![]() |
![]() |

'గ్రహణం', 'అష్టా చమ్మా', 'గోల్కొండ హైస్కూల్', 'సమ్మోహనం' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మోహన కృష్ణ ఇంద్రగంటి. అయితే ఆయన గత రెండు చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. 'వి' సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై జస్ట్ ఓకే అనిపించుకోగా.. ఇక 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రమైతే పెద్దగా ప్రేక్షకులకు తెలియను కూడా లేదు. ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఇంద్రగంటి.. తాజాగా కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు.
ఇంద్రగంటి తన తదుపరి సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో చేస్తున్నారు. ఈ బ్యానర్ లో ఆయనకిది మూడో సినిమా. గతంలో వీరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు 'జెంటిల్మన్', 'సమ్మోహనం' ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. ఈ సినిమాలో హీరోగా ప్రియదర్శి నటిస్తుండగా, హీరోయిన్ గా రూప కొడవయూర్ నటిస్తోంది. ప్రియదర్శి, ఇంద్రగంటి కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రమిదే. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఇవాళ ప్రారంభమైంది. షూటింగ్ కూడా ఈరోజే మొదలైంది.
ఓ వైపు కమెడియన్ నటిస్తూనే మరోవైపు హీరోగానే రాణిస్తున్నాడు ప్రియదర్శి. గతేడాది 'బలగం'తో హీరోగా మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న ప్రియదర్శి.. ఇంద్రగంటితో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
![]() |
![]() |