LATEST NEWS
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే కొండా సురేఖను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. మంత్రి పదవిని కోల్పోయిన నాటి నుంచి అసెంబ్లీ జరుగుతున్న ప్రస్తుత వర్షాకాల సమావేశాలకు దూరంగా ఉంటున్న ఆమెతో, తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు.  పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలను పక్కనబెట్టి, వ్యక్తిగత సమస్యలను విడనాడి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాల్సిన ఆవశ్యకతను ఆమెకు వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరుకాకపోవడం కాంగ్రెస్ పార్టీ సర్కిళ్లలో తీవ్ర దుమార రేపింది.  ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించినట్లు సమాచారం. ఫోన్ సంభాషణ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి నేరుగా రావాల్సిందిగా కొండా సురేఖకు పార్టీ పెద్దల నుంచి పిలుపు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది.  మంత్రి పదవిని కోల్పోయి తీవ్ర అసంతృప్తితో రగులుతున్న సురేఖను కూడగట్టే క్రమంలో భాగంగానే హైకమాండ్ ఈ చర్యలు చేపట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఆమెకు త్వరలోనే కేబినెట్ స్థాయి లేదా సముచితమైన మరో ఉన్నత పదవిని అప్పగించే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం గమనార్హం. గతంలో వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఆమె కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, పరకాల అసెంబ్లీ స్థానంపై చెలరేగిన వివాదం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.   తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనను బాధ్యురాల్ని చేసి బలిపశువును చేయడం ఎంతవరకు సమంజసమని సురేఖ గతంలో బహిరంగంగానే ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బీసీ వర్గానికి చెందిన తనపైనే కఠిన చర్యలు తీసుకున్నారని, పార్టీలో కొందరికే ఒక రకమైన న్యాయం, తమలాంటి వారికి మరో న్యాయం జరుగుతోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారకుండా చూసేందుకు హైకమాండ్ వేగంగా పావులు కదుపుతోంది. ఫోన్ కాల్ చర్చల తర్వాత, ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కొండా సురేఖతో పార్టీ పెద్దలు జరిపే సమావేశం తర్వాత ఈ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందనే అంశంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.         [ Konda Surekha, Congress High Command, Meenakshi Natarajan, Telangana Politics, CM Revanth Reddy, Congress Cabinet, Congress party, Parakala assembly, Konda Sushmita Patel, Telugu One, Telugu News ]
  What Can Today’s Generations Learn From G.D. Naidu? Today, we have almost everything. We have smartphones. We have Google. We have YouTube. We have AI. We have online courses. We have access to knowledge from almost every corner of the world. But with all this access to technology and information… Are we creating enough? Recently, while watching the biopic GDN, I came across the life of G.D. Naidu—an inventor, industrialist and experimenter whose life was far ahead of the technology available during his time. The film itself presents his journey as that of an inventor overcoming enormous challenges during the colonial era. (Netflix) And one question kept coming back to me… How did a man who lived more than 100 years ago, with very limited formal education, develop such extraordinary curiosity about machines, technology and innovation? How did he look at a machine and think, “How does this work?” And then try to understand it? How did he look at a problem and think, “Can I build a better solution?” That was G.D. Naidu. And perhaps the biggest lesson today's generations can learn from his life is not simply how to become an inventor. It is… How to become curious again. Don't Just Use Technology. Understand It. Today, we use technology every minute. We use smartphones, but how many of us understand how they actually work? We use AI, but how many of us are curious about what is happening behind it? We use machines every day, but how many of us stop and ask: “Can this be made better?” G.D. Naidu had a different relationship with technology. He didn't just want to use machines. He wanted to understand them. His curiosity eventually extended into electrical, mechanical and automotive technology, among other areas. He experimented, manufactured and developed practical solutions rather than simply being a passive consumer of technology. Today, technology is everywhere. But perhaps what we need most is not more technology. We need more people who are curious enough to understand it. Your Degree Should Not Be the End of Your Education G.D. Naidu's formal education was limited. But he never allowed that to become the limit of his learning. He learned through observation. Through experimentation. Through machines. Through travel. Through experience. Through mistakes. Through doing. This doesn't mean formal education is unimportant. It means something else: A classroom should be the beginning of learning, not the boundary of learning. Today, a student can learn from the world's best universities without even leaving home. The knowledge is available. The technology is available. The opportunities are available. The question is: Are we using them? Learn by Doing Perhaps one of the most important ideas we can take from G.D. Naidu's approach to education is simple: Learn by doing. Not just reading about something. Not just watching someone else do it. Do it yourself. Build something. Break something. Experiment. Fail. Understand why it failed. Try again. This is where real learning begins. Imagine a child learning electricity only from a textbook. And imagine another child being allowed to build a simple electrical circuit with their own hands. Which child is more likely to remember the