![]() |
![]() |

రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఓజి'(OG)ఫీవర్ మొదలైంది. సెప్టెంబర్ 25 ముందు రోజు మిడ్ నైట్ బెనిఫిట్ షో ప్రదర్శిస్తుండటంతో, టికెట్స్ కోసం అభిమానులు తమ తమ మార్గాల్లో ట్రై చేస్తున్నారు. బెనిఫిట్ షో మొదలుకొని రిలీజ్ రోజు పవన్ ఫ్యాన్స్ థియేటర్స్ లో చేసే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. సీట్ల పై నుంచొని ఎగరడమే కాకుండా,స్క్రీన్ ముందుకు వెళ్లి పవన్(Pawan Kalyan) జెండాలు పట్టుకొని డాన్స్ లు చెయ్యడం, అక్కడే బాణాసంచాలు కాల్చడం లాంటివి చేస్తుంటారు.
ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెడుతు 'విజయవాడ'(Vijayawada)లోని గాంధీనగర్ ఏరియాలో ఉన్న 'శైలజ థియేటర్'(sailaja Theater)ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్క్రీన్ పైకి అభిమానులు రాకుండా, స్క్రీన్ పై మేకులతో పాటు ఇనుప కంచెని ఏర్పాటు చేసారు. సీట్స్ కింద పెద్ద పెద్ద బండ రాళ్ళని కూడా ఉంచడం జరిగింది. ఈ ఏర్పాట్లపై థియేటర్ యాజమాన్యం మాట్లాడుతు పవన్ ఫ్యాన్స్ ఉత్సాహంతో స్క్రీన్ పైకి వెళ్లి జెండాలతో ఎగరడం వలన, వాటికి ఉన్న కర్రలు గుచ్చుకొని స్క్రీన్స్ డామేజ్ అవుతున్నాయి. కొంత మంది కావాలనే స్క్రీన్ ని చించుతున్నారు. దీంతో నెక్స్ట్ షో ప్రేక్షకులకి ఇబ్బంది కలగడమే కాకుండా, మేము కూడా నష్టపోతున్నాం. ఇనుప కంచె, మేకులు ఏర్పాటు చేయడం వల్ల, స్క్రీన్ పైకి ఎవరు వెళ్లకుండా, కిందే ఎగురుతారు. బౌన్సర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
కుర్చీల్లో ఎగరడం వల్ల కుర్చీలు విరిగిపోతున్నాయి. దీంతో నెక్స్ట్ షో ప్రేక్షకులు మూడుగంటల పాటు సినిమా చూడలేరు. గతంలో ఇలాగే ఒక సినిమాకి చెయ్యడం వలన, 150 కుర్చీలు విరిగిపోయాయి. దీంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చెయ్యడంతో టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేశాం. ఇప్పుడు కుర్చీ కింద పెద్ద పెద్ద బండ రాళ్లు ఏర్పాటు చేయడం వల్ల, ఎంత ఎగిరినా కుర్చీలు డామేజ్ అవ్వవని యాజమాన్యం చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారడంతో పాటు, అభిమానులని కంట్రోల్ చేయడానికి శైలజ థియేటర్ ఫాలో అయినట్టుగానే ఇతర థియేటర్స్ వాళ్ళు ఫాలో అవుతారేమో చూడాలి.
![]() |
![]() |