల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? బంధాలను బలంగా నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? వంటి అంశాలపై ఆసక్తికరమైన విశ్లేషణను తెలుసుకోండి.
ప్రస్తుత జీవనశైలిలో అధిక బరువు మరియు బెల్లీ ఫ్యాట్ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత డైట్ చేసినా, ఎంత వ్యాయామం చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో చాలామంది నిరుత్సాహానికి గురవుతున్నారు. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని సహజమైన ఆయుర్వేద చిట్కాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో వివరించారు.  శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి, జీర్ణవ్యవస్థ పనితీరు వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెబుతున్నారు.  అలాగే బరువు తగ్గాలంటే కేవలం మందులు లేదా ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా, సరైన ఆహారం, క్రమం తప్పని శారీరక వ్యాయామం, తగినంత నిద్ర కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సహజమైన ఆయుర్వేద పద్ధతులను అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.  బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ఆరోగ్య అవగాహన వీడియో ఇది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
నేటికాలంలో వేగవంతమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, బరువు పెరగడం ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం  శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక బరువు వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసుకున్న తర్వాత చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ కొన్నిసార్లు తప్పుడు ఆహారం , తీవ్రమైన వ్యాయామాలు శరీరానికి హాని కలిగిస్తాయి. కానీ బరువు తగ్గాలని అనుకునేవారు దినచర్యలో కొన్ని సాధారణ, ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకోవడం ద్వారా  నెమ్మదిగా , సురక్షితంగా బరువు తగ్గవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. గోరు వెచ్చని నీరు.. రోజును గోరువెచ్చని నీటితో ప్రారంభించడం బరువు తగ్గే ప్రక్రియను మెరుగుపరచడానికి ఒక సులభమైన,  ప్రభావవంతమైన మార్గం. ఇది శరీర జీవక్రియను ఉత్తేజపరిచి, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరం నుండి విషపదార్థాలు తొలగిపోయి, రోజంతా శరీరం చురుకుగా ఉంటుంది. నడక.. బరువు తగ్గడంలో శారీరక శ్రమ ఒక ముఖ్యమైన భాగం. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు చురుకుగా నడవడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి , శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.   ఇది అన్ని వయసుల వారు తమ దినచర్యలో చేర్చుకోగలిగే ఒక సులభమైన వ్యాయామం అవుతుంది. క్రమం తప్పకుండా నడవడం గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. స్వీట్స్, జంక్ ఫుడ్.. బరువు పెరగడానికి చక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రధాన కారణాలలో ఒకటి, ఇవి శరీరంలో కొవ్వు వేగంగా పేరుకుపోవడానికి కారణమవుతాయి. వీటికి బదులుగా,  ఆహారంలో పండ్లు, సలాడ్‌లు, డ్రై ఫ్రూట్స్ , ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను చేర్చుకోవాలి. ఇది బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. నిద్ర.. నిద్రలేమి బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది, దీనివల్ల ఆకలి, పదే పదే తినాలనే కోరిక, జంక్ ఫుడ్స్, స్వీట్స్ తినాలనే కోరిక పెరుగుతుంది.  ప్రతిరోజూ 7 నుండి 8 గంటల పాటు చక్కగా నిద్రపోవడం వల్ల శరీరం కోలుకుంటుంది , బరువు అదుపులో ఉంటుంది. నీరు.. తగినంత నీరు త్రాగడం బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.   నీరు శరీరాన్ని తేమగా ఉంచి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. చాలాసార్లు శరీరం దాహాన్ని ఆకలిగా పొరబడుతుంది, అందువల్ల క్రమం తప్పకుండా నీరు త్రాగడం ముఖ్యం. క్వాంటిటీ.. బరువు తగ్గాలంటే, మీరు ఏమి తింటున్నారు అనేదే కాదు, ఎంత తింటున్నారు అనేది కూడా ముఖ్యం. సమతుల్య ఆహారాన్ని కొద్దికొద్దిగా తినడం వల్ల, కేలరీల వినియోగం అదుపులో ఉంటుంది , శరీరంలో కొవ్వు పేరుకుపోదు.  ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, శక్తి స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.                                       *రూపశ్రీ.
ప్రస్తుత జీవనశైలిలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా బయట ఆహారం తినడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు చిన్నవిగా అనిపించినా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ ఆరోగ్య అవగాహన వీడియోలో ఆయుర్వేద వైద్య నిపుణుడు Dr. Murali Manohar Chirumamilla గ్యాస్ సమస్యలకు ప్రధాన కారణాలు ఏమిటి, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశాలను వివరంగా చెబుతున్నారు. అలాగే గ్యాస్ సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని ఆయుర్వేద గృహచిట్కాలు, ఆహార నియమాలు, జీర్ణశక్తిని పెంచే అలవాట్లు గురించి కూడా సూచనలు అందిస్తున్నారు.  ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: కడుపులో గ్యాస్ ఏర్పడడానికి కారణాలు అజీర్తి మరియు ఉబ్బరం సమస్యల లక్షణాలు జీర్ణశక్తిని మెరుగుపరచే సహజ మార్గాలు గ్యాస్ సమస్య తగ్గించేందుకు ఆయుర్వేద సూచనలు ఆహారంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యకరమైన జీవనశైలి చిట్కాలు గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ వీడియో ఉపయోగకరమైన అవగాహనను అందిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం సరైన ఆహారం, సరైన అలవాట్లు ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!).