Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 44


    మాతంగ పర్వతము శ్రీ విరూపాక్షస్వామి దేవాలయమునకు నెదురుగానున్నది. ఈ పర్వతమునకు నుత్తరమునను, బశ్చిమమునను, దక్షిణమునను, మూడు మెట్ల వరుసలున్నవి. వానిలో బడమటి వైపు సోపానపంక్తి మిక్కిలి శిధిలమైయున్నను బైకెక్కుట కనుకూలముగా నున్నది. మే మార్గముననే పర్వత శిఖరమునకుఁ జేరితిమి. దానిపై నున్న దేవాలయముపై కెక్కి నలుగడల దృష్టి సారించితిమి.
    ఈ క్షణమున నా హృదయస్థితి యెట్లున్నదో నేను వ్రాయలేను. పురాతన వైభవము నంతయును బోగొట్టుకొని, దుండగీండ్ర యత్యాచారముల కాహుతియై నామ మాత్రావశిష్టమైయున్న విద్యానగరమును గాంచి నా గుండెలు చేఱువై పోయినవి. శర్మయు, శాస్త్రియు నిశ్చేష్టులై తదేక దృష్టితో నా శిధిలములను దర్శించుచుండిరి. శ్యాము కుతూహలముతో "నిదియేమి? అదియే " మని యాచార్యుల వారినిఁ బ్రశ్నించుచుండెను. నాకు నోట మాట రాలేదు. "నిన్న మహోన్నత సౌధములలో హంసతూలికా తల్పముల నూగి నేఁడు జీర్ణ వసనములతో భిక్షాపాత్రము ధరించి వీధుల వెంట దిరుగు నిరుపేద" ను గాంచినట్లు నేనా శిధిల దృశ్యముల వైపు వ్యధామాయహృదయముతో రెప్పవాల్చక చూచుచుంటిని.
    ఎటు చూచినను భగ్నములైన కట్టడములే! పడిపోయిన కోటగోడలే! శిదిలములైన మందిరములే! చెడగొట్టఁబడిన శిల్పములే! గుట్టలు పడిన శిలాశకలములే!!
    అశేష శేముషీ ధురంధరుఁడైన శ్రీ మాధవ విద్యారణ్య స్వామిచే నిర్మింపఁబడిన పట్టాణరాజమాయిది! అపక్రపరాక్రమ సంపన్నుఁడైన హరిహరరాయలచేఁ బాలింపఁ బడిన మహానగరమా యిది!! విపక్షశిక్షణ స్వపక్షరక్షణ దక్షుఁడై దక్షిణ హిందూ స్థాన మంతయు నేకచ్చత్రాదిపత్యముతోఁ బరిపాలించిన వీరబుక్కరాయలచే విజయనగరమను విశేషనామము నందుకొన్న విద్యా నగరమూ యిది! సరసకవితా సనాదుఁడగు శ్రీనాధ మహాకవి సార్వభౌమునకుఁ గనకాభిశేకము గావించి యనంత యశశ్చంద్రికల దిగంత విశ్రాంతములు గావించుకొన్న ప్రౌడరాయ లేలిన నగరరాజమా యిది!!" శ్రీమన్మహరాజాదిరాజ" "రాజపరమేశ్వర" "మూరురాయరాగం"డాది మహాబిరుదు విభ్రాజమానుడైఁ యష్టదిగ్గజముల నాస్థానమున నిల్పి కవులకు గండపెండేరములు దొడిగిన శ్రీకృష్ణ దేవరాయల రాజధానియా యిది!! పాపము శాంతించుగాక!!
    విదేశయాతికులు వర్ణించిన యా మహోన్నత సౌదపంక్తులేవి? ఆ సువిశాల శ్రుంగాటకములేవి? ఆ మహా వైభవోపెతములగు విపణి వీదులేవి? ఆ రత్నరాసులేవి? ఆ అపరంజిరేకులు తొడిగిన దేవాలయ కుడ్యభాగము లేవి? ఆ ఘంటాపధము లేవి?
    భోగభాగ్యములతోఁ దులదూగిన మన విద్యానగర పూర్వవైభవము నొకింత స్మరింపుము. పారశీక దేశపు చక్రవర్తియగు "షాహరుజ" అనువాఁడు అబ్దుల్ రజాక్ అను వానిని విద్యానగరము నేలుచున్న ప్రౌడ దేవరాయల కడకు రాయబారిగ పంపెను. 'అబ్దుల్ రజాక్' విద్యానగరమునకు వచ్చి రాయలను సందర్శించేను ఆ సమయమునం దా రాయబారి విజయనగరమును స్వయముగా దర్శించి, తాను గాంచిన విశేషములను వర్ణించి యున్నాఁడు. ఆ వర్ణనము జదివిన మనకు పురాతన విజయనగర వైభవము కన్నులకుఁ గట్టినట్లు కానిపించును.
    "జిహేజ్ఞా (క్రీ.శ. 1442 చైత్రము) మాసంతరమున నేను విజయనగరము జేరితిని. నా రాక విని సార్వభౌముడు స్వగత మిచ్చుటకై తగిన పరివారమును ఎదురుగఁబంపెను. వారు నన్ను సముచిత రీతిని గారవించి చక్కని యొక సౌధమునకు గొనిపోయి విడియించిరి.
