![]() |
![]() |

ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో ప్రముఖ నటుడు 'సోనుసూద్'(Sonu sood)కి ఉన్న ప్రత్యేకత అందరకి తెలిసిందే. రెండున్నర దశాబ్దాలపై నుంచే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలకి చెందిన చిత్రాల్లో చేస్తు, బహుబాషా నటుడుగా కీర్తి గడించాడు. తను సిల్వర్ స్క్రీన్ పై పోషించే క్యారెక్టర్స్ కి ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. సామాజిక సేవా పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తు, సినిమా నటులకి గౌరవాన్ని పెంచడంతో పాటు, ఎంతో మంది పేదవాళ్ళకి అండగా ఉంటు వస్తున్నాడు.
కొంత కాలం నుంచి సోను సూద్ రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడి పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల ముంబైలోని అత్యంత ఖరీదు ప్రాంతమైన మహాలక్ష్మి(Mahalakshmi) ఏరియాలోని 'లోఖండ్వాలా మినర్వా'(LOkhandwala Minerva)లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసాడు. 5 కోట్ల రూపాయలకి సదరు ప్లాట్ ని కొనుగోలు చెయ్యడం జరిగింది. రీసెంట్ గా 'సోనుసూద్' ఆ ప్లాట్ ని 8.10 కోట్లకు విక్రయించాడు. అంటే సోను సూద్ 3.10 కోట్లు లాభాన్ని ఆర్జించడం జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ తో అభిమానులు ఎంతో హ్యాపీగా ఉన్నారు.
సోనూ సూద్ విక్రయించిన ఫ్లాట్ 92 అంతస్తుల ఒక లగ్జరీ రెసిడెన్షియల్ స్కైస్క్రాపర్. భారతదేశంలోని అత్యంత పొడవైన రెసిడెన్షియల్ టవర్లలో ఒకటి. 1,247 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా,1,497 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియా కలిగి ఉంది. స్కై లాంజ్, ప్రైవేట్ క్లబ్, ప్రపంచ స్థాయి ఫిట్నెస్ సెంటర్, రెండు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. అరేబియా సముద్రం యొక్క అద్భుతమైన దృశ్యాలని కూడా ఫ్లాట్ నుంచి చూడవచ్చు. సినిమాల పరంగా చూసుకుంటే సోను సూద్ ఈ ఏడాది జనవరి 10 న 'ఫతే' అనే బాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కగా పరాజయాన్ని అందుకుంది.

![]() |
![]() |