lesson? Today, we have simulations, laboratories, robotics kits, 3D printers, coding platforms and AI. We have more tools for hands-on learning than ever before. So the question is not whether resources exist. The question is whether we are using them to create, or simply using technology to consume. Don't Wait for Perfect Resources When we think about innovation today, we often imagine expensive laboratories, advanced equipment and large teams. But G.D. Naidu's journey tells us that innovation can begin much earlier than that. With a machine. With a problem. With a question. And with the determination to find an answer. His early journey itself was remarkable. He became involved in transport and engineering, and the United Motor Service eventually grew into a large bus operation. He also moved beyond transport into manufacturing and technology. That tells us something important. Sometimes we tell ourselves: “I don't have the right equipment.” “I don't have enough money.” “I don't have a laboratory.” “I don't have the right degree.” “I don't have the right opportunity.” But innovation doesn't always begin with resources. Sometimes it begins with a question. “Why?” “How?” “What if?” “Can I make this better?” That is where an inventor begins. Learn From the World. Build for India. G.D. Naidu understood the importance of learning from the world. He travelled abroad, observed technologies and brought back machines and technological knowledge. But the purpose wasn't simply to admire what other countries had built. He used what he learned as inspiration for experimentation, manufacturing and technological development in India. His museum in Coimbatore also became a way of exposing people to technology and the evolution of machines. The G.D. Naidu Industrial Museum today preserves many of these technological exhibits and inventions. (Tamil Nadu Tourism) That is an important lesson for today's generation. We don't have to reject what the world has created. We should learn from it. Understand it. Improve it. And ask: “How can we use this knowledge to solve India's problems?” Today, India has a huge opportunity. AI. Semiconductors. Electric vehicles. Space technology. Biotechnology. Robotics. Clean energy. The next generation shouldn't only ask, “What can I get from the world?” It should also ask, “What can I build for the world?” Innovation Should Solve Real Problems Innovation is not simply about creating something complicated. The real question is: Who does it help? A great invention solves a real problem. It makes something faster. Cheaper. Safer. Simpler. More accessible. More useful. That mindset is especially important for India. We have millions of real-world problems waiting for better solutions. From agriculture to transportation. From water management to waste management. From healthcare to education. From energy to rural technology. From manufacturing to public infrastructure. Imagine if today's young minds started looking at these problems not only as problems… but as opportunities to innovate. That could change India. What Can Millennials Learn? Millennials grew up during one of India's biggest technological transitions. We saw the world move from landlines to smartphones. From letters to instant messaging. From physical maps to Google Maps. From limited information to unlimited information. We have already experienced enormous technological change. But the lesson from G.D. Naidu is: Never let experience become resistance to learning. The technology we mastered yesterday may not be the technology that defines tomorrow. So keep learning. Keep adapting. Keep experimenting. What Can Gen Z Learn? Gen Z has grown up with extraordinary access to information. You can learn almost anything with a smartphone. But information alone doesn't create innovation. There is a difference between: knowing something, understanding something, and building something. The next step is to convert: Information → Knowledge → Skill → Idea → Product → Impact. Don't just become excellent consumers of content. Become creators of solutions. What Can Gen Alpha Learn? Gen Alpha is growing up in a completely different world. AI will be everywhere. Machines will become smarter. Learning will become more personalized. Technology will become increasingly powerful. But that creates an interesting challenge. If machines can answer more questions… will humans continue to ask better questions? That may become one of the most important skills of the future. Don't compete with machines at what machines do best. Use them. Question them. Work with them. And most importantly… imagine things that don't exist yet. And What Would G.D. Naidu Do With Today's Technology? This is the question that fascinates me the most. Imagine taking the young G.D. Naidu from his time… and bringing him into today's world. Give him a smartphone. Give him the internet. Give him AI. Give him a modern laboratory. Give him a 3D printer. Give him access to universities and research from around the world. Give him today's manufacturing technology. What would he build? What problem would he notice first? What machine would he take apart? What technology would he try to improve? What new invention would he imagine? We don't know. But perhaps that is exactly the point. Because the world he lived in had limited technology… but enormous curiosity. We live in a world where technology is abundant. So perhaps our biggest challenge is to make