LATEST NEWS
కొడలి నాని, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ తన బూతుల పంచాంగం దుమ్ము దులిపారు. మంత్రిగా ఉన్న సమయంలో నిత్యం విపక్ష నేతపై విమర్శలతో విరుచుకుపడిన నాని.. మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాకా.. తన వాగ్ధాటికి కొంత బ్రేక్ వేశారు. మంత్రి పదవి నుంచి ఊడబీకినందుకు అసంతృప్తో, నిరసనో తెలియదు కానీ, ఆయన ఒకింత మౌనం పాటించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ హెల్త్ వర్శిటీగా మార్చిన సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరినప్పటికీ ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మీడియా సమావేశం పెట్టలేదు. అలాగే మంత్రి పదవి ఊడిన తొలి నాళ్లలో ఓ విధమైన వైరాగ్యం ప్రదర్శించారు. పశువుల పాకలో పడుకున్నారు. అప్పట్లో అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి కూడా. అప్పట్లో ఓ పశువుల కొట్టంలో  మంచమేసుకొని.. రెండు దిండ్లు ప‌రుచుకుని.. హాయిగా రిలాక్స్ అవుతున్న ఫొటో బాగా సర్క్యులేట్ అయ్యింది. అప్ప‌టి వ‌ర‌కూ ప‌శువుల కొట్టంలో ప‌ని చేసి..చేసి అల‌సిపోయి  కాసేపు ఇలా సేద‌తీరుతున్న‌ట్టు ఉందీ ఫోటో అంటూ అప్పట్లో నెటిజన్లు సెటైర్లు కూడా వేశారు. అంతేనా.. మంత్రి ప‌ద‌వి పోయింద‌నే ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్న‌ట్టున్నారు. జ‌గ‌న్ కోసం అంత చేసిన నా ప‌ద‌వే పీకేస్తాడా అంటూ తెగ ఫైర్ మీదున్నట్లున్నాడు అని కొందరు కామెంట్లు చేస్తే.. ఇక‌పై ప్రెస్‌మీట్లు ఉండవు, బూతులు మాట్లాడే ఛాన్స్ రాదు అన్న బాధ అనుకుంటా అంటూ మరి కొందరు వ్యాఖ్యలు చేశారు. కార‌ణం ఏమో తెలీదు కానీ.. ఆయ‌న తీవ్ర అసంతృప్తితో, ఆవేద‌న‌తో ఉన్నార‌ని అప్పట్లో కొడాలి నాని అనుచ‌రులు గట్టిగా చెప్పారు. అలాంటి నాని ఒక్క సారిగా మళ్లీ బూతుల పంచాంగం విప్పారు. తెలుగు అధినేత చంద్రబాబుపై  విమర్శలు ఎక్కుపెట్టారు. సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి దివంగత ఎన్టీఆర్ అయితే... చంద్రబాబు ఒక 420 అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిన చంద్రబాబు... ఆయన బతికుండగానే సీఎం పదవి నుంచి తప్పించారని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెడతారని చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని తెలిపారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం సీటును లాక్కున్నారని దుయ్యబట్టారు.  ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెప్పుకుంటున్నవాళ్లు సిగ్గులేకుండా చంద్రబాబు వెనుక తిరుగుతున్నారని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ లా చాలా పౌరుషం ఉన్న వ్యక్తి హరికృష్ణ మాత్రమేనని చెప్పారు. ఎన్టీఆర్ లా సొంతంగా పార్టీ పెట్టి సీఎం అయిన వ్యక్తి జగన్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబుకు స్వార్థం ఎక్కువని... ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఇప్పుడు కూడా ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగిందని ఆరోపించారు. ఇంత హఠాత్తుగా కొడాలి నాని తన గొంతు సవరించుకుని మరీ విమర్శల చిట్టా విప్పి మీడియా ముందుకు రావడానికి కారణం నేడో, రేపో, రేపో, మాపో జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయన్న సమాచారమేనని పరిశీలకులు అంటున్నారు. ముచ్చటగా మూడో సారి జగన్ చేపట్ట నుంచి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కొడాలి నానికి కచ్చితంగా బెర్త్ దొరుకుతుందన్న సమాచారంతోనే నాని ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో ఒకింత సైలెంట్ గా ఉంటూ వస్తున్న నాని మళ్లీ బూతుల మంత్రిగా తనకు ఉన్న ఫేమ్ ను పూర్తిగా ఉపయోగించుకునేందుకు రెడీ అయిపోయారని అంటున్నారు. 
తెలంగాణ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకూ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటిస్తే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు   హాలిడేస్‌ను డిక్లేర్ చేసిన విద్యాశాఖ. 2023-24 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు ఎస్ఏ-2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.21 నుంచి 24వ తేదీ వరకు మూల్యాంకనం చేయనున్నారు. వచ్చేనెల 25న పేరెంట్స్ మీట్ నిర్వహించి.. విద్యార్థుల మార్కులు వెల్లడిస్తారు. కాగా  వచ్చేనెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
వేదంలా ఘోషించే గోదావరి... అమర ధామంలా శోభిల్లే  రాజమహేంద్రి... శతాబ్దాల  చరితగల  సుందర  నగరం .. గత  వైభవ  దీప్తులతో  కమ్మని  కావ్యం.. అలాంటి రాజమహేంద్రవరం మహానగరం పసుపు శోభ సంతరించుకోనుంది. తెలుగుదేశం మరికొద్ది రోజుల్లో పసుపు కళ సంతరించుకోనుంది. మే 28 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి. అలాగే ఆ   మహానాయకుడి శత జయంతోత్సవ సంవత్సరం.  ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మహా పండగ అయిన మహానాడును రాజమండ్రిలో నిర్వహించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. దీంతో రాజమండ్రి వేదికగా  మహానాడు బహిరంగ సభకు పార్టీ అధిష్టానం కమిటీని  ఏర్పాటు చేయనుంది.   అలాగే ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సభలలో ఒకటి హైదరాబాద్ వేదికగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ 100 సభలు నిర్వహించాలని నిర్ణయించిన తెలుగుదేశం.. తెలుగురాష్టరాలలోని 42 నియోజకవర్గాల కేంద్రాలలోనూ ఒక్కో సభ నిర్వహించాలని నిర్ణయించింది. మిగిలిన 58 సభలో వివిధ నగరాలు, పట్టణాలలో నిర్వహిస్తుంది. వందో సభ మహానాడు సభతో ముగుస్తాయి.   ఇక జగన్ ప్రభుత్వం అలంబిస్తున్న ప్రజా వ్యతికేర విధానాలపై టీడీపీ ఇప్పటికే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి  బలంగా తీసుకు వెళ్లింది. అలాగే ఈ సారి ఎన్నికల మేనిఫెస్టో విభిన్నంగా ఉండడమే కాకుండా, ప్రజలందరికీ చేరువ అయ్యే పథకాలతో రూపొందించే దిశగా ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ఆర్థిక అసమానతలు లేకుండా.. ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా పథకాల రూపకల్పన చేయాలని నిర్ణయించారు.  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా .. ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను సంసిద్దం చేసేందుకు టీడీపీ అధినాయకత్వం   ముందుకెళ్తోంది. ఇక ఎన్టీఆర్ శతజయంతి వేళ.. ఆయన పేరిట 100 రూపాయిల నాణాన్ని  విడుదల చేయనున్నట్లు కేంద్రం గెజిట్ విడుదల చేసింది.  మరోవైపు గతేడాది ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే తెలంగాణలో ఖమ్మం వేదికగా జరిగిన శంఖారావ సభ సైతం సూపర్ సక్సెస్ అయింది. ఆ క్రమంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. ఇక మార్చి 29న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.   తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వాటిలో 100 స్థానాలలో  ఇప్పటికిప్పుడు అభ్యర్థులను దింపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు...బీఆర్ఎస్, బీజేపీలలో కలవరం రేపాయి.  ఇంకోవైపు ఏపీలో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నలుగురు ఘన విజయం సాధించారు. దీంతో అధికార జగన్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా క్లియర్ కట్‌గా స్పష్టమైందని తేటతెల్లమైంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట చేపట్టి పాదయాత్ర ప్రభంజనంలో దూసుకుపోతోంది. ఇక తెలుగుదేశం మహానాడును రాజమండ్రిలో  నిర్వహించాలని నిర్ణయించడం వెనుక ఆ పార్టీ అధినేత చంద్రబాబు పకడ్బందీ వ్యూహం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలు కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే.    2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. దాంతో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలకుగాను.. 14 స్థానాలను టీడీపీ గెలుచుకోగా.. ఒక్క స్థానం నుంచి తెలుగుదేశంతో పొత్తులో ఉన్న బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.  అలాగే తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలకుగాను.. 12 టీడీపీ, ఒకటి బీజేపీ గెలుపొందిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలోని మొత్తం అన్ని స్థానాలను  గెలుచుకునే వ్యూహంలో భాగంగానే మహానాడు ను గోదావరి ఒడ్డున ఉన్న రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారనే చర్చ సైతం ఊపందుకొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముచ్చటగా మూడోసారి తన  కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైందని అందుకే ఇటీవల గవర్నర్  అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారనీ, ఆ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించే ఆయనతో చర్చించారనీ అంటున్నారు.  రేపో మాపో..ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మార్చి 31 లేదా ఏప్రిల్ మొదటి వారంలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెబుతున్నారు.  ఈ సారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ముగ్గురు నుంచి ఐదుగురి వరకూ కొత్త వారికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.  కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పు రాయలసీమ ప్రాంతాల నుంచి ఇద్దరిని తీసుకునే అవకాశం ఉందనే   చర్చ పార్టీ వర్గాలలో జోరుగా కొనసాగుతోంది. అలాగే ఇద్దరు ముగ్గురు ప్రస్తుత మంత్రులకు ఉద్వాసన కూడా ఉంటుందని అంటున్నారు.  కొడాలి నానికి మరోసారి మంత్రిగా అవకాశం ఇవ్వాలని సీఎం డిసైడైపోయారని చెబుతున్నారు.  ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాలపై ఘాటు విమర్శలు చేయాలంటే కొడాలి వంటి మంత్రి తన కేబినెట్ లో ఉండాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.  