ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు.. అన్న, చెల్లిల మధ్య పోరు వారి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఇక్కట్ల పాలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ సీఎం జగన్, ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల మధ్య ఇరుక్కుపోతున్న వైవీ సుబ్బారెడ్డి ఎటూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంట. మొన్న ఆస్తుల వివాదంలో.. నిన్న ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో వైవీ ప్రస్తావన తీసుకొచ్చారు షర్మిల. తన ఫోన్‌ను జగన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ.. వైవీని సాక్ష్యంగా చూపించారామె..  షర్మిల లేవనెత్తున్న అంశాలపై కౌంటర్‌ ఇచ్చేందుకు వైవీ సుబ్బారెడ్డి తెగ ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారంట. అటు మిగిలిన  వైసీపీ పెద్దలు కూడా షర్మిల లేవనెత్తిన అంశాలపై ఎలా స్పందించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారంట. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పటి వరకూ తెలంగాణకే పరిమితం అయిందనుకున్న తరుణంలో.. కాదు అటు ఏపీలోను ట్యాపింగ్ ఎపిసోడ్ కలకలం రేపుతోంది. గడిచిన ఐదేళ్లలో ఏపీకి చెందిన రాజకీయనాయకుల ఫోన్ ట్యాప్ అయ్యాయని జరుగుతున్న ప్రచారం వేడి పుట్టిస్తున్న తరుణంలోనే షర్మిల తెరపైకి వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే తన అన్న, మాజీ సీఎం జగన్‌తో షర్మిల విభేదిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా ఏపీ  రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె జగన్‌ను ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. దాంతో అన్నాచెల్లెల్ల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన షర్మిల.. తర్వాత జగన్‌ పార్టీ 11 సీట్లకు పరిమితమై, ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా పోయిన తర్వాత కూడా అదే రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కుటుంబ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి ఆమె తన అన్నపై తీవ్ర ఆరోపణలు చేశారు.  జగన్ సైతం తల్లి  విజయమ్మ, చెల్లి షర్మిలపై ఫిర్యాదులు చేశారు. ఆ వివాదం సద్దుమణగక ముందే షర్మిల ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు గుప్పించడంతో అన్నాచెల్లెల్ల మధ్య బంధం పూర్తిగా తెగిపోయినట్లే కనిపిస్తోందంటున్నారు.  తన ఫోన్ ట్యాప్ చేసి రాజకీయంగా తన ఎదుగుదలను జీర్ణించుకోలేక కుట్రలు చేశారని వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఏపీ రాజకీయల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ముమ్మాటికీ వాస్తవమని, ఈ వ్యవహారం అంతా అప్పటి  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషనేమోనని షర్మిలఅనుమానాలు వ్యక్తం చేశారు.  ఆ ఫ్లోలో కేసీఆర్, కేటీఆర్, జగన్‌‌లకు ఉన్న సాన్నిహిత్యాన్ని షర్మిల వివరించారు. వారు చాలా మంచి సత్సంబంధాలు మెయింటెయిన్ చేశారని, వారి అనుబంధం మందు రక్తం సంబంధం కూడా చిన్నబోయిందని సెటైర్లు వేశారు . ఒకరి కోసం ఒకరన్నట్లు మెలిగేవారని ఎద్దేవా చేశారు. పనిలో పనిగా ఆస్తుల వివాదం సమయంలో ప్రస్తావించిన వైవీ సుబ్బారెడ్డి పేరుని ఫోన్ ‌ట్యాపింగ్ వ్యవహారంలో కూడా షర్మిల ఇరికించేశారు. తన ఫోన్ ట్యాపైన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డే తనతో చెప్పారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనకు వైవీ సుబ్బారెడ్డి చెప్పారని..అవసరమైతే బైబిల్ పై ప్రమాణం చేస్తానని షర్మిల అన్నారు. ఇటీవల కాలంలో పదేపదే వైవీ సుబ్బారెడ్డి పేరును షర్మిల ప్రస్తావించడం  వైసీపీ పెద్దలకు మింగుడు పడడంలేదంట. కీలకమైన అంశాలకు సంబంధించి తన పేరును ప్రస్తావించడం పట్ల  రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా ఇబ్బంది పడుతున్నారట. ఇప్పటికే జగన్, షర్మిలకు మధ్య ఆస్తుల వివాదం నడుస్తోంది. ఆస్తుల పంపకాలపై రాజశేఖర్‌రెడ్డి ఆలోచనలు ఏంటో వైవీ సుబ్బారెడ్డికి స్పష్టంగా తెలుసని షర్మిల చేప్పారు. జగన్‌ ఒత్తిడితోనే వైవీ సుబ్బారెడ్డి వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని కూడా షర్మిల అంటున్నారు. ఓ వైపు ఆస్తుల వివాదంలో తన పేరు తెరపైకి తీసుకోవడంతోనే ఇబ్బందిపడిన వైవీ సుబ్బారెడ్డి...తాజా ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో తన పేరు షర్మిల ప్రస్తావించడపట్ల వైవీ సుబ్బారెడ్డి మదన పడుతున్నారట. ఒకవైపు షర్మిల తనను సాక్షిగా పేర్కొంటూ నిజాలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటే..  మరోవైపు వైవీ సుబ్బారెడ్డి మాత్రం షర్మిల ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షర్మిల ఆరోపణలకు కౌంటర్‌గా ఎక్స్ లో స్పందించారు. షర్మిల ఫోన్ ట్యాప్ చేయాల్సినవసరం అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని వైవీ ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండగా, షర్మిల  తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారని, అప్పుడు జగన్‌కి, షర్మిలకి సంబంధాలు ఇప్పటిలా లేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఫోన్‌ను ట్యాప్‌చేసి కేసీఆర్‌గారి ప్రభుత్వం ఇక్కడి సీఎంకు ఎందుకు ఇస్తుంది? అసలు కేసీఆర్‌గారి ప్రభుత్వం ట్యాప్‌చేసిందా? లేదా? అన్నది తనకు తెలియదన్నారు. తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నానని పేర్కొన్నారు. అన్నాచెల్లెల్ల గొడవలపై బయటకు మాట్లాడ లేకపోతున్న బాబాయ్ ఎక్స్ ఖాతాలో తన గోడు వెల్లగక్కుతుండటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా వైవీ సుబ్బారెడ్డి ఇద్దరి మధ్య ఇరుక్కు పోయారనే టాక్ నడుస్తోంది.
వైసీపీ సీనియర్ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరో మారు ఆస్పత్రిపాలయ్యారు. గురువారం (జూన్ 19) రాత్రి ఆయన అస్వస్థతకు గురి కావడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  వివిధ కేసులతో 3 నెలల క్రితమే అరెస్టై రిమాండ్ ఖైదీగా  జైలులో  ఉన్న వల్లభనేని వంశీ.. జైలులో పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో తరచుగా ఆయనను అధికారులు జైలు నుంచి ఆస్పత్రికి.. ఆస్పత్రి నుంచి జైలుకు అన్నట్లుగా తిప్పితున్నారు. కోర్టు   ఇటీవలే మ ఇటీవలే సమగ్ర వైద్య పరీక్షల కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. దీంతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయను చికిత్స అందించి, ఆరోగ్యం కుదుటపడిన తరువాత తిరిగి జైలుకు తీసుకువచ్చారు.  తాజాగా గురువారం వంశీ   వాంతులు, విరేచనాలతో  డీహైడ్రేషన్ కు గురవ్వడంతో జైలు అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.   