sure… our curiosity doesn't become scarce. The Biggest Lesson From G.D. Naidu When we talk about G.D. Naidu, we often talk about his inventions. But perhaps his greatest contribution was something bigger. He showed that learning doesn't have to stop with a textbook. That curiosity can become knowledge. Knowledge can become skill. Skill can become innovation. And innovation can create opportunities for an entire society. His legacy also reminds us that innovation is not only about inventing things. It is about creating a culture of learning, experimentation and problem-solving. That is why his story is still relevant. Not only for engineers. Not only for inventors. Not only for students. For every generation. Because every generation gets better technology than the previous one. But technology alone doesn't guarantee progress. People do. People who question. People who learn. People who experiment. People who build. People who solve problems. People who look at the world and say: “This can be better.” That is perhaps the real lesson G.D. Naidu leaves for Millennials, Gen Z and Gen Alpha. We don't need everyone to become an inventor. But we need every generation to develop the mindset of an inventor. To observe. To question. To learn. To experiment. To create. And finally… to leave the world a little better than we found it. G.D. Naidu lived in a time when technology was scarce, but curiosity was abundant. We live in a time when technology is abundant. So the real question is… Can we make sure our curiosity remains abundant too? Written by Sreekanth Damacharla Ideas for a Better India
  ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..? తెలంగాణ రాజకీయ రంగంలో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకులు అందరూ పాల్గొని, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. గత మూడు రోజులుగా శాసనసభ ప్రాంగణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న హైడ్రామా, నాటకీయ పరిణామాలు మరియు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వైఖరిపై ప్రభుత్వం ప్రజల నాడిని పట్టేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫ్లాష్ సర్వే ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నేతల ముందుంచడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, పాలనా విధానాలకు ప్రజల నుంచి పూర్తి స్థాయి సానుకూలత లభిస్తోందని, కాంగ్రెస్ పరిపాలనపై ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదని సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా జరిగిన పరిణామాలు, ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, స్పీకర్ పదవిని కించపరిచేలా జరిగిన వ్యాఖ్యలు  ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద చోటుచేసుకున్న శుద్ధీకరణ వివాదాస్పద ఘటనలను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల, రాజ్యాంగబద్ధ పదవుల పట్ల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో, అలాగే ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎర్రవల్లి ఘటనపై మంత్రులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని, చట్టపరమైన చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇంచార్జ్‌లు అందరూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించి బలంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియా  డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. ఈ ఫ్లాష్ సర్వే రిపోర్ట్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుండగా, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.       [ CM Revanth Reddy, flash survey, BRS party, CLP meeting, Telangana news, Congress government,Telangana goverment, KCR, KTR, BRS Party, Telugu One, Telugu News ]  
ALSO ON TELUGUONE N E W S
  రోమాలు నిక్కబొడుచుకునే పాటలకి, చక్కిలి గింతపెట్టే పాటలకి, మండే ఎండల్ని సైతం మంచు బిందువులుగా మార్చే పాటలకి కేర్ ఆఫ్ అడ్రస్స్ ఎవరంటే సుద్దాల అశోక్ తేజ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ఆర్ఆర్ లోని 'కొమరం భీముడో', ఖుషిలోని 'గజ్జె గళ్ళు మన్నాదిరో', శివాజీ లోని 'సహానా శ్వాసే వీచెనో... సహారా పువ్వై పూచెనో' సాంగ్స్ జస్ట్ స్మాల్ ఎగ్జామ్ ఫుల్. ఠాగూర్ లోని 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను' సాంగ్ కి   జాతీయ అవార్డు అందుకున్నసుద్దాలకి మరొక ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఆయన సుదీర్ఘ సాహిత్య సేవలకు, ప్రజా చైతన్యానికి అందించిన అమూల్యమైన రాతలకు గుర్తింపుగా 2026 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి "బుర్రా నర్సమ్మ-లింగా రెడ్డి స్మారక తెలంగాణ తెలుగు తేజం" సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు భాషా సంరక్షణ సంఘం  తెలంగాణ సాహితీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రకటించారు. పురస్కార ఎంపిక కమిటీ ఛైర్మన్ కెప్టెన్ బుర్రా మధుసూదన్ రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కార ప్రధానోత్సవం ఈ నెల 22న కరీంనగర్ పట్టణంలోని ఫిల్మ్ భవన్ ప్రాంగణంలో వైభవంగా జరగనుంది. సివిల్ సప్లైస్ డైరెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై సుద్దాల అశోక్ తేజకు జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతిని అందజేయనున్నారు. గతంలో 2025 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిద్దారెడ్డికి ఈ పురస్కారాన్ని అందజేయడం విశేషం.   Also Read: సంక్రాంతి రేసులో విశ్వంభర:  కాకా పరిస్థితి ఏంటి.. రిలీజ్ డేట్ వచ్చింది కదా! కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి, బండలింగాపూర్ వంటి గ్రామాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సుద్దాల అశోక్ తేజ, ఆ తర్వాత సినీ రంగానికి వచ్చి తన అక్షర విన్యాసంతో తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేశారు. ఇప్పటివరకు ఆయన 1250కి పైగా చిత్రాలకు 2200కి పైగా సినీ గీతాలు రాయడమే కాకుండా, 2500కి పైగా ప్రైవేటు, జానపద గేయాలను రచించి తెలుగు రసజ్ఞులను అలరించారు. శ్రీశ్రీ, వేటూరి సుందరరామమూర్తిల తర్వాత జాతీయ ఉత్తమ గేయ రచయిత అవార్డుని  అందుకున్న  మూడవ తెలుగు గేయ రచయితగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా 2017లో 'ఫిదా' చిత్రంలోని "వచ్చిందే" పాటకూ, 2025 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా కోటి రూపాయిల నగదు పురస్కారం సహా అనేక అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి సన్మానాలను అందుకున్నారు. సుద్దాల హన్మంతు, జానకమ్మల కడుపున జన్మించి, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని రక్తం నిండా నింపుకున్న అశోక్ తేజ, తన కలాన్ని నిరుపేదల చైతన్యానికి, ప్రకృతి ప్రేరణకు, బహుజన సంస్కృతికి అంకితం చేశారు. 