    విజయనగర మేలు నృపాలుఁడసాధారణ బలదర్పితుఁడు. అతని సామ్రాజ్యము సింహళద్వీప ప్రాంతము నుండి కలబరిగే రాజ్య ప్రాంతమువరకు వ్యాపించి యెటుఁ జూచినను వేయి యామడల దూర మున్నట్లుండేను. అయన రాజ్యము నకుఁబూర్వ పశ్చిమ దిశలందు సముద్రములే యెల్లలు. దేశమంతయుఁ జక్కగ సాగుచేయఁ బడుచు కనుల పండువైన భూములతో నొప్పారుచున్నది. ఆ క్ష్మాపాలుని రాజ్యమందు దేశ దేశంతర నగరములతో సముద్ర వ్యాపారము చేయు ప్రసిద్దులైన రేవు పట్టణములు మూడు వందలు గలవు. నగరమందేచ్చట జూచినను రాక్షసులవలెను, కొండలవాలేను, భయంకరములైన యేనుఁగులు వేలకొలఁది గానిపించు చుండును.
    ఈ రాజు సైన్యమునందుఁ గాల్బలము పదనోంకండు లక్షలు గలదు. ఈ దేశీయులు దమ యేలికను 'రాయ' లని పిలుతురు హిందూ స్థానమం దెచ్చుటను నీ 'రాయల' వంటి బలదర్ప సంపన్నుఁడగు భూపాలుఁడింకోకఁడు లేఁడని విందుము. ఇచ్చట ప్రజలలో నందఱికంటే బ్రాహ్మణులు విశేష గౌరవమును బొందుచుఁ బూజింపఁబడుచున్నారు.
    విజయనగరమును బోలిన యనుపమాన భాగ్యవైభవ సౌందర్యములు గల మహానగరమును బ్రపంచమందేచ్చటను నింకొక దానిని జూడఁబోము. మీఁదు మిక్కిలి వినఁజాల మన్నను నతిశయోక్తి కాదు. ఎంత విస్తీర్ణము! ఒక ప్రాకారము లోపల నింకొకప్రాకారము చొప్పున నేడు ప్రాకారముల నడుమ గట్టిన యీ మహా నగరము మిక్కిలి దుర్గమమైనది. ఎదవా ప్రాకారమునకు వెలుపల యేఁబది గజముల వెడల్పు గల వాహ్యాలి ప్రదేశము గలదు. నగరము చుట్టును గల సప్త ప్రాకారములలో వెలుపలది వలయాకారముగా నుండి ఎత్తైన యొక శిఖరము పై నున్నది. అయ్యది రాతితోడను , సున్నము తోడను గట్టిగాఁ గట్టఁబడి బలిష్టమైన కవాటములు గలిగియున్నది. ఆ ద్వారము చెంత రేయింబవల్లెప్పుడు ను రక్షకభటులేమరక కావలి గాయు చుందురు. వారు దుర్గరక్షణమం దెంతయప్రమత్తులుగ నుందురో యగంతుకుల కడ నగర ప్రవేశసుంకములు గైకొనుటలోఁ గూడ నంతటి యప్రమత్తులు. తొలికోట నుండి రెండవ ప్రాకారమునకు, దానిని గడచి మూడవదానిని, అందుండి నాల్గవ కోట వాకిలిని అట్లు వరుసగా దాటుచుఁబోయి యెడవ ప్రాకారమును సమీపించితిమి. ఈ కడపటి ప్రాకారములోపల రాయల మందిరములు, సౌధములు, సభామంటపములు , కొల్వుకూటములు, కచ్చేరీలు గలవు.
    నగరమునకు వెలుపలఁగల యెడవ ప్రాకారమునకు నాలుగు గవనులు కలవు. అందుత్తర దక్షిణముల వానికి నడుమను, పశ్చిమముల వానికి నడుమను రెండామడల దూరము నుందును . వెలుపలి ప్రాకారములో మొదటి దానికిని రెండవ దానికిని నడుమ గల ప్రదేశమున సారవంతములై సాగు చేయబడుచున్న భూములు, ఫలపుష్పవంతములైన చక్కని తోటలు పెక్కులు గలవు. వెలుపల నుంచి మూడవ ప్రాకారము మొదలుకొని లోపల ఏడవ ప్రహరీ వరకును , రాజవీధి కిరుప్రక్కల దట్టముగా, నిండ్లు, అంగళ్లు, నడుమ వీధులు , తోఁటలు గలవు. ఏడవ ప్రాకారము లోపల రాయల నగరును, సభాగారములను , సౌధములను, నాలుగు రాజవీదులు గలిసికొను మొగయును గలవు. ఆ రాజవీధులు నాలుగు నొక దాని కొకటి ఎదురుగా నున్నవి. ముందుత్తరముగా రాయలు నివసించు నగరుకలదు. ఈ నగరివాకిటి నుండియే నాలుగు వీధులును నాలుగు మొగలకు బోవును. ప్రతి రాజవీధి మొగను నగరివాకిటికి సమీపమున ధనురాకారముగా నున్న తోరములతో గూడిన ఎత్తైన గోపురమును, దాని చుట్టును స్తంభములతో నలంకరింపబడిన వసారయును గలవు. ఈ రాజవీధుల మొగలనున్నతోరణ గోపురము లన్నింటి కంటెను, నగరి వాకిట నందమైన గోపురము గలదు.

 Previous Page Next Page