కొంతకాలంగా తెలుగు సినిమా పాటల్లో ఎక్కువగా వినిపిస్తున్న గొంతు 'సిద్ శ్రీరామ్'. సౌత్ లో ఎన్నో సాంగ్స్ పడుతూ తన వాయిస్ తో మ్యాజిక్ చేస్తున్న ఈ సింగర్.. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అది కూడా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం సినిమాతో హీరోగా మారనున్నాడని టాక్ వినిపిస్తోంది.
మణిరత్నం దర్శకత్వం వహించిన 'కడల్' సినిమాతో సింగర్ గా సిద్ శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చాడు. మణిరత్నం నిర్మాతగా వ్యవహరించిన 'వానం కొట్టత్తుం'తో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఇప్పుడు హీరోగానూ మణిరత్నం సినిమాతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలొస్తున్నాయి. ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహిస్తారా లేక నిర్మాతగా వ్యవహరిస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
సింగర్ గా అతికొద్ది కాలంలోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న సిద్ శ్రీరామ్.. హీరోగానూ ఆకట్టుకుంటాడేమో చూడాలి.