Mugguru Kabotunnaam

ముగ్గురు కాబోతున్నాం

విషయం తెలుసుకున్నరమణి, చెప్పలేని సంతోషంతో ఇంటిలో సందడి చేస్తూ " ఆయన

రాగానే ముందుగా ఈ విషయం చెప్పాలి " అని తనలో తను అనుకుంటుండగా...అప్పుడే

ఆఫీసు నుండి రమణి భర్త కిశోర్ అలసటగా ఇంటికి వచ్చాడు.

భర్తను చూడగానే మరింత సంతోషంతో " ఏవండీ...త్వరలో మనం ముగ్గురం కాబోతున్నాం

తెలుసా " అని చెప్పింది.

ఆ మాట వినగానే అలసట మరిచిపోయిన కిశోర్ " యాహూ... అమ్మ దొంగా ఇంత

ఆలస్యంగానా చెప్పడం " అని ఆనందంగా భార్యను దగ్గరికి తీసుకుంటుండగా, మాట

మధ్యలో రమణి కల్పించుకుంది.

" నాకు మాత్రం ఏం తెలుసండీ. గంట క్రితమేగా మా అమ్మ తను వస్తున్నట్టు చెప్పింది "

అని అసలు విషయం చెప్పింది రమణి.

ఆ మాట విని అదిరిపడిన కిశోర్ " ఆ...." అని నోరు తెరిచాడు.