![]() |
![]() |
.webp)
పాన్ ఇండియా లెవల్లో కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు, పైరసీ ఉగ్రవాదులు సదరు చిత్రాలని పలు మార్గాల ద్వారా పైరసీ చేసి కోట్ల రూపాయలని సంపాదిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన తేజ సజ్జ మిరాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(OG)కూడా థియేటర్స్ లో అడుగుపెట్టిన కొన్ని గంటలకే ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. రీసెంట్ గా హైదరాబాద్ నగర పోలీసులు కొంత మంది పైరసి ఉగ్రవాదులని అరెస్ట్ చేసారు.
ఈ విషయంపై హైదరాబాద్(Hyderabad)నగర పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతు నగరంలో విస్తృతంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారీ మూవీ పైరసీ రింగ్ని పట్టుకున్నాం. ఈ ఆపరేషన్లో ఐదుగురు కీలక నిందితులని అరెస్టు చేయడంతో పాటు, వారి వద్ద నుంచి కంప్యూటర్లు, హార్డ్డిస్కులు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ పరికరాలు తదితర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ నిందితులు కొత్తగా విడుదలైన తెలుగు, హిందీ, తమిళ సినిమాలని రహస్యంగా రికార్డ్ చేసి, వాటిని ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అక్రమంగా అమ్మకాలు జరుపుతు కోట్ల రూపాయల లాభాలని ఆర్జిస్తున్నారు. ప్రత్యేక బృందాలు వారాల తరబడి నిఘా ఉంచి,నిందితుల గ్యాంగ్ ని పట్టుకున్నాం.
సినిమా పరిశ్రమని దెబ్బతీసే పైరసీ మాఫియాని ఉపేక్షించం. కఠిన చర్యలు ఉంటాయి.ప్రజలు కూడా థియేటర్లలో సినిమాలు చూసి పరిశ్రమని ఆదుకోవాలి. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీస్ స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో పనిచేసారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ గ్యాంగ్కు సంబంధించి మరిన్ని వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఇది హైదరాబాద్ నగర పోలీసులు పైరసీపై సాధించిన ఒక పెద్ద విజయంగా కూడా పరిగణిస్తున్నారు. పైరసీ ఉగ్రవాదుల వల్ల సినిమా ఇండస్ట్రీకి యేటా 3000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్న విషయం తెలిసిందే.
![]() |
![]() |