సాధారణంగా మనం బైక్ తీసుకుని బయలుదేరినప్పుడు ఒక్కోసారి పెట్రోల్ ట్యాంక్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతుంటాం. అయినా బండి స్టార్ట్ అవుతుంది, ఓ ఫర్లాంగు దూరం నడుస్తుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. సరిగ్గా అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన క్షణాలలోనే కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియా  విమానం విషయంలో ఇలాంటిదే జరిగివుంటుందని కొందరు నిపుణులు విశ్లేసిస్తున్నారు. 1,26,000 లీటర్ల ఇంధనం విమానం ట్యాంకులో నింపిన తర్వాత ట్యాంకు నుండి ఇంజనుకు ఇంధనం వెళ్లే స్విచ్ ఆఫ్ చేస్తారట. విమానం బయలుదేరే ముందు దానిని ఆన్ చేయడం మర్చిపోయి ఉంటారని అంటున్నారు.  పైపుల్లో ఉన్న ఇంధనం విమానం టేకాఫ్ అయి కొద్ది దూరం ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఇంధనంఅందక రెండు ఇంజన్లు ఆగిపోతాయి.  ఎందుకంటే.. విమానం సక్రమంగా గాల్లోకి లేచిందంటే ఇంజన్లు బాగున్నట్టే. ఒకేసారి రెండు ఇంజన్లు ఫెయిల్ కావడం జరగదు. ఇది కేవలం విశ్లేషణ కాదండోయ్. కొందరు నిపుణుల అంచనా. అయితే.. పెట్రోలు స్విచ్ ఆఫ్ లో ఉంటే పైలట్ కు ఇండికేటర్ సిగ్నల్ చూపించదా, అలాంటి టెక్నాలజీ ఏమీ ఉండదా అనేది సందేహం. విచారణ పూర్తయితేనే అసలు విషయం బయటకు వస్తుంది.
ALSO ON TELUGUONE N E W S
  Yash Raj Films’ War 2, directed by Ayan Mukerji, is the most awaited film of 2025. The massive pan-India action spectacle produced by Aditya Chopra, is the sixth film from the fabled YRF Spy Universe franchise, that has only delivered blockbusters. Ayan reveals how he focussed entirely on crafting the storyline of War 2 because he wanted a conflict that was big enough to pit two icons of Indian cinema, Hrithik Roshan against NTR.    Ayan says, “It is a huge responsibility to take forward a hugely loved franchise like War and leave your own mark on it. I saw directing War 2 as a relishing opportunity to give a hat-tip to the first film. You can’t have fun otherwise while coming on board such a huge blockbuster franchise. One has to take what has been set and then make the fans of the film and the fans of these gigantic superstars of our country go on a journey that is new, that hopefully leaves them hungry for more. As a director, I have to be honest, I immersed myself into delivering this feeling.”   He adds, “Everything about War 2 has been crafted with a lot of planning to elevate the theatrical experience of the audience. The maximum time spent was on the action set pieces and crafting the storyline and the conflict which was needed to mount the face off between Hrithik Roshan and NTR.”   Ayan calls War 2 a film that celebrates the might of Indian cinema as it brings Hrithik and NTR together for a jaw-dropping, adrenaline pumping theatrical experience like no other.    The director says, “War 2 is truly the coming together of Indian cinema with these two huge actors joining forces. We were aware of the expectations this pairing would set in the minds of their fans and the audience and every second was spent thinking of how to give them an experience of a lifetime when they sit in the theatres.”   War 2 is scheduled to hit theatres worldwide on August 14, 2025.  
  Starring : Dhanush, Nagarjuna, Rashmika Mandanna, Jim Sarbh, Dalip Tahil, Sayaji Shinde  Crew:  Music Direction by Devi Sri Prasad Cinematography by Niketh Bommireddy Edited by  Karthika Srinivas Written & Directed by Sekhar Kammula Produced by  Suniel Narang, Puskur Ram Mohan Rao, Ajay Kaikala   Sekhar Kammula has an unique way of narrating any story with real characters and circumstances. With Dhanush and King Nagarjuna, Rashmika Mandanna in leading roles, he made a financial thriller Kuberaa, on a large canvas. The movie is released today and let's discuss about it in detail.    Plot:  Neeraj Mithra (Jim Sarbh), a multi-billionaire gets a tip about pure crude oil and natural gas on the coast of Tamil Nadu. He immediately plans to take over the contract and influences Union Minister to privatise the oil rig. For this contract, he has to plan a Hawala scam to transfer Rs.1 Lakh crores to various MPs. He finds a honest CBI officer, who is facing the wrath of a politician, Deepak (Nagarjuna) to complete the transaction.  Deepak plans to hire beggars and open shell companies on their name to use them to transfer the movie from foreign countries. He finds Deva (Dhanush) from Tirupathi along with three others from various locations. He and his team train them but Neeraj decides to kill them after the transaction. Will Deepak let them be killed? Will Deva survive and uno reverse the scam? Watch the movie to know more.    Analysis:  Dhanush has given his career best performance as a beggar in this film. Shedding out all sort of star baggage, he showcased his acting skills and mesmerise us to believe that he is a beggar. King Nagarjuna took a different role from his routine and he delivered a very honest performance. He also sheds all his starry baggages in the role and it fits him well.  Rashmika Mandanna is good in the limited scope and Jim Sarbh delivered a very good performance. All others leave a mark but they did not get much to do, either. The movie takes off well and does bring realistic perspective to the story of financial scams. Each and every scene adds to the drama.  While the first hour impresses us, the second half starts to drag with predictable run. Still, the narrative keeps us booked to see how the resolution will be achieved and what will be the final solution. Pre-climax and climax portions don't really stand up to the drama built till the moment, hence, it looses the impact that had been established till that point.  Devi Sri Prasad delivered one of his career best works for this film. He kept giving something fresh in every scene and his work is remarkable. Editing by Karthika Srinivas and Cinematography could have better but they did their best in the first half to create the realistic vibe. Overall, the movie due to the drag in the second hour falls flat despite good production values and technical brilliance to an extent.    Bottomline:  Kuberaa works to all an extent with draggy and lethargic narrative in second hour.    Rating: 2.75/5    Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.  
