వామ్మో... రోజులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. ఇటీవల కర్నాటకలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బెంగళూరులోని బసవశంకరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే పద్మజ అనే మహిళ కుమార్తె ఇంటర్మీడియట్ పాస్ అయింది. అయితే ఆమెకు మార్కులు తక్కువ వచ్చాయి. దానికి పద్మజ తన కూతుర్ని మార్కులు తక్కువ వచ్చాయేంటని కోప్పడింది. దాంతో ఆ కూతురు కోపంతో రగిలిపోయింది. కిచెన్‌లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి తన తల్లి మీద దాడి చేసింది. కత్తితో తల్లిని నాలుగుసార్లు పొడిచింది. కత్తిపోట్లకు గురైన తల్లి మరో కత్తిని తీసుకుని కూతురి మీద ఎదురుదాడి చేసి, తాను కూడా కత్తిపోట్లు పొడిచింది. కత్తిపోట్లకు తీవ్రంగా గురైన కుమార్తె అక్కడికక్కడే మరణించింది. ఇల్లంతా రక్తసిక్తమైపోయింది. కూతుర్ని చంపిన తర్వాత తల్లి కూడా కుప్పకూలిపోయింది. కూతురు చనిపోయింది. ఇప్పుడు తల్లి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో వుంది. 
సాధార‌ణంగా ఎలాంటి శుభ‌కార్యాలు జ‌ర‌గాల‌న్న మంచి ముహూర్తాలు ఉండాల్సిందే. మంచి ముహుర్తాలు లేకుంటే శుభ‌కార్యాలు చేయ‌రు. ప్ర‌స్తుతం మూఢ‌మి వ‌చ్చేసింది. మూడు నెల‌ల వ‌ర‌కు శుభ‌కార్యాల‌కు విరామం అనే చెప్ప‌వ‌చ్చు. దీంతో ప‌లు రంగాల వారిపై ప్ర‌భావం ప‌డ‌నుంది. ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవని పండితులు తేల్చారు. ఈ మూడు నెలలు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాలు కావడంతో ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది. నిన్న‌టి నుంచి అదే.... ఏప్రిల్‌ 29 నుంచి ఆగస్టు 8వరకు, మూడు నెలలపాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు లేవ‌ని వేద పండితులు తేల్చిప‌డేశారు. అంతే ఇక  వివాహాలతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనలు, శంకుస్థాపనల లాంటి శుభకార్యాలను జరపడం సాధ్యం కాదు. మంచి రోజులు రావాలంటే, మూడు నెల‌లు ఆగాల్సిందేన‌ట‌.  శుభకార్యాలకు బ్రేక్‌ పడటంతో పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరు వ్యాపారుల ఉపాధిపై ప్రభావం వుంటుంది. అలాగే బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజేలు, బారాత్‌లు నిర్వహించే కళాకారుల ఉపాధికి కూడా మూడు నెలలపాటు గండిపడిన‌ట్లే.  పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు ఆగిపోయినట్టే. ఈ మూడు నెలల పాటు వంటల వారు, పూల అలంకరణ చేసేవాళ్లు, క్యాటరింగ్ సిబ్బంది, లైటింగ్ డెకరేషన్ వారు, పెళ్లిముంతలు చేసే స్కిల్ వర్కర్లు, ప్రైవేటు కల్యాణ మండపాల యజమానులు విశ్రాంతి తీసుకోవాల్సిందే. వీరితో పాటు బంగారం, వస్త్రదుకాణాలు వెలవెల బోయే పరిస్థితులు నెలకొన్నాయి.  ఇక‌ ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకుల‌కు గిరాకీ లేక ఈగ‌లు తోలుకోవాల్సిందే. క‌నీసం మెయింట్‌నెన్స్‌ చార్జీలు కూడా రావని ఫంక్ష‌న్ హాళ్ల నిర్వాహ‌కులు తెగ బాధ‌ప‌డిపోతున్నారు.  ప్రతి సంవత్సరం మే నెలలో అత్యధిక వివాహాలు జరుగుతుంటాయి. కానీ, ఈ సారి ఆ అవకాశం లేదు. సోమవారం నుంచే శుభకార్యాలకు బ్రేక్‌ పడింది.  సూర్యకాంతి గురు, శుక్ర గ్రహాలపై పడి ఈ మౌఢ్యమి సంక్రమిస్తుందని ఈ సమయంలో ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహుర్తాలు పెట్టడం సాధ్యం కాని పురోహితులు చెబుతున్నారు.  మూడాల కారణంగా   ముఖ్యంగా శుభ‌కార్యాల‌కు గురు, శుక్ర గ్ర‌హాల బ‌లం ముఖ్యం. ఆ రెండు గ్ర‌హాలు సూర్యుడికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన‌ప్పుడు వాటి శ‌క్తిని కోల్పోయి బ‌ల‌హీన‌మ‌వుతాయి. కాబ‌ట్టి అలాంటి స‌మ‌యం, ఎటువంటి శుభ‌కార్యాల‌కు ప‌నికి రాద‌ని పంచాగ క‌ర్త‌లు చెబుతున్నారు.  మంచి రోజులు రావాలంటే, మూడు నెల‌లు ఆగాల్సిందేన‌ట‌. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
