![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas),అనుష్క(Anushka)ఫెయిర్ కి సిల్వర్ స్క్రీన్ పై మంచి క్రేజ్ ఉంది. మిర్చి, బాహుబలి సిరీస్ సక్సెస్ లే అందుకు ఉదాహరణ. సినిమాల పరంగా కాకుండా,వ్యక్తిగతంగా కూడా, ఆ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పైగా ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఎప్పట్నుంచో వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలని ఇద్దరు ఎక్కడ ఖండించలేదు. దీంతో పెళ్లి న్యూస్ పై మరింతగా చర్చ జరుగుతూనే ఉంది.
అనుష్క టైటిల్ రోల్ ని పోషించిన 'ఘాటి'(Ghaati)రేపు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో 'ఘాటి' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ గ్లింప్స్ విడుదలైంది. ఎంతో పవర్ ఫుల్ గా ఉన్న గ్లింప్స్ లో యాక్షన్ సన్నివేశాలు, అనుష్క రౌద్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా చివర్లో 'వాళ్ళు ఊరుకోరు, వీళ్లు ఊరుకోరు అంటే నేను ఊరుకోను' అని అనుష్క చెప్పిన డైలాగ్ అయితే సూపర్ గా ఉంది. ఏ ఉద్దేశ్యంతో 'ఘాటి' తెరకెక్కిందనే విషయాన్నీ కూడా ఆ డైలాగ్ ద్వారా చెప్పించినట్టయ్యింది. ఇక ముందుగా చేసుకున్న ఒప్పంద ప్రకారం ఘాటి ప్రమోషన్స్ లో అనుష్క పాల్గొనడం లేదు. దీంతో ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ గ్లింప్స్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఘాటి కి విభిన్న దర్శకుడు 'క్రిష్(Krish)జాగర్లమూడి 'దర్శకత్వం వహించాడు ఇంతకు ముందుకు ఈ ఇద్దరి కాంబోలో వేదం వచ్చి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యరావు, జిష్ణు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

![]() |
![]() |