'ఒసేయ్ రాములమ్మ', 'నిన్నే పెళ్లాడుతా' చిత్రాలతో మొదలైన ఆయన ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా సాగుతోంది. ఈ సందర్భంగా పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, అభిమానులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.        [Suddala Ashok Teja, Telangana Telugu Tejam Award, Karimnagar Event, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]    
'ప్రేమమ్' సినిమాతో సౌత్ ఇండియా అంతటా క్రేజ్ సంపాదించుకున్న మలయాళ హీరో నివిన్ పాలీ.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఇక "నివిన్ పాలీ కెరీర్ ముగిసిపోయింది" అంటూ ట్రోల్ చేసిన వారు కూడా ఉన్నారు. ఆ ట్రోల్స్ కు సమాధానం చెపుతూ గతేడాది 'సర్వం మాయ'తో కంబ్యాక్ ఇచ్చిన నివిన్.. ఈ ఏడాది 'బెత్లెహెం కుటుంబ యూనిట్'తో తన అసలుసిసలు బాక్సాఫీస్ స్టామినా చూపించాడు. ఆగస్ట్ 21న థియేటర్లలోకి వచ్చిన 'బెత్లెహెం కుటుంబ యూనిట్' చిత్రం ఇప్పుడు మలయాళ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 'ప్రేమలు' దర్శకుడు గిరీష్ ఎ.డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ రొమాంటిక్ కామిడీ ఎంటర్‌టైనర్, బాక్సాఫీస్ వద్ద కేవలం కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. ఒక సునామీనే సృష్టించింది. ఇంతకుముందు కేరళ స్టేట్ ఆల్-టైమ్ రికార్డుగా ఉన్న 'వాలా 2' సాధించిన రూ.129.5 కోట్లను దాటేసి.. రూ.130 కోట్లతో కేరళ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన నంబర్ 1 సినిమాగా 'బెత్లెహెం కుటుంబ యూనిట్' నిలిచింది. కేవలం కేరళలోనే 80 లక్షల మందికి పైగా ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూశారు. బుక్ మై షో లోనే ఏకంగా 55 లక్షల టికెట్లు అమ్ముడై, ఒక మలయాళ సినిమా సాధించిన సరికొత్త ఆల్-టైమ్ రికార్డును సెట్ చేసింది. ఇక వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వైపు దూసుకెళ్తోంది. 'లోక పార్ట్ 1: చంద్ర' తర్వాత 300 కోట్ల క్లబ్‌లో చేరబోతున్న రెండో మలయాళ చిత్రంగా నిలవనుంది. త్వరలోనే 'లోక పార్ట్ 1: చంద్ర' కలెక్షన్స్ ను కూడా దాటేసి, మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాలో నివిన్ పాలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, గిరీష్ ఎ.డి మార్క్ క్లీన్ అండ్ నాచురల్ హ్యూమర్ ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేసాయి. ఒక సాదాసీదా కుటుంబ కథ, మన పక్కింట్లో జరిగే సరదా సంఘటనలు, గుండెకు హత్తుకునే ప్రేమానురాగాలు.. వీటినే దర్శకుడు ఎంతో అందంగా తెరకెక్కించాడు. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు.       Bethlehem Kudumba Unit Movie, Kerala Industry Hit, Malayalam Highest Grossing Movies, Nivin Pauly, Mamitha Baiju, Girish AD, Vaazha 2 Collections, Telugu Film News, Telugu News  
    విశ్వంభర vs  కాకా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండింటి మధ్య పోటీ ఏర్పడబోతుందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైగా కాకా సంక్రాంతి బరి నుంచి వెనక్కి వెళ్లనుందనే టాక్ సైతం సోషల్ మీడియాని ఉక్కిరిబిక్కిరి కి గురి చేస్తుంది.  తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘విశ్వంభర’ని  వచ్చే సంక్రాంతి బరిలో దించేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్. 2025  సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన 'విశ్వంభర' ఇప్పటికే ఎన్నో వాయిదాలని ఎదుర్కొంటు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఓటిటి ఒప్పందం కుదిరిందని, సదరు ఓటిటి కంపెనీ డిమాండ్ ప్రకారం సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిందే అన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. దీంతో కాకా సంక్రాంతి డేట్ మారబోతుందని జోరుగానే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాకా రిలీజ్ డేట్ జనవరి 13 అని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.     Also Read: గురువాయూర్ లో పవన్ కళ్యాణ్: ఫ్యాన్స్ దెబ్బకి సోషల్ మీడియా షేక్     ఆ లెక్కన  ‘విశ్వంభర’ కూడా సంక్రాంతి బరిలోకి వస్తే.. రెండు మెగా చిత్రాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సాధ్యమవుతుందా? అనేదే పెద్ద  ప్రశ్న తలెత్తుతోంది. ఏది ఏమైనా చిరుతో పాటు రెండు చిత్రాల మేకర్స్ ఈ విషయంపై అధికారకంగా ముందు ముందు స్పందించే అవకాశం ఉంది.        [Chiranjeevi, kaaka, Vishwambhara, Release dates, Sankranthi, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]
Reassemble for the epic conclusion of the Infinity Saga on the big screen on 25th September across English, Hindi, Tamil and Telugu in all premium formats. Marvel Studios opens bookings for Avengers Endgame: Encore for IMAX, Marvel Studios Presented In Infinity Vision, and premium formats including 4DX, MX4D, SCREEN X, DOLBY VISION, HDR BARCO, ICE, ahead of its theatrical release. Returning to Indian cinemas in English, Hindi, Tamil, and Telugu, Avengers Endgame: Encore will let audiences experience one of the most monumental cinematic events of all time on the big screen once again. The movie includes an exclusive look at the highly anticipated Avengers: Doomsday , which arrives in cinemas on 18th December 2026.  For fans looking to experience Avengers Endgame: Encore at its most spectacular, the film will be presented in IMAX, Marvel Studios Presents Infinity Vision, and other premium large formats. Infinity Vision-certified screens guarantee audiences an exceptional cinematic presentation, with larger screens, brighter images, and outstanding sound. In Avengers Endgame: Encore, after devastating events wiped out half the world’s population, the remaining heroes struggle to move forward. Ultimately, they must come together to restore order and harmony in the universe and bring their loved ones back in a dramatic showdown against Thanos. The film is produced by Kevin Feige and directed by Anthony and Joe Russo. Louis D’Esposito, Victoria Alonso, Michael Grillo, Trinh Tran, Jon Favreau, James Gunn, and Stan Lee serve as executive producers.  