తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.  ముందుగా వైసీపీ అధినేత జగన్ ప్లాన్ ఏమిటని చూస్తే..  ఆయన  2027వ సంవత్సరంలో తాను సరికొత్త చారిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు ఆయన బహిరంగంగానే వెల్లడించారు. ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్‌ను రాబోయే కొద్ది నెలల్లోనే వైసిపి శ్రేణులు సిద్ధం చేయనున్నాయి. అయితే ఈసారి జగన్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. 2027లో అడుగు ముందుకు వేస్తే, మళ్లీ 2029 అసెంబ్లీ ఎన్నికల ముగింపు వరకు ఆయన నిరంతరం ప్రజల మధ్యే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్ర ఏపీ రాజకీయ చరిత్రను తిరగరాసి ఆయనకు బంపర్ మెజారిటీని తెచ్చిపెట్టింది. ఇప్పుడు 2026 దాటి 2027 రాగానే అదే మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను పూర్తిగా తన వైపు తిప్పుకోవడానికి ఈ సుదీర్ఘ పాదయాత్రే ఏకైక మార్గమని ఆయన నమ్ముతున్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్  అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు విషయానికి వస్తే.. ఆయన కూడా జగన్ రూట్ నే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయన కూడా ప్రజలతో మమేకం అవ్వడం ద్వారా మళ్లీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే జగన్ పాదయాత్ర ద్వారా ప్రజలలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంటే.. కేసీఆర్ బస్సు యాత్ర అంటున్నారు. అదోక్కటే తేడా మిగతాదంతా సేమ్ టూ సేమ్.  ఇద్దరూ ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికీ.. వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి 2027ను   కీలకంగా భావిస్తున్నారు.     2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపు ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అయితే ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ 2027 ప్రారంభం నుండి కేసీఆర్ సరికొత్త అవతారంలో ప్రజల ముందుకు రానున్నట్లు ఆ పార్టీ కీలక నేత తన్నీరు హరీష్ రావు అధికారికంగా స్పష్టం చేశారు. 2027 నుండి కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చురుకైన పాత్ర పోషించబోతున్నారు. ఇందుకోసం ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గాన్ని తాకుతూ సాగే ఈ బస్ యాత్ర ద్వారా ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గులాబీ బాస్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.  చూడాలి మరి ఏపీలో జగన్ పాదయాత్ర, తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్రలకు జన స్పందన ఎలా ఉంటుందో?
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  స్వయంగా ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదా?  సాధారణంగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లు  నత్తనడకన సాగుతాయని, మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తరచూ ఆరోపిస్తుంటారు. అధికారులు మంత్రుల మాటలను కూడా పెద్ద ఖాతరు చయరన్న విమర్శలూ వినవస్తుంటాయి.  సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ..  క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. విషయమేంటంటే.. వచ్చే ఏడాది  జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పవన్ కళ్యాణ్ ఇటీవల  రాజమహేంద్రవరంలో   పర్యటించారు. ఆ  సందర్భంగా పుష్కర్ ఘాట్ నుంచి పడవలో ప్రయాణిస్తూ గోదావరి నది పరివాహక ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆ పర్యటనలో పవన్ కళ్యాణ్  ఎన్నో పారిశ్రామిక విభాగాలు, ఫ్యాక్టరీల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, నగరంలోని మురుగునీరు,  ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా   గోదావరి నదిలోకి కలిసిపోతుండటాన్ని  గమనించారు. కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పుష్కరాల సమయానికి నది ఇంతలా కలుషితమైతే ప్రజల ఆరోగ్యం ఏమైపోతుందని ఆయన అధికారులను గట్టిగా నిలదీశారు. గోదావరిని కలుషితం చేస్తున్న పరిశ్రమలను తక్షణమే గుర్తించి, వాటికి  నోటీసులు జారీ చేయాలని ఆయన స్థానిక అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. డిప్యూటీ సీఎం స్వయంగా ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ తాజాగా సోమవారం(జూన్ 8)  నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్‌కు తాను ఆదేశాలు ఇచ్చి ఇన్ని రోజులైనా, కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమల్లో కనీసం ఒక్కటంటే  ఒక్క సంస్థకు కూడా అధికారులు ప్రాథమిక నోటీసులు  జారీ చేయలేదని తెలిసింది.  దీంతో పవన్  తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇంతటి సున్నితమైన, ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని సీనియర్ అధికారులపై పవన్ కళ్యాణ్  మండిపడ్డారు. ముఖ్యంగా గోదావరి నదిలోకి శుద్ధి చేయని రసాయన వ్యర్థాలను వదులుతోందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఆంధ్ర పేపర్ మిల్స్ కు తక్షణమే నోటీసులు జారీ చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో పాటు, ఈ వ్యవహారంలో పర్యవేక్షణ లోపించి, బాధ్యతారహితంగా వ్యవహరించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బ్యూరోక్రసీకి ఒక బలమైన హెచ్చరికను పంపారు. గతంలో తాను ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అదే సమయంలో నిబంధనల ప్రకారం పనిచేసే అధికారులకు ఆయన ఒక భరోసానిచ్చారు. కాలుష్య కారక సంస్థలపై లేదా అక్రమార్కులపై చర్యలు తీసుకునేటప్పుడు మీకు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదనీ..  ఆ విషయాలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. అవసరమైతే ఆ ఒత్తిళ్లపై తాను క్యాబినెట్ సమావేశంలోనో,  అసెంబ్లీ వేదికగానో  ప్రశ్నిస్తానని, అధికారులకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా అడ్మినిస్ట్రేషన్ తన పని తాను నిష్పక్షపాతంగా చేయాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో  మిత్ర భేదం  కలకలం రేపుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న  మహాయుతి కూటమిలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఒక  అధికారిక కార్యక్రమం   కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్ర విభేదాలకు కేంద్రబిందువుగా మారింది.  మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో  వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.  ఈ పరిణామం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.   ఈ విమానాశ్రయ ప్రాజెక్టును పర్యవేక్షించే అత్యున్నత ప్రభుత్వ సంస్థ  సీఐడీసీవో  నేరుగా షిండే నేతృత్వంలోని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోనే పనిచేస్తుంది. అయినా..   ఆ శాఖ మంత్రికే  ఆహ్వానం అందకపోవడం సంచలనంగా మారింది.  ఈ  వేడుకను అదానీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ,  సీఐడీసీవో   సంయుక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరై..  20 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహాన్ని  ఆవిష్కరించారు. వేదికపై రాష్ట్ర మంత్రులు గణేశ్ నాయక్, అదితి తత్కరేలు ఉన్నారు. అయితే..  డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ షిండేతో పాటు సునేత్రా పవార్‌లకు కనీసం ఆహ్వానం కూడా అందకపోవడంతో వారు రాలేదు.  దీంతో షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ఆగ్రహంతో రగిలిపోతున్నది.  కొందరు ప్రభుత్వ అధికారులు  రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనీ, ఈ ప్రతిష్ఠాత్మక ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు క్రెడిట్ ఏక్‌నాథ్ షిండేకు దక్కకుండా చేసేందుకేఆయనకు ఆహ్వానం కూడా పంపకుండా  తెరవెనుక  కుట్ర జరిగిందనీ మంత్రి సంజయ్ శిర్సాత్ బహిరంగంగానే  తీవ్ర విమర్శలు గుప్పించారు.   ఈ పరిణామాలపై శివసేన (యూబీటీ)   నేత అంబాదాస్ దాన్వే   మహాయుతి కూటమిలో అసలు ఏక్‌నాథ్ షిండే ప్రాధాన్యత మరియు ఆయన స్థానం ఏంటో ఈ  సంఘటనతో స్పష్టంగా అర్థమవుతోందన్నారు.  కూటమిలో ముసలం   ముదిరిపోయిందన్నారు. ఈ వివాదం మరింత ముదరకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నష్టనివారణ చర్యలకు దిగింది.   ప్రొటోకాల్‌ను   ఉల్లంఘించి, ఉప ముఖ్యమంత్రులను ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి దూరం పెట్టడంపై 24 గంటల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ సీఐడీసీవో, అదానీ ఎయిర్‌పోర్ట్ అథారిటీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా సమీపిస్తున్న తరుణంలో..  క్రెడిట్ రాజకీయం చుట్టూ తిరుగుతున్న ఈ  వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 
ALSO ON TELUGUONE N E W S
    మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)వన్ మాన్ షో శక్తితో పాటు సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం, శుభప్రదం వంటి చిత్రాలతో పాటు పలు హిందీ, తమిళ, కన్నడ సినిమాల్లో చేసి మెప్పించిన హీరోయిన్ మంజరి ఫడ్నిస్. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో చేసింది. సదరు వీడియోలో తాను ప్రాణంగా చూసుకునే శునకాన్ని  ఎవరో ఐరన్ రాడ్‌తో దారుణంగా కొట్టి చంపేశారంటూ బోరున ఏడుస్తుంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మంజరి ఫడ్నిస్ తెలిపిన వివరాల ప్రకారం.. 2019 సంవత్సరంలో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్కని మంజరి ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఆ కుక్కని  అపార్ట్‌మెంట్‌లోని సొసైటీ సభ్యులంతా చేరదీశారు. ఎంతో ముద్దుగా 'మైకీ' అని పేరు పెట్టుకున్నారు. గత 6 నుండి 7 ఏళ్లుగా అంటే 2019-20 కాలం నుండి ఆ కుక్క ఆ అపార్ట్‌మెంట్‌లోనే నివసిస్తూ అందరికీ ఎంతో ఇష్టమైనదిగా మారిపోయింది. ఎంతో సాధువైన మైకీకి నటి మంజరి స్వయంగా స్నానం చేయించడం, గ్రూమింగ్ చూసుకోవడం, ఆహారం తినిపించడం  లాంటివి చేస్తూ తన సొంత కుటుంబ సభ్యునిలా చూసుకునేవారు. మైకీ ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టేది కాదని, సొసైటీలో అందరితో ఎంతో ప్రేమగా ఉండేది. అయితే, కొన్ని రోజుల క్రితం మైకీ హఠాత్తుగా అపార్ట్‌మెంట్ నుండి కనిపించకుండా పోయింది. దాంతో ఆందోళన చెందిన మంజరి, మిగిలిన సొసైటీ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించారు. మైకీ ఫొటోలతో కూడిన మిస్సింగ్ పోస్టర్లని సైతం ముద్రించి వీధుల్లో అంటించారు. అంతా వెతికినా మైకీ ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాతే వారికి అసలు విషయం తెలిసింది. ఒకరోజు బేస్‌మెంట్ ఏరియాలో మైకీ  నిద్రపోతున్న సమయంలో, ఆ అపార్ట్‌మెంట్ సొసైటీకి చెందిన ఒక వ్యక్తి లోహపు రాడ్‌తో (ఐరన్ రాడ్) మైకీపై అత్యంత క్రూరంగా దాడి చేశాడు. ఆ దెబ్బలకి తాళలేక ఆ మూగజీవం అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అంతటితో ఆగకుండా, చనిపోయిన మైకీ మృతదేహాన్ని ఒక గోనె సంచిలో (బోరి) మూటగట్టి, ఎవరికీ తెలియకుండా ఒక ఖాళీ ప్రదేశంలో లేదా ఒక కాలువలో (ఖాడీ) పారేసినట్లు ఘోరమైన నిజం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు మైకీ భౌతికకాయం కూడా లభించలేదని రోదిస్తూ పేర్కొంది. Also read: Drishyam 3: ఓటిటిలోకి దృశ్యం 3 .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!  మన సమాజంలో జంతువులపై జరుగుతున్న ఇలాంటి అమానవీయ దాడులని అరికట్టడానికి జంతు క్రూరత్వ నిరోధక చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. జంతువులని  హింసించాలంటేనే నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టేలా కఠినమైన శిక్షలు అమలు చేయాలని కూడా సదరు వీడియోలో పేర్కొంది. మంజరి వీడియో చూసిన తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు భూమి పెడ్నేకర్, వేదిక, డింపుల్ హయతి వంటి హీరోయిన్లు మైకీకి న్యాయం జరగాలంటూ, ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు. మంజరికి మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా  కామెంట్లు చేస్తున్నారు.   
