ఏపీ అసెంబ్లీ  వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో  వైసీపీ శాసనసభాపక్షం బుధవారం (ఆగస్టు 12)న భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సాధారణంగా ఏ పార్టీ అయినా శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేస్తుంది. దీంతో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం అనగానే.. వైసీపీ అసెంబ్లీ బహిష్కరణకు స్వస్తి చెప్పి సభకు హాజరు కానుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది.  అయితే వైసీపీ శాసనసభాపక్ష సమావేశం మాత్రం అసెంబ్లీ బహిష్కరణను కొనసాగించాలన్న నిర్ణయం తీసుకుంది. ఇప్పుడూ ప్రతిపక్ష హోదాపై స్పష్టత రానందున సభను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది.   2024 శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఆ సంఖ్య సభ్యులతో సభలో ప్రతిపక్ష హోదా వచ్చే అవకావం ఇసుమంతైనా లేదు.  అయితే వైసీపీ మాత్రం నిబంధనలతో పని లేకుండా తమ పార్టీకి ప్రతిపక్ష హోదా, పార్టీ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. ఆ డిమాండ్ తో నే అసెంబ్లీ బహిష్కరణ చేస్తున్నది.  శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.  ముఖ్యంగా  మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో  అక్రమాలు, అవకతవకలపై ప్రభుత్వాన్ని మండలిలో నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ శాసనమండలి సభ్యులకు దిశానిర్దేశం చేశారు.    AP Assembly,  Monsoon Sessions, YSRCP Boycott,  Jagan Leader of Opposition Status, AP Legislative Council,  TeluguOne
  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు,  బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు టాలీవుడ్ ఎంట్రీపై ముహూర్తం ఖరారైపోయిందా? అంటే సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల నుంచీ ఔనన్న సమాధానమే వస్తోంది. కల్వకుంట్ల హిమాన్షు సినీ ఎంట్రీ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కల్వకుంట్ల హిమాన్షు సంగీత ప్రతిభ తెలిసిందే. తన గానంతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. కల్వకుంట్ల హిమాన్సు పాడిన గోల్డెన్ అవర్ సాంగ్ నెటిజనులను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం గానం, సంగీతమే కాకుండా..సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ హిమాన్షు చురుగ్గా ఉంటారు.  బెహతర్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామిగా మారి  29 వేల 482 కిలోగ్రాముల రీసైకిల్ వ్యర్థాలను సేకరించి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు.  అలాగే త గజ్వేల్ సమీపంలోని గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాలను 90 లక్షల వ్యయంతో అధునాతన హంగులతో అభివృద్ధి చేసి  ప్రశంసలు అందుకున్నారు. ఇటీవలి కాలంలో హిమాన్షు రావు  తన  ఫిట్‌నెస్‌తో, సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన లుక్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ లుక్కే హిమాన్షురావు త్వరలోనే హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న ప్రచారం జోరందుకునేలా చేసింది.  ఇప్పటికే కొందరు ప్రముఖ దర్శకులు ఆయన కోసం కథ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.   పొలిటికల్ ఫ్యామిలీ నుంచి  సినీ  ఎంట్రీ కొత్తేం కాదు... ఇప్పఇకే  మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా  హీరో' సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు.   2024 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న  యువకుడు హిమాన్షు రావు    పొలిటికల్ గ్లామర్, మాస్ ఫాలోయింగ్ కేసీఆర్ కుటుంబం నుంచి సినీరంగ ప్రవేశం చేయనున్నారన్న వార్త ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.  KTR grand son tollywood entry, KTR son Himanshu, Himanshu Rao Cine debut, Kalvakuntla Himanshu Rao transformation, TeluguOne
ఏపీ పాలిటిక్స్ లో  ఆసక్తికరమైన  పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మనవడు, పురందేశ్వరి కుమారుడు   దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.  నందమూరి, దగ్గుబాటి, నారా కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్న తరుణంలో..  హితేష్ చెంచురాం టిడిపి కండువా కప్పుకోనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  తెలుగుదేశం  ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పుడు తాజాగా దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు హితేష్ తెలుగుదేశం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టనున్నారు.   కుటుంబ బంధాలు,  రాజకీయ వేదికలు ఏకతాటిపైకి రావడం పార్టీలో నూతనోత్తేజాన్ని నింపుతుందని పరిశీలకులు అంటున్నారు.  లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దగ్గుబాటి హితేష్   రాజకీయ ప్రవేశం వెనుక కుటుంబ పెద్దల సహకారం, పొత్తుల సమీకరణాలు   ఉన్నాయని అంటున్నారు. గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా దగ్గుబాటి కుటుంబం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చింది. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా  చంద్రబాబు నాయకత్వంలో  తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేసేందుకు  హితేష్ ను తెలుగుదేశంలో చేర్చడం ద్వారా ఈ దూరం తగ్గుతుందని భావిస్తున్నారు. బాపట్ల జిల్లా కారంచేడు పరిధిలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హితేష్ క్రియాశీలకంగా పాల్గొన్నారు.  అలాగే స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి సొంతంగా నిధులు కేటాయించడం వంటి అంశాలు ఆయన రాజకీయ ప్రవేశానికి సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2019 శాసనసభ ఎన్నికలకు ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ఆయన కుమారుడు హితేష్ చెంచురాం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పర్చూరు నియోజకవర్గం నుంచి హితేష్ పోటీ చేయాలని భావించినప్పటికీ,  సాంకేతిక సమస్యల కారణంగా ఆయన స్థానంలో తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలోకి దిగారు. ఆ ఎన్నికల అనంతరం దగ్గుబాటి తండ్రీకొడుకులు వైసీపీకి,   రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా..  దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగుతూ ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలి కాలంలో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం  పెరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లడం, కుటుంబ వేడుకలు,  పుస్తకావిష్కరణల సందర్భంగా చంద్రబాబు, దగ్గుబాటి ఒకే వేదిక పంచుకోవడం వారి మధ్య దూరం తగ్గిపోయిందనడానికి సాక్ష్యంగా నిలిచాయి.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ మూడు కుటుంబాల మధ్య  బంధం మరింత బలపడింది. ఈ సఖ్యతే హితేష్ చెంచురాం తెలుగుదేశం పార్టీలో చేరడానికి  మార్గం సుగమం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   Hitesh Chenchuram TDP Entry, Daggubati Hitesh Chenchuram, NTR Grandson Political Entry, TDP New Political Developments,  Daggubati Family, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈరోజు(ఆగస్టు 12) ఆయన సికింద్రాబాద్ KIMS హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హాస్పిటల్ యాజమాన్యం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయిందని, అయితే ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ లో భాగంగానే ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవడానికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అవసరమని వైద్యుల బృందం నిర్ణయించింది. ఈ క్రమంలోనే KIMS హాస్పిటల్స్‌లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ R.A. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సూరపనేని ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ సక్సెస్ ఫుల్‌గా పూర్తయింది. వైద్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. సర్జరీ పూర్తిగా విజయవంతమైందని, ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి క్షేమంగా ఉన్నారని KIMS డైరెక్టర్ అండ్ మెడికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ సంబిత్ సాహు స్పష్టం చేశారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభం కానుంది. రాబోయే 2 నుండి 3 నెలల వ్యవధిలో ఎన్టీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ స్థితికి చేరుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెడతారని వైద్యులు ధీమా వ్యక్తం చేశారు.     Jr NTR Surgery, KIMS Hospital, Health Bulletin  
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత్ కనిపిస్తున్న విషయం తెలిసిందే.  హీరోయిన్ అంటే కొంత మందిలో ఉన్న అర్దాన్ని ఆమడదూరం పారదోలుతూ కీ రోల్ పోషించబోతుందనే విషయం టీజర్ తో  అర్ధమవుతుంది. ఇప్పుడు ఈ భామ మలయాళ చిత్రసీమలోకి ఘనంగా అడుగుపెడుతోంది. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ సరసన కథానాయికగా రుక్మిణి వసంత్ నటించబోతున్న ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా 'NP51' అనే వర్కింగ్ టైటిల్‌తో మొన్న  9న హైదరాబాద్ మరియు కేరళ వేదికగా పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 2022లో వచ్చి సంచలన విజయాన్ని సాధించిన 'జయ జయ జయ జయ హే' చిత్రానికి సహ రచయితగా వ్యవహరించిన నషిద్ ఫామి ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మార్టిన్ ప్రక్కట్ ఫిల్మ్స్, పౌలీ జూనియర్ పిక్చర్స్ మరియు గ్రీన్ రూమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా అజు వర్గీస్, జగదీష్, కలారంజని, అశోకన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో తన మొదటి సినిమాకే ఇటువంటి ప్రతిష్టాత్మక కాంబినేషన్ లభించడం పట్ల రుక్మిణి వసంత్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, క్లాప్‌బోర్డ్ పట్టుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోగా, అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.  