![]() |
![]() |
పవర్స్టార్ పవన్కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఓజీ సాధించిన విజయంపై సినీ ప్రముఖులు ప్రశసలు కురిపిస్తున్నారు. ఇక అభిమానులు ఓజీ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తుంటే మరో పక్క పవన్కళ్యాణ్ కుమార్తె ఆద్య, కుమారుడు అకీరా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రేణుదేశాయ్ తన కుమార్తె ఆద్య గురించి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్లో ‘ఆధ్య ఇప్పుడు పెద్దదై తన అన్న అకీరాతో కలిసి థియేటర్లకు వెళ్లి నాన్న సినిమా ఓజీని ఎంజాయ్ చేస్తోంది. నిన్న రాత్రి, ఈరోజు మధ్యాహ్నం, రేపు, ఎల్లుండి కూడా థియేటర్లకు వెళ్లే ప్లాన్ వేసుకుంది. ఆద్య తన నాన్న సినిమా చూసి ఎంజాయ్ చెయ్యడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఓజీ డ్రెస్లో వున్న ఆద్య ఫోటోలు షేర్ చేసిన రేణు దేశాయ్.. చివరి ఫొటోలో ‘ఆమె తండ్రి చేసిన రెండు ఐకానిక్ రోల్స్ మేళవింపుగా కనిపిస్తోంది’ అని కామెంట్ చేశారు. రేణు పోస్ట్ పవన్ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, రేణు దేశాయ్ ప్రదర్శించిన ఆనందం నెటిజన్లకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
ఓజీ సినిమా ప్రీమియర్స్ నుంచే బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు 155 కోట్లు కలెక్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓజీ చాలా సినిమాల రికార్డులను అధిగమించింది. ఇప్పటికే హౌస్ఫుల్ కలెక్షన్స్తో థియేటర్లు సందడిగా కనిపిస్తున్నాయి. దసరా సెలవులు కావడంతో కలెక్షన్లు భారీ స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటివరకు పవన్కళ్యాణ్ చేసిన ఏ సినిమాకీ రాని అప్రిషియేషన్, కలెక్షన్లు ఓజీకి లభిస్తున్నాయి. దీంతో పవర్స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
![]() |
![]() |