  తమిళ స్టార్ హీరో, జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. క్రీడా ప్రపంచంలో టెన్నిస్ దిగ్గజంగా పేరొందిన రఫెల్ నాదల్‌ను ఉద్దేశించి ఆయన అత్యంత భావోద్వేగభరితమైన సందేశాన్ని పంచుకున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా తాజాగా విడుదలైన 'రఫా' అనే డాక్యుమెంటరీని వీక్షించిన అనంతరం, ధనుష్ తీవ్ర చలనానికి లోనయ్యారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ చూసిన తర్వాత నాదల్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అసలైన నరకాన్ని, శారీరక వేదనను తాను అర్థం చేసుకోగలిగానని ధనుష్ పేర్కొన్నారు. గతంలో నాదల్ మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో టీవీల ముందు కూర్చుని తాను గట్టిగా అరిచేవాడినని, కానీ ఆ సమయంలో నాదల్ అనుభవిస్తున్న తీవ్రమైన నొప్పి, ఒత్తిడి గురించి తనకు అస్సలు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేసినందుకు ఇప్పుడు తనను తాను అస్సలు క్షమించుకోలేకపోతున్నానని ఆయన రాసుకొచ్చారు. ముఖ్యంగా కోర్టులో మ్యాచ్ ఆడేటప్పుడు నాదల్ వాటర్ బాటిళ్లను ఒక పద్ధతిలో అమర్చడం, గీతలను పదే పదే శుభ్రం చేయడం వంటి అలవాట్లను చాలామంది మూఢనమ్మకాలుగా భావిస్తారని, కానీ అవి ఒత్తిడిని అధిగమించడానికి ఆయన అనుసరించిన పద్ధతులని ధనుష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ముల్లర్-వీస్ సిండ్రోమ్ వంటి భయంకరమైన దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతూ కూడా నాదల్ సాధించిన విజయాలు సామాన్యమైనవి కావన్నారు. గణాంకాల పరంగా జకోవిచ్ ముందుండొచ్చు, లేదా రోజర్ ఫెదరర్‌ను ప్రపంచమంతా ఎంతో ఇష్టపడొచ్చు.. కానీ లెక్కలేనన్ని గాయాల నడుమ 22 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన రఫెల్ నాదల్ మాత్రమే తన దృష్టిలో ఎప్పటికీ 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) అని ధనుష్ స్పష్టం చేశారు. టెన్నిస్ ఆటకు తన రక్తాన్ని, ఆత్మను ధారపోసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎప్పటికీ నీ అభిమానిని’ అంటూ పోస్ట్‌ ముగించారు. ధనుష్ చేసిన ఈ రివ్యూ కమ్ ఎమోషనల్ పోస్ట్‌పై అటు సినిమా వర్గాల్లోనూ, ఇటు క్రీడా ప్రేమికుల్లోనూ గట్టి చర్చ నడుస్తోంది. గతేడాది అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన నాదల్ జీవితంలోని చీకటి కోణాలను, అద్భుత పోరాటాలను ఆవిష్కరించిన ఈ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ధనుష్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ ప్రశంసించడంతో సినిమా ఫ్యాన్స్ సైతం ఈ సిరీస్ చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ఆయన తదుపరి చిత్రాల అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఊరమాస్ పర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో రచ్చ లేపుతున్న పవర్‌ఫుల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ వార్త విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా ఒక సినిమా థియేటర్లలోకి విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన వస్తే కాస్త ట్రిమ్మింగ్ చేయడం లేదా కొన్ని నిమిషాల సీన్స్ కట్ చేయడం మనం చూస్తుంటాం. కానీ ఇప్పటికే థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న 'పెద్ది' సినిమా విషయంలో మాత్రం మేకర్స్ చాలా సాహసోపేతమైన, ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను గౌరవిస్తూ, సినిమా బాక్సాఫీస్ రేంజ్‌ను మరింత పెంచేలా సరికొత్త మార్పులతో కొత్త వర్షన్‌ను సిద్ధం చేస్తున్నారట. ఈ సరికొత్త చేర్పులు, మార్పులలో భాగంగా ముఖ్యంగా సినిమా సెకండాఫ్ పై చిత్ర యూనిట్ గట్టిగా ఫోకస్ పెట్టింది. థియేటర్లలో సినిమా చూసిన ఆడియన్స్ నుండి సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ కథా గమనానికి కాస్త బ్రేక్ వేస్తున్నాయనే కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో గౌర్నాయుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇప్పుడు థియేటర్ల నుండి పూర్తిగా తొలగించనున్నారట. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ స్థానంలో, మెగా అభిమానులకు థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేశారని టాక్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కాంబినేషన్‌లో ఉండే మైండ్ బ్లాకింగ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్లను కొత్తగా ఈ చిత్రంలో జత చేయబోతున్నారట. రామ్ చరణ్ మార్క్ మాస్ ఎలివేషన్స్, జగపతి బాబు పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో సాగే ఈ సరికొత్త సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త హై ఇస్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ సీన్స్ సినిమా రేంజ్‌ను మార్చేలా ఎంతో అద్భుతంగా వచ్చాయట. జాన్వీ కపూర్ సీన్స్ ను కూడా రీ ఎడిట్ చేస్తున్నారట. అయితే కొత్త సన్నివేశాలను కలపడం వల్ల సినిమా రన్‌టైమ్‌లో మార్పులు వస్తాయి కాబట్టి, ఈ సరికొత్త అప్‌డేటెడ్ వర్షన్‌ను చిత్ర యూనిట్ మళ్లీ సెన్సార్ బోర్డు ముందుకు తీసుకెళ్లనుంది. సెన్సార్ బోర్డు నుండి కొత్త సర్టిఫికెట్ లభించిన వెంటనే, ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న పాత ప్రింట్‌ను తీసేసి, సరికొత్త 'పెద్ది' అప్‌డేటెడ్ వర్షన్‌ను డిజిటల్ క్యూబ్స్ ద్వారా థియేటర్స్ కి అప్‌లోడ్ చేయనున్నారు. ఇప్పటికే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు సైతం ఈ కొత్త సీన్స్ కోసం మళ్లీ థియేటర్లకు వెళ్లేలా ఈ సరికొత్త కట్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇదొక విలక్షణమైన ప్రయోగంగా నిలవనుంది. ఈ సరికొత్త సర్ప్రైజ్ అప్‌డేట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులలో అంచనాలు ఒక్కసారిగా డబుల్ అయ్యాయి. థియేటర్లలో ఈ కొత్త వర్షన్ ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుందో చూడాలి.  