తారాగణం: అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న, జిమ్ సర్భ్, దలీప్ తాహిల్, షాయాజీ షిండే తదితరులు సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ డీఓపీ: నికేత్ బొమ్మిరెడ్డి ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి సహ రచయిత: చైతన్య పింగళి రచన, దర్శకత్వం: శేఖర్ కమ్ముల నిర్మాతలు: సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ విడుదల తేదీ: జూన్ 20, 2025 నాగార్జున, ధనుష్, రష్మిక, శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ 'కుబేర' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో రిలీజ్ కి ముందే ప్రేక్షకుల్లో హిట్ టాక్ ని తెచ్చుకున్న మూవీగా కూడా కుబేర నిలిచింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ దీపక్(నాగార్జున) సిన్సియర్ సిబిఐ అధికారి. రాజకీయ ఒత్తిళ్లు కారణంగా ఉద్యోగం కోల్పోయి అక్రమ కేసులు మోపడంతో  జైలు శిక్ష అనుభవిస్తు ఉంటాడు. దేవా(ధనుష్) తిరుపతి ప్రాంతంలో ఉండే ఒక బిచ్చగాడు. బాల్యం నుంచే బిచ్చగాడుగా బతుకుతుండటం వలన చదువుతో పాటు లోకజ్ఞానం తెలియదు. తన లాంటి వృత్తి చేసుకునే వారితో పాటు, ఎదుటివారి పట్ల జాలి, దయ కలిగి ఉంటాడు. ముంబైలో నివసించే నీరజ్ (జిమ్ సర్బ్) ఒక బిలినియర్. కొన్నిలక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతితో పాటు, తన వ్యాపార విస్తరణ కోసం ఎంతమందినైనా చంపగలిగే సమర్థుడు. దీపక్ ని జైలు నుంచి విడిపించి తన వ్యాపార లక్ష్యం కోసం నియమించుకుంటాడు. ప్రేమించిన వాడు మోసం చెయ్యడంతో నల్గొండ ప్రాంతానికి చెందిన సమీరా(రష్మిక) ముంబై వస్తుంది. దేవాతో పాటు ఇతర ప్రాంతాలకి చెందిన ముగ్గురు బిచ్చగాళ్ళని  దీపక్ ముంబై తీసుకొస్తాడు. ఒక రహస్యం తెలిసిన దేవా ప్రాణ భయంతో వాళ్ళ దగ్గరి నుంచి పారిపోతాడు. ఈ క్రమంలో దేవా,సమీరాకి పరిచయం జరుగుతుంది. తనకి ఇష్టం లేకపోయినా దేవాతో సమీరా ట్రావెల్ అవుతుంది. దేవాని చంపడానికి దీపక్ వెతుకుతుంటాడు. దీపక్ నిజంగానే చెడ్డవాడా? ఒక వేళ చెడ్డవాడైతే సిన్సియర్ సిబిఐ అధికారి ఆ విధంగా ఎందుకు మారాడు? అసలు దేవాని ముంబై కి ఎందుకు తీసుకొచ్చారు? ఏ రహస్యం తెలుసుకొని దేవా పారిపోయాడు? దేవాని దీపక్ నిజంగానే చంపాడా? లేక  కాపాడాడా?  దేవా, దీపక్ కి గతంలోనే పరిచయం ఉందా?  చివరకి ఎవరు గెలిచారు, ఎవరు చనిపోయారు? అసలు కుబేర ఎవరు? అనేదే ఈ చిత్రం. ఎనాలసిస్  కుబేర ప్రమోషన్స్ లో శేఖర్ కమ్ముల మాట్లాడుతు ఇలాంటి కథతో కూడా సినిమా తెరకెక్కించవచ్చా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. అన్ని వర్గాల వారికి సినిమా నచ్చుతుందని చెప్పాడు. ఈ మాట అక్షరాలా సత్యం. పాన్ ఇండియా సెల్యులాయిడ్ పై ఒక సరికొత్త కథ ఆవిష్కృతమైంది. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ నుంచే ప్రేక్షకుడు కంప్లీట్ గా కుబేర కి సరండర్ అయ్యేలా కథనం, క్యారక్టర్ ల పరిచయం సాగింది. దీపక్ ని నీరజ్ జైలు నుంచి బయటకి తీసుకురావడం, దీపక్ తన లక్ష్యంలో భాగంగా దేవాతో పాటు మరికొంత మందిని ముంబై కి తీసుకురావడం, వాళ్ళ మధ్య వచ్చిన సీన్స్ అన్ని బాగున్నాయి. బిచ్చగాళ్ల కి ఏం తెలియదు కాబట్టి ముంబై లో ప్రజల మధ్యకి వాళ్ళని పంపించి కామెడీ ని సృష్టించాల్సింది. సమీరా క్యారక్టర్ ని కూడా  ఫస్ట్ హాఫ్ మధ్యలోనే చూపించి, దేవాని కోటీశ్వరుడిగా భావిస్తు ఉండాల్సింది. ఈ దిశగా ఆలోచించకుండా ఒకే పాయింట్ పై ఫస్ట్ హాఫ్ ని నడిపించారు. కానీనటీ నటుల పెర్ ఫార్మెన్స్ వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో సమీరా, దేవా మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుండటంతో పాటు, కథ అనేక మలుపులు తిరిగి, ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఏర్పడింది. దీపక్ క్యారక్టర్ ఒక్కసారిగా తన అసలు రూపమైన సిన్సియర్ అధికారిగా మారడంతో కథనంలో మంచి స్పీడ్ వచ్చింది. కాకపోతే దీపక్ తన ఓల్డ్ స్టైల్లో మారడానికి మంచి సీన్ ని క్రియేట్ చేసి, ఆ తర్వాత తన భార్య పిల్లలని దుబాయ్ పంపించి ఉంటే బాగుండేది. పైగా సెకండ్ హాఫ్  కొంచం లాగ్ అనిపిస్తుంది. దేవా దైర్యంగా మారడం బాగుంది. టోటల్ గా ప్రీ క్లైమాక్ బాగున్నా క్లైమాక్ మాత్రం కొంచం వీక్ గా అనిపిస్తుంది. నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు దీపక్ క్యారక్టర్ లో నాగార్జున నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కోసమే ఆ క్యారక్టర్ పుట్టినట్టుగా జీవించాడు. దేవా అనే బిచ్చగాడు క్యారక్టర్ లో ధనుష్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. నిజమైన బిచ్చగాడు మన కళ్ళ ముందు ఉన్నాడు అనేంతలా పెర్ఫార్మ్ చేసాడు. రిపీట్ ఆడియెన్స్ ని రప్పించేంతలా తన నటన కొనసాగింది. దేవా క్యారక్టర్ తన సినీ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో తన నటన అద్భుతం. సమీరా గా కూడా రష్మిక మరో సారి తను ఎంత పెద్ద నటినో నిరూపించింది. సెకండ్ ఆఫ్ లో ఎంటర్ అయినా కూడా సినిమా మొత్తం తాను ఉందనేలా అనిపిస్తుంది. దీన్ని బట్టి సమీరాగా రష్మిక చేసిన మ్యాజిక్ ని అర్ధం చేసుకోవచ్చు. విలన్ గా బిలీనియర్  నీరజ్ పాత్రలో చేసిన జిమ్ సర్బ్ నటన కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని దాటింది. తన క్యారక్టర్ ద్వారా బిలినియర్ బాడీ లాంగ్వేజ్ ని కళ్ళ ముందు ఉంచాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక కొత్త శేఖర్ కమ్ముల ప్రతి ఫ్రేమ్ లోనే కనపడ్డాడు. కథనాన్ని వేగం పెంచిన తీరు, నటీనటుల నుంచి పెర్ఫార్మ్ రాబట్టడంలో తన తర్వాతే ఎవరైనా అని నిరూపించాడు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి కొత్త లుక్ ని ఇచ్చింది. కాకపోతే రష్మిక పై చిత్రీకరించిన సాంగ్ లేదు. ఫొటోగ్రఫీ కూడా ఎక్స్ లెంట్. ముంబై ని కళ్ళ ముందు ఉంచింది. డైలాగ్స్ ఇంకా మెప్పించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సూపర్ గా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే సరికొత్త కథ, కథనాలతో సాగిన కుబేర ప్రేక్షకులని మెప్పిస్తుంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచం లాగ్ గా ఉంది.                                           రేటింగ్ 2.75/5                                                                                                                                                                                                                                                                           అరుణాచలం                                                                                                                                                                                            
  సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా కోసం ఏకంగా రూ.50 కోట్లతో ఓ భారీ సెట్ వేశారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.   రాజమౌళి సినిమా సినిమాకి తన బ్రాండ్ ను పెంచుకుంటున్నాడు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ వైడ్ గా సత్తా చాటిన రాజమౌళి.. ఇప్పుడు మహేష్ సినిమాతో మరింత సౌండ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇది ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోంది. ఇక ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీలో పురాతన వారణాసి సెట్ చేశారట. ఈ సెట్ కోసం ఏకంగా రూ.50 కోట్లు ఖర్చయినట్లు సమాచారం.   SSMB29 సినిమా ఇండియానా జోన్స్ తరహా కథతో రూపుదిద్దుకుంటోంది. రాజమౌళి తన గత సినిమాలకు భిన్నంగా జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ కెన్యాలో జరగనుంది. ఫారెస్ట్ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తారని తెలుస్తోంది. దీని తర్వాత వారణాసి సెట్ లో షూటింగ్ జరిగే అవకాశముంది.  
గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ళ కెరీర్‌లో 2010 నుంచి 2021 వరకు ఎంతో కీలకమైన సంవత్సరాలుగా చెప్పొచ్చు. ఈ 11 సంవత్సరాల్లో బాలయ్య సాధించిన విజయాలు అలాంటివి. ఎంతో మంది డైరెక్టర్లు బాలయ్యకు బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చారు. కానీ, వారిలో బోయపాటి శ్రీనుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్‌లో సింహా, లెజెండ్‌, అఖండ వంటి హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్స్‌ వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టింది. ‘అఖండ2 తాండవం’తో మరోసారి బాక్సాఫీస్‌ మీద విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సెప్టెంబర్‌ 25న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. హ్యాట్రిక్‌ సాధించిన కాంబినేషన్‌ కావడంతో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే భారీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుగుతోందని తెలుస్తోంది.  నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే మొదటి పాన్‌ ఇండియా మూవీగా ‘అఖండ2’ రిలీజ్‌ కాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అఖండ చిత్రాన్ని మించిన స్థాయి విజువల్స్‌ ఈ సినిమాలో ఉంటాయని ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్‌తోపాటు ప్రేక్షకుల్ని ఎమోషనలైజ్‌ చేసే ఇతర అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. బోయపాటి టేకింగ్‌, బాలయ్య పవర్‌.. వెరసి సిల్వర్‌ స్క్రీన్‌పై ఒక అద్భుతాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సీన్స్‌ అన్నింటినీ చిత్రీకరించారు. ఇటీవలే ప్రారంభమైన చివరి షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు క్లైమాక్స్‌ని కూడా షూట్‌ చెయ్యబోతున్నారు. ఈ షెడ్యూల్‌ ఆగస్ట్‌ వరకు కొనసాగుతుంది. రిలీజ్‌ డేట్‌ కూడా అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేసెయ్యడంతో బిజినెస్‌ కూడా స్పీడ్‌ అందుకుందని తెలుస్తోంది. బాలకృష్ణ కెరీర్‌లోనే ‘అఖండ2’ థియేట్రికల్‌ బిజినెస్‌ భారీ ఎత్తున జరుగుతోందని సమాచారం. తెలుగు థియేట్రికల్‌ బిజినెస్‌ 120 కోట్లు దాటిందని తెలుస్తోంది. అలాగే ఇతర భాషలకు సంబంధించిన థియేట్రికల్‌ రైట్స్‌, ఓవర్‌సీస్‌ బిజినెస్‌ ఇవన్నీ కలిపి ఇప్పటికే 100 కోట్లు దాటింది. ఇక ఓటీటీ రైట్స్‌ 85 కోట్లకు ఇచ్చారని తెలుస్తోంది. టోటల్‌గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఇప్పటికే 300 కోట్లు దాటిందని సమాచారం. ఇప్పటివరకు బాలయ్య కెరీర్‌లో ఈ స్థాయి బిజినెస్‌ జరగలేదని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. తెలుగుతోపాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలను మించే స్థాయిలో ‘అఖండ2’ ఉంటుందని, మరోసారి బాలయ్య పవర్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఫ్యాన్స్‌ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. రిలీజ్‌కి ముందే బిజినెస్‌ పరంగా రికార్డులు క్రియేట్‌ చేస్తున్న ‘అఖండ2’.. రిలీజ్‌ తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 
  Klin Kaara, the beloved daughter of Global Star Ram Charan and Upasana Konidela, continues to capture hearts across social and media circles. As she turns two today (June 20), her birthday was marked by a heartwarming and symbolic moment.   Last year, during a visit to the Hyderabad Zoo, Ram Charan, Upasana, and little Klin Kaara encountered a newborn white tigress – a rare Bengal Tiger cub. In a touching gesture, the zoo authorities named the cub ‘Klin Kaara’ in honour of the young Konidela, celebrating the family’s love for wildlife.   On her second birthday today, Klin Kaara met her majestic namesake for the very first time. The little one was visibly mesmerized as she looked at the white tigress in awe. The encounter was pure and powerful — a moment of connection between the child and the animal that felt both wild and warm, echoing themes of empathy, love, and legacy.   Known for their compassion toward animals, Ram Charan and Upasana have now officially adopted the tigress named after their daughter. Their continued support for the Hyderabad Zoo reflects their deep commitment to animal welfare and their belief in ensuring that all creatures are treated with dignity and care.   This birthday celebration was not just a joyful family moment — it was also a reminder of the lasting bond we share with the natural world and the responsibility we carry to protect it.  
  న్యాచురల్ స్టార్ నానికి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరుంది. అందుకు తగ్గట్టుగానే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల 'హిట్-3' ప్రేక్షకులను పలకరించిన నాని.. ప్రస్తుతం 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది పారడైజ్' చేస్తున్నాడు. అలాగే దర్శకులు సుజీత్, శౌర్యువ్, శేఖర్ కమ్ములతో సినిమాలు కమిటై ఉన్నాడు. ఇప్పుడు ఈ లిస్టులో మరో దర్శకుడి పేరొచ్చి చేరింది. ఆ దర్శకుడు ఎవరో కాదు వెంకీ అట్లూరి.   'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న వెంకీ అట్లూరి.. ప్రస్తుతం సూర్యతో ఓ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత వెంకీ అట్లూరి.. నానితో సినిమా చేసే అవకాశముంది అంటున్నారు.   వెంకీ అట్లూరి తన గత రెండు చిత్రాలు 'సార్', 'లక్కీ భాస్కర్' ఇతర భాషల హీరోలతో చేశాడు. ప్రజెంట్ మూవీ కూడా సూర్యతో చేస్తున్నాడు. దీంతో వెంకీ.. తెలుగు హీరోలతో సినిమాలు చేయడా అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి సినిమాల్లో నాని నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తుంటారు. అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఓ మూవీ చేయడానికి నాని-వెంకీ చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కూడా సితార బ్యానర్ లోనే రూపొందనుందని సమాచారం.   మరి నాని 'పారడైజ్' తర్వాత వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడా లేక ఇతర సినిమాలు పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ పైకి వస్తాడా అనేది చూడాలి.  
తారాగణం: అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డి, రవి దుగ్గిరాల, కన్నా పసునూరి, సంజనా హార్ద గేరి  తదితరులు   సంగీతం: హేషం అబ్దుల్ వాహబ్  డీఓపీ: విశ్వనాధ్ రెడ్డి  ఎడిటర్: శశాంక్ మాలి  రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి  నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి  బ్యానర్ :మైత్రి మూవీ మేకర్స్  విడుదల తేదీ: జూన్ 20, 2025  అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers) బ్యానర్ లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ '8 వసంతాలు'(8 Vasantalu). మ్యాడ్ మూవీ ఫేమ్ 'అనంతిక సనిల్ కుమార్'(Anathika Sanilkumar) టైటిల్ రోల్ పోషించగా, 'ఫణీంద్ర నర్సెట్టి'(Phanindra Narsetty) దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రచార చిత్రాలతో మూవీ లవర్స్ లో  మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.                                   కథ          శుద్ధి అయోధ్య (అనంతిక) ఆత్మాభిమానం మెండుగా ఉన్న అమ్మాయితో పాటు, అందం అనేది మనసుకి సంబంధించిదనేది తన నమ్మకం. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న 'శుద్ధి' ఊటీలో  తల్లితో పాటు కలిసి ఉంటుంది. మనుషుల్లో చైతన్యం నింపడానికి రచనలు కూడా చేస్తుంటుంది. ఆమె రాసిన కొన్ని పుస్తకాలు బాగా ఫేమస్. వరుణ్(హను రెడ్డి) ఒక పెద్దింటి అబ్బాయి. మ్యూజిక్ లో ఉన్నత శిఖరాలు అందుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. శుద్ధి వ్యక్తిత్వం, రచనలు చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య కొంత కాలం ట్రావెలింగ్ జరిగిన తర్వాత శుద్ధికి వరుణ్ ప్రపోజ్ చేస్తాడు.తండ్రి మరణం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత తన జీవితంలోకి వచ్చిన మొదటి ప్రేమని శుద్ధి ఆహ్వానిస్తుంది. వరుణ్ మాత్రం శుద్ధిని వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకి శుద్ధి జీవితంలోకి సంజయ్ వస్తాడు. సంజయ్ ఒక  ఫేమస్ రైటర్. సంజయ్ ని తొలి చూపులోనే శుద్ధి ప్రేమిస్తుంది. ఈ లోపు శుద్ధి వాళ్ళ అమ్మ వేరే పెళ్లి సంబంధం చూస్తే శుద్ధి అందుకు ఒప్పుకుంటుంది. కానీ శుద్ధి కి తెలియని విషయం ఏంటంటే శుద్ధి ' 8 వసంతాల' లో సంజయ్ పాత్ర ఉంటుంది. శుద్ధి' 8 వసంతాల'లో సంజయ్ పాత్ర ఏ విధంగా ఉంది? వరుణ్ శుద్ధి కి ఎందుకు బ్రేక్ అప్ చెప్పాడు? శుద్ధి రచనలు చెయ్యడానికి ఏమైనా కారణం ఉందా?  