ENGLISH | TELUGU  

రాజమౌళి ఒక కాంట్రాక్టర్.. ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు!

on Oct 31, 2025

 

తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడమే కాకుండా, పాన్ ఇండియా ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన చిత్రం 'బాహుబలి'. ఇప్పుడు 'బాహుబలి' రెండు భాగాలు కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఒక కొత్త సినిమా విడుదలైన రేంజ్ లో ఆడియన్స్ నుండి రెస్పాన్స్ వస్తోంది. సెలబ్రిటీలు సైతం 'బాహుబలి: ది ఎపిక్' చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. (Baahubali: The Epic)

 

'బాహుబలి' బాటలో పయనించి, పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేసిన సినిమాల్లో 'కేజీఎఫ్' ఒకటి. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. అలాంటి నీల్, తాజాగా రాజమౌళిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఒక రోడ్డుకి మరమత్తులు చేయాల్సి వచ్చింది. దీంతో ఓ కాంట్రాక్టర్ ని పిలిచారు. ఆ కాంట్రాక్టర్ రోడ్డుని ఫిక్స్ చేయడమే కాకుండా.. ఏకంగా దాన్ని 16 లైన్ల సూపర్ ఎక్స్ ప్రెస్ హైవేగా మార్చేశాడు. ఆ రోడ్డు ఏదో కాదు.. పాన్ ఇండియా. ఆ కాంట్రాక్టర్ ఎవరో కాదు.. రాజమౌళి. ఒక తరం కోసం కలలు కన్న బాహుబలి టీమ్ కి అభినందనలు" అంటూ ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ మాటలను ఆయన సతీమణి లిఖిత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

 

కాగా, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్.. షూటింగ్ దశలో ఉంది.

 

Also Read: మహేష్ తో సందీప్ రెడ్డి మూవీ.. స్పిరిట్ సంగతేంటి..?

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.