  'దృశ్యం'(Drishyam 3) సిరీస్ కి భారతీయ చలనచిత్ర రంగంలోనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల ట్రెండ్‌ని మార్చేసిన ఘనత దక్కుతుంది. 2013 లో ప్రారంభమైన ఈ సిరీస్ ఈ సంవత్సరం మే నెలలో వచ్చిన దృశ్యం 3 వరకు ఒకదాన్ని మించి ఒకటి విజయవంతమయ్యాయి. సాధించిన కలెక్షన్స్ నే అందుకు ఉదాహరణ.   ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు సిద్ధమవుతోంది. స్ట్రీమింగ్  హక్కులని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ (SVOD), ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ (TVOD) వంటి అన్ని ప్రధాన డిజిటల్ ఫార్మాట్లలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేట్రికల్ రన్ ముగిసిన 30 నుండి 35 రోజులలోపు ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం జూన్ 18 లేదా జూన్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో  స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. Also read: డీజే టిల్లు దర్శకుడి నయా నిర్వాహకం.. ఉత్త అనుమానపక్షి అనుకుంటా ఈ మూడో భాగం కథ విషయానికి వస్తే, వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్‌కుట్టి ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడాడనేది చూపించారు. అయితే ఈసారి కథలో ట్విస్టులు మరింత ఉత్కంఠని  రేపుతాయి. జార్జ్‌కుట్టి పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని చూస్తుండగా, వచ్చిన ప్రతి సంబంధం ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అవుతుంటుంది. దీని వెనుక ఎవరో ఉండి కావాలనే సంబంధాలని  చెడగొడుతున్నారని గ్రహించిన జార్జ్, ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో పడతాడు. మరోవైపు సహదేవ్ అనే కానిస్టేబుల్ తనను ఎందుకు నిరంతరం ఫాలో అవుతున్నాడో అర్థం కాక జార్జ్‌కుట్టి సందిగ్ధంలో పడతాడు. ఈ అపరిచిత శత్రువు చుట్టే కథ మొత్తం నడుస్తూ చివరిలో జీతూ జోసెఫ్ మార్క్ అదిరిపోయే ట్విస్టులతో ముగుస్తుంది. థియేటర్లలో ఈ సస్పెన్స్ మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 230 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లని  నమోదు చేసింది.  
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) డిజిటల్ డెబ్యూ ఇస్తూ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'దూత' (Dhootha) సృష్టించిన సంచలనం అందరికీ గుర్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ సస్పెన్స్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వీక్షకులను ఎంతగానో అలరించింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ మొదటి సీజన్ విజయవంతం కావడంతో, ఇప్పుడు 'దూత సీజన్ 2' (Dhootha Season 2) కోసం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి సీజన్‌లో అద్భుతమైన సస్పెన్స్, ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో మెప్పించిన దర్శకుడు, సెకండ్ సీజన్‌ను అంతకంటే హై వోల్టేజ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి కాస్టింగ్ పరంగా అప్పుడే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'దూత సీజన్ 2' ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక అదిరిపోయే క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్‌లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ భూమిక చావ్లా (Bhumika Chawla) ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ కోసం దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఆమెను ఎంపిక చేశారని తెలుస్తోంది. భూమిక ఎంట్రీతో దూత సీజన్ 2 పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సస్పెన్స్ డ్రామాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేలా ఆమె పాత్రను ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారట. అయితే, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక అరుదైన మరియు ఆసక్తికరమైన కాంబినేషన్ రిపీట్ కాబోతుండటం విశేషం. గతంలో 2018లో చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'సవ్యసాచి' (Savyasachi) సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ చిత్రంలో నాగచైతన్యకు అక్క పాత్రలో భూమిక చావ్లా కనిపించి మెప్పించారు. ఆ సినిమా వచ్చి దాదాపు 8 ఏళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, ఇప్పుడు మళ్లీ ఇంత కాలం తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకోబోతున్నారు. సవ్యసాచి (2018) తర్వాత నాగచైతన్య, భూమిక కాంబినేషన్ సరిగ్గా 'దూత సీజన్ 2' ద్వారానే మళ్లీ పునరావృతం అవుతుండటంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఈ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ మొదటి భాగంలో మీడియా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే మిస్టీరియస్ మరణాల చుట్టూ కథ తిరిగింది. ఒక పేపర్ క్లిప్పింగ్ ముందే జరగబోయే ప్రమాదాలను సూచించడం అనే యూనిక్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ఇచ్చింది. ఇప్పుడు రాబోయే సెకండ్ సీజన్‌లో భూమిక క్యారెక్టర్ ఈ ఇన్వెస్టిగేషన్ మిస్టరీకి ఎలా లింక్ అవుతుంది, నాగచైతన్య పాత్రతో ఆమెకు ఉండే రిలేషన్ ఏంటనేది సస్పెన్స్‌గా మారింది. మొదటి సీజన్‌ను మించి మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో, టాప్ నాచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో రాబోతున్న ఈ సిరీస్ ఇటీవలే అధికారికంగా లాంచ్ అయింది. సెకండ్ సీజన్ కి నాగచైతన్య నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.  