అదీకాక   జగన్ రెండోసారి... తన కేబినెట్ కూర్పులో.. కొడాలి నాని సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకోదు. ఇదే అంశాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు బహిరంగంగానే సీఎం జగన్‌పై విమర్శలు సైతం గుప్పించిన సంగతి తెలిసిందే. అలాంటి వేళ కొడాలి నానినీ మళ్లీ కేబినెట్‌లోకి తీసుకుంటే.. అన్ని నొప్పులకు ఒకటే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ లాగా... అందరికీ.. అన్నిటికి ఒకటే సమాధానం అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారన్న టాక్ అయితే పార్టీలో గట్టిగా వినిపిస్తోంది.    ఇక ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. జగన్ తొలి కెబినెట్‌లో మంత్రిగా పని చేశారు. అదీకాక ముఖ్యమంత్రి జగన్‌కు సమీప బంధువు. కానీ రెండో సారి కేబినెట్ కూర్పులో క్యాస్ట్ ఈక్వేషన్ కారణంగా.. ఆయనను తప్పించడంతో.. బాలినేని శ్రీనివాసరెడ్డి అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో హర్ట్ అయి బుంగ మూతి  పెట్టుకొన్నారు. బహిరంగంగా నిరసన కూడా వ్యక్తం చేశారు.  నెల్లూరు, తిరుపతి,   కడప జిల్లాలకు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారు.  అయితే ఉమ్మడి నెల్లూరు జల్లాలోని ఫ్యాన్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు మిన్నంటాయి. ఆ క్రమంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి విజయం నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది.  అలాగే ఇదే జిల్లాకు చెందిన కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు మరి కొందరు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేస్తారంటూ  సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో కథనాలు అయితే వెలువడుతున్న నేపథ్యంలో  నెల్లూరు జిల్లాలో  పార్టీలో ఉన్న అసమ్మతిని తగ్గించి.. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో మళ్లీ పార్టీ క్లీన్ స్వీప్ చేయించేందుకు బాలినేనితోపాటు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు.. గంపగుత్తగా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీంతో అటు ఉత్తరాంద్ర, ఇటు తూర్పు పశ్చిమ రాయలసీమ ప్రాంతాల నుంచి ఇద్దరిని కేబినెట్‌లో తీసుకొంటారని.. ఆ క్రమంలోనే ఆయా ప్రాంతాలకు చెందిన ప్రస్తుత కేబినెట్‌లోని మంత్రులకు ఉద్వాసన తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది.  మార్చి 14న జరిగిన కేబినెట్ భేటీలో.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మన పార్టీ అభ్యర్థులే గెలవాలని.. మంత్రుల పని తీరును గమనిస్తున్నానని.. ఈ ఎన్నికల్లో తేడా వస్తే.. కేబినెట్‌లో మార్పులు చేర్పులు తథ్యమంటూ   ముఖ్యమంత్రి  జగన్ హెచ్చరించిన విషయాన్ని పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  
 రౌడీయిజం, ఫ్యాక్షనిజంలో కక్షలు కార్పణ్యాలు ఉంటాయి. అందులోనూ రాయలసీమ రాజకీయాల్లో ఫ్యాక్షనిజం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అది అభిలషణీయం కాదు. అయినా  అదొక రకం. ఇప్పుడు విషయం అది కాదు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులపై కక్ష సాధింపు కోసం ఎండలు మండుతున్నా ఒంటిపూట బడులు ప్రారంభించలేదని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో ఆరోపించారు.  ఎండలు మండుతున్నా ఒంటిపూట బడులు ఎందుకు నిర్వహించరని, ఉపాధ్యాయులపై కక్ష సాధింపు కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడతారా? అని ఆ లేఖలో అనగాని సత్యప్రసాద్  ప్రశ్నించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఒంటిపూట బడులు పెట్టడం దశాబ్ధాలుగా అమలులో ఉంది. అయితే ఒంటిపూట బడుల కోసం అడిగిన ఉపాధ్యాయులపై  మంత్రి బొత్స ఆగ్రహించడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ మండిపడ్డారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా  ఫ్యాక్షనిస్టు రాజకీయాలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయా, లేవా అనే విషయాన్ని పక్కన పెడితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు కక్ష సాధింపు దాడులకు,  హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణ అయితే బలంగా వినిపిస్తోంది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ రెడ్డి కుల్చివేతల పాలనలో గీతం యూనివర్సిటీ సహా అనేక మంది ప్రతిపక్ష నాయకుల ఇళ్లూ, వాకిళ్ళ కూల్చివేతల సంఘటనలు అనేకం వెలుగు చూశాయి. రాజకీయ ప్రత్యర్ధులపై  భౌతిక దాడులు నిత్య కృత్యంగా సాగుతున్నాయనే ఆరోపణ ఎటూ ఉండనే వుంది. అలాగే, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది హత్యలకు గురయ్యారనే ఆరోపణలున్నాయి. ఈ నాలుగు సంవత్సరాలలో జరిగిన పరిణామాలను గమనిస్తే  వైసేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే అభిప్రాయం  సామాన్య ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది.  ఈ నేపథ్యంలో  ప్రభుత్వం పట్ల ధిక్కార స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్న ఉపాధ్యాయులపై  ముఖ్యమంత్రి  కట్టారని, అందుకే, ఇరుగు  పొరుగు రాష్ట్రాలలో ఎప్పటినుంచో ఒంటి పూట  బడులు నిర్వహిస్తున్నా రాష్ట్రంలో మాత్రం నిర్ణయం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. మరోవంక   పిల్లల తల్లితండ్రులు ఎండలు తీవ్ర స్థాయికి చేరిన పరిస్థితిలో మీ రాజకీయాల కోసం పిల్లలు ప్రాణాలతో చెలగాటం వద్దని అంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
Everyone knows about the Manchu brothers’ recent alleged feud. It has become a discussion point in the Telugu states from past few days. The video has gone viral on social media and TV channels picked up the issue in no time and blew the whole issue out of proportion.   Amidst all this, the media as well as the public wants to know what exactly happened in Manchu’s house. Now cashing in on this craze and surge in demand from all over to know the happenings of Manchus, actor, filmmaker and businessman Manchu Vishnu has come up with an interesting idea of ‘Manchus Reality Show’.   Interestingly, a glimpse about this reality TV show House of Manchus is out. The glimpse featured clippings of news channels about Manchus and the recent incident. Looks like, Vishnu Manchu poked these channels in the teaser and thus wants this reality TV show to be the talking point.    Touted to be India’s biggest reality show, House Of Manchus is going to be similar to The Kardashians, an American reality TV series that focuses on the personal lives of the Kardashians. The reality show is going to be produced by Vishnu himself on AVA Entertainment. More details will be known soon. This reality show will premiere this year only.
Young actor Bellamkonda Sai Sreenivas, who made his Tollywood debut with the movie Alludu Sreenu, got a good success.    After that, he made few films in Telugu like Jaya Janaki Nayaka, Sita, Rakshasudu and few others which failed to impress audience.   Now for the first time, he is making his Bollywood debut with a remake movie. A few years ago, the movie Chatrapathi directed by Rajamouli starring Pan Indian star Prabhas was released in Telugu and created a sensation.   Meanwhile that movie is currently directed by VV Vinayak in Hindi with Bellamkonda Srinivas as the hero. The shooting of this movie, which has been completed long ago, has been produced by Dhaval Jayanthilal Gada and Akshay Jayanthilal Gada under the banner of Pen Movies.   Today the makers released the first look teaser of this movie. Meanwhile, the teaser of Chatrapathi was filled with massive action and mass emotions. Especially in the teaser Bellamkonda Srinivas looks, style, action, fights are amazing, the BGM and the visuals are also very good.   Currently this teaser is getting good response from everyone. Meanwhile, this movie will be released on May 12. Bellamkonda thinks he has good craze in Hindi by watching his dubbed film views on Goldmines channel. We have to wait and see how well he impresses Bollywood audience.
Pan India biggie NTR 30 starring NTR under the direction of star director Koratala Siva. Recently, the film had a grand launch with pooja programs.   As it is the second collaboration of sensational combo after Janatha Garage there are huge expectations on the film. The team has roped in some top technicians from Hollywood to handle the stunts and visual effects in the film.   The latest update is that the film will start shooting tomorrow with a high octane fight sequence. Koratala promised that NTR 30 will his best work till now. Now we have to wait few more days to see how he handles this biggie.   Bollywood beauty Janhvi Kapoor, is playing the heroine in this film. Produced by Harikrishna and Mikkilineni Sudhakar under the banner of NTR Arts and Yuva Sudha Arts, the film is presented by Nandamuri Kalyan Ram. Anirudh Ravichander is composing the music for this film.