Also Read: నసీరుద్దీన్ షాపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు రాకింగ్ స్టార్ యష్  వన్ మాన్ షో  టాక్సిక్’ ద్వారా ఈ  26న రుక్మిణి వసంత్ థియేటర్స్ లోకి  అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, సుకుమార్ ల 'RC17'లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్‌ని  పరిశీలిస్తున్నట్లు టాక్. Ntr, Rukmini Vasanth, Nivin Pauly, Dragon  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కమిట్‌మెంట్ అండ్ డెడికేషన్‌తో టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తున్నారు. 'సీతా రామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' సినిమా కోసం ప్రభాస్ చూపిస్తున్న డెడికేషన్ చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ పరిసరాల్లో ఏకంగా 3 వేర్వేరు యూనిట్లతో జరుగుతోంది. ప్రభాస్ ఒకే రోజులో రిహార్సల్స్, హెవీ యాక్షన్ సీక్వెన్స్, సెకండ్ యూనిట్ ప్యాచ్‌వర్క్ షూటింగ్‌లలో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. షూటింగ్ ప్రారంభం కాగానే.. ఫస్ట్ యూనిట్ దగ్గర ప్రభాస్ రిహార్సల్స్‌లో పాల్గొంటున్నారు. యాక్షన్ సీన్స్ లేదా సంక్లిష్టమైన సీక్వెన్సెస్ పర్ఫెక్ట్‌గా రావడానికి మొదట రిహార్సల్స్ పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా.. వెంటనే సెకండ్ సెట్‌లోకి వెళ్లి హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. ఇక ఆ ఫైట్ సీన్ల మధ్యలో లభించే చిన్న చిన్న విరామాలలో.. ప్యాచ్ వర్క్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.  అంటే ఒకే రోజులో రిహార్సల్స్, హెవీ యాక్షన్ స్టంట్స్, ప్యాచ్‌వర్క్.. ఇలా మూడింటినీ ప్రభాస్ సింగిల్ హ్యాండ్‌తో మేనేజ్ చేస్తున్నారు. దీనికి తోడు, ఈ సినిమా వేగంగా పూర్తి కావడానికి ప్రభాస్ ఏకంగా నెల రోజుల డేట్స్‌ను నాన్‌స్టాప్‌గా కేటాయించారట. తన బాడీపై ఎంత స్ట్రెయిన్ పడుతున్నా, సినిమా అవుట్‌పుట్ పర్ఫెక్ట్‌గా రావాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ప్రభాస్ పడుతున్న ఈ కష్టం చూసి యూనిట్ సభ్యులు సైతం ఫిదా అయిపోతున్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామాలో ప్రభాస్ ఒక విప్లవాత్మక సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, ప్రభాస్ మేకోవర్ నెట్టింట ఏ స్థాయిలో రచ్చ చేశాయో తెలిసిందే. ఒకవైపు సెట్స్‌లో ఈ స్థాయిలో కష్టపడటం, మరోవైపు ప్రతి సీన్‌ని పర్‌ఫెక్ట్‌గా చెక్కడం చూస్తుంటే.. 'ఫౌజీ' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించబోతోందో అర్థమవుతోంది.     Prabhas Dedication, Fauzi Movie, Shooting Update, Hanu Raghavapudi  
Suriya’s Vishwanath And Sons is heading towards its theatrical release amid concern over its opening in the Tamil Nadu market. The film is reportedly witnessing very low advance bookings in the state, which has come as a surprise given Suriya’s strong market and the success of his previous outing Karuppu. The film is scheduled to release on August 14, with Venky Atluri directing the family drama. The bookings for Vishwanath And Sons were opened quite late, and this has reportedly impacted the advance sales significantly. The delay is said to have been linked to issues between the distributor and exhibitors over the percentage-sharing arrangement. With the commercial terms taking time to settle, the film missed valuable time to build momentum through advance bookings. Another concern is the response to the trailer. While the film's teaser had generated considerable attention earlier, the theatrical trailer has not created the kind of impact expected from a Suriya-starrer. Interestingly, reports from within the trade suggest that the film itself has received positive reactions from those who have seen it, giving the team hope that strong word-of-mouth could change the situation after release. The stakes are particularly high in Tamil Nadu. The film reportedly needs to collect more than Rs.120 crore to reach the breakeven point for all the parties involved in the state. That makes the current booking trend a significant concern, especially for a film carrying Suriya’s name. What makes the situation more notable is the timing. Suriya’s Karuppu delivered a strong theatrical run, with the film reportedly crossing Rs.160 crore in Tamil Nadu alone. Coming immediately after such a successful outing, Vishwanath And Sons showing such low advance bookings is certainly an issue for the trade. The film now needs strong opening-day response and, more importantly, positive word-of-mouth to overcome the slow start. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Adivi Sesh is set to be at the centre of New York City’s Independence Day celebrations this year, becoming one of the prominent Indian film personalities to represent the country at a major gathering of the Indian diaspora. The actor will participate in a series of events across three days, culminating in the annual India Day Parade on Madison Avenue. Sesh’s schedule begins on August 14 with one of the most symbolic moments of the celebrations. He will join the leadership of the Empire State Building for the ceremonial lighting of the landmark in India’s tricolour. The iconic New York skyline turning saffron, white and green has become a powerful visual celebration for the Indian community, and Sesh will be part of that moment this year. The following day, the actor will join the Consul General of India at Times Square for a special Independence Day flag-hoisting ceremony. The programme will bring together music, dance and other cultural performances, turning one of New York’s busiest public spaces into a celebration of Indian heritage. Adivi Sesh will then headline the India Day Parade on August 16. He will ride the America 250 float alongside elected officials and take his place at the main podium, where he will greet the 55 floats participating in the parade. The event is expected to draw close to three lakh people along Madison Avenue. For Adivi Sesh, the three-day appearance goes beyond a conventional celebrity engagement. With an Indian actor being given a prominent role across three of the city’s most visible Independence Day events, his participation reflects the growing cultural reach of Indian cinema and the increasing visibility of Indian personalities on global platforms. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ'. రవి నంబూరి దర్శకుడు. 'బేబీ' ఫేమ్ సాయి రాజేష్ కథ అందించారు. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ జులై 24న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్‌ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ.. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది. 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ థియేటర్లలో విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో, యూత్‌ని అమితంగా ఆకట్టుకుంది. కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి, బిగ్ హిట్‌గా నిలిచింది. మొదటి ప్రేమ విఫలమైతే జీవితం అక్కడితో ఆగిపోదు, అంతకంటే గొప్ప ప్రేమ మనకోసం ఎదురుచూస్తుందనే ఒక అందమైన కాన్సెప్ట్‌ను చాలా ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారు దర్శకుడు రవి నంబూరి. సినిమా తీసి వెండితెరపై తన పేరు చూసుకోవాలనే ఆశయంతో చెన్నైకి వచ్చిన అనాథ స్టీవెన్ శంకర్ పాత్రలో కిరణ్ అబ్బవరం ఒదిగిపోగా.. ప్రేమించిన వ్యక్తి హ్యాండ్ ఇవ్వడంతో తీవ్రమైన మనోవేదనకు గురైన నివి పాత్రలో శ్రీ గౌరీ ప్రియ అద్భుతంగా నటించింది. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ భారీ ధరకు దక్కించుకుంది. ఆగస్టు 21 నుంచి ఈ సినిమా సోనీ లివ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.     Kiran Abbavaram, Sri Gouri Priya, Chennai Love Story, OTT Release  
  రాకింగ్ స్టార్ యష్ ఈ నెల 26 న టాక్సిక్ తో వరల్డ్ వైడ్ గా తన సత్తా చాటడానికి వస్తున్న విషయం తెలిసిందే. దీంతో థియేటర్స్ అన్ని ఆ దివ్యమైన రోజు కూడా ఎదురుచూస్తూ ఉన్నాయి. అభిమానుల్లో, సినీ సర్కిల్స్ లో అయితే ట్రైలర్ రిలీజ్ రోజు నుంచే సందడి వాతావరణం నెలకొంది. దీంతో టాక్సిక్ గురించి మాట్లాడుకోవడం తన రోజు వారి దిన చర్య గా మారింది. యష్ పర్సనల్ విషయానికి వస్తే భార్య పేరు రాధికా పండిత్. ఒకప్పటి హీరోయిన్.  ఆమె రీసెంట్ గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో '10 సంవత్సరాల నిశ్చితార్థం, జీవితాంతం నిలిచిపోయే ప్రేమ.. మాకు అత్యంత ఇష్టమైన ఈ అందమైన కథ ఇంకా రాయబడుతూనే ఉంది. ఆగస్టు 12, 2016 నాటి ఆ రోజున నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకు నేను చెప్పిన 'YES' వర్డ్   నా జీవితంలోనే అత్యుత్తమమైనది. నువ్వు ఎప్పటికీ నా ఫేవరెట్ 'YES'గానే ఉంటావు" అంటూ రాసుకొచ్చారు. ఎంగేజ్‌మెంట్ తాలూకు పిక్స్ కూడా షేర్ చెయ్యడంతో అభిమానులు, నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నాయి. Also read: సంచలనం: మాజీ భర్త రెండో పెళ్లి రిసెప్షన్ ఫోటోలు..#ఊర్మిళ మటోండ్కర్ వైరల్ పోస్ట్  2007వ సంవత్సరంలో 'నంద గోకుల' అనే కన్నడ టెలివిజన్ సీరియల్ సెట్స్‌లో యష్, రాధికా పండిత్  పరిచయం జరిగింది. ప్రారంభంలో మంచి స్నేహితులుగా ఉన్న తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ప్రేమికులుగా మారారు. 2008లో వచ్చిన 'మొగ్గినా మనసు' సినిమాతో  వెండితెర అరంగేట్రం చేసి  'డ్రామా', 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి', 'సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్' వంటి పలు విజయవంతమైన చిత్రాలలో కలిసి నటించి, తెరపై తమ అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు.   అయితే, తమ ప్రేమ వ్యవహారాన్ని చాలా ఏళ్ల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచడం విశేషం. 2016 ఆగస్టు 12న గోవాలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, అదే ఏడాది డిసెంబర్ నెలలో వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహ అనంతరం బెంగళూరు ప్యాలెస్‌లో తమ ప్రియమైన అభిమానుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన రిసెప్షన్ వేడుక అప్పట్లో ఒక సంచలనంగా నిలిచింది.  వీరికి ఒక కుమార్తె, ఒక కొడుకు. పేర్లు అయ్రా, యథార్వ్.  #Yash, Radhika Pandit, Sandil Wood, Toxic