విమల్ కృష్ణ(Vimal Krishna)దర్శకత్వంలో వచ్చిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద సెట్ చేసిన ట్రెండ్ తెలిసిందే. తనదైన మార్క్ కామెడీ తో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు  విమల్ కృష్ణ నుండి వస్తున్న సరికొత్త ప్రాజెక్ట్ పేరు అనుమానపక్షి. ఎ సైక్ ఖాస్టిక్ కామెడీ అనేది టాగ్ లైన్.  ఈ మేరకు రీసెంట్ గా టైటిల్‌ అనౌన్స్ మెంట్ తో పాటు టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ కథాంశాన్ని గమనిస్తే, హీరో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ, ప్రతి ఒక్కరినీ అమితంగా అనుమానించే ఒక విచిత్రమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా హీరో కనిపిస్తాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, తనను కన్న తల్లిదండ్రులను సైతం అనుమానిస్తూ అతను చేసే పనులు, దానివల్ల అతని జీవితంలో ఎదురైన తీవ్ర పరిణామాలు ఏంటి అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా కథ సాగుతుందని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. హీరో అనుమానపు బుద్ధితో విసిగిపోయిన తల్లిదండ్రులు, అతనికి పెళ్లి చేసి ఇల్లు దాటించాలని చూసే సీన్లు టీజర్ ప్రారంభంలోనే 100 శాతం వినోదాన్ని పంచుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో అతని జీవితంలోకి హీరోయిన్ ప్రవేశించడం, అతని ఎక్సెంట్రిసిటీని భరిస్తూ ప్రేమించడం వంటి సీన్లు యూత్‌ని  ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.  నటుడు అజయ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంట్రీ ఇవ్వడం, సీనియర్ నటి రాశి కథలోకి రావడంతో సినిమా ఒక్కసారిగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లోకి మారుతుంది. రాగ్ మయూర్,  మెరిన్ ఫిలిప్ జతగా చేస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకోగా  జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు విమల్ కృష్ణ మరోసారి తన మార్క్ హిలేరియస్ నరేషన్‌తో థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. Also read: ఆరుగురు పిల్లల స్టార్ హీరోతో అఫైర్.. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకి తల్లైన టాలీవుడ్ హీరోయిన్ . ప్రిన్స్ సిసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, సుప్రీత్ మరియు సలీం ఫేకుగా గుర్తింపు తెచ్చుకున్న మస్త్ అలీ ఇతర రోల్స్ . చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు రాజీవ్ చిలక, మేఘా చిలక, స్నేహ రాజేష్ జగ్తియాని, విహాన్ దాండ్, శ్రీచరణ్ మర్నేని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, భరత్ లక్ష్మిపతి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ  టీజర్‌ని  నెక్ట్స్ లెవెల్‌కి  తీసుకెళ్లాయి.      
The teaser of Anumana Pakshi, starring Rag Mayur and directed by DJ Tillu filmmaker Vimal Krishna, has been released. Rather than revealing the plot upfront, the teaser spends most of its runtime introducing the unusual world of its lead character and the situations that surround him. Rag Mayur appears as a man who doubts everything and everyone around him. His constant suspicion seems to irritate even his own parents, who appear more interested in getting him married and moving him out than solving his problems. The setup creates much of the teaser’s early humour for this 10th July release. Things begin to shift when a woman enters his life and seems willing to accept him with all his eccentricities intact. But just as the teaser settles into relationship comedy, it takes a different turn. Ajay’s entry as a police officer and the presence of Raasi introduce another layer to the narrative. Their interactions hint that there could be more happening beneath the surface than the lead character’s overthinking, pushing the teaser towards investigative and thriller territory. The teaser moves between comedy, suspicion and moments of tension without revealing where exactly the story is headed. Vimal Krishna appears to be building the film around character behaviour first and genre later. Backed by Rajiv Chilaka along with Hirachand Dand and Rajesh Jagtiani, Anumana Pakshi leaves behind enough questions while holding back its bigger reveals.    Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
The teaser of Slumdog 33 Temple Road was launched in Chennai with director Puri Jagannadh and the film’s cast interacting with the media. Starring Vijay Sethupathi in the lead, the film also features Tabu, Duniya Vijay and Samyuktha in prominent roles. Speaking at the event, Vijay Sethupathi spoke about his association with Puri Jagannadh and revealed that their connection goes back several years. He recalled acting as a junior artiste in the remake of Amma Nanna O Tamil Ammayi and said working with Puri now felt like a full-circle moment. Vijay described Puri as a filmmaker who constantly thinks and writes stories even in between shots and breaks. He added that he enjoyed working on Slumdog and called it an intense action drama with strong emotions at its core. Expressing confidence in the project, he said he believes the film has the potential to connect with audiences across India. Puri Jagannadh, in turn, thanked Vijay Sethupathi for coming onboard and said the actor’s ability to express emotions with restraint became one of the film’s strengths. Talking about the story, Puri revealed that Slumdog 33 Temple Road is inspired by two real incidents. He said the film explores the lives of people who have nowhere to go and focuses on characters who are left without support or protection. The director also stated that the emotional intensity of certain scenes affected him personally during the making process and expressed confidence that younger audiences would connect with the film’s themes.