Natural star Nani much awaited Dasara hit the big screens today. The efforts of Nani created huge expectations on the movie and let's find out does it reach the expectations and excitement.   Story: Dasara story centres around Silk Bar in Veerlapally village in Godhavarikhani. Dharani (Nani), Soori (Dheekshith Shetty) Vennela (Keerthy Suresh) are childhood friends. Everyone in the village addicted to alcohol. Chinna Nambi (Shine Tom Chacko), son of Shivanna (Samuthirakani) is elected as the Sarpanch and he looks after the Silk Bar. Rajanna (Sai Kumar) helps Soori and his friends in a case and they elect him as their Sarpanch. After this, someone kills Soori on the night of his wedding with Vennela. Who killed Soori? What’s the future of Vennela? What did Dharani do then? All the questions are answered in the film.   Performances: Nani is one gem of an actor and proved it umpteen times. In Dasara, Nani reinvented himself and we see only Dharani from beginning to end. Undoubtedly Dasara remains Nani’s best performance so far. From the accent and appearance to emotional scenes and action sequences, Nani excelled in each and every frame. There are many highlight scenes of Nani where he snatches the show with his onscreen brilliance and especially in action.    Keerthy Suresh’s acting prowess could be seen alongside the scenes with Nani. Deekshith Shetty gives an exciting act matching Nani and Keerthy Suresh. In other actors, Sai Kumar and Samthurakani get very limited roles and they did fine. The friends’ gang of Dharani is good. Shine Tom Chacko looked ordinary and could have been more ruthless and powerful.   Technical Aspects: Srikanth Odela comes up with a routine story that has commercial elements to entertain mass audiences only. Music director Santhosh Narayanan gives addictive score and songs music that uplifts many scenes in the film. Sathyan Sooryan is terrific in his work. His camerawork, especially during the night scenes, looks quite rich. Editing should have been better and the editor Naveen Nooli should have trimmed many scenes in the second half to make Dasara an engaging fare. Production values are top-notch. The screenplay is good. Chamkeela Angeelesi song is impressive in every bit.   Positives: Nani Cinematography Action Scenes Interval Climax action set piece Background music   Negatives: Slow narration in some parts Straightforward story   Analysis: The first half of the movie builds the premise with more of the friendship between Nani and Dharani. The pace falls down most of the time in the first half until the pre-interval. The story keeps moving but there are places where it gives the dragged feel. The pre-interval block twist is a surprise and that particular shot is sure to leave an impact. The interval block sets the right arena for the second half. The second half has its own lows and highs. The emotions play high most of the time than the plot twists do. A Dasara-like film from a new director is promising.   The authentic taking and captivating performances from the lead actors work well for Dasara, but the story has too many concepts to be dealt with. The concepts of friendship, caste, and political gamble later get overshadowed by love and then lust. Dharani’s forgetfulness and courage when he gets drunk is a motif the director had been carrying from the start.   Coming to the presentation, the director maintained the theme and setting effectively from start till the end. The dark-lit setting and the minute details like party symbols changing in Silk Smitha’s painting do not let the audience deviate from the setting. The villain character appears flat where it should be intense and powerful. While the other lead cast is performing top-notch, the villain character appears weak and inferior mostly. Only the director knows if the characterization is intentional.   The climax of Dasara is one that steals the show. It is a never-before action-packed massacre from Nani and he appears monstrous with a weapon in hand. Overall, Dasara has a common story with an emotional ride and a blend of massive action in parts, but it is Nani’s never before performance that makes this Dasaraw.   Verdict: On the whole, Dasara is a gritty action drama that has Nani’s outstanding performance. He shouldered the film all the way. Keerthy Suresh, Dheekshith Shetty and Shine Tom Chacko also performed well. The film is quite good technically. Barring a few laggy portions in the second half, the film is a perfect choice to enjoy the weekend.   The film stars Keerthy Suresh and Deekshith in lead roles. Directed by Srikanth Odela, this movie is produced by Sudhakar Cherukuri under the banner of Sri Lakshmi Venkateswara Cinemas and Santosh Narayanan has given music for it.   Starring: Nani, Keerthy Suresh, Deekshith Shetty, Sai Kumar, Shine Tom Chacko, Samuthirakani, Purnaa, Zarina Wahab   Director: Srikanth Odela   Producers: Sudhakar Cherukuri   Music Director: Santhosh Narayanan   Cinematography: Sathyan Sooryan   Editor: Naveen Nooli
The talented and versatile actor who comes up with innovative concepts, Nandamuri Kalyan Ram is currently busy with the new film, Devil- The Secret Agent. The shooting has reached final stage. As part of the climax shoot, the makers are currently canning a massive action episode.   This action sequence involves 500 fighters in action with Kalyan Ram. This high-octane action sequence was designed by fight master Venkat. We can expect a powerful sequence that will be one of the Tollywood's best action sequences.   On this occasion producer Abhishek Nama said, "We are producing this film very prestigiously under our banner with a huge budget. The film's climax is currently being shot at breakneck speed. Venkat Garu is in charge of this massive action episode involving 500 fighters. It's going to be incredible, and everyone who sees it on the big screen will agree. We will provide more updates on this film soon."   The film is bankrolled under Abhishek Pictures banner. Being directed by Naveen Medaram, Devil has its story, screenplay and dialogues provided by Srikanth Vissa. Harshavardhan Rameshwar is scoring the music. Soundarajan will be handling the cinematography. More details regarding this said-to-be period spy thriller will be out soon.