టీడీపీ సంక్షేమ ప‌థ‌కాల ముందు జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు వెల‌వెల పోతున్నాయి. గ‌తంలో జ‌గ‌న్‌కు ఓటు వేసిన వారంతా ఇప్పుడు కూట‌మి మేనిఫెస్టో కే జై అంటున్నారు. ముఖ్యంగా పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొత్తం ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్నే మార్చివేసింది. వాస్త‌వానికి ప్ర‌జ‌లు ఎప్పుడూ, సంక్షేమంతో పాటు అభివృద్ధినే కోరుకుంటారు. కానీ గ‌త ఐదేళ్ళ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎక్క‌డా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేదు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచివేసిందనే అస‌హ‌నం ఏపీ ప్ర‌జ‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఆ అస‌హ‌న‌మే ఇప్పుడు ఓట్ల రూపంలో చూప‌నున్నారు. జ‌గ‌న్ పాల‌న‌కు ఈ ఎన్నికలు రెఫరెండం అని చెప్ప‌వ‌చ్చు.   తన వల్ల మేలు జరిగితేనే తనకు ఓటేయాలని.. లేకుంటే వద్దని ఆయ‌నే చెబుతున్నాడు. కేవ‌లం సంక్షేమ పథకాలనే జగన్ నమ్ముకున్నారు.  మ‌రోవైపు.. రాష్ట్రంలో అభివృద్ధి లేద‌ని.. అమ‌రావ‌తిని విధ్వంసంచేశార‌ని.. రాష్ట్రానికి పెట్టుబ‌డులు రా కుండా చేశార‌ని.. దీని వ‌ల్ల రాష్ట్రం 30 ఏళ్ల‌పాటు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చెబు తోంది. దీనినే ప్ర‌చారం కూడా చేస్తోంది. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ ప‌థ‌కాల‌కు మించి, సంక్షేమ ప‌థ‌కాలు ఇస్తామ‌ని టీడీపీ చెబుతోంది. చంద్ర బాబుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అంటూ కూటమి విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. తెలుగుదేశం అంటేనే సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసే పార్టీ. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. ప్రజాగళం పేరుతో చంద్ర‌బాబు ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం కంటే, మెరుగైన సంక్షేమం అందిస్తామ‌ని కూట‌మి మేనిఫెస్టో విడుద‌ల చేసింది. కూట‌మి సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న‌తో మొత్తం ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. అధికార, విపక్ష కూటమి ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీకి ఎలాంటి నాయ‌కుడు అవ‌స‌రం అనేదే, ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అదే జ‌నం మాట్లాడుకుంటున్నారు.  జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌, అలాగే చంద్ర‌బాబు 14 ఏళ్ల పాల‌న‌...వీరిలో ఎవ‌రు స‌రైన నాయ‌కుడో ఏపీ ప్ర‌జ‌లు ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తీర్పు ఇవ్వ‌నున్నారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
ALSO ON TELUGUONE N E W S
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో.. 'పుష్ప-2' (Pushpa 2 The Rule) తో అంతకుమించిన సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది. 'పుష్ప-2' ఫస్ట్ సింగిల్ గా టైటిల్ సాంగ్ విడుదల కానుంది. "పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్" అంటూ సాగే ఈ సాంగ్ లిరికల్ ప్రోమోని ఇటీవల విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ని మే 1న ఉదయం 11:07 కి విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు రిలీజ్ టైం మారింది. మే 1న సాయంత్రం 5:04 కి రిలీజ్ చేయనున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు.  'పుష్ప-1' విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా', 'ఊ అంటావా మావా', 'శ్రీవల్లి', 'సామి సామి', 'దాక్కో దాక్కో'.. ఇలా అన్ని పాటలూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. అందుకే 'పుష్ప-2' సాంగ్స్ పై (Pushpa 2 Songs) ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. అయితే "పుష్ప.. పుష్ప.." ప్రోమోకి మిశ్రమ స్పందనే వచ్చింది. మరి ఫుల్ సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
