
మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి'. ఈ సినిమాలోని రామాయణ ఎపిసోడ్ గురించి సంచలన నిజాలు బయటకొచ్చాయి. ఈ ప్రత్యేకమైన రామాయణ సీక్వెన్స్లో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నారు. అయితే ఈ ఎపిసోడ్లో సీతాదేవి, రావణాసురుడు వంటి పాత్రలు ఉండవట. కేవలం శ్రీరాముడు, కుంభకర్ణుడు మధ్య జరిగే భయంకరమైన యుద్ధ సన్నివేశాన్ని మాత్రమే రాజమౌళి అద్భుతంగా చూపించనున్నారట.
ఈ ఎపిసోడ్ మొత్తం కేవలం ఒక్క సీక్వెన్స్ చుట్టూనే ఎంతో పవర్ఫుల్గా తిరుగుతుందని తెలుస్తోంది. అదే.. రాముడు, కుంభకర్ణుడి మధ్య జరిగే మహా యుద్ధం. రాముడిగా మహేష్ బాబు గ్లోరీ అప్పీరియన్స్, ఆ దివ్య రూపం, ఆ బాణాల వర్షం... వీటన్నింటినీ ఒక విజువల్ వండర్లా రాజమౌళి స్క్రీన్ మీద ప్రెసెంట్ చేయబోతున్నారు. ఈ పర్టికులర్ చాప్టర్లో కేవలం శ్రీరాముడు, కుంభకర్ణుడు, ఆంజనేయ స్వామి, వానర సేన మాత్రమే ఉంటారట.
కొండంత ఆకారంతో ఉన్న కుంభకర్ణుడు ఒకవైపు... విల్లు చేతబూని, దైవికమైన తేజస్సుతో శ్రీరాముడిగా మహేష్ బాబు ఇంకోవైపు. పక్కనే హనుమంతుడి గర్జన, వానర సేన హుంకారం. ఈ ఒక్క ఎపిసోడ్కే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని చెప్పవచ్చు.
రాజమౌళి ఒక పర్టికులర్ రామాయణ చాప్టర్ను మాత్రమే ఎంచుకుని, దానికి గ్లోబల్ రేంజ్ విఎఫ్ఎక్స్, మైండ్ బ్లాకింగ్ యాక్షన్ కోరియోగ్రఫీ జోడించి ప్రజెంట్ చేయబోతున్నారు. అందుకే ఈ ఎపిసోడ్లో సీతమ్మ తల్లి, రావణాసురుడు లేదా ఇతర రామాయణ పాత్రలు కనిపించవట.
SS Rajamouli, Mahesh Babu, Varanasi, Ramayana Episode




.webp)