  సినిమా పేరు: దసరా తారాగణం: నాని, కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, పూర్ణ, సాయికుమార్, సముద్రకని, ఝాన్సీ డైలాగ్స్: తోట శ్రీనివాస్ పాటలు: కాసర్ల శ్యామ్, శ్రీమణి, రెహమాన్, గడ్డం సురేశ్ సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ఎడిటింగ్: నవీన్ నూలి ప్రొడక్షన్ డిజైనర్: అవినాశ్ కొల్లా స్టంట్స్: రియల్ సతీశ్, అన్బరివ్ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, ఈశ్వర్ పెంటి సౌండ్ డిజైన్: సురేన్ జి., ఎస్. అలగియకూత్తన్   నిర్మాత: సుధాకర్ చెరుకూరి  రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ రిలీజ్ డేట్: 30 మార్చి 2023 'దసరా' ట్రైలర్‌లో నాని అవతారాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంతదాకా లోకల్ బాయ్‌గా, మన పక్కింటి అబ్బాయిగా కనిపిస్తూ వచ్చిన అతను మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్‌ను, అందులోనూ ఒక మొరటోడి క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడని అర్థమైంది. అంతకు ముందు వచ్చిన టీజర్, సాంగ్స్‌తో వచ్చిన క్రేజ్, ట్రైలర్ తర్వాత ఇంకో లెవల్‌కు చేరుకుంది. దానికి తగ్గట్లే నాని కెరీర్‌లో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని అడ్వాన్స్ బుకింగ్స్ మొదటిరోజు 'దసరా'కు కనిపించింది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తీసిన 'దసరా' ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. కథ సింగరేణి కాలరీస్ దగ్గర్లోని వీర్లపాలెం అనే ఊళ్లో ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి).. ఒకరి కోసం ఒకరు ప్రాణమైనా సునాయాసంగా ఇచ్చేంత జిగరీ దోస్తులు. ఇద్దరికీ తమ చిన్ననాటి నేస్తం వెన్నెల (కీర్తి సురేశ్) అంటే ప్రేమ. చిన్నప్పుడే వెన్నెలను తను ప్రేమిస్తున్నానని సూరి చెబితే, తన ప్రేమను తన గుండెల్లోనే దాచుకొని, సూరి-వెన్నెలను ఒక్కటి చేస్తాడు ధరణి. వీర్లపాలెంలో 'సిల్క్ బార్' బాగా ఫేమస్. ఎన్టీ రామారావు మద్య నిషేధం తేవడంతో తాగుడుకు అలవాటుపడ్డ ఆ ఊరి మగోళ్లంతా డీలా పడతారు. తాగుబోతులైన ధరణి, సూరి కూడా. అయితే సర్పంచి పోటీలో సవతి సోదరుడు రాజన్న (సాయికుమార్)పై గెలిచిన శివన్న (సముద్రకని), సిల్క్ బార్‌ను మళ్లీ తెరుస్తాడు. సరైన ఉద్యోగం లేని సూరికి తన కూతుర్ని ఇవ్వనని వెన్నెల తల్లి చెప్పడంతో, క్రికెట్ ఆటలో గెలిచి, సూరికి సిల్క్ బార్ క్యాషియర్ ఉద్యోగం వచ్చేట్లు చేస్తాడు ధరణి. అయితే పెళ్లయిన రోజు రాత్రి ఎక్కడినుంచో వచ్చిన గూండాలు బార్ దగ్గర దావత్ చేసుకుంటున్న ధరణి మిత్ర బృందంపై దాడిచేస్తారు. సూరి తల నరికేసి, మరో ముగ్గుర్ని కూడా చంపేస్తారు. తొలి రేయి కాకుండానే వితంతువు అవుతుంది వెన్నెల. తన ప్రాణమైన వెన్నెలను అలా చూసి భరించలేకపోయిన ధరణి ఏం చేశాడు? సూరిని చంపిన హంతకులెవరు? వారిపై ధరణి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనే విషయాలను మిగతా కథలో చూస్తాం.  విశ్లేషణ 'దసరా'లో నిజంగానే మనం ఎప్పుడూ చూడని ఒక మొరటు తాగుబోతు పాత్రలో నానిని చూస్తాం. ఇంతదాకా నానికి ఉన్న ఇమేజ్‌కు భిన్నమైన క్యారెక్టర్‌లో బొగ్గు మరకలతో నిండిన మొహంతో ఉండే అతడ్ని చూపిస్తూ ఈ సినిమా తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సాహసాన్ని అభినందించి తీరాలి. అలాగే ఇలాంటి పాత్రను చేస్తే, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం లేకుండా ఆ పాత్రను పోషించిన నానిని మెచ్చుకోవాలి. ఈ సినిమా కథ మొత్తం ఒక పాత్ర కేంద్రకంగా నడుస్తుంది. ఆ పాత్ర.. వెన్నెల. ఆ వెన్నెల చుట్టూ మూడు పాత్రల్ని నడిపించాడు కథకుడు కూడా అయిన దర్శకుడు శ్రీకాంత్. ఆ మూడు పాత్రలు.. ధరణి, సూరి, చిననంబయ్య. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు మద్యం కూడా వారి జీవితంలో భాగమంటూ చూపించిన కథకుడు, ఆ మందు వల్ల ఆడవాళ్ల జీవితాలు ఎలా దుర్భరమవుతున్నాయో చివరలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే కథలో సిల్క్ బార్ కూడా ఒక కీలక పాత్ర పోషించింది. సిల్క్ స్మిత బొమ్మతో కనిపించే ఆ బార్‌లో మందు తాగే తాగుబోతులకు మత్తునిచ్చేది మందు మాత్రమే కాదు, అందులోని టీవీలో వచ్చే స్మిత పాటలు కూడా. అంటే.. ఇది సమకాలీన కథ కాదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన మద్యనిషేధం తెచ్చిన నాటి కథ. జనం సిల్క్ స్మితను విపరీతంగా ఆరాధించినప్పటి కాలం కథ. ధరణి, సూరి మధ్య స్నేహం చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. సూరి కోసం వెన్నెల మీద తన ప్రేమను ధరణి అణచివేసుకోవడం ఆ పాత్రపై సానుభూతి కలిగేట్లు చేస్తుంది. ధరణిని కాకుండా సూరిని వెన్నెల ఇష్టపడటం, ఆ ఇద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ధరణి పాత్రపై జాలి కలిగేట్లు చేస్తాయి. నాని ఏంటి ఇలాంటి క్యారెక్టర్ చేశాడు అనే అభిప్రాయం కూడా మనకు కలుగుతుంది. సినిమాలో కీర్తి సురేశ్.. నానిని కాకుండా ఎవరో ఒక అనామక నటుడ్ని ఇష్టపడటం ఎవరికి మాత్రం ఇష్టముంటుంది? అయినా ఏ మూలో ఆ ఇద్దరూ కలుస్తారనే ఆశ మిణుకు మిణుకుమంటూ ఉంటే, వెన్నెల, సూరికి దగ్గరుండి ధరణి చేత పెళ్లి జరిపించేసి, ఆ ఆశలపై నీళ్లు కుమ్మరించేశాడు దర్శకుడు. అప్పుడే సూరికి కూడా వెన్నెలను ధరణి ఇష్టపడుతున్నాడనే విషయం తెలిసిపోతుంది. కానీ ఇద్దరూ ఏమీ ఎరగనట్లుగానే ఉంటారు. అంతలోనే సూరి తల తెగిపడి, వెన్నెల బతుకు బుగ్గిపాలయ్యే ఘట్టం వస్తుంది. కానీ వెన్నెల బతుకు అలా అయిపోతుంటే, ధరణి ఎలా తట్టుకుంటాడు! అందుకే ఊరంతా షాకయ్యే పని చేస్తాడు. ఒక కులం తక్కువోడు ఆ పని చేస్తే వెన్నెల కులపోళ్లు ఊరుకుంటారా? లొల్లి చెయ్యబోతారు. కానీ ధరణి-సూరి కారణంగా సర్పంచి అయిన రాజన్న అతడికి మద్దతుగా నిలుస్తాడు. వెన్నెల తల్లితండ్రులు కూడా తమ కూతురి కోసం ధరణి చేసిన పనికి హర్షిస్తారు. ఈ సన్నివేశాన్ని శ్రీకాంత్ ఓదెల చాలా బాగా తీశాడు. వెన్నెలపై కన్నేసిన తూర్పుగుట్ట చిననంబయ్య (షైన్ టామ్ చాకో) చేసే దుర్మార్గం, మందు తాగితే తప్ప ధైర్యం తెచ్చుకోలేని పిరికివాడైన ధరణి అతడిని ఎదుర్కొనే విధానాన్ని దర్శకుడు ఇంకా ప్రభావవంతంగా చిత్రీకరిస్తే బాగుండేదనిపిస్తుంది. నాని, కీర్తి మధ్య రొమాంటిక్ యాంగిల్ లేకపోయడంతో దాన్ని ఎక్స్‌పెక్ట్ చేసినవాళ్లంతా అసంతృప్తికి లోనవుతారు. ఈ తరహా కథలు గతంలోనూ వచ్చాయి. కొత్తదనం ఏదైనా ఉందంటే.. అది ధరణి క్యారెక్టర్‌ను నాని చేయడమే. తోట శ్రీనివాస్ డైలాగ్స్ సమయోచితంగా, సందర్భోచితంగా సాగాయి. సంతోష్ నారాయణన్ స్వరాలు కూర్చిన పాటలు బాగానే ఉన్నాయి. 'ధూమ్ ధామ్ దోస్తాన్' సాంగ్ ధూం ధాంగానే ఉంది. 'చమ్కీల అంగీలేసి' పాట ఊహించిన స్థాయిలో లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవల్లో ఉంది. సత్యన్ సూర్యన్ కెమెరా వర్క్ సూపర్బ్. కలర్ టోన్ కానీ, సీన్స్ పిక్చరైజేషన్ కానీ టాప్ క్లాస్‌లో ఉన్నాయి. ఎడిటర్ నవీన్ నూలి శక్తివంచన లేకుండా సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా కనిపించడానికి కష్టపడ్డాడు. కొల్లా అవినాశ్ ఆర్ట్ వర్క్ ఇంప్రెసివ్‌గా ఉంది. రియల్ సతీశ్, అన్బరివ్ డిజైన్ చేసిన ఫైట్స్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఫైట్ ఓకే. సూరిని చంపేప్పుడు వచ్చే సీన్లు 'రంగస్థలం' సీన్లను గుర్తుకు తెచ్చాయి. నటీనటుల పనితీరు ధరణి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, దాన్ని ఉన్నత స్థాయిలో పోషించాడు నాని. ఆ క్యారెక్టర్‌లోని మానసిక సంఘర్షణను అతను చేసిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. ఇంత రగ్డ్ క్యారెక్టర్ నానికి సూటవుతుందా అని అతని విమర్శకులు సైతం ఆశ్చర్యపోయే రీతిలో దాన్ని చేశాడు. అతని మేనరిజమ్స్ అలరిస్తాయి. ఈ సినిమా చూశాక నాని విషయంలో కథకుల, దర్శకుల దృక్పథం మారుతుంది. సూరి క్యారెక్టర్‌లో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి చాలా హుషారుగా చేశాడు. నానితో కలిసి ఉన్న సీన్లలో అతనికి ఏమాత్రం తగ్గని నటనను ప్రదర్శించాడు. కథకు కేంద్రబిందువు లాంటి వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ సునాయాసంగా ఇమిడిపోయింది. చాలా రోజుల తర్వాత ఆమెకు నటించడానికి అవకాశమున్న మంచి పాత్ర దొరికింది. విలన్ చిననంబయ్యగా మలయాళం నటుడు షైన్ టామ్ చాకో ఆకట్టుకున్నాడు. అతని భార్య పాత్రలో పూర్ణ నిండుగా కనిపించింది. రాజన్న, శివన్న పాత్రల్లో సాయికుమార్, సముద్రకని రాణించారు. మిగతా పాత్రధారులు తమ పరిధుల మేరకు చేశారు. తెలుగువన్ పర్‌స్పెక్టివ్ ఇంతదాకా తను పోషించని ఒక పూర్తిస్థాయి మాస్ రోల్‌లో నాని చెలరేగిన 'దసరా' సినిమా యాక్షన్ ప్రియుల్ని అలరిస్తుంది. అతడిని ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌కు దగ్గర చేస్తుంది. నాని అంటే ఇష్టపడే ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం అతడిని ఇలాంటి తాగుబోతు పాత్రలో, హింసాత్మక పాత్రలో చూడ్డానికి ఇష్టపడకపోయే అవకాశం ఉంది. అయితే నాని ప్రదర్శించిన అభినయం కోసమైనా ఈ సినిమాని చూడొచ్చు.  రేటింగ్: 3/5 - బుద్ధి యజ్ఞమూర్తి 