టాలీవుడ్ లో ఒక నటుడికి దక్కే అతిపెద్ద బహుమతి ఏది అంటే మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చే ప్రశంస అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన నటులైనా, కమెడియన్లైనా వారి టాలెంట్‌ను గుర్తించి వేదికలపై ప్రోత్సహించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా 'కొరియన్ కనకరాజు' మూవీ సక్సెస్ ఈవెంట్ లో కమెడియన్ సత్యపై చిరంజీవి కురిపించిన ప్రశంసలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేదికపై మాట్లాడిన మెగాస్టార్, సత్య నటన గురించి చెబుతూ "ఈ సినిమాలో నువ్వు చాలా అద్భుతంగా చేశావు. నీ కామెడీ టైమింగ్, నటన చూశాక నీ కోసమే ఈ సినిమాను మరోసారి చూడాలి అనిపించింది" అని కొనియాడారు. గతంలో సత్య తనతో కలిసి నటించిన రోజులను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. సత్య నటనలో ఎలాంటి హద్దులు, పరిమితులు ఉండవని, ఆ క్యారెక్టర్‌కు ఏది కావాలో తన మిమిక్ టాలెంట్‌తో దానికి తగ్గట్టుగా మలచుకుంటూ వెళ్లిపోతాడని అభినందించారు. "నువ్వు ఎలాంటి అభద్రతా భావాలు లేకుండా, నిర్భయంగా నటించే విధానమే నీ అసలైన బలం. నీలో ఉన్న ఆ వైవిధ్యమే నిన్ను ఇంతమంది ప్రేక్షకులకు దగ్గర చేసింది" అని మెగాస్టార్ కొనియాడారు. ప్రేక్షకుల ఆశీస్సులతో సత్య ఖాతాలో మరిన్ని ఘన విజయాలు చేరాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇటీవలి కాలంలో కామెడీ చిత్రాలతోనూ, వైవిధ్యమైన పాత్రలతోనూ మెప్పిస్తున్న సత్యకి మెగాస్టార్ ఇచ్చిన ఈ కాంప్లిమెంట్ ఒక పెద్ద సర్టిఫికెట్‌లాంటిదని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.      Chiranjeevi, Comedian Satya, Korean Kanakaraju  
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.  కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.  అయితే మనిషి మెదడు  ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉండదని అంటున్నారు నిపుణులు. సమాచారాన్ని వేగంగా గ్రహించడంలో  సహాయపడటానికి..  మనస్సు కాగ్నిటివ్ బయాసెస్ అని పిలువబడే మానసిక పరిస్థితి పై ఆధారపడుతుంది. ఈ మార్గాలు సమయాన్ని ఆదా చేయగలిగినప్పటికీ, అవి ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే ,  చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకునే విధానాన్ని కూడా వక్రీకరించగలవని అంటున్నారు. దీని ఫలితంగా  మెదడు ఒక విషయాన్ని వేరేగా అన్వయించుకుంటుంది, అందుకే అదే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిర్థారణలో పక్షపాతం..  ఇప్పటికే నమ్ముతున్న విషయాలను బలపరిచే సమాచారం కోసం  మెదడు సహజంగానే వెతుకుతూ ఉంటుందట.  ఎవరితోనైనా విభేదిస్తే, వారితో విభేధించడానికి గల అభిప్రాయానికి గల కారణాలను,  సాక్ష్యాలను విస్మరించి, వారు తప్పు అని చెప్పడానికి గల ప్రతి కారణంపై  దృష్టి పెడతారట. నిజాన్ని తెలుసుకోవడానికి  బదులుగా, మనస్సు తరచుగా తను అనుకున్నదే కరెక్ట్ అనే విషయాన్ని నిరూపించడం  కోసం వెతుకుతూ ఉంటుందట.  ఇలా నిజాలు తెలుసుకునే విషయంలో మెదడు పక్షపాతం వహిస్తుందట. హెలో ఎఫెక్ట్.. చాలామంది చక్కగా దుస్తులు ధరించి,  శుభ్రంగా ఉంటూ, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంటారు.  ఇలాంటి వారి విషయంలో చాలామంది పాజిటివ్ గానూ,  వాళ్లదిమంచి వ్యక్తిత్వం అని అనుకుంటారు.  దీని కారణం మెదడే.. ఇలాంటి వాళ్లు మంచోళ్లు అని మెదడు అనుకుంటుందట.  ఇలాంటి ప్రభావాన్ని హెలో ఎఫెక్ట్ అని అంటారు. ఒక వ్యక్తిలో  మంచి గుణాన్ని గమనించినప్పుడు, ఎటువంటి నిజమైన ఆధారం లేకపోయినా,  మెదడు వారికి ఇతర మంచి లక్షణాలు కూడా ఉన్నాయని దానంతట అదే ఊహించుకుంటుంది. వాస్తవాల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి బదులుగా,  మనస్సు దానికి నచ్చినట్టు మంచి మంచి స్టోరీస్ ను ఊహించుకుని మరీ  వారిని చాలా మంచోళ్లను,  అన్నీ మంచి గుణాలే ఉన్నోళ్లుగా భావిస్తుంది. ఎమోషనల్ లాజిక్.. ఎమోషన్స్ అనేవి వాస్తవాన్ని చూసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైనా ఆందోళనగా అనిపిస్తే, ఆ పరిస్థితి ప్రమాదకరమైనదని అనుకోవడం,  ఎందులో అయినా ఫెయిల్యూర్ ఎదురైతే నిజంగానే పూర్తీగా విఫలమయ్యారని అనుకోవడం జరుగుతుంది. మనిషిలో ఉండే ఫీలింగ్స్  సరైనవే అయినప్పటికీ, అవి ఎల్లప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండవు. ఎమోషన్స్ ను  వాస్తవాల నుండి వేరు చేయడానికి కొంత సమయం తీసుకోవాలి, యాంత్రికంగా రియాక్ట్ అయ్యే  బదులు మరింత ఆలోచనాత్మకంగా స్పందించాలి.  