మార్షల్ ఆర్ట్స్ లో శుద్ధి కి ఉన్న గోల్ ఏంటి? తల్లి చెప్పిన పెళ్ళి శుద్ధి ఎందుకు ఒప్పుకుంది? శుద్ధి ప్రేమ రెండో సారి కూడా ఓడిపోయిందా లేక గెలిచిందా అనేదే '8 వసంతాలు' చిత్ర కథ  ఎనాలసిస్  సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కిన కొన్ని ప్రేమ కథలు, థియేటర్ నుంచి బయటికి వచ్చినా, మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ప్రేమ కథే ఈ '8 వసంతాలు'. టైటిల్ కి తగ్గట్టే సినిమా చూస్తున్నంతసేపు ఒక కొత్త వసంతం మన కళ్ళ ముందు కదలాడుతుందా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే  శుద్ధి, వరుణ్  ఇంట్రడక్షన్ తో పాటు ఆ ఇద్దరి లక్ష్యానికి సంబంధించిన సీన్స్ బాగున్నాయి. పైగా ఊటీలో చిత్రీకరించడం వల్ల ఫ్రెష్ నెస్ వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళిద్ద రీ మధ్య వచ్చిన లవ్ సీన్స్ కొత్తగా ఉన్నా, అంతగా కనెక్ట్ అవ్వలేం. లవ్ గా కంటే ఆ ఇద్దరు ఎట్రాక్షన్ అయినట్టుగా ఆయా సన్నివేశాలు ఉన్నాయి. బ్రేక్ అప్ సీన్ మాత్రం హైలెట్. ఆ సమయంలో వచ్చిన డైలాగ్స్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగించేవిగా ఉన్నాయి. శుద్ధి ఆమె చిన్ననాటి ఫ్రెండ్ కార్తీక్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో పరిణితి చెందిన శుద్ధి కనిపించింది. కాశీలో చేసిన ఫైట్ ఐతే చాలా బాగా వచ్చింది. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చే గురువు, శుద్ధి కి మధ్య వచ్చిన సన్నివేశాలు కథకి మంచి బలాన్ని ఇవ్వడంతో పాటు గురు, శిష్యుల గొప్పతనాన్ని చెప్పింది. రైటర్ అయిన సంజయ్ ని  శుద్ధి నే ఇష్టపడుతుంది. దీంతో కథనంలో వేగం పెరగడంతో పాటు, ఈ సారి శుద్ధి  లవ్ ఏమవుతుందనే క్యూరియాసిటి వచ్చింది. స్వతహాగా మంచి మనసు గల వాడైన సంజయ్ కూడా శుద్ధిని  ఇష్టపడతాడు. అలా కాకుండా సంజయ్ ని నెగిటివ్ షేడ్ లో చూపించాల్సింది. ఎట్ లీస్ట్ సంజయ్ నెగిటివ్ క్యారక్టర్  అని చీటింగ్ అయినా చేసుండాల్సింది. అప్పుడు శుద్ధి క్యారెక్టర్ పై సానుభూతి కలిగి, ఈ సారి తన ప్రేమ ఏమవుతుందనే క్యూరియాసిటి ఉండేది. క్లైమాక్స్ కొత్తగానే ఉన్నా, వరుణ్ క్యారెక్టర్ ఎలివేషన్ అవ్వడంతో, ఈ కథకి మూలమైన శుద్ధి  8 వసంతాల ప్రయాణాన్ని బీట్ చేసినట్లయింది. వరుణ్ క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్ లో చూపించాల్సింది. మూవీ మొత్తం మీద వచ్చే మార్షల్ ఆర్ట్స్ నేపధ్యం కావాలని మిక్స్ చేసినట్టుగా అనిపిస్తుంటుంది.       నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు శుద్ధి అయోధ్య క్యారెక్టర్ లో అనంతిక పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అభిమానాన్ని పంచే స్నేహితురాలిగా, ప్రేమ కోసం పరితపించే ప్రేమికురాలుగా, ఆ ప్రేమ తనకి దక్కనప్పుడు, బాధని దిగమింగుకుంటూ, మనో ధైర్యాన్ని తెచ్చుకునే సగటు అమ్మాయిలా, తల్లి చాటు బిడ్డలా, మార్షల్ ఆర్ట్స్ ద్వారా చెడుని ఎదుర్కునే డేరింగ్ ఉన్న అమ్మాయిలా, ఒక రచయిత్రిగా ఇలా అన్ని వేరియేషన్స్ లోను చాలా అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించింది. తెలుగు సినిమాకి ఇంకో మంచి నటి అనంతిక ద్వారా  లభించినట్టే. హను రెడ్డి, రవి దుగ్గిరాల, కన్నా పసునూరి, సంజనా హార్ద గేరి కూడా ఎంతో అనుభవమున్న వాళ్ళల్లా నటించి తమ క్యారెక్టర్స్ కి నిండుతనాన్ని తీసుకొచ్చారు. ఫణింద్ర( దర్సకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోను కనపడింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. రచయితగా మాత్రం సెకండ్ హాఫ్ లో తడబడ్డాడు. డైలాగ్స్ ఇన్ స్పైర్ గా ఉండటంతో పాటు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. మైత్రి నిర్మాణ విలువల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వాళ్ళు లేనిదే ఈ సినిమా లేదనేంతలా ప్రొడక్షన్స్ వాల్యూస్ ఉన్నాయి. ఈ విషయం ప్రతి ఫ్రేమ్ లోను స్పష్టంగా కనపడింది. విశ్వనాధ్ రెడ్డి ఫొటోగ్రఫీ కూడా హైలెట్ గా నిలిచింది. విజువల్స్ పరంగా ఆయన మ్యాజిక్ ఎక్స్ లెంట్. హేషం అబ్దుల్ సాంగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి సంజీవిని గా నిలిచాయి. ఫైనల్ గా చెప్పాలంటే నువ్వు వెతికే అమృతత్వాన్ని పంచే ప్రేమ '8 వసంతాలు' నుంచి నీ చుట్టూనే తిరుగుతుంటుంది. కాకపోతే నువ్వు గుర్తించలేదని చెప్పిన '8 వసంతాలు'  పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. కాకపోతే సెకండ్  హాఫ్ కొంచం మైనస్. అనంతిక నటన ప్లస్ పాయింట్. రేటింగ్ 2.5/5                                                                                                                                                                                                                                                  అరుణాచలం 
  Cast: Ananthika Sanilkumar, Hanu Reddy, Ravi Theja Duggirala, Kanna Pasunoori, Sumanth Nitturkar Crew:  Edited by Shashank Mali Cinematography by Viswanath Reddy Music by Hesham Abdul Wahab  Written & Directed by Phanindra Narisetty  Produced by Naveen Yerneni & Y Ravi Shankar of Mythri Movie Makers    Phanindra Narisetty created a good impression for himself with a short film, Madhuram. Later, he made a full length feature Manu, which did not work at the box office. But he impressed people with his technical brilliance and writing abilities. Now, he made 8 Vasanthalu with Anantika Sanilkumar in the leading role. Let's discuss about the film in detail.    Plot:  Shuddhi Ayodhya (Anantika Sanilkumar) is a highly talented writer, who wrote a self-help book at the age of 17 years. She learns Martial Arts and treats her Guru as God. As he is undergoing cancer treatment, she fears of she can take black belt before his death. But he encourages her to write another book without worrying about him.  Varun (Hanu Reddy) challenges her at the dojo and then falls for her. He pursues her and she accepts his love. But due to his father's ambition to see him join Berkeley School of Music, he takes an easy route out and ditches her. Years later, she finds writer Sanjay (Ravi Theja) and falls in love with him, due to his deep thoughts and respect towards women. Will Sanjay also fall for her? Will Varun return? Watch the movie to the answers.    Analysis:  Phanindra Narisetty has strong visual sense in staging a scene but at the same time his blocking and detailing of a shot lack the similar clarity. He used color theory and nature to symbolically narrate the story but his effort is undermined by his writing. The metaphors to state the character motivations look very childish.  Each and every character tends to speak like him rather than them. You.csn accept one person having such sort of maturity or ideology but not everyone. Even if we not consider that part of the dialogues, all seem to stretch more than welcome. Nothing seems like a normal conversation between normal people.  The relatability to characters and the make belief of looking at real people in a whirlpool of Love is missing from this film. To create a poetic feel, the director has decided to go more surrealistic approach for even normal scenes. Mani Ratnam kind of directors keep the conversation real and relatable but here poetic sense, metaphors are just too much to even connect.  Performances wise Ananthika Sanilkumar, Hanu Reddy impress among everyone. All others seem to either lack capabilities or asked to act in just one way. Even Ananthika looks inconsistent in her performance but she evolved throughout.  Technically, sound design and cinematography are good while music by Hesham Abdul Wahab is heart of the film. Production values of Mythri Movie Makers are sound but the film feels too lethargic with narrative dragging in the name of "feel" and "effect".    Bottomline:  Not so memorable and highly passable "8 Years"!    Rating: 2.5/5    Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.  