ఇండియ‌న్ సినిమాలో ఇప్పుడు హాట్ ప్రాప‌ర్టీ ఎవ‌ర‌య్యా అంటే ముగ్గురు పేర్లు మ‌ళ్లీ మ‌ళ్లీ వినిపిస్తున్నాయి. అంత‌గా జ‌నాల మ‌న‌సులు దోచుకున్న‌వారిలో ఫ‌స్ట్ ప్లేస్ కొట్టేశారు రామ్‌చ‌ర‌ణ్‌. ఆయ‌న్ని ఫాలో అవుతూ య‌ష్‌, ఫాహ‌ద్ పేర్లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. తార‌క్‌, రామ్‌చ‌ర‌ణ్‌ న‌టించిన ట్రిపుల్ ఆర్ 1250 కోట్లు క‌లెక్ట్ చేసింది. య‌ష్ న‌టించిన కేజీయ‌ఫ్‌2 1200 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఫాహద్ పాజిల్‌ న‌టించిన విక్ర‌మ్‌, పుష్ప 400 కోట్లకు పైగా క‌లెక్ట్ అయ్యాయి. ఇండియ‌న్ సినిమా స్టాండర్డ్స్ ని త‌మ పెర్ఫార్మెన్స్ ల‌తో గొప్ప స్థాయికి తీసుకెళ్లిన నటులుగా ఈ ముగ్గురినీ గురించి నార్త్ మీడియా చెబుతోంది. ఈ ముగ్గురికీ దాదాపు ఒక‌టే వ‌య‌సు. సినిమాల్లో ఎంట్రీ కూడా అటూ ఇటూగా ఒకే స‌మ‌యంలో ఇచ్చారు. ఇటీవ‌ల ఆస్కార్ వేడుక‌లో హంగామా చేసిన రామ్‌చ‌ర‌ణ్‌ని, ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా ఇండియ‌న్ బ్రాడ్ పిట్‌గా పొగుడుతోంది. ఇటీవ‌ల పుట్టిన‌రోజు వేడుక‌లు వైభ‌వంగా జ‌రుపుకున్న రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ చేంజ‌ర్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ఆయ‌న మూడు గెట‌ప్పుల్లో క‌నిపిస్తార‌ని టాక్‌. హై ఆక్టేన్ యాక్ష‌న్ రొమాంటిక్ సినిమాగా తెర‌కెక్కుతోంది గేమ్ చేంజ‌ర్‌. ఆ వెంట‌నే బుచ్చిబాబు సినిమాలో క‌నిపిస్తారు చెర్రీ. మధ్య‌లో స‌ల్మాన్‌ఖాన్ సినిమా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌లో క‌నిపిస్తారు. అటు య‌ష్ కూడా గ్లోబ‌ల్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. గొప్ప గొప్ప విష‌యాలు జ‌ర‌గాలంటే కాస్త స‌మ‌యం ప‌డుతుంది. అప్ప‌టిదాకా వేచి చూడ‌మ‌ని త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్ కి న‌చ్చ‌జెప్పారు య‌ష్‌. గ్లోబ‌ల్ స్టార్‌గా ఎదిగే క్ర‌మంలో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చార‌న్న‌ది బెంగుళూరులో ఎకోసౌండ్‌తో వినిపిస్తున్న మాట‌. ఫాహ‌ద్ ఫాజిల్ గురించి ఏం చెప్పాల్సి వ‌చ్చినా మ‌ల‌యాళం టాలెంట్ ప‌వ‌ర్‌హౌస్ అనే అంటున్నారు జ‌నాలు. ఇప్పుడు పుష్ప‌2, త్వ‌ర‌లో విక్ర‌మ్‌2లో ఫాహ‌ద్ పెర్ఫార్మెన్స్ కోసం జ‌నాలు వెయిట్ చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం 'సైంధవ్'. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను దర్శకుడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'సైంధవ్' చిత్రాన్ని 2023, డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో వెంకటేష్ నెత్తుటి మరకలతో చేతిలో గన్ పట్టుకొని కంటైనర్ పై కూర్చొని ఉండగా, పక్కన పేలుడు పదార్థాలు ఉండటం చూస్తుంటే విధ్వంసానికి సిద్ధం అన్నట్లుగా ఉంది. గత చిత్రం 'ఎఫ్-3'తో ప్రేక్షకులను నవ్వించిన వెంకటేష్.. ఈసారి వైలెన్స్ చూపించబోతున్నారని అర్థమవుతోంది. పైగా విడుదల తేదీ ఎంపిక కూడా కలిసొచ్చేలా ఉంది. మొదటి మూడు రోజులు వీకెండ్, నాలుగో రోజు క్రిస్మస్ హాలిడే కలిసొచ్చే అవకాశముంది.
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డెవిల్'. 'ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' ట్యాగ్ లైన్. న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. 500 మందితో ఈ ఫైట్‌ను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ యాక్ష‌న్ ఎపిసోడ్‌గా చెప్పుకునేలా దీన్ని ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ ఆధ్వ‌ర్యంలో డిజైన్ చేశారు.  ఈ సంద‌ర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ "మా బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా డెవిల్ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాం. కొత్త సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే త‌ప‌న ఉన్న మా నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ మ‌రో డిఫ‌రెంట్ అవతార్‌లో ఆక‌ట్టుకోబోతున్నారు. సినిమా అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. 500 మంది ఫైట‌ర్స్‌తో ఈ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను వెంక‌ట్‌గారు నేతృత్వంలో చిత్రీక‌రిస్తున్నారు. దీన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూస్తే వావ్ అనేంత గొప్ప‌గా పిక్చ‌రైజేష‌న్ ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలియ‌జేస్తాం" అన్నారు.  సౌంద‌ర్ రాజన్‌.ఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతాన్ని... శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మిస్తున్న చిత్రం 'యూనివర్సిటీ'. ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. "ఈ రోజు ప్రపంచం ప్రైవేటీ కరణ జరుగుతున్న దశలో భారత్ దేశం లాంటి వర్ధమాన దేశాల్లో లక్షలాది మంది యువత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆశావహ దృక్పధంతో ఎంతో కష్టపడి చదువుతూ డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఎగ్జామ్ పేపర్ లీకేజీ లు అయిపోతూవుంటే వాళ్ళు కన్న కలలు ఏమైపోవాలి. వాళ్ళ గమ్యం అగమ్య గోచరం అయిపోతూ నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా కాకూడదు. పోలీస్ శాఖ, రైల్వే శాఖ ఇలా అనేక శాఖల్లో ఉద్యోగుల ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ అయిపోతున్నాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసినట్టు ప్రశ్నా పత్రాలు లీకేజీ అవుతుంటే విద్యార్థుల భవిష్యత్ ఏమి అవ్వాలి? లంభకోణం చెప్పేవాడు కుంభకోణం చేసుకు పోతూ ఉంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు గిల గిల లాడి పోతుంటే ఈ విద్య వ్యవస్థకు అర్ధం ఎక్కడుంది. ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి కల పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటివి చాలా అప్రమత్తంగా ఉండాలి. అవకతవకలు జరుగకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేదే యూనివర్సిటీ సినిమా. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాము" అని అన్నారు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
