అప్పారావు అశరీరవాణి పలికింది

అప్పారావు అశరీరవాణి పలికింది

వర్షం పడుతుండగా ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు అప్పారావు.

" ఇంతలో అక్కడే ఆగిపో..నీ ముందున్న చెట్టు పడిపోతుంది" అంటూ ఎవరో అరచినట్టు

అనిపించి ఆగిపోయాడు.

వెనక ఎవరూ లేరు కానీ నిజంగానే చెట్టు పడిపోయింది. ఆశ్చర్యపోతూనే

ఇంటికివెళ్ళేందుకు ఆటో ఎక్కబోతుంటే "వద్దు ఎక్కకు. ఆ ఆటోకి యాక్సిడెంట్

అవుతుంది" అని వినిపించి ఆగిపోయాడు.

ఇంతలో మరెవరో ఆ ఆటో మాట్లాడుకున్నారు.అది కదలి కదలగానే కారు వచ్చి

కొట్టేసింది.

అప్పారావు మరింత ఆశ్చర్యపోయి "నన్నింతగా రక్షిస్తున్నావు..ఎవరు నువ్వు?" అని

అడిగాడు.

" నేను అశరీరవాణిని " అంటూ సమాధానం వచ్చింది.

" నా క్షేమం ఇంత కోరేవాడివి నేను పెళ్ళిచేసుకుంటున్నప్పుడు ఎక్కడ చచ్చావ్ " అంటూ

కోపగించుకున్నాడు అప్పారావు.