Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 46


    టంకసాల కెదురుగ కటకపాలుని కచ్చేరి కలదు. అతని క్రింద నగర రక్షణమునకై పండ్రెండు వేలమంది కావలి వాండ్రు కలరు...."
    ఈ పైన వర్ణింపఁబడినది ప్రౌడదేవరాయుల కాలము నాటి విజయనగరవైభవము. ఇంక శ్రీకృష్ణదేవరాయల కాలమునాఁడీ మహా పట్టాన మెంతటి మహోన్నతస్థితిలో నున్నదో! క్రీ.శ. 1520 సంవత్సరమున "ఫేగారీడో" యను పోర్చుగీసు రాయబారివెంట విజయనగరమునకు వచ్చిన "ఫేయిస్ " అనునాతఁడు ప్రత్యేక్షముగా దర్శించి వ్రాసిన యీ క్రింది వ్రాతల వలన నూహింపవచ్చును.
    "ఆ రాజ్యమునకు విజయనగరము రాజధాని. అందు రాజేపుడును నివసించుచుండెను. నగరమున కారు మైళ్ళ కీవలనే యడ్డముగా కొండల వరుస గలదు. దానిలో నుండి మార్గములు గలవు. వానికే ద్వారములని పేరు. నగరములోని కా ద్వారముల గుండ బోవలయునే కాని వేరు మార్గములు లేవు. ఎ కొండలవరుస డెబ్బది మైళ్ళ పొడవు గలిగి యీ మహా నగరమును జుట్టి యున్నది. ఈ పర్వతపంక్తికి లోపల నంటి చుట్టుకొని యున్న యితర పంక్తులనేకములు గలవు. ఈ పంక్తులలో నెచ్చటనైనను సమభూమి యున్నయెడల నచ్చట బలాధ్యమగు గోడ కట్టబడి యున్నది. ఈ రీతిగా గొఁడలన్నియు మూసి వెయఁబడియున్నవి. జనులు నడుచుటకు బాట లేర్పరుపఁబడియున్నవి. ఆ బాట లీద్వారమూలగుండఁ బోవును.
    ఈ ద్వారములకడఁ జిన్నా గుహలు కలవు. అందుఁ గూర్చుండి రక్షక భటులు ద్వారములు రక్షించుచుందురు. ఆ యావరణ లోపల వరి మొదలగు ధాన్యములు పండునట్టి బయళ్ళును , నిమ్మలు, నారింజలు, పనసలుం మామిళ్ళు మొదలగు ఫలవృక్షములతో నున్న తోఁటలును గల సారవంతములైన భూములను గలవు.
    ఈ కొండల మధ్య జలశయములు పెక్కులు గలవు. దాని యాధారము వల్లనే పై నుదహరించిన భూములు సాగుబడి చేయఁబడుచున్నవి. గోవానగరము నుండి వచ్చిన బాట యొక్కటి మొదటి కొండవరుసలోఁ గల ద్వారములలో నొకద్వారముగుండ నగరములోఁ బ్రవేశించుచున్నది. పడమటి ప్రక్క నిదియే ప్రధానమైన ద్వారమగుటచేత గోడల చేత సురక్షితమై యేప్పేడి పట్టణ మొకటి రాజుచే మొదటి పంక్తి లోపల గట్టబడినది. (నగలా పురము) ఈ ద్వారమున కుండు తలుపులును మిక్కిలి బాలాడ్యములైనవి. ఇతర నగరముల లోని గోడలవంటివి గాక యీ గోడలు పాలగచ్చు చేయఁబడి వే రెచ్చటను గానరానట్టివిగా నున్నవి. లోపల మిద్దె తిండ్ల వలె బల్ల పరుపుగా నున్నకప్పులు గల సొగసైన కట్టడములచే నిరుపార్శ్వములయం దలంచరింపబడిన వీధుల పంక్తులు రమ్యముగా నున్నవి.
    నాగలాపురమునుండి విజయనగరమున కొక వీధి పోవుచున్నది. ఆ వీధి కిరుప్రక్కలను ఇండ్ల వరుసలు చక్కగాఁ దీర్చియున్నవి. బాటసారులను నీడ నిచ్చుటకై వృక్షములు రెండు ప్రక్కలకు నాటింపఁబడి యున్నవి. ఈ వీధిలో సమస్త వస్తువులను విక్రయించు నంగడులు కలవు. ఈ వీధిలో రాజు సుందరమైన యనంతశయన దేవాలయమును గట్టించేను. ప్రభువులును సేనానులును గట్టిమ్చిన దేవళములు గూడ కలవు. ఈ నగరము చుట్టును బరువు గల పెద్ద ఱాలతోఁ గట్టఁబడిన గోడ కలదు. అది మిక్కిలి బలాడ్యమైనది.....అందు సురక్షితములైన దుర్గములు కలవు. దానికి నేరుగా నట్టిదే మరియొక గోడ కలదు. మనుష్యుని రొమ్ము దాకునంత ఎత్తు గలిగి మొనలు దేరియున్న ఱాళ్ళుపాతబడియున్నవి. ఈ గోడ కొండలకు మధ్యనున్న పల్లపు ప్రదేశములం దేత్తుగా బెట్టఁబడి కొండల వఱకు వ్యాపించి యున్నది....