Marvel Studios’ Avengers Endgame: Encore releases in IMAX, Marvel Studios Presented In Infinity Vision, and premium formats including 4DX, MX4D, SCREEN X, DOLBY VISION, HDR BARCO, ICE in English, Hindi, Tamil and Telugu on 25th September. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ఎవరకి ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ నెల 2 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రీ రిలీజైన పంజా మూవీలో 'ఓజి 2 'ఉందనే విషయాన్నీ చిన్న వీడియో ద్వారా తెలియచేసారు. పవన్ నే ఓజి 2 ని సొంతంగా నిర్మిస్తుండటంతో త్వరగా స్టార్ట్ అయ్యి, త్వరగా తమ ముందుకు రావాలని కోరుకుంటున్నారు. దర్శకుడు సుజిత్ అయితే పవన్ డేట్స్ కోసం సిద్ధంగా ఉన్నాడని ఫిలిం సర్కిల్ టాక్.  పవన్ రీసెంట్ గా కేరళ రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని (గురువాయూరప్ప దేవస్థానం) దర్శించుకున్నారు. కేరళలో ప్రకృతి వైద్య చికిత్సతో పాటు ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్, సంప్రదాయ దుస్తులైన తెల్లటి పట్టు వేష్టి (ధోతీ) ధరించి ఈ రోజు వేకువజామున 3:00 గంటల సమయానికే ఆలయానికి చేరుకొని  సంప్రదాయాలను పూర్తీగా గౌరవిస్తూ, పవిత్ర నియమ నిబంధనలకు అనుగుణంగా శ్రీ గురువాయూరప్ప దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.     Also Read: సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం: మీకు తెలిసిన వ్యక్తే.. ఏం దోచాడో తెలిస్తే షాక్ అవుతారు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పవన్ పిక్స్ వైరల్ గా మారాయి. అభిమానుల లైక్స్ తో అయితే సోషల్ మీడియా క్రాష్ అయ్యే పరిస్థితి.      [Pawan Kalyan, Guravayur, SriKrishna Mandir, Og2, Sujeeth, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో చెలరేగిన వివాదంపై కూకట్‌పల్లిలోని రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసోసియేషన్ పేరుతో నకిలీ పత్రాలు, లెటర్ హెడ్లు సృష్టించడాన్ని నిరోధించడంతో పాటు, సెప్టెంబర్ 13న నిర్వహించతలపెట్టిన జనరల్ బాడీ సమావేశాన్ని నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఇంజంక్షన్ (స్టే) విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం వి.వి. సుమలతా దేవి అధ్యక్షతన 2025-2027 కాలపరిమితికి ఎన్నుకోబడిన కార్యవర్గం చట్టబద్ధంగా కొనసాగుతున్నప్పటికీ, కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా అసోసియేషన్ నిర్వహణను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. బైలా నిబంధనల ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఆగస్టు 30న అనధికారికంగా సమావేశం ఏర్పాటు చేసి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించుకున్నారని విమర్శించారు. అంతటితో ఆగకుండా, అసోసియేషన్ అధికారిక ఈమెయిల్ ఐడీని హ్యాక్ చేసి, జూబ్లీహిల్స్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు ఫోర్జరీ లేఖలు పంపి బ్యాంక్ సంతకాలు మార్చేందుకు యత్నించారని ఆరోపించారు. సభ్యుల సంక్షేమం కోసం కేటాయించిన సుమారు 4 కోట్ల రూపాయల నిధులను, అసోసియేషన్ భవిష్యత్తును కాపాడటానికి తక్షణమే న్యాయపరమైన జోక్యం అవసరమని బాధితుల తరఫున కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 13న ఇందిరా నగర్‌లోని హోటల్ అనుపమలో మరో సమావేశం నిర్వహించేందుకు ప్రతివాదులు యత్నిస్తున్నారని తెలిపారు. పిటిషనర్ సమర్పించిన సాక్ష్యాధారాలు, పోలీస్ ఫిర్యాదుల కాపీలను పరిశీలించిన జడ్జి శ్రీమతి కావ్య జాడ, ప్రతివాదుల చర్యలను ప్రాథమికంగా తప్పుబడుతూ ఆదేశాలు జారీ చేశారు. కే రాఘవేంద్ర, వై మెహర్ బాబాతో పాటు ఇతర ప్రతివాదులు సెప్టెంబర్ 13న ఎలాంటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించకూడదని స్పష్టం చేశారు. అలాగే అసోసియేషన్ ముద్రలు, లెటర్ హెడ్లు వాడటంపై మరియు బ్యాంకులు, ఇతర అధికారులకు ఎలాంటి లేఖలు రాయకుండా వారిపై నిషేధం విధిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేస్తూ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.       [Dancers Association Dispute, Dancers Association Controversy, TFTDDA, Sumalatha, Kukatpally Court, Telugu Film News, Telugu News]  
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'రణబాలి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'రణబాలి' ఒక సాధారణ పీరియాడిక్ ఫిల్మ్ కాదు. చరిత్రలో దాగిన కొన్ని చీకటి పేజీల కథ. 1876 నుండి 1878 వరకు దక్షిణ భారతదేశాన్ని పట్టి పీడించిన 'గ్రేట్ మద్రాస్ ఫామైన్' (కరువు) నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. వర్షాలు పడక, పంటలు పండక ప్రజలు అల్లకల్లోలమైపోయారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కరువు రక్కసి కోరల్లో చిక్కుకుని నలిగిపోయింది. ఒక్క రాయలసీమలోనే దాదాపు ఏడు లక్షల మంది ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఒక వైపు జనం తిండిలేక నకనకలాడిపోతుంటే, అప్పటి బ్రిటిష్ పాలకులు మాత్రం మన దేశం నుంచి ధాన్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూనే ఉన్నారు. సర్ రిచర్డ్ టెంపుల్ అనే బ్రిటిష్ అధికారి కరువు నివారణ క్యాంపులను నిర్వహించాడు. కానీ ఆ క్యాంపుల్లో ఇచ్చే ఆహారం జైలు ఖైదీలకు ఇచ్చే తిండి కంటే కూడా తక్కువ కేలరీలు ఉండేది. దాంతో జనం ఆకలితో అస్థిపంజరాల్లా మారి చనిపోయారు. ఈ క్రూరమైన పాలనను, పన్నుల వసూళ్లను చూసి తట్టుకోలేకపోయిన రాయలసీమ ప్రజలు చివరకు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆకలితో ఉన్న తమ బిడ్డల కోసం ధాన్యపు గిడ్డంగులపై దాడి చేశారు, పన్నులు కట్టేది లేదని తెగేసి చెప్పారు. చరిత్ర పుస్తకాల్లో బ్రిటిష్ పాలకులు వీరిని ‘నేరస్థులు’గా ముద్రవేశారు. కానీ రాయలసీమ జానపద కథల్లో, చరిత్రలో వీరు అమరవీరులుగా నిలిచిపోయారు. ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన ఒక వీరుడి కథే ఈ 'రణబాలి'. విజయ్ దేవరకొండ ఇందులో రాయలసీమ పోరాట వీరుడిగా కనిపిస్తుంటే, రష్మిక జయమ్మ అనే వీరనారి పాత్రలో నటిస్తోంది. అలాగే హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో బ్రిటిష్ అధికారిగా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.       [Ranabaali Real Story, Ranabaali Teaser, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Madras Famine, Telugu Film News, Telugu News]  