జీవితంలో అన్ని విషయాలలోనూ మంచి చెడు అనే రెండు కోణాలు ఉంటాయి. వాటిని బట్టే మనుషులను కూడా మంచి చెడు అని పేర్కొంటాము.  ఎదుటివాడి ఆశయాలను, ఇష్టాయిష్టాలను గౌరవించే స్నేహమే నిజమైన స్నేహం. తాను చెప్పిందే ఎదుటివాడు వినాలి, తాను రమ్మన్నప్పుడు రావాలి, చేయమన్న పని చేయాలి అనేది బానిసత్వం అవుతుంది. అది స్నేహం ఎప్పటికీ కాదు. తన స్నేహితుడిలోని లక్షణాలను విశ్లేషించి, స్నేహం గురించి విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. జీవితంలోని ప్రతి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. గమనిస్తే అనేక మంది విజేతలు ఏదో ఓ దశలో సమాజంలో పిచ్చివారుగా పరిగణనకు గురైనవారే. తమ లక్ష్యంపై వారి దృష్టి ఎంతగా కేంద్రీకృతమై ఉంటుందంటే ఇతర విషయాలన్నీ వారికి పనికిరానివిగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఇతర విషయాలను పట్టించుకోవడం మానేస్తారో అప్పుడే వారి మీద విమర్శలు మొదలవుతాయి. అవెలా ఉంటాయంటే స్థాయి పెరిగేకొద్దీ మనుషుల్ని మరచిపోతారు అనేలా. తన దృష్టి దేనిపై కేంద్రీకృతమై ఉందో ఆ విషయానికి సంబంధించినవి మాత్రమే విజేతలకు గుర్తుంటాయి. ఒకే రకమైన పక్షులు ఒకే గూటికి చేరతాయంటారు. కాబట్టి మనిషి మంచివాడైనా, చెడ్డవారితో స్నేహం వాడి మంచితనాన్ని మరుపుకు తెస్తుంది. ఒకే గూటి పక్షి అయిపోతాడు.  "తాటి చెట్టు పాలు తాగడం" కథ ఇక్కడ వర్తిస్తుంది. మంచివాడైనా, దుష్టులతో కలిసి తిరిగితే చెడ్డవాడనే అని అందరూ అంటారు. స్వతహాగా ఇతను మంచివాడే అయినప్పటికీ, చెడ్డ లక్షణాలు ఉండి ఉంటాయని అనుమానిస్తారు. చెడ్డవాడుగానే పరిగణిస్తారు. సాధారణంగా, ప్రతివ్యక్తికీ ఇష్టాయిష్టాలుంటాయి. ఆ ఇష్టాయిష్టాలు అతడు పెరిగిన వాతావరణం, సంస్కారం వంటి అంశాలపై ఆధారపడి వుంటాయి. ఆ ఇష్టాయిష్టాల ఆధారంగా అతడు కొందరు వ్యక్తులకే సన్నిహితుడవుతాడు. అందరితో కలిసి తిరుగుతున్నా కొందరితోనే అత్యంత సన్నిహితంగా వెళ్ళగలుగుతాడు. ఈ సన్నిహితులెవరో గమనిస్తే చాలు, వ్యక్తి స్వభావ స్వరూపాలు బోధపడతాయి. వారు మంచివారైతే పరవాలేదు. అదే వారు చెడ్డవారైతే వ్యక్తి మంచి వాడైనా అనుమానాస్పదుడే అవుతాడు. ఎందుకంటే అటువంటి వారి ప్రభావం వ్యక్తిపై ఎంతైనా వుంటుంది. ఏదో ఓ రోజు అది ఫలితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచి ఆలోచనలపైనే దృష్టిని నిలపాలి. అలా కాక దుర్మార్గులు, దుష్టులుగా పరిగణించే వారి సాంగత్యంలో వుంటే వాళ్ళ నడుమ తుచ్ఛమైన ఆలోచనలే వస్తాయి. అవి మనపై ప్రభావం చూపిస్తాయి. కొందరు అంటారు మనం బాగుంటే ఇతర విషయాలు మనల్ని ఏమీ చేయలేవు అని.  వజ్రం ఎంత విలువైనది అయినా దాన్ని బంగారంలో పెట్టి ఆభరణంగా మారిస్తే దాని స్వరూపం ఎంతో బాగుంటుంది. అదే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి గులకరాళ్ల మధ్య వేస్తే దాన్ని గుర్తించేవారెవరు?? పరీక్షల కోసం బాగా చదివే విద్యార్థిని మాటమాటికి వచ్చి బయటకు రమ్మని పిలిచే స్నేహం అంత మంచిది కాదు. చాలా మంది తాము బాగా చదువుకుని తమ విరామ సమయాన్ని గడపడానికి వచ్చి, ఏమీ చదవనట్టు పరీక్షంటే లెక్కలేనట్టు మాట్లాడతారు. కష్టపడి చదివే వాడిని వెక్కిరిస్తారు. దాంతో చదివేవాడు సైతం తానేదో తప్పు చేస్తున్నట్లు బాధపడతాడు. చదువు వదలుతాడు దెబ్బ తింటాడు. కాబట్టి, చదవాలనుకున్న వాడు చదువుతుంటే వచ్చి ఏకాగ్రతకు భంగం కలిగించేవాడి స్నేహాన్ని నిర్మొహమాటంగా వదల్చుకోవాలి. ఎందుకంటే కొందరు పైకి మంచిగా నటించినా మనసులో వేరే రకంగా భావిస్తూంటారు. అటువంటివారితో స్నేహం ఎప్పడైనా ముప్పు తెస్తుంది. ఈవిషయం అందరూ గమనించండి. చెడ్డవారితో స్నేహాన్ని వదులుకోండి. తమ జీవితానికి చెడ్డవారి వల్ల కలిగే నష్టాన్ని ఆ నష్టం ఎదురయ్యే వరకు కాకుండా వ్యక్తుల ప్రవర్తనలో గుర్తించి దూరంగా ఉంటేనే మంచిది.                                       ◆నిశ్శబ్ద.
వేసవికాలం వచ్చిందంటే వామ్మో అంటాము. మండిపోయే ఎండలు, మగ్గబెట్టే ఉక్కపోత, వీటికి తోడు కరెంట్ కోతలు. ఉదయం, సాయంత్రం తప్ప ఏ మధ్యాహ్నపు ఎండలోనో బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందంటే గుండె గుభేలుమంటుంది. అందుకే ఎండ అంటే చెప్పలేనంత మంట అందరికీ. కానీ సమయం గడుస్తూ ఉంటే ఈ కాలాలు అదేనండి వర్షాకాలం, చలికాలం వచ్చినట్టు ఎండాకాలం కూడా రాక తప్పదు. అది తన ప్రతాపం చూపించక తప్పదు. అయితే ఈ వేసవిని చూసి భయపడటానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, దీన్ని ఎంజాయ్ చేయడానికి అన్నే మార్గాలు ఉన్నాయి. ఓసారి తెలుసుకుంటే సమ్మర్ మీద హమ్మర్ తో ఓ మోస్తరు సౌండ్ చేయచ్చు. ఒకప్పుడు!! సంవత్సరకాలం అంతా పిల్లలు ఎదురుచూసేరోజులు ఇవే అంటే ఆశ్చర్యమేస్తుంది. నిజంగానే వేసవి కోసం పిల్లలు అర్రులు చాచేవాళ్ళు. ఒక పూట బడి ముగియగానే ఎండను కూడా లెక్కచేయకుండా బావుల వెంట, చేల వెంట వెల్తూ ఎన్నో మధురస్మృతులను మూటగట్టుకునేవాళ్ళు. ఓ ముప్పై సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళను పిలిచి బాల్యం గురించి చెప్పమంటే కళ్ళు మెరవడం, చిరునవ్వు బయటకు రావడం ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.  అందుకే అన్ని కాలలను ఒకేలా పుస్తకాల మధ్య కాకుండా కాసింత ప్రత్యేకంగా గడిపేలా మీ పిల్లలకు ఏర్పాటు చేయండి. అది వాళ్లకు ఆసక్తికరమై, వాళ్ళ సంతోషానికి కారణమయ్యేది అయ్యుండాలి సుమా!! ప్రకృతి ఆతిథ్యం!! నిజంగా నిజమే. వేసవిలో ప్రకృతి ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తుందని. అవన్నీ చాలా వరకు ఇప్పటి తరానికి తెలియకుండా ఉన్నాయి. వాళ్లకు ఓసారి పరిచయం చేసి చూడండి. నాచురల్ లైఫ్ మీద లవ్ లో పడతారు వాళ్ళు. పుల్లని విందు!! బలే బలే పసందు ఈ పుల్లని విందు. అదే అదే ఫలాల రాజు మామిడి గారు ఎంతో ఠీవిగా చెట్లలో పెరిగి అందరినీ పలకరించడానికి ఇంటింటికి వస్తాడు. అందరి నోర్లు జలపాతాలు చేస్తాడు.  చెరకు చరిష్మా!! చిన్నప్పటి దంతాల రహస్యం. నోటితోనే చెరకు పొట్టు తీసి, కొరికి, కసకస నమిలి, రసాన్ని జుర్రుకుంటూ పిప్పిని పడేస్తే ఆహా ఉంటుంది ఆ నాలుగు అదృష్టం ఎంతో అనిపిస్తుంది. ఇప్పట్లో అంత సీన్లు లేకపోయినా ఎంచక్కా రోడ్ సైడ్ దొరికే చెరకు రసం తాగేసి హాయి హాయిగా వెళ్లిపోవచ్చు.  ఇవి మచ్చుకు రెండు మాత్రమే. ఇంకా చింతచిగురు వేరే లెవెల్. తాటి ముంజలు మరొక ఎత్తు, చల్ల చల్లటి మజ్జిగ, శరీర తాపాన్ని తగ్గించే పుదీనా శరబత్ ఇవన్నీ హైలైట్.  అయితే మరొక మ్యాజిక్ కూడా ఉంది. అదే కేవలం రాయలసీమ ప్రాంతంలో లభ్యమయ్యే సుగంధి సిరప్. కేవలం కడప జిల్లాలో అడవులలో మాత్రమే పెరిగే సుగంధ మొక్కల వేర్లను ఉడికించి పంచదార కలిపి సిరప్ చేసి అమ్ముతుంటారు. సువాసన అద్భుతంగా ఉంటుంది. చల్లని నీళ్లు, లేదా షోడాతో ఈ సిరప్ కలిపి తీసుకుంటే వేసవి కాలం వెంట తీసుకొచ్చే వడదెబ్బ వంద కిలోమీటర్లు పరిగెత్తి పరిగెత్తి పారిపోతుంది. శరీర వేడిని తక్షణమే తగ్గిస్తుంది.  వేసవి భయం అసలు వద్దు!! ఎవరు ఎన్ని చెప్పుకున్నా బయటకు వెళ్ళేవాళ్లకు అదొక భయం. సర్రుమని కాలిపోతున్న రోడ్లన్నీ నరకంలో యమధర్మరాజు ఏర్పాటు చేసినట్టు అనుభూతి కలుగుతుంది. అందుకే సులువైన, మరియు అందరూ ఆచరించగల జాగ్రత్తలు. బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. మరి నీళ్లు అయిపోతే?? ఏముంది ఏకంగా బాటల్  కొనే పని తప్పుతుంది ఎక్కడో ఒక చోట అయిదు రూపాయల్లో బాటల్ నింపుకోవచ్చు. లేదు కాదు అంటే 20 నుండి 30 పెట్టి వాటర్ బాటిల్ కొనేబదులు ఎంచక్కా ఫ్రూట్ జ్యూస్, లేదా నిమ్మ షోడా వంటివి తాగడం హాయి. వేసవి తాపాన్ని తగ్గిస్తాయి ఇవి. ఇవి కాకుండా మరొక సలహా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కీరా దోస, పుచ్చకాయ వంటి నీరు అధికంగా ఉన్నవి తినడం లేదా జ్యూస్ తాగడం మంచిది. ఉప్పు, కారం, మసాలాలు వంటివి తగ్గించుకోవాలి ఈ కాలంలో. శరీర ఉష్ణోగ్రత మీద అవి ప్రభావం చూపిస్తాయి.  వెంట గొడుగు ఉంచుకోవడం మర్చిపోకండి. లేదంటే టోపి, లేదా స్పార్క్ ఇలా ఎదో ఒకటి నెత్తిని కప్పి ఉంచేలా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలా చూసుకోవాలి. మధ్యలో సమయం అంతా ఇంటి పట్టున లేదా ఉద్యోగాలు చేసే ప్రాంతాలలో ఉండటం మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే వేసవి కోసం బోలెడు మార్గాలు. అయితే మనం ఎంత డాబు చెప్పుకున్నా ఈ ఎండల కొరడా దెబ్బకు ఒళ్ళు చురుక్కుమనడం సాధారణం. అందుకే దాని నుండి జాగ్రత్త మరి. జాగ్రత్తగా షేక్ హాండ్ ఇచ్చి కూల్ గా డీల్ చేసి పంపిద్దాం.                                     ◆వెంకటేష్ పువ్వాడ.
