![]() |
![]() |

అగ్ర హీరోయిన్ 'అనుష్క'(Anushka)ఈ నెల 5 న 'ఘాటీ'(Ghaati)తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కగా, అనుష్క కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోతుందనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతుంది. దర్శకుడు క్రిష్(Krish Jagarlamjudi)వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటు ఘాటీ గురించి, అందులోని అనుష్క నటన గురించి చెప్పుకొస్తున్న విషయాలతో 'ఘాటీ' పై అంచనాలు అంతకంత పెరిగాయి. అనుష్క గంజాయి స్మగ్లింగ్ చేసే 'షీలావతి' క్యారక్టర్ లో కనిపిస్తుంది. ఆ తర్వాత తాను చేస్తున్న పని తప్పని తెలుసుకొని గంజాయి ముఠాని ఏ విధంగా నిర్మూలించిందనే పాయింట్ తో 'ఘాటీ' తెరకెక్కింది.
కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో 'పుష్ప' (Pushpa)సిరీస్ లోని ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)నటనకి, ఘాటీ లోని అనుష్క నటనని పోలుస్తు పోస్ట్ లు కనపడుతున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా పుష్ప రాజ్, షీలావతి లు స్మగ్లింగ్ పై తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఈ ఇద్దరు క్రిష్ దర్సకత్వంలోనే వచ్చిన 'వేదం' మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఘాటీలో విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతిబాబు, జిష్ణు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ కీలక పాత్ర పోషించగా ఫస్ట్ ఫేమ్ ఎంటర్ టైన్ మెంట్ పై సాయిబాబు, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్ అయితే రికార్డు వ్యూస్ తో దూసుపోతుంది.

![]() |
![]() |