అలా ఉంటేనే మంచిది.  లేకపోతే మెదడు చేతిలో మోసపోవాల్సి వస్తుంది. సన్క్ కాస్ట్ పాలసీ.. ఇప్పటికే చాలా సమయం , శ్రమను  ఒక పని కోసం వెచ్చించారు అనే కారణంతో  అందులో  అలాగే కొనసాగుతూ ఉంటే దాన్ని 'సన్క్ కాస్ట్ ఫాలసీ' (sunk cost fallacy) అంటారు.  మెదడు తరచుగా గత పెట్టుబడిని భవిష్యత్ విలువతో గందరగోళానికి గురిచేస్తుంది. దీనివల్ల ఏదైనా  ఇకపై ఉపయోగపడకపోయినా దాని నుండి బయటపడటం కష్టమవుతుంది.  ఇప్పటికే గడిపిన సమయాన్ని తిరిగి పొందలేరని గుర్తుంచుకోవాలి.  ఎలా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారో అదే  అత్యంత ముఖ్యం. నెగిటివ్  ప్రభావం.. ఎవరైనా విమర్మించినప్పుడు, తిట్టినప్పుడు, బాధపెట్టినప్పుడు.. అది  రోజుల తరబడి మనసులో నిలిచిపోతుంది, కానీ ఎన్నో మంచి విషయాలు, సంతోషకరమైన విషయాలు  త్వరగా మర్చిపోతారు. ఇలా జరగడానికి కారణం, మెదడు సహజంగానే సానుకూల అనుభవాల కంటే ప్రతికూల అనుభవాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం. ఇది  ఒకప్పుడు, ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండటానికి,  మానవులు మనుగడ సాగించడానికి సహాయపడింది. అయితే ఈ రోజుల్లో, ఇది రోజువారీ ఎదురుదెబ్బలను అవి నిజంగా ఉన్నదానికంటే చాలా పెద్దవిగా అనిపించేలా చేస్తుంది. నెగిటివ్ కంటే పాజిటివ్ ను మెదడులో ఇముడ్చుకోవాలి. అప్పుడే మెదడు పనితీరు ఆరోగ్యకరంగా ఉన్నట్టు. స్పాట్ లైట్ ఎఫెక్ట్..  తప్పులను,  రూపాన్ని, లేదా ఒక ఇబ్బందికరమైన క్షణాన్ని అందరూ గమనిస్తారని నమ్మడం చాలా సులభం. వాస్తవానికి, చాలా మంది తమ సొంత జీవితాలు , విషయాలపైనే దృష్టి పెడతారు. ఈ స్పాట్‌లైట్ ఎఫెక్ట్ వల్ల అందరూ తమను నిరంతరం గమనిస్తున్నారనే భావన కలుగుతుంది. కానీ నిజానికి అలా జరగకపోయినా  అదేలా భావిస్తుంటారు. ఈ ఆలోచనను  వదిలేయడం వల్ల,  రోజువారీ జీవితంలో మరింత ఆత్మవిశ్వాసంతో, తక్కువ భయంతో  ఉండటానికి సహాయపడుతుంది. పైన చెప్పుకున్నవిధంగా.. వివిధ కారణాల వల్ల చాలామందికి తమ మెదడే శత్రువులా మారి మోసం చేస్తుంది.                                                                                                                                               *రూపశ్రీ.
 పిల్లలు సక్సెస్ కావాలంటే ఈ లక్షణాలు అలవాటు చెయ్యాలి..! "నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని వారి నడవడికను తెలియజేయడానికి, పిల్లల భవిష్యత్తు గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు.  ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, తమకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటారు.  అయితే ఇవన్నీ జరగాలన్నా, పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలన్నా.. పిల్లలకు కొన్ని లక్షణాలు అలవాటు చేయాలి.  దీని వల్ల పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయాల్సినవి ఏమిటో తెలుసుకుంటే.. జ్ఞానం, తెలివితేటలు.. జ్ఞానం , తెలివితేటలు  పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా బలాలుగా మారతాయి. నేర్చుకోవాలనే తపన, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న పిల్లలు జీవితంలో విజయ మార్గంలో సులభంగా పయనిస్తారు. అటువంటి పిల్లలు తమ వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలరు. తెలివైన పిల్లలు తమ భవిష్యత్తును గొప్పగా మార్చుకోవడమే  చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రుల ప్రతిష్టను కూడా పెంచుతారు. అందుకే చిన్నతనం నుండే పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వాలి.   ప్రవర్తన.. మంచి ప్రవర్తన, నీతి, నిజాయితీ వంటి విలువలు గొప్ప ఆస్తిగా పరిగణించాలి. పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన పిల్లలు కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి పిల్లలు ఇంట్లో శాంతి, సంతోషాన్ని నెలకొల్పి, సమాజంలో కుటుంబానికి గౌరవాన్ని తెస్తారు. అందుకే పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి.  దీని వల్ల పిల్లల ప్రవర్తన కూడా ఉన్నతంగా మారుతుంది. నిజాయితీ.. అబద్ధాలు చెప్పడం, మోసం, వంచనలకు దూరంగా ఉండే పిల్లలు సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. పిల్లలు అయినా పెద్దలు అయినా.. వారి వ్యక్తిత్వాన్ని బలంగా ఉంచేది నిజాయితీనే..  ఇది  చుట్టూ ఉన్న వ్యక్తుల నమ్మకాన్ని పొందడంలో సహాయపడుతుంది. అటువంటి పిల్లలకు జీవితంలో విజయం సాధించడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. అందుకే వారి తల్లిదండ్రులు కూడా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. దయ.. దయ కలిగి ఉండటం,  సహాయపడే గుణం ఉన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు.  పేదలకు సహాయం చేస్తూ, ఇతరుల పట్ల సున్నితంగా ఉండే పిల్లలు సంతోషం, శాంతితో కూడిన జీవితాన్ని గడుపుతారు. అలాంటి పిల్లలకు  తల్లిదండ్రుల ఆశీర్వాదం, మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది.   పిల్లలలో ఉండే ఈ దయ, జాలి, కరుణ, సహాయం చేసే గుణం వంటివి సమాజంలో గప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.                                *రూపశ్రీ.  