మనిషి జీవితంలో బలాలు, అవకాశాలు, భయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటి గురించి తెలుసుకుంటే... బలాలు మనిషి జీవితంలో బలాలు మాత్రమే కాదు. బలహీనతలు కూడా ఉంటాయి. అయితే నేటి కాలంలో మనుషులు తమలో ఉన్న బలాలను పక్కన పెట్టి తమలో ఉన్న చిన్న బలహీనతల్ని కూడా భూతద్దంలో చూస్తారు. ఫలితంగా తమలో చాలా పెద్ద లోటుపాట్లు ఉన్నాయని అవి తమ జీవితాన్నే కుదిపేస్తున్నాయనే ధోరణిలోకి వెళ్ళిపోతారు. స్నేహితులను, బంధువులను, ఆత్మీయులను కలిసినప్పుడు తమ గురించి తాము ఓపెన్ గా మాట్లాడుకోగలిగే చనువు ఉంటే గనుక అలాంటి సందర్భంలో  సహజంగా చాలామంది తమలో చాలా బలహీనతలు ఉన్నాయని అంటూంటారు. కానీ అందరూ గ్రహించని ముఖ్య విషయం ఏమిటంటే… అందులో అధికశాతం ఊహించుకున్నవే.  ఇక్కడ బలహీనతలంటే మొహమాటం, ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆందోళన.. లాంటి వైఖరులన్నమాట. ఉదాహరణకి చెప్పుకుంటే తను చదివే కోర్సు పూర్తయిపోగానే తరువాత ఏది ఎంపిక చేసుకోవాలనే నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొందరు చాలా బాధపడిపోతారు. అలాంటి పరిస్థితిలో వారి మనసులో ఉండే భావం ఎలాంటిదంటే ఒకరి మీద ఆధారపడాల్సి వస్తోందే అనే బాధ, నాకు నేను ఎలా నిర్ణయం తీసుకోవాలి నాకు తెలియనప్పుడు అనే సంఘర్షణ ఒక విద్యార్థిలో ఏర్పడటం తన బలహీనతగా భావిస్తాడు. అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదు. కొద్దిపాటి అవగాహన పెంచుకుంటే, తెలుసుకుంటే అన్నీ సాధ్యమవుతాయి. మనిషిలో ఉండే బలహీనతలు ఎప్పటికీ బలహీనతలుగా ఉండిపోవు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఆ బలహీనతలు క్రమంగా అధిగమించవచ్చు. అవకాశాలు అవకాశాల గురించి చాలామందికి అవగాహన సరిగా ఉండదు. తమ ముందున్నవి అవకాశాలే కాదు అన్నంత నిర్లక్ష్యంగా, అవగాహనా లోపంతో ఉంటారు చాలామంది.  చదువుకునే విద్యార్థుల నుంచి, ఉద్యోగాలు చేసే వారి వరకు తాము ముందుకు పోవడానికి గల అవకాశాలను గుర్తించడం అరుదు. చదువుకునే విద్యార్ధినీ విద్యార్థులు, తాము బాగా చదువుకుంటే భవిష్యత్తులో ఏమి సాధించగలరో, తమ కుటుంబ గౌరవ ప్రతిష్ఠలు ఎలా పెంచగలరో గుర్తించాలి. చదువు పూర్తి చేస్తే తండ్రి వ్యాపారంలో చేరవచ్చు. విదేశాల్లో ఉన్న బంధువులు స్పాన్సర్ చేయవచ్చు. ఇక్కడే ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని ఆదుకోవచ్చు... ఇలా తమ జీవితానికి ఉన్న మార్గాలను అనుసరించి ఆలోచించాలి. నిజానికి ఈనాటి యువతరానికి ఇవన్నీ తెలియకకాదు. అన్నీ తెలుసు. కానీ బద్ధకం, నిర్లక్ష్యవైఖరి, చెడు అలవాట్లు అడ్డుపడుతున్నాయి.  భయాలు  మనిషి పతనానికి మూలకారణం భయం. ఒక పని ప్రారంభించే ముందు విజయం సాధించగలమా లేదా అనే చిన్న భయం ఉండవచ్చు. దాంతో మధ్యలో సమస్యలు రావచ్చు. విజయమార్గంలో వైఫల్యాలు ఉంటాయి తప్పదు. విజయం అనేది ప్రయాణం తప్ప, గమ్యం కాదని గుర్తించాలి. అర్థం లేని భయాలు, భీతులు మన విజయానికి ఆటంకం కాకుండా ధైర్యం తెచ్చుకోవాలి. “నేను మాట్లాడలేను, నావల్లకాదు" వంటి మాటలకు ముగింపు చెప్పాలి.మాట్లాడటం అందరికీ వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడలేను?? విషయం గురించి కొంచెం అవగాహన పెంచుకుంటే ఆ అవగాహన ఉన్న విషయాన్ని మాట్లాడటమే క్షదా చేయాల్సింది. అలాంటప్పుడు మాట్లాడలేమనే భయం ఎందుకు?? ఇలాంటి ప్రశ్నను తమకు తాము వేసుకోవాలి. అలా వేసుకుంటే ఒకానొక ప్రేరణ ఎవరిలో వారికి కలుగుతుంది.  కాబట్టి మనిషి జీవితంలో బలహీనతలు, అవకాశాలు, భయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిని సరైన విధంగా డీల్ చేయడం నేర్చుకోవాలి.                                ◆నిశ్శబ్ద.
మారుతున్న వాతావరణం వల్ల  తరచుగా అనేక రకాల గొంతు సమస్యలు వస్తాయి. వీటిలో గొంతు ఇన్ఫెక్షన్ చాలా ఇబాబుది పెడుతుంది.  గొంతు ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాల ద్వారా దాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. అదే ఈ ఇన్ఫెక్షన్ ను లైట్ తీసుకుంటే ఇది చాలా దారుణమైన ఫలితాన్ని పరిచయం చేస్తుంది.   గొంతు ఇన్ఫెక్షన్ సాధారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, అలెర్జీల వల్ల సంభవించవచ్చు. కొన్నిసార్లు వాతావరణంలో మార్పు లేదా ఫ్లూ కారణంగా కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే.. గొంతు ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? గొంతు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వస్తుంది. ఇది  ఏ వయస్సు వారిలో అయిన కనిపించవచ్చు.  కానీ ఈ సమస్య చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు గొంతు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ.   గొంతు ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. గొంతు నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది తలెత్తడం.  టాన్సిల్స్‌లో వాపు, నొప్పి. టాన్సిల్స్ మీద తెల్లగా ఉండటం. గొంతు ఎరుపు రంగులోకి మారడం.  వాయిస్ లో మార్పు, గొంతు బొంగురు పోవడం జరుగుతుంది.  గొంతు ఎండిపోయినట్టు, నాలుక మీద దద్దుర్లు రావడం,  జ్వరం-దగ్గు, తలనొప్పి మొదలైనవి ఉంటాయి.  గొంతు ఇన్ఫెక్షన్ కారణాలు.. జలుబు వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. గొంతు నొప్పి, వాపు, జ్వరం వంటి సమస్యలు ఉండవచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని కారణంగా, స్ట్రెప్ థ్రోట్ సమస్య, గొంతు, టాన్సిల్స్‌లో ఇన్ఫెక్షన్ వస్తుంది. అలర్జీ వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. కాలుష్యం, పెంపుడు జంతువులు, బలహీనమైన రోగనిరోధక శక్తి, ఇతర కారణాల వల్ల అలెర్జీలు వస్తాయి. గొంతు గాయం కారణంగా,  స్వర తంతువులు, గొంతులో కండరాలు వ్యాకోచం చెందుతాయి. , దీని కారణంగా గొంతు నొప్పి వస్తుంది. దీర్ఘకాలం గొంతు నొప్పి ఉంటే అది ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ నివారణ ఇలా.. గొంతు నొప్పి లేదా ఇతర లక్షణాలు ఉంటే, భౌతిక దూరం పాటించడం ముఖ్యం. శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి. ఆహారం తినే ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోటిపై రుమాలు ఉంచుకోవాలి. సిగరెట్ మద్యం అలవాట్లు ఉంటే వాటిని వదిలెయ్యాలి. . పొగతాగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ మరింత పెరుగుతుంది. ఎక్కడైనా గాలి కాలుష్యం, ధూళి ఉంటే గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. మురికి ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి. పుష్కలంగా నీరు త్రాగాలి కానీ చల్లని నీరు మాత్రం త్రాగకూడదు. గొంతు ఇన్ఫెక్షన్ చికిత్స ఇలా..   గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే  డాక్టర్లు  యాంటీబయాటిక్స్ ఇవ్వవచ్చు.  వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఏదైనా మందు  వాడటం ముఖ్యం. సమస్య తీవ్రత పెరిగినప్పుడు  గొంతు ఇన్ఫెక్షన్ చికిత్సకు శస్త్రచికిత్సా ప్రక్రియ కూడా ఉంది, దీనిలో టాన్సిల్స్ తొలగించబడతాయి.  గొంతు ఇన్ఫెక్షన్‌లో అనేక ఇంటి చిట్కాలు  ప్రయోజనకరంగా ఉంటాయి.  ఉప్పు, వెల్లుల్లి, ఆపిల్ వెనిగర్, తేనె, పాలు మంచివి. అలాగే పసుపు, అల్లం, ఆవిరి పట్టడం లికోరైస్ మొదలైనవి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.                                  ◆నిశ్శబ్ద.
ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే  తీసుకునే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతారు. ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తీసుకోవడం మంచిది. మనం తినే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే బొప్పాయి ఆరోగ్యానికి హానికరంగా కూడా మారుతుంది. అందుకే రోజూ బొప్పాయిని ఎంత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఆరోగ్య నష్టాలు ఏంటి తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  బొప్పాయిలో ఉండే పోషకాలు..  బొప్పాయి విటమిన్ ఎ కి ఖజానా అనుకోవచ్చు.  ఇందులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది, అంతే కాకుండా విటమిన్ సి కూడా లభిస్తుంది. మరోవైపు, బొప్పాయిలో చాలా నీరు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ పదార్థాలు, ఆల్కలీన్ మూలకాలు, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, చక్కెర మొదలైనవి కనిపిస్తాయి. సహజంగా, ఫైబర్, కెరోటిన్, ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు బొప్పాయి తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటి గింజలను తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. బొప్పాయిలో ఉండే ఔషధ గుణాలు కంటి ఆరోగ్యానికి మంచిది. ఆర్థరైటిస్ రోగులు సమస్య నుండి ఉపశమనం కావాలని అనుకుంటే బొప్పాయి చక్కగా పనిచేస్తుంది. బొప్పాయి స్కిన్ టోన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. జుట్టును దృఢంగా ఒత్తుగా మార్చేందుకు బొప్పాయి ఆకుల రసాన్ని ఉపయోగించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బొప్పాయి గింజలు క్యాన్సర్‌ను నివారించడంలో మేలు చేస్తాయి. అధిక బరువు ఉన్నవారు బొప్పాయి తినడం వల్ల  ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. అధిక రక్తపోటు చికిత్సలో పచ్చి బొప్పాయి ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల  రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు గర్భధారణ సమయంలో బొప్పాయి తినకూడదు. బొప్పాయిలో పాలు కనిపిస్తే, అది గర్భాశయ సంకోచాలకు కారణమవుతుంది. దీని కారణంగా గర్భస్రావం, ప్రసవ నొప్పి, శిశువులో అసాధారణతలు ఉండవచ్చు. పాలిచ్చే తల్లులు బొప్పాయికి దూరంగా ఉండటమే మంచిది. బొప్పాయిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే జాండిస్ సమస్య పెరుగుతుంది. బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కులో రద్దీ, జలదరింపు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అంతేకాదు కిడ్నీలో రాళ్ల సమస్య రావచ్చు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే..  ఒక సంవత్సరం లోపు పిల్లలకు బొప్పాయి హానికరం.                                 ◆నిశ్శబ్ద.
కాళ్ల నొప్పులు గృహిణులలో ఒక సాధారణ సమస్య. చాలామంది మహిళలు తరచుగా వారి మోకాళ్ళలో నొప్పి అంటూ ఉంటారు. మోకాళ్ల నొప్పుల కారణంగా మహిళల వర్కింగ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది. కీళ్ల లేదా మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణాలలో ఒకటి పేలవమైన జీవనశైలి మరియు ఆహారంలో పోషకాహార లోపం. నేటి ఆధునిక జీవనశైలి వల్ల కీళ్ల నొప్పులు వస్తున్నాయి. ఈ సమస్య రాత్రిపూట ఎక్కువగా వేధిస్తుంది. ఒక వయస్సు తర్వాత, స్త్రీలు, పురుషులు ఇద్దరూ మోకాలి నొప్పి గురించి ఫిర్యాదు చేస్తారు, అయితే ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మోకాళ్ల నొప్పుల సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో నొప్పులు పెరిగే అవకాశం కూడా ఉంది. మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుంటే, ముందుగా ఈ సమస్యకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. మోకాలి నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నివారణలు తెలుసుకోవాలి. మోకాలి నొప్పి కారణాలు పురుషుల కంటే మహిళలకు మోకాళ్ల నొప్పులు ఎక్కువ. పురుషులు, స్త్రీల శరీర నిర్మాణంలో వ్యత్యాసం దీనికి ఒక కారణం. నిజానికి స్త్రీల కీళ్ల కదలికలు ఎక్కువగా ఉండడం వల్ల వారి లిగమెంట్లు కూడా మరింత ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. స్త్రీల మోకాళ్ల కదలిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని వల్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ. మెనోపాజ్ తర్వాత, మహిళల్లో ఋతు చక్రంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. ఈస్ట్రోజెన్ అనేది మహిళల్లో కనిపించే హార్మోన్, ఇది మోకాళ్లను ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. కానీ పీరియడ్స్‌లో ఈస్ట్రోజెన్ హార్మోన్ తక్కువ స్థాయి మోకాళ్లపై ప్రభావం చూపుతుంది. మోకాలి గాయాల విషయంలో, సరిగ్గా లేక వెంటనే చికిత్స చేయకపోతే, భవిష్యత్తులో నొప్పి ప్రమాదం పెరుగుతుంది. వ్యాయామం చేసినప్పుడు లేదాఎక్కువగా పరిగెత్తినప్పుడు, మోకాలి చిప్ప, స్నాయువులపై ఒత్తిడి ఉంటుంది. కీళ్ల నొప్పులు పెరుగుతాయి. అధిక వ్యాయామం ఆరోగ్యానికి హానికరం.  పురుషులతో పోలిస్తే మహిళల్లో కీళ్ల నొప్పులకు అధిక బరువు లేదా ఊబకాయం ఒక కారణం. ఊబకాయం సమస్యకు పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది బాధితులు. అధిక బరువు వల్ల మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక బరువు, మోకాళ్లపై ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. తేలికపాటి నొప్పి ఉన్నప్పుడు తరచుగా ప్రజలు దానిని లైట్ తీసుకుంటారు., ఇది మోకాళ్లలో ఎక్కువ నొప్పికి అవకాశాలను పెంచుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ రీసెర్చ్ సొసైటీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, ఒక వ్యక్తికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు మోకాలి నొప్పి ఉంటే, అది ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వచ్చినధై ఉండొచ్చు. కీళ్ల నొప్పులకు నివారణలు మోకాళ్లు లేదా కీళ్లలో నొప్పి రాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని కోసం, వ్యాయామం చేస్తే, దాన్ని కూడా అవగాహనతో ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మోకాళ్ల మృదులాస్థిని కాపాడుకోవచ్చు.  మోకాళ్ల నొప్పులను నివారించడానికి స్విమ్మింగ్ సైక్లింగ్ చేయవచ్చు. ఈ వ్యాయామం భవిష్యత్తులో మోకాళ్లకు నష్టం జరగకుండా చేస్తుంది. అధిక బరువు కారణంగా, మోకాళ్లపై ఒత్తిడి ఉంటుంది, కాబట్టి బరువు విషయంలో జాగ్రత్త.   అతిగా వ్యాయామం చేయడం వల్ల కీళ్లలో నొప్పి కూడా వస్తుంది. కొన్నిసార్లు వేగంగా లేవడం, కూర్చోవడం లేదా నడవడం వంటి అధిక శ్రమ నొప్పిని కలిగిస్తుంది. జుంబా, ఫంక్షనల్ వర్కవుట్, సూర్య నమస్కారం, పద్మాసనం వంటివి ఎక్కువగా సాధన చేయడం వల్ల నొప్పి పెరుగుతుంది. కాబట్టి నిపుణుల సలహా మేరకు మాత్రమే వ్యాయామం చేయాలి. మోకాళ్లలో వాపు వచ్చినా, నొప్పి వచ్చినా పట్టించుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మోకాళ్ల సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో సమస్య పెరుగుతుంది.                                    ◆నిశ్శబ్ద.