    ఆనందాన్ని ఎవరు కోరుకోరు అనే లెక్కనే, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటే కాదనే వారెవరు ఉంటారు చెప్పండి. పైగా వాళ్ళు అడక్కుండానే మీకు ఏం కావాలో అని అడిగే అమాయకపు సినీ పిచ్చి పట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే తామని తాము సెల్యులాయిడ్ పై చూసుకొని మురిసిపోవాలనే ఏకైక లక్ష్యమే అజెండా. అందుకే మోసాన్ని గ్రహించలేరు. చివరకి మోసపోతారు. రీసెంట్ గా ఈ కోవలోనే హైదరాబాద్ నగరంలో ఒక సంఘటన జరిగింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ శివం రోడ్డులో ఉన్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శివ కుమార్ గౌడ్ సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని లక్షల రూపాయిల డబ్బులు వసూలు చేసాడు. కానీ అవకాశాలు ఇప్పించకపోవడంతో  శివ కుమార్ గౌడ్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు సినిమా డిస్ట్రిబ్యూటర్ తమకి  టాలీవుడ్ చిత్రాలలో కీలక పాత్రలతో పాటు విభిన్నమైన అవకాశాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చాడు  ఆ మాటలు నిజమేనని నమ్మి, 10 మందికి పైగా  50 లక్షలకు పైగా నగదుని  డిస్ట్రిబ్యూటర్‌కి  విడతల వారీగా చెల్లించాం . అయితే, నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరికీ సినిమాలో అవకాశం రాకపోవడం, అడిగితే రకరకాల వంకలు చెబుతూ కాలయాపన చేస్తున్నాడు. తాము చెల్లించిన సొమ్మును తిరిగి ఇచ్చేయాలని గట్టిగా నిలదీయగా, డిస్ట్రిబ్యూటర్ బాధ్యతారాహిత్యంగా సమాధానమివ్వడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు దిగుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.     Also Read: అదరగొట్టిన ఫస్ట్ డే కలెక్షన్స్: జై మహేంద్రగిరి వారాహి!  సమాచారం అందుకున్న అంబర్‌పేట్ స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులను శాంతింపజేసి, ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని, బాధిత వ్యక్తుల నుంచి రాతపూర్వక ఫిర్యాదు స్వీకరించి   కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఏది ఏమైనా డబ్బు ఇస్తే అవకాశాలు రావు. . రచయిత, డైరెక్టర్ మైండ్ లో ఉన్న క్యారక్టర్ కి మీరు సెట్ అవ్వాలి. అంతకంటే ముందు మీకు యాక్టింగ్ వచ్చి ఉండాలి. ఎందుకంటే సినిమా అనేది మీ చుట్టాలు చూస్తే ఆడదు కదా!        [Tollywood , Film Opportunity, Distributor, Amberpeta, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  ప్రశాంతమైన నిద్ర మానవ ఆరోగ్యానికి అత్యంత ఆవశ్యకమైన నిధి. రాత్రంతా హాయిగా, ఎటువంటి ఆటంకం లేకుండా నిద్రపోతేనే మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా, చురుగ్గా పనులు చేసుకోగలుగుతాం. అయితే చాలామందికి రాత్రివేళల్లో హఠాత్తుగా మెలకువ రావడం, ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం వంటి తీవ్రమైన సమస్య వేధిస్తుంటుంది. రాత్రి సమయం ముఖ్యంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ వచ్చి మళ్లీ గంటల తరబడి నిద్ర కోసం తల్లడిల్లడం మనం చాలామందిలో గమనిస్తుంటాం. దీనిని కేవలం ఒక సాధారణ అలవాటుగానో లేదా ఏదో చిన్న నిద్రలేమి సమస్యగానో భావించి నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. నిద్ర మధ్యలో పదే పదే మెలకువ రావడానికి మన జీవనశైలితో పాటు శరీరంలో అంతర్గతంగా ఉండే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణాలు కావచ్చు. ఈ సమస్యకు మొదటి మరియు అత్యంత ప్రధానమైన కారణం విపరీతమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్) మరియు ఆందోళన. మనసులో ఏవైనా ఆందోళన కలిగించే ఆలోచనలు ఉన్నప్పుడు, మన శరీరంలో  కోర్టిసాల్  అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు రాత్రి సమయంలో ఒక్కసారిగా పెరుగుతాయి. సాధారణంగా నిద్రపోతున్నప్పుడు తగ్గే ఈ హార్మోన్, మానసిక ఒత్తిడి వల్ల అర్ధరాత్రి వేళ హెచ్చుతగ్గులకు లోనై మెదడును తక్షణమే మేల్కొలిపేస్తుంది. అంతేకాకుండా, రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ ఉన్న పదార్థాలను తీసుకోవడం కూడా నిద్ర భంగానికి ప్రధాన కారణం. కెఫిన్ ప్రభావం శరీరంలో దాదాపు 6 నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను దెబ్బతీసి, గాఢ నిద్రలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. మరొక ముఖ్యమైన కారణం నిద్రపోయే ముందు భారీగా ఆహారం తీసుకోవడం లేదా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు. రాత్రి వేళ ఆలస్యంగా, ముఖ్యంగా కొవ్వులు మరియు కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిని వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లేదా అసిడిటీ సమస్య తలెత్తుతుంది. కడుపులోని ఆమ్లాలు పైకి రావడం వల్ల గుండెల్లో మంట, అసౌకర్యం కలిగి రాత్రిపూట ఉలిక్కిపడి లేస్తుంటారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్ లెవల్స్) హఠాత్తుగా పడిపోవడం వల్ల కూడా నిద్ర మధ్యలో మెలకువ వస్తుంది. రాత్రి సమయంలో రక్తంలో గ్లూకోజ్ తగ్గగానే, దాన్ని సరిచేయడానికి శరీరం అడ్రినలిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది గుండె వేగాన్ని పెంచి మనకు మెలకువ వచ్చేలా చేస్తుంది. రాత్రివేళ పదే పదే మెలకువ రావడానికి  స్లీప్ ఆప్నియా  అనే భయంకరమైన శ్వాసకోశ సమస్య కూడా కారణం కావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో నిద్రపోతున్నప్పుడు గొంతు కండరాలు సడలిపోవడం వల్ల గాలి పీల్చుకోవడం కొన్ని సెకన్ల పాటు నిలిచిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, ఊపిరి ఆడక మెదడు రక్షణ చర్యగా శరీరాన్ని వెంటనే మేల్కొలుపుతుంది. వీటితో పాటు రాత్రిళ్లు తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం (నాక్టూరియా), పడుకునే గదిలో ఎక్కువ వెలుతురు ఉండటం, తీవ్రమైన ఉష్ణోగ్రత లేదా ధ్వనులు ఉండటం కూడా నిద్రకు విఘాతం కలిగిస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే రాత్రి పూట లలితమైన ఆహారం తీసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం మరియు తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందడం చాలా అవసరం.         [Sleep Problems, Sleep Disorders, Night Waking, Insomnia, Stress and Anxiety, Caffeine, Acid Reflux, Blood Sugar, Sleep Apnea, Healthy Sleep]  
