కరుణామయుడి త్యాగాన్ని కీర్తించుటకు వేళ ఇదే!

క్రైస్తవులు జరుపుకునే పండుగలలో గుడ్ ఫ్రైడే ప్రధానమైనది. అందరూ అనుకున్నట్టు దీన్ని గుడ్ ఫ్రైడే అని క్రైస్తవులు అనరు. క్రైస్తవులు దీన్ని బ్లాక్ డే గా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు దుఃఖించడం జరుగుతుంది. అసలు బ్లాక్ ఫ్రైడే ని  గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారు?? ఈరోజు క్రిస్టియన్స్ దుఃఖించడానికి కారణం ఏమిటి?? తెలుసుకుంటే..

గుడ్ ఫ్రైడే రోజు క్రిస్టియన్స్ ప్రార్థనా మందిరాలు అయిన  చర్చిలకు వెళ్లి  ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈరోజు వారి ప్రార్థనల్లో దుఃఖం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం యేసు ప్రభువు తన ప్రాణాలను ఇదే రోజు వదిలిపెట్టాడు. యేసును రోమన్లు ​​ఈ రోజున సిలువ వేశారు. తాను దేవుని కుమారుడనని యేసు చెప్పుకోవడం అతనిపై దైవదూషణ ఆరోపణలకు దారితీసింది. యూదు మతపరమైన అధికారులు యేసు వాదనలకు మనస్తాపం చెందారు. వారు అతనిని రోమన్లకు సమర్పించారు. పొంటియస్ పిలేట్, గవర్నర్రోమ్, యేసుక్రీస్తును ఉరితీయమని ఆదేశించాడు. యేసు అనుచరులలో ఒకరైన జుడాస్ యేసు సమాచారాన్ని రోమన్ సేనలకు చేరవేశాడు. వారు యేసును బంధించారు.  జుడాస్ కు బహుమతిగా 30 వెండి నాణేలు ఇచ్చారు. 

యేసు సిలువ వేయబడిన రోజును "మంచి" శుక్రవారం అని ఎలా పిలుస్తారని చాలా మంది ఆశ్చర్యపోతారు. అయితే దీని వెనుక చాలా కారణాలున్నాయి. యేసుక్రీస్తు మరణం ఒక సాధారణ సంఘటన కాదని, ఒక విధంగా మానవాళికి మోక్షాన్ని తీసుకువచ్చే మార్గమని కొందరు నమ్ముతారు. అదే సమయంలో, చాలా మంది ఈ రోజును మొదట 'గాడ్' ఫ్రైడే అని పిలిచేవారు. కాలక్రమేణా అది 'శుభ' శుక్రవారంగా మారిందని చెప్పారు. యేసు బాధ తన అనుచరులను పాపం నుండి రక్షించడానికి దేవుడు చేసిన ప్రణాళిక కాబట్టి ఆ దినానికి సముచితంగా పేరు పెట్టబడిందని కూడా కొందరు నమ్ముతారు. 

సిలువ వేయబడిన తరువాత యేసు చాలా బాధను అనుభవించారు. అందుకే, ఈ రోజున, క్రైస్తవులు యేసు త్యాగాలను, ఆయన సిలువ వేయబడిన విధానాన్ని, ఆయన బాధలను, ఆయన అనుభవించిన హింసలను మరియు బాధాకరమైన మరణాన్ని గౌరవిస్తారు.

ఈ కారణంగానే క్రైస్తవులు ఈరోజు దుఃఖంలో ఉంటారు. అంతేకాదు.. ఈరోజు యేసు ప్రభువును స్మరించుకుంటూ ఉపవాసం కూడా ఉంటారు. ఉపవాసం ముగిసిన తరువాత చాలాచోట్ల తీపి రొట్టెలను ఆహారంగా తీసుకుంటారు. 

                                     ◆నిశ్శబ్ద.


More Festivals