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.  అయితే రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.  పక్కన ప్రయాణికుల నుండి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రైల్వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక "నైట్ జర్నీ కండీషన్స్" అమలు చేసింది. ప్రతి రైలు ప్రయాణికుడు ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే.. శబ్దం చేయకూడదు.. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నిశ్శబ్ద వాతావరణాన్ని పాటించడం ప్రధాన నియమం. ఈ సమయంలో మొబైల్ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు, లేదా ఇయర్‌ఫోన్‌లు లేకుండా స్పీకర్‌లపై వీడియోలు లేదా సంగీతాన్ని ప్లే చేయకూడదు. ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు, స్నేహితులతో గుంపులుగా బిగ్గరగా నవ్వడం , జోకులు వేయడం కూడా నిషేధించబడింది. లైట్స్ ఆఫ్.. కొన్నిసార్లు ప్రయాణికులు ఎవరైనా రాత్రి పొద్దుపోయే వరకు  ఏదో ఒక కారణంతో మెయిన్ లైటును ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల ఇతర ప్రయాణికులు నిద్రపోలేరు. పక్క వారి నిద్రకు ఇబ్బంది అవుతుంది.  రైల్వే నిబంధనల ప్రకారం, రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన కోచ్‌లోని లైట్లన్నీ తప్పనిసరిగా ఆపివేయాలి. రాత్రిపూట కేవలం నైట్‌లైట్ బల్బులు మాత్రమే ఆన్ చేసి ఉండవచ్చు. ఎవరైనా  అవసరం అనిపిస్తే వారు  తమ సీటులోని పర్సనల్ రీడింగ్ లైటును ఉపయోగించుకోవచ్చు. మధ్య బెర్త్ లకు రైల్వే నియమాలు.. లోయర్ బెర్త్  , మధ్య బెర్త్ ప్రయాణీకుల మధ్య సీట్ల తగాదాలను నివారించడానికి, రైల్వే ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టింది. మధ్య బెర్త్ ప్రయాణీకుడు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే తన సీటును విప్పి నిద్రపోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత, ఇతరులు దిగువ బెర్త్‌లో కూర్చోవడానికి వీలుగా  మధ్య బెర్త్‌ను దించాలి. అదేవిధంగా, రాత్రి 10 గంటల తర్వాత, లోయర్ బెర్త్ ప్రయాణీకుడు తన సీట్ లో ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదు. వారు తమ పక్కన కూర్చోమని ఎవరినీ బలవంతం చేయలేరు. టికెట్ చెకింగ్.. ప్రయాణికుల నిద్రను దృష్టిలో ఉంచుకుని, రైల్వే తన టికెట్ చెకింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల మధ్య  టికెట్‌ను తనిఖీ చేయడానికి ఏ టిటిఇ మిమ్మల్ని నిద్రలేపకూడదు. వారు రాత్రి 10:00 గంటల లోపు తమ పనిని పూర్తి చేసుకోవాలి. అయితే, రాత్రి 10:00 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులు ఈ సమయంలో తమ టికెట్లను తనిఖీ చేయించుకోవచ్చు. ఇది కాకుండా రాత్రి 10 గంటల తర్వాత రైలులో వీధి వ్యాపారులు లేదా విక్రయదారులు గట్టిగా అరుస్తూ ఎలాంటి వస్తువులను అమ్మకూడదు.  కానీ ఎవరైనా ఈ-క్యాటరింగ్ ద్వారా ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకుని ఉంటే, అది ఖచ్చితంగా వారి సీటుకే తెచ్చిస్తారు. నియమాలు ఉల్లింఘిస్తే.. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికుడు ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారితో వాదించాల్సిన అవసరం లేదు.  వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), TTE, లేదా రైలులోని కోచ్ అటెండెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.  రైల్వే అధికారిక యాప్ 'రైల్‌మదాద్' లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. నియమాలను ఉల్లంఘించిన వారిపై రైల్వే జరిమానాలు కూడా విధించవచ్చు. కాబట్టి రైలు ప్రయాణం చేసేటప్పుడు పై నియమాలు గుర్తుంచుకుని,  వాటిని అనుసరిస్తూ ప్రయాణించడం మంచిది.                                      *రూపశ్రీ.  