మన వంటింట్లో సులభంగా మరియు తక్కువ ధరకు లభించే ఆకుకూరల్లో పాలకూర అత్యంత విలక్షణమైనది. మార్కెట్లో అత్యంత చవకగా లభించినప్పటికీ, ఇది శరీరానికి అందించే పోషక విలువలు మాత్రం ఎంతో అమూల్యమైనవి. నేటి ఆధునిక జీవనశైలిలో విపరీతమైన కాలుష్యం, పోషకాహార లోపం మరియు రసాయన ఆహారాల కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. ఈ క్రమంలో నిత్యం మన ఆహారంలో పాలకూరను భాగం చేసుకోవడం వల్ల ఎటువంటి ఖరీదైన మందులు లేకుండానే పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందే వీలుంది. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, ఫోలేట్, కాల్షియం మరియు పొటాషియం వంటి అపరిమితమైన పోషకాలు దాగై ఉన్నాయి. దీనితో పాటు శరీర కణాలను దృఢంగా మార్చే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. పాలకూరను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల లభించే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన ప్రయోజనం కంటి చూపు మెరుగుపడటం. పాలకూరలో ల్యూటిన్ మరియు జియాజాంతిన్ అనే రెండు ప్రధాన యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను అరికట్టడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ల ముందు గంటల తరబడి పనిచేసే వారికి ఇది డిజిటల్ స్క్రీన్ల వల్ల కంటిపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. కంటి చూపు మందగించకుండా కాపాడటంతో పాటు దృష్టిని మరింత స్పష్టంగా మారుస్తుంది. అలాగే విటమిన్ ఏ పుష్కలంగా ఉండటం వల్ల రేచీకటి వంటి సమస్యలను కూడా ఇది నిరోధిస్తుంది.   రక్తహీనత లేదా ఎనీమియాతో బాధపడే వారికి పాలకూర ఒక అద్భుతమైన దివ్యౌషధం. ఇందులో ఐరన్ శాతం సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల (RBC) ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడి నీరసం, అలసట మరియు తల తిరగడం వంటి సమస్యలు మాయమవుతాయి. అంతేకాకుండా, పాలకూరలోని నైట్రేట్లు రక్తనాళాలను విస్తరించి రక్తప్రసరణ సులభంగా జరిగేలా చేస్తాయి. దీనివల్ల అధిక రక్తపోటు (బిపి) అదుపులోకి వచ్చి, గుండెపోటు మరియు పక్షవాతం వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో మరియు బరువు అదుపులో ఉంచడంలో పాలకూర ఎంతో తోడ్పడుతుంది. ఇందులో కరిగే మరియు కరగని నార పదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారించడమే కాకుండా, పేగుల ఆరోగ్యాన్ని క్షణాల్లో మెరుగుపరుస్తుంది. పాలకూరలో కేలరీలు అత్యంత తక్కువగా మరియు నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ డైట్ ఫుడ్. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా అడ్డుకుంటుంది. చర్మ సౌందర్యం మరియు ఎముకల దృఢత్వానికి కూడా పాలకూర ఒక వరప్రసాదంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కే మరియు కాల్షియం ఎముకల సాంద్రతను పెంచి, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. పాలకూరలోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. కాబట్టి రోజువారీ పప్పులు, సూప్‌లు, స్మూతీలు లేదా కూరల రూపంలో పాలకూరను క్రమం తప్పకుండా తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఖాయం.       [Spinach, Spinach Benefits, Eye Health, Iron Rich Foods, Anemia, Heart Health, Blood Pressure, Digestive Health, Bone Health, Healthy Diet]
  నేటి వేగవంతమైన జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం మరియు పెరిగిన కాలుష్యం కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరినీ తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. తల దువ్వుకున్న ప్రతిసారీ గుప్పెడు జుట్టు చేతికి రావడం, వెంట్రుకలు పల్చబడిపోవడం లేదా కాలక్రమేణా కుదుళ్లు బలహీనపడటం చాలామందిలో ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే ఖరీదైన కెమికల్ షాంపూలు, నూనెలు లేదా రకరకాల హెయిర్ ట్రీట్‌మెంట్ల వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ, ఇవన్నీ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి మరియు కొన్నిసార్లు జుట్టుకు మరింత హాని కలిగిస్తాయి. అయితే మన సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎటువంటి పార్శ్వ ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) లేకుండా ఇంట్లోనే జుట్టును సహజంగా ఒత్తుగా, బలంగా మార్చే అద్భుతమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా మన వంటింట్లో నిత్యం లభించే నల్ల నువ్వులు జుట్టు ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తాయి. మన పూర్వీకుల కాలం నుంచి నల్ల నువ్వులను ఆరోగ్యానికి మరియు కేశ సంరక్షణకు ఒక మహోన్నతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. నల్ల నువ్వులలో కేవలం ఆకలిని పెంచే గుణాలు మాత్రమే కాకుండా జుట్టుకు అవసరమైన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తలలో రక్త ప్రసరణను గణనీయంగా పెంచి, కుదుళ్లను లోపలి నుంచి దృఢంగా మారుస్తాయి. ముఖ్యంగా జుట్టు విరిగిపోకుండా అడ్డుకోవడంలోనూ, చివర్లు విడిపోకుండా చూడటంలోనూ నల్ల నువ్వులు అద్భుతంగా తోడ్పడతాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా అర టీస్పూన్ నల్ల నువ్వులను నమలి తినడం లేదా రాత్రి వేళ నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో పాటు నువ్వులను తీసుకోవడం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు అంతర్గతంగా లభిస్తాయి. నల్ల నువ్వులను కేవలం ఆహారంగా తీసుకోవడమే కాకుండా, వాటితో ప్రత్యేకమైన హెయిర్ ఆయిల్ తయారుచేసి తలకు పట్టించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. దీని కోసం గుప్పెడు నల్ల నువ్వులను తీసుకుని శుభ్రమైన కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో వేసి చిన్న మంటపై బాగా వేడెక్కించాలి. నువ్వులలోని సారం మొత్తం నూనెలోకి దిగి, నూనె రంగు మారేంత వరకు మరగబెట్టాలి. ఆ తర్వాత ఆ నూనెను చల్లార్చి వడకట్టి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పవిత్రమైన మూలికా నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు తలకు రాసి, చేతి వేళ్లతో తలపైన కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు తేలికపాటి మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల మాక్యులేషన్ పెరిగి వెంట్రుకల కుదుళ్లకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. ఈ నూనె మసాజ్ చేసిన గంట తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం రసాయనాలు లేని కుంకుడుకాయలు లేదా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా ఈ చిట్కాను రెండు నుంచి మూడు నెలల పాటు పాటిస్తే జుట్టు రాలడం గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, పల్చబడిన చోట కొత్త వెంట్రుకలు రావడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా నల్ల నువ్వులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు చిన్న వయస్సులోనే తెల్లబడకుండా కాపాడతాయి. సహజమైన కాంతిని, నిగనిగలాడే నలుపును జుట్టుకు ప్రసాదిస్తాయి. కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే లభించే ఈ నల్ల నువ్వుల ఉపాయాన్ని పాటించి, ఆరోగ్యకరమైన, దృఢమైన మరియు ఒత్తైన జుట్టును మీ సొంతం చేసుకోండి.       [Black Sesame Seeds, Hair Fall, Hair Growth, Hair Care, Hair Loss Remedies, Ayurvedic Hair Care, Hair Oil, Healthy Hair, Scalp Massage, Natural Hair Care]
