![]() |
![]() |

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన -దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిలో ఉండే సంబరాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది పెళ్లి కల్చర్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు. కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు.
ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్ లో ప్రారంభం అయ్యాయి. నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా స్టార్ట్ అయిన ఈ కార్యక్రమంలో సాయి రోనక్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ గా కృష్ణ, ఎడిటర్ గా బొంతల నాగేశ్వర రెడ్డి వ్యవహరిస్తున్నారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం సాహిత్యం అందిస్తున్నారు.
![]() |
![]() |