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  తెలుగు సినిమా ఉన్నంత కాలం కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఏంఎస్ రాజు నిర్మించిన 'దేవి' సినిమా బతికే ఉంటుంది. సదరు మూవీలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా సుశీల క్యారక్టర్ లో అత్యద్భుతంగా చేసిన  వనితా విజయ్ కుమార్ కూడా ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచి ఉంటుంది. సీనియర్ లెజండ్రీ యాక్టర్ విజయ్ కుమార్, లెజండ్రీ హీరోయిన్ మంజుల కూతురే వనితా. కాకపోతే గత కొంత కాలంగా నటిగా కంటే వివాదాలతోనే  వార్తల్లో నిలుస్తు ఫైర్‌బ్రాండ్ గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సీనియర్ స్టార్ హీరోయిన్స్  నయనతార, రమ్యకృష్ణలతో తనకున్న వివాదాలపై ఎవరూ ఊహించని సంచలన నిజాలని  వెల్లడించారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతో గతంలో ఒక రియాలిటీ షో వేదికగా జరిగిన గొడవ గురించి వనిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఆ రోజు సెట్స్‌లో ఏం జరిగిందో చెబుతూ వనిత ఆవేదన వ్యక్తం చేశారు. రమ్యకృష్ణతో జరిగిన సంఘటనపై వనిత స్పందిస్తూ, అది వ్యక్తిగత విరోధం కాదు.కేవలం వృత్తిపరమైన ఇగో సమస్య మాత్రమే. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన షోలో పాల్గొన్నప్పుడు, సదరు ఛానెల్ నాకు ఇచ్చిన ప్రామిస్ ఒకటి అయితే, అక్కడ ప్రాక్టికల్‌గా జరిగింది మరొకటి. నేను కేవలం ఒక సాధారణ బిగ్ బాస్ కంటెస్టెంట్‌ని మాత్రమే. ఒక ఫిల్మ్ స్టార్‌గా, సుదీర్ఘ సినీ నేపథ్యం ఉన్న విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చాను. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ నటిగా కొనసాగుతున్ననన్ను వేరే వాళ్లతో పోల్చి జడ్జ్ చేసిన విధానం అస్సలు నచ్చలేదు.ఆ రోజు షోలో రమ్యకృష్ణ నా మీద అరవడం కరెక్ట్ కాదు. విభిన్న వయసుల వ్యక్తుల ప్రదర్శనలని ఒకేలా పోల్చడం తప్పు. 40 ఏళ్ల వయసులో ఉన్న నేను ,16 ఏళ్ల టీనేజ్ అమ్మాయి చేసే డాన్స్ లేదా పెర్ ఫార్మెన్సు ని చేయలేను. అలాగే 60 ఏళ్ల వయసున్న వారు నా లాంటి ప్రదర్శన ఇవ్వలేరు . ఆ రోజు రమ్యకృష్ణ స్పందించిన తీరు నచ్చకపోవడం వల్లే ఆ ప్రతిష్టాత్మక షో నుండి మధ్యలోనే బయటకి  వచ్చాను. దీనికి ఛానెల్ యాజమాన్యం ప్రవర్తనే ప్రధాన కారణం. అయితే రమ్యకృష్ణపై నాకు  వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. చిన్నప్పటి నుండి ఆమె నాకు తెలుసు. ఒక గొప్ప నటిగా ఆమెని ఎప్పుడూ గౌరవిస్తానని వనిత చెప్పుకొచ్చింది. Also read: Nithya menen: నిత్యామీనన్ కొత్త సినిమా..హీరో, హీరోయిన్స్ కి ఆదర్శంగా నిలిచినట్టే ఇదే సమయంలో, లేడీ సూపర్ స్టార్ నయనతారతో తనకు తీవ్రమైన విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న పుకార్లని  వనిత గట్టిగా ఖండించారు. నయనతార ఒక గొప్ప అచీవర్, అత్యంత దృఢమైన, ధైర్యవంతురాలైన వ్యక్తి . గతంలో ప్రభుదేవాతో నయన్ రిలేషన్‌లో ఉన్నప్పుడు నేను  వ్యతిరేకంగా మాట్లాడినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికీ నయనతార భర్త విఘ్నేష్ శివన్‌తో టచ్‌లోనే ఉన్నానని, నయన్‌కి  పిల్లలు పుట్టినప్పుడు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలియజేశానని గుర్తు చేశారు.   
  దక్షిణాది సినీ ప్రేమికులకి, ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు నిత్యామీనన్(Nithya menen). ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి సదరు క్యారక్టర్ కి ప్రేక్షకులు జేజేలు పలికేలా చెయ్యడంలో ఆరి తేరిన నటి. గ్లామర్ క్యారెక్టర్ల జోలికి వెళ్లకుండా నటనకి ప్రాధాన్యమున్న వాటిని  ఎంచుకుంటూ, వెండితెరపై తన అద్భుతమైన అభినయంతో మంత్రముగ్ధులని  చేస్తోంది.  గత ఏడాది అక్టోబర్ లో ధనుష్ తో చేసిన 'ఇడ్లీ కడై' (తెలుగులో 'ఇడ్లీ కొట్టు') చిత్రం తర్వాత నిత్యా మీనన్, తాజాగా ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌కి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కథ నచ్చితేనే సంతకం చేసే నిత్యాకు, ఈ కొత్త ప్రాజెక్ట్ లైన్ తెగ నచ్చేసిందని సమాచారం. దర్శకురాలిగా మారేందుకు ప్లాన్ చేసుకుంటున్న తరుణంలోనే, నిత్యా మీనన్ మరో క్రేజీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. యామిరుక్క బయమేన్', 'కవలై వేండాం' వంటి విభిన్నమైన చిత్రాలతో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు డీకే (DK) చెప్పిన ఒక వైవిధ్యమైన లేడీ ఓరియెంటెడ్  కథకి  నిత్యా మీనన్ ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. Also read: లెనిన్ ఆంధ్ర బిజినెస్ క్లోజ్.. షాకింగ్ రేట్! సరికొత్త జోనర్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రంలో నిత్యా మీనన్ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త లుక్ మరియు క్యారెక్టరైజేషన్‌లో కనిపించబోతోందని టాక్. అయితే ఈ చిత్రానికి పూర్తి పారితోషకం తీసుకోకుండా అడ్వాన్స్ మాత్రమే తీసుకొని వచ్చే లాభాల్లో వాటాని పారితోషకంగా తీసుకోనుందనేది టాక్ . ఇదే నిజమైతే పలువురు హీరో, హీరోయిన్స్ కి నిత్య మీనన్ ఆదర్శంగా నిలిచినట్టే.    