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు. ఇది సాధారణ కీళ్ల నొప్పులతో పోలిస్తే భిన్నమైన ఆటో ఇమ్యూన్ సమస్య. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదం పనిచేస్తుందా? ఇంగ్లీష్ మెడిసిన్ తప్పనిసరా? కొన్ని సందర్భాల్లో సంప్రదాయ వైద్య చికిత్స అవసరం లేదా? ఆటో ఇమ్యూన్ కీళ్ల సమస్యల్లో ఆయుర్వేదాన్ని ఎందుకు కొందరు నిపుణులు సిఫారసు చేయరు? ఫంక్షనల్ మెడిసిన్ విధానం ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ వీడియోలో Acupuncture మరియు Functional Medicine నిపుణులు డా. పి.ఎస్. సాగర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సంబంధించిన వివిధ చికిత్సా విధానాల గురించి వివరిస్తున్నారు. ఆయుర్వేదం, కన్వెన్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్ మధ్య ఉన్న తేడాలు, వాటి విధానాలు, పరిమితులు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో చికిత్సను ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన అంశాల గురించి తెలుసుకోండి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య పరిస్థితికి సరైన చికిత్సను నిర్ణయించుకునే ముందు అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు. బొజ్జ గణపయ్యకు పెట్టే ప్రసాదాలు కేవలం సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు, వాటి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు ఆ కాలానికి తగినట్లుగా, శరీరానికి మేలు చేసే పదార్థాలనే వినాయకుడి ప్రసాదాలుగా మార్చారు. ఆ ప్రసాదాలు ఏమిటి, వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. కుడుములు , ఉండ్రాళ్ళు.. వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కుడుములు, ఉండ్రాళ్ళు. వీటిని నూనె లేకుండా కేవలం ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తారు. ఆవిరి మీద ఉడికే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉంటాయి. బియ్యపు పిండి, పెసరపప్పు లేదా శనగపప్పు, బెల్లం, కొబ్బరి కలగలిపి వీటిని తయారుచేస్తారు. బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆవిరి వంటకం కావడం వల్ల జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పొట్టలో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. కొందరు కుడుములను మైదా పిండితో నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తారు. ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు.   బెల్లం , పప్పుధాన్యాల కాంబినేషన్.. అన్ని రకాల ప్రసాదాలలో బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. కుడుముల్లో వాడే శనగపప్పు, పెసరపప్పుల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వర్షాకాలంలో పెరిగే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి బెల్లం, పప్పుధాన్యాల కాంబినేషన్ శరీరానికి మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది. జిల్లేడు కాయలు , మోదకాలు.. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలను బియ్యపు పిండిలో బెల్లం, కొబ్బరి పూరకంతో చేస్తారు. కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు చర్మానికి, జుట్టుకు చాలా మంచివి. అంతేకాకుండా కొబ్బరి శరీరానికి అవసరమైన శక్తిని త్వరగా అందిస్తుంది. కొబ్బరి , బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు, వాత రోగాల నివారణకు  ఈ కాంబినేషన్ చక్కగా తోడ్పడుతుంది. పాయసం , పరమాన్నం.. పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే పాయసం నివేదనలో ముఖ్యమైనది. పాలల్లో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. ఇందులో వేసే యాలకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పాయసంలో వాడే నెయ్యి శరీరానికి కావలసిన విటమిన్లు ఎ, డి లభించేలా చేస్తుంది , కీళ్ళకు అవసరమైన నూనెను అందిస్తుంది. పులిహోర.. ఏ పండుగైనా పులిహోర లేకపోతే నివేదన పూర్తికాదు. వినాయక చవితి నాడు నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను ప్రసాదంగా పెడతారు. చింతపండు, నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో విటమిన్ సి లభించడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పుల వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. పులిహోర తాళింపులో వాడే పసుపు సహజమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపులోని కుర్కుమిన్ అనే అంశం శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇందులో వేసే అల్లం, మిరియాలు జీర్ణరసాలను ఉత్పత్తి చేసి ఆకలిని పెంచుతాయి. చలిమిడి , వడపప్పు.. వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత ఇచ్చే ముఖ్యమైన ప్రసాదం చలిమిడి ,   పచ్చి పెసరపప్పును నీటిలో నానబెట్టి వడపప్పుగా ఇస్తారు. నానబెట్టిన పెసరపప్పులో పీచు పదార్థం, ప్రోటీన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి చేసిన బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసే చలిమిడి శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో కలిగే అలసటను నివారించడంలో ఈ  కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. పండ్ల నివేదన , పత్రీ ప్రభావం.. స్వామివారికి ప్రసాదాలతో పాటు రకరకాల పండ్లను సమర్పిస్తారు. ముఖ్యంగా వెలగపండు, నేరేడు పళ్ళు, అరటిపళ్ళు నివేదిస్తారు. వెలగపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపులోని క్రిములను సంహరిస్తుంది. నేరేడు పళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటితో పాటు పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి కూడా ఒక రకమైన ఔషధ గని. పూజ చేసే సమయంలో ఆ పత్రి తాకిడి, వాటి సువాసనల వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విధంగా వినాయక చవితి ప్రసాదాలు కేవలం నైవేద్యం మాత్రమే కాకుండా, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధాలుగా పనిచేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ ప్రసాదాలను తిని, పండుగను భక్తితో పాటు ఆరోగ్యకరంగా జరుపుకోవడం ఆ వినాయకుడు ఇచ్చే అదృష్టం.. !                          *రూపశ్రీ.