![]() |
![]() |

ధర్మ కీర్తిరాజు హీరోగా, నిఖిత స్వామి హీరోయిన్ గా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా 'అప్సర'. కె ప్రవీణ్ నాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శంకర్ రామ్ రెడ్డి నిర్మాత. రేణు కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పి.కె.హెచ్. దాస్, ఎడిటర్ గా గిరీష్ కుమార్ పనిచేశారు.
ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమాగా దర్శకుడు కె ప్రవీణ్ నాయక్ ఈ సినిమాను తెరకెక్కించారు. లవ్, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్నీ అప్సర సినిమాలో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
రేణు కుమార్ అందించిన సాంగ్స్ అన్నీ కుడా సినిమాకు హైలెట్ కాబోతున్నాయి. ధర్మ కీర్తిరాజు, నిఖిత స్వామి కెమెస్త్రి సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.
సుమన్ శర్మ, నాగేంద్ర యుఅర్ఎస్, కోటే ప్రభాకర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. వారి పాత్రలు సినిమాకు కీలకం.. అలాగే ముగ్గురు వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అప్సర సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
![]() |
![]() |