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తూ చేసే ఒక సాధారణ యోగాభ్యాసం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో చేయడం ముఖ్యమని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ప్రాణాయామం చేయడం సరికాదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం ఉన్న సమస్యలను బట్టి విధానం మారవచ్చు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ శ్రావంతి రఘు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎవరు చేయవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలి? వీడియోలో అనులోమ విలోమాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఎలా చేయాలో చూపించారు. శ్వాసను నెమ్మదిగా, నియంత్రణతో తీసుకోవడం, వదలడం వంటి అంశాలను సరైన పద్ధతిలో పాటించడం గురించి వివరించారు. ప్రాణాయామం చేసేటప్పుడు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడం, తొందరపడకుండా శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యమైన అంశాలు. మొదటిసారి ప్రయత్నించేవారు నిపుణుల సూచనతో ప్రారంభించడం మంచిది. BP ఉన్నవారు చేయవచ్చా? అధిక రక్తపోటు ఉన్నవారు కూడా కొన్ని శ్వాసాభ్యాసాలను తగిన జాగ్రత్తలతో చేయవచ్చు. అయితే అధిక బీపీ ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే విధమైన ప్రాణాయామ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా శ్వాసను బిగపట్టడం వంటి పద్ధతులను స్వయంగా ప్రయత్నించకుండా, నిపుణుల సూచనలు పాటించడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు చేయవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నిపుణుల సలహా తీసుకుని సాధన చేయవచ్చు. అయితే ప్రాణాయామం ఏదైనా వ్యాధికి మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులు సూచించిన మందులు, ఆహారం, వ్యాయామాన్ని కొనసాగిస్తూ మాత్రమే యోగాభ్యాసాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. సైనసైటిస్ ఉన్నవారు? సైనసైటిస్ లేదా ముక్కు సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం చేసే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. ముక్కు పూర్తిగా బ్లాక్‌గా ఉన్నప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు బలవంతంగా శ్వాసాభ్యాసం చేయకూడదు. అవసరమైతే యోగా థెరపిస్ట్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. రోజూ 10 నిమిషాలు చేస్తే స్ట్రెస్, BP శాశ్వతంగా పోతాయా? ప్రాణాయామం వల్ల రిలాక్సేషన్, శ్వాస నియంత్రణ, మానసిక ప్రశాంతతకు సహాయం లభించవచ్చు. అయితే రోజూ 10 నిమిషాలు అనులోమ విలోమం చేస్తే స్ట్రెస్ లేదా బీపీ శాశ్వతంగా పూర్తిగా నయమవుతాయని చెప్పడం సరైనది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఒక వైద్య పరిస్థితి. దాని కోసం వైద్యుల సూచనలు, మందులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. ఈ వీడియోలో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరు చేయవచ్చు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సరైన పద్ధతి ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రావంతి రఘు వివరిస్తున్నారు. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు బీపీ, డయాబెటిస్, సైనసైటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాణాయామం ప్రారంభించే ముందు మీ వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా థెరపిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం. అయితే రక్తంలో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉన్నా (Hyperkalemia), తక్కువగా ఉన్నా (Hypokalemia) ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అసలు పొటాషియం అంటే ఏమిటి? రక్తంలో పొటాషియం ఎందుకు పెరుగుతుంది? పొటాషియం తగ్గడానికి కారణాలు ఏమిటి? పొటాషియం ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ సమస్యను నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేయాలి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ వైద్యులు డా. N. Papa Rao సులభంగా వివరిస్తున్నారు. పొటాషియం ఎక్కువైతే ఏమవుతుంది? రక్తంలో పొటాషియం సాధారణ స్థాయికి మించి ఉండటాన్ని Hyperkalemia అంటారు. కొన్ని సందర్భాల్లో కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం, కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని మందుల కారణంగా పొటాషియం స్థాయి పెరగవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు కండరాల బలహీనత, అలసట, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా గుండె పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పొటాషియం తగ్గితే? రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉండటాన్ని Hypokalemia అంటారు. వాంతులు, విరేచనాలు, అధికంగా చెమట పట్టడం, కొన్ని మందుల వాడకం వంటి కారణాలతో శరీరంలో పొటాషియం తగ్గే అవకాశం ఉంటుంది. పొటాషియం తక్కువగా ఉన్నప్పుడు నీరసం, కండరాల బలహీనత, కండరాలు పట్టేయడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? పొటాషియం స్థాయి ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది కేవలం లక్షణాల ఆధారంగా నిర్ణయించలేం. అవసరమైతే వైద్యుల సూచనతో రక్త పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా కొన్ని మందులు క్రమం తప్పకుండా ఉపయోగించేవారు వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. పొటాషియం ఎక్కువగా ఉందని లేదా తక్కువగా ఉందని అనుమానం వచ్చినప్పుడు సొంతంగా మందులు తీసుకోవడం, పొటాషియం సప్లిమెంట్లు వాడటం లేదా ఆహారంలో పెద్ద మార్పులు చేయడం చేయకండి. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పొటాషియం ఎక్కువైనా ప్రమాదమే.. తక్కువైనా సమస్యే. కాబట్టి శరీరంలో పొటాషియం స్థాయి ఎందుకు మారుతుంది, దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాలపై పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల వ్యక్తిగత సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా అనుమానాలు ఉంటే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)