    విజయనగరము యొక్క మొదటి ద్వారమునకు వచ్చుటకు ముందు మీరొక నీటి కాల్వను దాటి మలుపు దిరిగిన బలాడ్యమగు నొక ఱాతి గోడ వద్దకు వచ్చెదరు. ఈ ద్వారమున కిరుప్రక్కల నుండు రెండు బురుజులు దానిని కాపాడుచున్నవి. ఆ ద్వారము మిక్కిలి సొగసైనట్టిదియు. పెద్దధగు నట్టిదియు నై యున్నది. ద్వారమును దాటి లోపలకుఁబోవగానే రెండు చిన్న దేవళములు కాన్పించును...... ఈ మొదటి ద్వారమునగల కుడ్యము నగరమంతయుఁజుట్టి వచ్చుచున్నది. మరి కొంతదూరము పోయిన తోడనే మరియొక ద్వారమును గోడను కాన్పించును. ఈ గోడయును నగరమంతయుఁ జుట్టి వచ్చుచున్నది.
    ఇచ్చటి నుండి రాజభవనంతపురము వరకు గల మధ్య భూమి యందు వీధులను, ఇండ్ల వరుసలను , సేనానుల యొక్కయు, ప్రభువుల యొక్కయు నందములగు మందిరములును గలవు. చూచుటకు వినోదకరములగు విగ్రహాములతో నలంకరింపఁబడిన యిండ్ల  వరుసలు మనోజ్ఞములై యెప్పుచున్నవి. ముఖ్యమైనట్టి పెద్ద వీధి గుండ వెళ్ళునప్పుడు రాయల యంతఃపుర భవనమున కెదుట నున్న గొప్ప మైదానమునకుఁ గొనిపోవు ప్రధానమైన మార్గము కలదు. దీని కెదురుగ మరి యొక మార్గము నగరము యొక్క రెండవభాగమునకు గొని పోవుచున్నది..... ఆ మైదానము గుండ సరుకులు మొదలగువాని నెక్కించుకొని బండ్లు నడుపఁబాడుచుండును. లిస్బాను (పోర్చుగల్ ముఖ్యపట్టణము) ఎంత స్థల మాక్రమించుకొనేనో యంతకంటె నెక్కువ స్థల మాక్రమించుకొని రాయల మందిరము బలాడ్యమై సురక్షితమై యున్న ప్రాకారము గలిగియున్నది....
    .....ఈ దేవళములకు దాపునఁ జిత్తరువులు చెక్కబడి నట్టియు, విగ్రహాములతో నలంకరింపబడి నట్టియు జయసూచకమైన రాధ మొకటి కలదు. సంవత్సరమున కొకసారి దేవత్సవమునాఁడు నగరవీధులగుండ రధము నూరేగింతురు. అది మిగులఁ బెడ్డది యగుట వల్ల మూలలఁ దిరుగనేరదు. ఇంకను ముందు నడువ విశాలమై సొగసుకలదై యిరుపార్శ్వములందు సుందరములగు గృహముల వరుసలను గలిగియున్నదై యొక వీధి కలదు..... ఈ వీధిలో వణిజులు పెక్కండ్రు నివసించు చున్నారు. ఇందు పెక్కు రకముల కెంపులు, వజ్రములు, నీలములు, పచ్చలు రత్నములు, ముత్యములు, వస్త్రములు, ఇంకను ప్రపంచములో దొరుకునట్టి అన్ని వస్తువులు విక్రయింపఁబడు చుండును. ప్రతి సాయంకాల మొక సంత జరుగు చుండును. అచ్చట సామాన్యములైన గుఱ్ఱములు మొదలగు జతువులు మాత్రమే కాక దబ్బపండ్లు, నిమ్మపండ్లు, నారింజ పండ్లు, ద్రాక్ష పండ్లు మొదలగు ఫలవర్గమును విక్రయింపబడుచుండును..... ఈ నగరములోని జనసంఖ్య లెక్కించుటకు నలవి కానిదిగా నున్నది. నే నుదహరించిన గల్పితముగను, అతిశయోక్తిగను నుండు నను భయముచే సుదహరింపమానినాఁడను.

 Previous Page Next Page