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం, చర్మం దెబ్బ తినడం  వంటివి జరగకపోయినా, చర్మం మీద నీలం రంగులో మచ్చలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. కొందరికి ఎలాంటి గాయాలు అయినట్లు కూడా గుర్తుండదు.  చాలామంది తరచుగా ఇది సాధారణమే అనుకుని నిర్లక్ష్యం చేస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో, ఇది ఒక శరీరం లోపల ఏదో  సమస్యకు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. పదేపదే కారణం లేకుండా ఏర్పడే గాయాలను తేలికగా తీసుకోవడం మంచిది కాదని  అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే…  మచ్చలు ఎందుకు కనిపిస్తాయి?  కొన్నిసార్లు అధిక శారీరక శ్రమ లేదా తీవ్రమైన వ్యాయామం చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాలను ప్రభావితం చేయగలదని నిపుణులు అంటున్నారు. కండరాలపై అధిక ఒత్తిడి ఈ నాళాలు చిట్లిపోవడానికి,  చర్మం కింద రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది, దీని ఫలితంగా నీలి రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా జరిగినప్పుడు  ఆ వ్యక్తికి గాయం అయినట్టు తెలియకపోవచ్చు, కానీ మచ్చలు కనిపినస్తుంటాయి. మందులు.. కొన్ని మందులు కూడా చర్మం మీద ఇలా నీలి రంగు మచ్చలకు కారణం కావచ్చు. రక్తాన్ని పల్చబరిచే మందులు, ముఖ్యంగా ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్,  నాప్రోక్సెన్ వంటివి, రక్తం మరింత త్వరగా గడ్డకట్టేలా చేస్తాయి. రక్తం సాధారణ వేగంతో గడ్డకట్టనప్పుడు, అది చర్మం కిందకు కారిపోయి, సులభంగా కమిలిపోతుంది. కొత్త మందులు తీసుకున్న తర్వాత ఈ సమస్య మొదలైతే వైద్యుడిని సంప్రదించడం ఎంతో ముఖ్యం.  పోషకాల లోపం.. కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తుంది. విటమిన్ సి లోపం చర్మాన్ని, రక్తనాళాలను బలహీనపరిచి, చిన్న ఒత్తిడికే మచ్చలు ఏర్పడేలా చేస్తుంది. ఐరన్ లోపం రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది, విటమిన్ కె లోపం రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, ఎటువంటి కారణం లేకుండా పదేపదే నీలి మచ్చలు రావడం పోషకాహార లోపానికి సంకేతం కావచ్చట..  ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం.. ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా వంటి అరుదైన సమస్యలలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతాయి. రక్తం గడ్డకట్టడంలో ప్లేట్‌లెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి లోపం వల్ల చర్మంపై అకస్మాత్తుగా నీలం లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో, పదేపదే వచ్చే నీలం మచ్చలు నాన్-హాడ్కిన్స్ లింఫోమా లేదా ఇతర రక్త సంబంధిత సమస్యల వంటి తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం కావచ్చు. ఇది అరుదైనప్పటికీ, తీవ్రమైన అలసట, బరువు తగ్గడం లేదా తరచుగా రక్తస్రావం వంటి లక్షణాలతో పాటుగా ఉంటే వైద్యులను కలిసి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుడిని ఎప్పుడు కలవాలి? ఎటువంటి స్పష్టమైన గాయం లేకుండా  శరీరంపై పదేపదే నీలి మచ్చలు కనిపిస్తే, ఆ మచ్చలు క్రమంగా పెద్దగా అవుతూ పరిమాణంలో పెరుగుతుంటే, తరచుగా ముక్కు నుండి రక్తం కారుతుంటే, లేదా ఆ రక్తస్రావం సులభంగా ఆగకపోతే,  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో వైద్య పరీక్ష చేయించుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యాన్ని దాని ప్రారంభ దశలోనే గుర్తించి, వ3ఎలైనంత తొందరగా చికిత్సను ప్రారంభించవచ్చు.                          *రూపశ్రీ 
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి చాలామంది ఆశ్రయించేది "మల్టీవిటమిన్ టాబ్లెట్లు" (Multivitamin Tablets). అయితే, ఈ టాబ్లెట్లను ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ఎక్కువగా వాడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్ష్మి కోన గారు అందించిన పూర్తి వివరాలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం. మల్టీవిటమిన్ టాబ్లెట్ల ఉపయోగాలు (Uses of Multivitamins) మన శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి విటమిన్లు ఎంతగానో తోడ్పడతాయి. మల్టీవిటమిన్ల వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు: పోషకాహార లోపాన్ని భర్తీ చేయడం: మనం తినే ఆహారంలో లోపించిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ను ఇవి శరీరానికి అందిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల (Immunity Boost): విటమిన్ C, D, మరియు జింక్ వంటి పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. శక్తిని అందించడం (Energy Levels): విటమిన్ B-కాంప్లెక్స్ శరీరంలో ఆహారాన్ని శక్తి గా మార్చడంలో సహాయపడుతుంది, దీనివల్ల అలసట, నీరసం తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం: విటమిన్ E, బయోటిన్ వంటివి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఎముకల బలం: క్యాల్షియం మరియు విటమిన్ D కలిసిన మల్టీవిటమిన్లు ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి. సరైన డోసేజ్ మరియు వేసుకునే విధానం (Correct Dosage & Guidelines) మల్టీవిటమిన్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్ని పడితే అన్ని వేసుకోకూడదు. వాటికంటూ ఒక పద్ధతి ఉంటుంది: మల్టీవిటమిన్ టాబ్లెట్లను సాధారణంగా ఉదయం లేదా मధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవడం మంచిది. పరగడుపున (ఖాళీ కడుపుతో) వేసుకుంటే కొంతమందిలో కడుపులో మంట లేదా వికారం కలగవచ్చు. కొన్ని విటమిన్లు (A, D, E, K) కొవ్వులో కరిగేవి (Fat-soluble vitamins). కాబట్టి, కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత వీటిని వేసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. ఎల్లప్పుడూ డాక్టర్ సూచించిన డోస్ మాత్రమే వాడాలి. సొంత నిర్ణయాలతో రోజుకు ఒకటి కంటే ఎక్కువ టాబ్లెట్లు వేసుకోకూడదు. జాగ్రత్త: మితిమీరిన విటమిన్ల వాడకం  చాలామంది మల్టీవిటమిన్లు ఆరోగ్యానికి మంచిదే కదా అని విపరీతంగా వాడుతుంటారు. కానీ, డాక్టర్ లక్ష్మి కోన గారి ప్రకారం, విటమిన్లు ఎక్కువైతే "విటమిన్ టాక్సిసిటీ" (Vitamin Toxicity / Hypervitaminosis) అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా విటమిన్ A, D, E, K లు శరీరంలో పేరుకుపోయి కాలేయం (Liver) మరియు మూత్రపిండాల (Kidneys) పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, విటమిన్ D ఎక్కువైతే శరీరంలో క్యాల్షియం పెరిగిపోయి కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విటమిన్ A ఎక్కువైతే తలనొప్పి, వాంతులు మరియు కాలేయ సమస్యలు రావచ్చు. దుష్ప్రభావాలు (Side Effects) సాధారణంగా పరిమితికి లోబడి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొంతమందిలో క్రింది లక్షణాలు కనిపించవచ్చు: కడుపులో అశాంతి, వికారం లేదా వాంతులు. మలబద్ధకం (Constipation) లేదా విరేచనాలు (Diarrhea) - ముఖ్యంగా ఐరన్ (Iron) ఎక్కువగా ఉన్న మల్టీవిటమిన్ల వల్ల మలం నల్లగా రావడం మరియు మలబద్ధకం జరుగుతుంది. నోటిలో వింత రుచి (Metallic Taste). ఇతర మందులతో పరస్పర చర్యలు (Drug Interactions) మీరు ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడుతుంటే, మల్టీవిటమిన్లు వేసుకునే ముందు జాగ్రత్త వహించాలి: యాంటీబయాటిక్స్: మల్టీవిటమిన్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ (ఉదాహరణకు Tetracyclines) శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. బ్లడ్ థిన్నర్స్ (రక్తాన్ని పలచబరిచే మందులు): విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు రక్తాన్ని పలచబరిచే మందులు (Warfarin వంటివి) వాడుతుంటే, విటమిన్ K ఉన్న మల్టీవిటమిన్లు వాటి పనితీరును దెబ్బతీస్తాయి. చివరిగా:-  మల్టీవిటమిన్ టాబ్లెట్లు అనేవి సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.. సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా వచ్చే పోషకాలే శరీరానికి అత్యంత శ్రేష్ఠమైనవి.  మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం,  శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండె సమస్యలు వచ్చే వారిలో మొదట్లోనే చిన్న చిన్న లక్షణాలుగా కనిపిస్తాయి. కానీ చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల తీవ్రమైన గుండె జబ్బులను , గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులను నివారించవచ్చు. శరీరంలో ఏ లక్షణాలు గుండె జబ్బులను సూచిస్తాయో.. ఆ లక్షణాలు మీకు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేస్కోండి.. ఛాతీ నొప్పి.. ఛాతీ నొప్పి, బిగుతుగా అనిపించడం, బరువుగా ఉండటం లేదా ఒత్తిడి వంటివి గుండె జబ్బు  అత్యంత సాధారణ లక్షణాలు. ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు ఉండవచ్చు లేదా పదేపదే రావచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి భుజం, మెడ, వీపు లేదా చేతికి కూడా వ్యాపించవచ్చు. ఇలా పదేపదే జరుగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఊపిరి ఆడకపోవడం.. మెట్లు ఎక్కేటప్పుడు  విపరీతమైన అలసటగా లేదా ఆయాసంగా అనిపిస్తే, అది గుండె బలహీనతకు సంకేతం కావచ్చు. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అలసట, బలహీనత.. విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిరంతరం అలసటగా అనిపిస్తుంటే, దానిని సాధారణ బలహీనతగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు.  గుండె పనితీరు తగ్గినప్పుడు, శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్ అందదు, దీనివల్ల అలసట , నీరసం ఏర్పడుతుంది. హృదయ స్పందన.. గుండె కొట్టుకునే వేగంలో ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల గుండె సమస్యకు సంకేతం కావచ్చు.  ఈ పరిస్థితి పదేపదే ఏర్పడుతుంటే వైద్య పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.                                        *రూపశ్రీ.