బ్లాక్ బస్టర్ మూవీ `సోగ్గాడే చిన్ని నాయనా` (2016)కి సీక్వెల్ గా `బంగార్రాజు` రాబోతున్న సంగతి తెలిసిందే. `సోగ్గాడే..`లో ద్విపాత్రాభినయం చేసిన అక్కినేని నాగార్జున.. ఇందులోనూ తండ్రీకొడుకులుగా సందడి చేయనున్నారు. ఒక పాత్రకి జోడీగా రమ్యకృష్ణనే కొనసాగనుండగా.. మరో నాయిక పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అంతేకాదు.. ఇందులో నాగ్ తనయులు నాగచైతన్య, అఖిల్ ముఖ్య పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 20 నుంచి ప్రారంభించనున్నారని సమాచారం. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో `బంగార్రాజు` తాలూకు ఫస్ట్ షెడ్యూల్ జరుగనుందట. ఈ షెడ్యూల్ లో నాగ్, రమ్యకృష్ణపై కొన్ని కీలక దృశ్యాలను చిత్రీకరించనున్నారని టాక్. ఆపై చకచకా సినిమాని పూర్తిచేసి 2022 సంక్రాంతికి ఈ సీక్వెల్ ని రిలీజ్ చేసే దిశగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సన్నాహాలు చేస్తున్నారట. మరి.. `సోగ్గాడే చిన్ని నాయనా` తరహాలో `బంగార్రాజు` కూడా బాక్సాఫీస్ ముంగిట కాసుల వర్షం కురిపిస్తాడేమో చూడాలి.
కాగా, `బంగార్రాజు`ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ నిర్మించనుండగా.. అనూప్ రూబెన్స్ బాణీలు అందించనున్నాడు.