![]() |
![]() |

స్టార్ హీరోల సినిమాలు కూడా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. దీని కారణంగా థియేటర్లలో వసూళ్లపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు కొన్ని సినిమాలు ఏకంగా మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ముందుముందు పెద్ద హీరోల సినిమాలు కూడా రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యంలేదు అనేలా పరిస్థితి ఉంది.
మాస్ మహారాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
.webp)
'ఈగల్' మూవీ ఓటీటీ రైట్స్ ని ఈటీవీ విన్ దక్కించుకుంది. ఈ సినిమా మార్చి 8 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని ఇటీవల న్యూస్ వినిపించింది. అయితే ఈగల్ చిత్రాన్ని మార్చి 1 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది ఈటీవీ విన్. అంటే థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతుంది అన్నమాట. ఇదిలా ఉంటే ఈటీవీ విన్ తో పాటు మరో ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా విడుదల కానుంది 'ఈగల్'.
అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, వినయ్ రాయ్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన ఈగల్ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతం అందించాడు.
![]() |
![]() |