![]() |

'త్రిబాణధారి బార్బరిక్' సినిమాని చూడటానికి ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడంతో.. ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స చెప్పుతో కొట్టుకున్న సంగతి తెలిసిందే. మోహన్ శ్రీవత్స అలా చేయడాన్ని ప్రముఖ దర్శకుడు మారుతి తప్పుబట్టారు. కళను నమ్ముకున్న వాళ్ళు అలా చేయకూడదని, ఇది కాకపోతే ఇంకో సినిమాతో మెప్పించే ప్రయత్నం చేయాలని అన్నారు. అంతేకాదు, ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ పేరుతో కొంతమంది పిచ్చి చేష్టలు చేస్తున్నారంటూ మారుతి విరుచుకుపడ్డారు.
సెప్టెంబర్ 19న విడుదల కానున్న 'బ్యూటీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన మారుతి మాట్లాడుతూ.. "ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, చొక్కా విప్పుకు తిరుగుతాం అంటున్నారు, అసలు సినిమాలే మానేస్తాం అంటున్నారు. ఇంతలా దిగజారాలా?. అసలు కల్చర్ ఎటుపోతోంది. కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తేనో, బూతులు మాట్లాడితేనో సినిమాలు చూస్తారు అనుకుంటున్నారు. బూతులు రాసి డబ్బులు సంపాదించలేక కాదు. డబుల్ మీనింగ్ డైలాగ్ లు నాకంటే గొప్పగా ఎవడు రాయలేడు. కానీ, బస్ స్టాప్ సినిమాతోనే ఆపేశాను. మంచి సినిమాలు తీయాలి, మన సినిమాలు ఫ్యామిలీస్ చూడాలి అనే ఉద్దేశంతో రాయట్లేదు. ఈరోజుల్లో, బస్ స్టాప్ సినిమాలు చేసిన డబులు మీనింగ్ లు, బూతుల డైరెక్టర్.. ఇప్పుడు 400 కోట్లతో రాజా సాబ్ చేస్తున్నాడు. వాడి ఎదుగుదల చూడండి. ఊరికే డైరెక్టర్లు అయిపోరు. ఊరికే పాన్ ఇండియా స్టార్లు పిలిచి సినిమాలు ఇవ్వరు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. సినిమాని ఆడించాలనే ఉద్దేశంతో ఈవెంట్స్ లో ఇష్టమొచ్చి మాట్లాడుతున్నారు. సినిమాని నమ్మండి, కంటెంట్ ని నమ్మండి. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా. ఆడియన్స్ కి ఏది కావాలో తెలుసుకొని అది చేయండి. అంతేకాని, చిల్లర పనులు చేయకండి." అన్నారు.
![]() |