  మల్టీస్టారర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈమధ్య కాలంలో పలువురు హీరోలు మల్టీస్టారర్ లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు పాన్ ఇండియా హీరోలు ఓ మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం పాన్ ఇండియా యాక్టర్ కమ్ డైరెక్టర్ రంగంలోకి దిగుతున్నాడని సమాచారం.   'కార్తికేయ-2'తో నిఖిల్, 'హనుమాన్'తో తేజ సజ్జా పాన్ ఇండియా హీరోలుగా అవతరించారు. ప్రస్తుతం నిఖిల్ 'స్వయంభు', 'ది ఇండియా హౌస్' సినిమాలు చేస్తుండగా.. తేజ 'మిరాయ్'తో బిజీగా ఉన్నాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అయితే త్వరలో నిఖిల్-తేజ ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ కోసం చేతుల కలబోతున్నట్లు వినికిడి. ఈ ప్రాజెక్ట్ కి 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించనున్నాడని టాక్.   'కాంతార'తో హీరోగా, డైరెక్టర్ గా పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో 'కాంతార-2' చేస్తున్నాడు. అలాగే నటుడిగా 'జై హనుమాన్', ఛత్రపతి శివాజీ బయోపిక్ చేస్తున్నాడు. ఓ వైపు నటుడిగా భారీ సినిమాలను లైన్ లో పెడుతూనే.. ఇంకోవైపు డైరెక్టర్ గా కూడా మరో భారీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిఖిల్, తేజ హీరోలుగా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్ ను పాన్ ఇండియా ఫిల్మ్ గా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  యోగా గురించి ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యంగా చెబుతుంది. ఇది శరీరం, మనసు,  ఆత్మ మధ్య సమతుల్యతను ఏర్పరచే సాధనంగా పరిగణించబడుతుంది. ఆయుర్వేదం,  యోగా రెండూ భారతీయ సంప్రదాయ వైద్యం,  ఆధ్యాత్మికతకు మూల స్తంభాలుగా ఉన్నాయి. ఇవి పరస్పరం అనుసంధానంగా ఉండి, ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ,  శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా  మెరుగుపరచే విధానాలను అందిస్తాయి. ఆయుర్వేదంలో యోగ స్థానం ఇదే.. త్రిదోష సిద్ధాంతానికి అనుగుణంగా... ఆయుర్వేదం ప్రకారం మన ఆరోగ్యం మూడు దోషాలపై ఆధారపడి ఉంటుంది.  వాత, పిత్త, కఫ అనే దోషాలు ప్రతి మనిషిలో ఉంటాయి. ఇవి సమతుల్యంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది.  ఈ త్రిగుణాలను సమతుల్యంలో ఉంచడానికి యోగా సహాయపడుతుంది. ఉదాహరణకు.. ప్రాణాయామం వాత దోషాన్ని నియంత్రించగలదు, ఆసనాలు కఫ దోషాన్ని క్రమంలోకి తేస్తాయి. ధ్యానం పిత్త దోషాన్ని శాంతపరచగలదు. ఆహార, ఆచార నియమాలకు తోడుగా.. ఆయుర్వేదం మనిషి జీవన విధానాన్ని సమతుల్యంలో ఉంచే విధంగా ఆహార నియమాలు , జీవన శైలి ,  మానసిక ఆరోగ్యం  ఉండాలని చెబుతుంది.  వీటిని ఆహార, విహార, మనోవ్యాపార నియమాలు అని అంటుంది.  యోగా వీటిని స్థిరంగా పాటించడంలో శరీరానికీ మనస్సుకీ స్థిరత్వాన్ని ఇస్తుంది. యోగ ప్రాముఖ్యత ఇదే.. శరీరశుద్ధి .. యోగిక శుద్ధిక్రియలు  ముఖ్యంగా కపాలభాతి, జలనేతి, శంఖ ప్రక్షాలన మొదలైనవి శరీరంలో తామసిక,  రజసిక సంకలితాలను తొలగించి, సత్వగుణాన్ని పెంచుతాయి. ఇది ఆయుర్వేదంలో చెప్పే "పంచకర్మ" విధానాలకు సహాయకం. ఆత్మ నియంత్రణ .. యోగాభ్యాసం వల్ల శీలం, నియమం, ధైర్యం, సామర్థ్యం వంటి లక్షణాలు పెరుగుతాయి. ఇవి ఆయుర్వేదంలో స్వస్థవ్యక్తి లక్షణాలుగా పేర్కొనబడ్డాయి. మనోవ్యాధుల నివారణ.. ఆయుర్వేదంలో మనోవ్యాధులు (మానసిక రుగ్మతలు) కోసం సత్త్వవజయ చికిత్స అనే ప్రత్యేక విభాగం ఉంది. ఇందులో ధ్యానం, ప్రాణాయామం,  మనస్సు పై నియంత్రణ సాధనాలుగా యోగను ఉపయోగిస్తారు. ఒజస్సు వృద్ధి.. యోగా ఆయుర్వేదంలో ముఖ్యంగా చెప్పే "ఒజస్సు" (శరీర రక్షణశక్తి)ని పెంచుతుంది. దీర్ఘకాలికంగా యోగ సాధన వల్ల దీర్ఘాయువు, యోచనా స్పష్టత, జీవశక్తి పెరుగుతాయి. అంతర్వేద కాలం నుంచి ఆధునిక యోగం వరకు.. ఆయుర్వేద గ్రంథాల్లో  ముఖ్యంగా అష్టాంగ హృదయం, చరక సంహిత, సుశ్రుత సంహిత మొదలైన గ్రంథాలలో  యోగ గురించి ప్రత్యక్షంగా ప్రత్యేక అధ్యాయాలు లేవు కానీ, జీవన నియమాలలో, దినచర్య, ఋతుచర్యల్లో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి సాధనలు సూచించబడ్డాయి. ఆయుర్వేదంలోని "స్వస్థవృత్తం" అనే విభాగం యోగానికి ప్రాధాన్యతను సూచిస్తుంది. ఆయుర్వేదంలో యోగ ప్రాముఖ్యత.. శరీర ఆరోగ్యం దోష సమతుల్యం, శుద్ధిక్రియలు మానసిక శాంతి ధ్యానం, మనోవ్యాధుల నివారణ జీవశక్తి ఒజస్సు వృద్ధి, జీవన శైలి దినచర్య, ఋతుచర్యలో భాగంగా ఆత్మీయ వికాసం ధ్యానం ద్వారా ఆత్మ గమనం మొదలైనవి సాధించడానికి సహాయపడుతుందని యోగ గురించి ఆయుర్వేదం చెబుతుంది.                       *రూపశ్రీ.
ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదోకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ వారు  చేసే కొన్ని తప్పులు విజయానికి అడ్డుపడతాయి. చాణక్యుడు తెలిపిన  ఆ తప్పులు ఏంటి..? మీ లక్ష్యాలను సాధించడంలో మీరు చేయకూడని ఆ రెండు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం అన్నాక సమస్యలు సర్వసాధారణం. ముఖ్యంగా ఒకలక్ష్యంతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన లక్ష్యం ఎంత పెద్దది అయితే...అన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి..తన జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని సాధిస్తాడు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే దృఢ సంకల్పం, కఠోర శ్రమ అవసరం. వీటితోపాటు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ద పెట్టాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద మార్పునకు కారణం అవుతుంది. ఆచార్య చాణక్యుడు చెబుతూ..మన లక్ష్యాలను సాధించేందుకు కొన్ని తప్పులు చేయకూడదని తెలిపారు. అవి ఏంటో చూద్దాం. లక్ష్యం గురించి ఎవరికీ చెప్పవద్దు. మనం విజయం సాధించాలంటే దానికి కృషి, ప్రణాళిక, సమయపాలన చాలా అవసరం. ఇవే కాదు విజయం సాధించడానికి చాణక్య ఒక ప్రత్యేక సమాచారాన్ని అందించాడు. జీవితంలో విజయం సాధించాలంటే మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు, మన లక్ష్య సాధన గురించి మనం బయటకు చెప్పినప్పుడు.. వారు మన లక్ష్యాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువు మీ లక్ష్యం గురించి తెలుసుకుంటే,మీకు సమస్యలను లేదా అడ్డంకులు కలిగించవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు తీసుకున్న ప్రణాళికలు,నిర్ణయాల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. లక్ష్యం సాధించే వరకు రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు. లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు: లక్ష్య సాధన కోసం శ్రమించే వ్యక్తిని చాణక్యుడు సింహంతో పోల్చాడు. సింహం తన వేటను చూసి వెనక్కి తగ్గనట్లేదు. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి ఆ దిశగానే అడుగులు వేయాలి తప్ప..వెనక్కు తగ్గకూడదు.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకూడదన్నది చాణక్యుడి మాట. చాణక్యుడు ప్రకారం, ఎవరైతే తన పాలసీలో ఈ రెండు అంశాలకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారో, ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు.   
మీరు కొత్త సంవత్సరంలో తీసుకున్న దృఢ నిర్ణయాలు సంగతి ఏమిటి? వాటి సంగతే మర్చిపోయారు కదూ! ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే తప్ప గుర్తుకురావడం లేదు కదూ! మీరే కాదు, ఇలాగే చాలా మంది 'కొత్త సంవత్సరంలో బరువు తగ్గాలనీ, వేకువజామున లేచి వ్యాయామం చేయాలనీ, లేదా నడకకు వెళ్ళాలనీ, ప్రతి రోజూ ఫలానా సమయంలో చదువుకోవాలనీ, తినడం తగ్గించాలనీ' తాము ఇలా మారాలనుకున్న విషయాలను జనవరి 1వ తేదీన సంప్రదాయంగా తీసుకునే నిర్ణయాలుగా మార్చి, ఈపాటికి మర్చిపోయే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునేవారు ఇరవైనాలుగు గంటలు గడవకముందే తమ ప్రమాణాలను తీసి గట్టున పెడతారని ఒక సర్వేలో తేలింది. మనం తీసుకునే ఇలాంటి కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మనకు ప్రయోజనాలను చేకూరుస్తాయని తెలిసినా నిర్ణయాలకు కట్టుబడి ఉండడం లేదు. మొదటి రోజున్నంత దృఢ నిశ్చయం ఆ తరువాత లేకపోవడం, అవి కేవలం ఉద్వేగభరితమైన మాటలుగానే మిగిలిపోవడం చాలామందికి నిత్యం అనుభవమే. సంకల్పబలం, క్రమశిక్షణ మాత్రమే అంతర్గత శక్తిని మేల్కొలిపి, బలహీనతల్ని జయించేలా చేయగలవు. జీవితంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే పై రెండూ సహకరించకుండా ఏదీ సాధ్యం కాదు. సంకల్పబలం : సంకల్పబలం కలిగినవాళ్ళు మానసిక బలహీనతలకు దూరంగా ఉంటారు. సోమరితనాన్నీ, వాయిదా మనస్తత్వాన్నీ ఆమడదూరంలో ఉంచుతారు. జీవితంలో తమదంటూ ప్రత్యేకశైలితో ఉంటూ విజయం వైపు పయనిస్తారు. అనవసరమైన, పనికిరాని అలవాట్లకు బానిసలు కారు. వారిలోని అంతర్గత శక్తి వారిని ఉద్వేగాలకు గురి కాకుండా మార్పునకు వ్యతిరేకధోరణిని వ్యక్తం చేయనీయ కుండా వారిని మానసికంగా బలవంతులుగా తయారుచేస్తుంది.  క్రమశిక్షణ : క్రమశిక్షణ అనేది సంకల్పబలంతో కలసి పనిచేసే మానసిక శక్తి. అనుకున్నవి సాధించే ప్రయత్నంలో భాగంగా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తినిచ్చేదే క్రమశిక్షణ. ముఖ్యంగా క్షణికసుఖాలను దూరంగా ఉంచి ఉత్తమ నిర్ణయాలను తీసుకునే శక్తిని కూడా ఇస్తుంది. ఉదాహరణకు క్రమశిక్షణ కలిగిన విద్యార్థి సంకల్పబలం తోడైతే గంటసేపు టీవీ చూసే కన్నా చదువు మీదే పెట్టే సమయం వల్ల ప్రయోజనం కలుగుతుందనీ, పొద్దున్న ఇంకా నిద్రపోవడం కన్నా వాకింగ్ చేయడం, యోగాభ్యాసం చేయడం ఉత్తమమనీ తెలుసుకుంటాడు. ప్రయోజనాలు: సంకల్పబలం, క్రమశిక్షణ తోడైతే మనిషి తన ప్రవర్తనలను, చర్యలను, ఉద్వేగాలను అదుపులో ఉంచుకునే చైతన్యస్థితిలో ఉంటాడు. అవి లేనివారు వాటికి బానిసలవుతారు. మీ విషయంలోనే ఆలోచించండి. మీరు కచ్చితంగా ఈ సారి చేయాలని నిర్ణయించుకున్న పనులు ఎన్ని వాయిదా వేసుకున్నారు? ఒక పని మొదలు పెట్టి తరువాత వదిలేసిన అనుభవాలున్నాయా? పై బలహీనతల నుంచి బయట పడి, అనుకున్న పని అనుకున్న సమయంలోనే పూర్తిచేసినప్పుడు కలిగే విజయగర్వం, మానసిక తృప్తి, తత్సబంధ ఫలితాలు అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇలా భావాల్ని అదుపులో ఉంచుకుని క్రమశిక్షణతో జీవించడమంటే జీవితాన్ని నిస్సారంగానో, నిస్తేజంగానో గడిపినట్లు అనుకుంటారు కొంతమంది. నిజానికి ఇలా జీవించడమే, అనవసర ఆలోచనలను దూరం చేసి ఉత్సాహంగా ఉండటమంటే...                                   ◆నిశ్శబ్ద.
ఉప్పు లేని వంటను ఊహించలేం, అలాగే ఉప్పు లేకుండా ఏమీ తినలేం.  చాలామంది పలుచటి మజ్జిగ తాగాలన్నా సరే.. అందులో కాసింత ఉప్పు వేసుకుని తాగుతుంటారు.  ఉప్పు ఆరోగ్యానికి మంచిదే కానీ సరైన విధంగా ఉప్పు తీసుకోకపోతే అది ఆరోగ్యానికి చేటు కూడా చేస్తుంది. అదేవిధంగా ఉప్పులో రకాలు కూడా ఉంటాయి.  ఏ ఉప్పు ఆరోగ్యానికి మంచిది అనే విషయం ఈ మధ్యకాలంలో చాలా హాట్ టాపిక్ గా మారింది.  ఆయుర్వేదంలో ఆరోగ్యానికి ఏ ఉప్పు మంచిది అనే విషయం స్పష్టంగా ఇవ్వబడింది.  దీని గురించి తెలుసుకుంటే.. ఆయుర్వేదంలో సాధారణంగా "సెంధా నమక్" లేదా "సైంధవ లవణం" ఆరోగ్యానికి అత్యుత్తమమైన ఉప్పుగా పరిగణించబడుతుంది. ఇది హిమాలయ ప్రాంతాల్లో దొరికే సహజ  ఉప్పు. దీనిని ఆంగ్లంలో Himalayan Rock Salt లేదా Pink Salt అని కూడా అంటారు. ఆయుర్వేద దృష్టిలో సైంధవ లవణం విశిష్టత: ఆయుర్వేద గ్రంథాలలో ఆరు రకాల లవణాలు (ఉప్పులు) గురించి చెప్పబడింది. వాటిలో సైంధవ  లవణం ఉత్తమంగా భావించబడుతుంది.  సైంధవ లవణం  యొక్క ఆరోగ్య ప్రయోజనాలు.. త్రిదోష సమతుల్యత.. వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యంలో ఉంచుతుంది. ముఖ్యంగా వాత దోషాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది.. అజీర్ణం, ఉబ్బసం, గ్యాస్ వంటి సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది. అపానవాయువు నియంత్రణకు ఉపయోగకరమైందిగా భావిస్తారు. అల్కలైనిటి మేనేజ్‌మెంట్.. శరీరంలో పిహెచ్ స్థాయిని సద్దుమణిగించే లక్షణం కలిగి ఉంటుంది. అమ్లత్వాన్ని తగ్గించి దాహాన్ని నివారిస్తుంది. హృదయ ఆరోగ్యం.. రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుందని చెబుతారు. అయితే దీన్ని అత్యధికంగా తీసుకోకూడదు. సోడియం కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల హై బీపీ ఉన్నవారు సాధారణ ఉప్పు కంటే దీనిని కొంతమేరకు ఉపయోగించవచ్చు. చర్మ సమస్యలు.. సైంధవ  ఉప్పుతో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, అలర్జీలు తగ్గుతాయని నమ్మకం ఉంది. గర్భిణీ స్త్రీలకు అనుకూలం: సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణంను  ఉపవాసాల సమయంలో, గర్భధారణ సమయంలో ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది శరీరానికి మృదుత్వం ఇస్తుంది. ఇవి తెలుసుకోండి.. ఆయుర్వేద ప్రకారం ఇది అధికంగా వాడితే కఫ, పిత్తాన్ని పెంచే అవకాశం ఉంది. శరీరానికి అధిక ఉష్ణతనివ్వడం, రక్తాన్ని కలుషితం చేయడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. సముద్ర ఉప్పు.. ఇది కూడా కొన్ని సందర్భాల్లో వాడతారు కానీ ఇది ఎక్కువగా కఫ, పిత్తాన్ని ప్రేరేపించగలదని భావిస్తారు. ఉపయోగించే విధానం.. రోజువారీ వంటల్లో సాధారణ ఉప్పు స్థానంలో తక్కువ మోతాదులో సైంధవ లవణం వాడడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చట్నీలు, రైతాలు, ఉపవాసకాల వంటల్లో ఇది వాడతారు. స్నాన జలంలో ఈ ఉప్పును కలిపి వాడితే శరీరానికి విశ్రాంతి కలుగుతుంది.                         *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
యోగ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. యోగాలో చాలా రకాల ఆసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి కూడా ఉన్నాయి.  యోగాలో శక్తివంతమైన (Powerful) ఆసనాలు  శరీరానికి శక్తిని, స్థిరతను, సౌష్టవాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ఆసనాలు. ఇవి శారీరకంగా గట్టిగా ఉండటంతో పాటు మానసిక శాంతిని కూడా అందిస్తాయి. ఇవి శక్తి, సహనం, స్తైర్యం, ఫోకస్, ప్రాణశక్తి పెంచే విధంగా పనిచేస్తాయి. అలాంటి శక్తివంతమైన యోగాసనాలు ఏవో తెలుసుకుంటే.. శక్తివంతమైన యోగాసనాలు.. వీరభద్రాసనాలు..   వీరభద్రాసనాలలో మూడు రకాలు ఉన్నాయి.   ఇవి వేస్తుంటే శరీరానికి ధైర్యం, స్థైర్యం కలుగుతుంది. కాళ్ళు, చేతులు, వెన్నెముక బలపడతాయి. మనస్సు కేంద్రీకృతం అవుతుంది.  నౌకాసన (Boat Pose).. నౌకాసనం వస్తుంటే శరీరంలో మధ్య భాగం (core) శక్తివంతంగా తయారవుతుంది. అబ్డోమినల్ మసిల్స్, స్పైన్ బలపడతాయి. మానసిక దృఢత పెరుగుతుంది. బకాసన (Crow Pose).. బలమైన చేతులు, మోకాలుకు సపోర్ట్ కావాలంటే బకాసన వేయడం చాలా మంచిది. ఈ ఆసనం వేయడం వల్ల  ఫోకస్, సమతుల్యత అభివృద్ధి చేస్తుంది.  ధైర్యాన్ని పెంచుతుంది.  ఉర్ధ్వ ధనురాసనం (Upward Bow or Wheel Pose).. ఊర్థ్వ ధనురాసనం వేస్తే వెన్నెముక, గుండె, ఛాతీ తెరుచుకుంటాయి. ఇది  శక్తిని పంచుతుంది, ఉత్సాహం పెంచుతుంది. పరివ్రుత్త పర్వతాసన (Revolved Triangle Pose ) పరివృత్త పర్వతాసన వేయడం ద్వారా శరీరానికి లవణత (flexibility),  బలం ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీరాన్ని డిటాక్స్  చేయడంలో సహాయం చేస్తుంది.  అధో ముఖ శ్వానాసన (Downward Facing Dog).. అధోముఖ శ్వానాస వేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది.  ఇది శక్తిని పునరుత్తేజితం చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చతురంగ దండాసన (Low Plank).. చేతులు, భుజాలు, మధ్య భాగం బలంగా తయారవుతాయి. శక్తిని కేంద్రీకరించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాణాయామం తో కలిపితే.. శక్తివంతమైన ఆసనాలకు ప్రాణాయామం (విశేషంగా కపాలభాతి, బస్ట్రికా) తోడైతే శక్తి స్థాయి మరింత పెరుగుతుంది. సూచనలు: ఆసనాలు సాధన చేయడానికి ముందుగా మైల్డ్ వార్మప్ చేయాలి. శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యం. మొదట్లో శిక్షణ పొందిన గురువు సూచనతో చేయడం ఉత్తమం.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజూ ఆహారంలో పండ్లు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అయితే కొన్నిరకాల పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  ముఖ్యంగా దానిమ్మ రసం చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రోజూ ఒక కప్పు దానిమ్మ (pomegranate) రసం తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరతాయి. ఇది శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచే సహజ ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే.. గుండె ఆరోగ్యానికి మంచిది.. రక్తనాళాలను శుభ్రపరిచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. గుండెపోటు, హై బీపీ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్.. దానిమ్మలో పునికాలగిన్స్ (punicalagins) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, క్యాన్సర్, వృద్ధాప్యం రాకుండా రక్షిస్తాయి. శరీరానికి నష్టం కలిగించే హానికరమైన కణాలతో పోరాడతాయి. రక్తహీనత (అనీమియా) నివారణ.. దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్ లో కూడాఐరన్ అధికంగా ఉంటుంది.  ఈ కారణం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. రక్తహీనత సమస్య తో ఇబ్బంది పడేవారు,  ముఖ్యంగా మహిళలు దానిమ్మ రసం రోజూ తీసుకుంటే మంచిది.  ఇంకా దానిమ్మ జ్యూస్  రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మవర్ణం మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక శక్తి.. దానిమ్మలో విటమిన్ C, విటమిన్ K, పొటాషియం అధికంగా ఉంటాయి.  ఇవి   ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మ ఆరోగ్యం,  అందం.. దానిమ్మ జ్యూస్ రోజూ తాగుతూ ఉంటే చర్మం గ్లోగా, యంగ్‌గా కనిపించేందుకు సహాయపడుతుంది.  అలాగే చర్మం మీద మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహకరిస్తుంది. మూత్రపిండాలకు & కాలేయానికి శుభ్రత.. టాక్సిన్లను బయటకు పంపి లివర్‌ను డిటాక్స్ చేయడంలో దానిమ్మ బాగా పనిచేస్తుంది. అంతేకాదు  మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడం & బరువు తగ్గడం.. దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా దానిమ్మ పండు లేదా జ్యూస్ తీసుకుంటే   త్వరగా ఆకలి కాదు.   మితంగా తీసుకుంటే బరువు తగ్గే వారికీ సహాయకరంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన  రసం తీసుకోవడం మంచిది.  ప్యాకెట్ జ్యూస్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ చేస్తుంది.  డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. రోజూ 1 కప్పు (150–200 మిల్లీలీటర్లు) సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...