హనీ  ఈజ్  ది బెస్ట్  అనే డైలాగ్ తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి  మెహ్రిన్ ఫిర్జాద. పాల మీగడ తరగ   లాంటి అందం తన సొంతం. నటన  కూడా అంతే  అందంగా  ఉంటుంది. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, ఎఫ్ 2 , ఎఫ్ 3 లాంటి సినిమాల్లో నటించింది. తమిళ, హిందీ భాషల్లో కూడా పలు  చిత్రాలు చేసిన మెహరీన్  టూ డే టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది  వయసులో  ఉన్నప్పుడు శరీరంలోని  ఆరోగ్యకరమైన  అండాలని  భద్రపరచుకోవడాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. అలా భద్రపరుచుకున్న అండాలతో మన  ఇష్టం వచ్చినప్పుడు  పిల్లలని కనవచ్చు. అచ్చ  తెలుగులో చెప్పుకోవాలంటే అండాల శీతలీకరణ. ఇప్పుడు కొంత మంది ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. తాజాగా ఈ కోవలో   మెహ్రిన్ కూడా చేరింది. అందులో భాగంగా మై ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ అంటు ఒక వీడియోని ఇనిస్టాగ్రమ్ లో అప్ లోడ్ చేసింది.  అందులో మెహ్రిన్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకోవడం  ఎగ్ ఫ్రీజింగ్  ద్వారా  అండాలని  ఎలా సేకరిస్తారో  ఉంది.  సదరు వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఈ సందర్బంగా కొన్ని  విషయాలని కూడా ఆమె వెల్లడించింది. ఎగ్ ఫ్రీజింగ్  చేయించుకోవాలా వద్దా అని రెండు సంవత్సరాలు ఆలోచించాను. ఆ తర్వాత సమాజం గురించి కాకుండా  నా భవిష్యత్తు  గురించి  నిర్ణయం తీసుకోవాలనుకున్నా. హాస్పిటల్ కి వెళ్లిన ప్రతి సారి హార్మోన్ల ఇంజక్షన్ కారణంగా  కళ్ళు తిరిగి పడిపోయానని  కూడా  చెప్పుకొచ్చింది. ఇక ఆమెకి 2021 లో భవ్య బొష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. అతను హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు. తండ్రి పేరు  కుల్దీప్ బిష్ణోయ్. ప్రస్తుతం ఎంఎల్ఏ గా కొనసాగుతూ ఉన్నాడు. ఇక వాళ్ళిద్దరి పెళ్లి మాత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.   
Disney unveiled a first look at “Mufasa: The Lion King,” the new film coming to theatres Dec. 20 that explores the unlikely rise of the beloved king of the Pride Lands. Announced yesterday is an all-star roster of talent bringing new and fan-favorite characters to life—plus, celebrated award-winning songwriter Lin-Manuel Miranda is writing the film’s songs produced by Mark Mancina and Miranda, with additional music and performances by Lebo M. “Mufasa: The Lion King” enlists Rafiki to relay the legend of Mufasa to young lion cub Kiara, daughter of Simba and Nala, with Timon and Pumbaa lending their signature schtick. Told in flashbacks, the story introduces Mufasa as an orphaned cub, lost and alone until he meets a sympathetic lion named Taka—the heir to a royal bloodline. The chance meeting sets in motion an expansive journey of an extraordinary group of misfits searching for their destiny—their bonds will be tested as they work together to evade a threatening and deadly foe. Additional casting includes Braelyn Rankins, Theo Somolu, Folake Olowofoyeku, Joanna Jones, Thuso Mbedu, Sheila Atim, Abdul Salis and Dominique Jennings. Blending live-action filmmaking techniques with photoreal computer-generated imagery, “Mufasa: The Lion King” is directed by Barry Jenkins, produced by Adele Romanski & Mark Ceryak, and executive produced by Peter Tobyansen. Disney's Mufasa: The Lion King releases in India on 20th December 2024, in English, Hindi, Tamil and Telugu.      
Varalaxmi Sarathkumar’s Sabari is set for release on the 3rd of May and the film is directed by Anil Katz and produced by Mahendra Nath Kondla under Maha Movies banner. Maharshi Kondla is presenting the film. The makers dropped the second song from the album today and it was unveiled by versatile filmmaker Karuna Kumar. The song is titled Alasina Oopiri and it delves into the mother-daughter sentiment the film has to offer. It shows the fighting spirit of Varalaxmi’s character.
ఎన్నో వైవిధ్యమైన చిత్రాలని తెలుగుప్రేక్షకులకి అందించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన.సినిమాల కోసం  టీచర్ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడంటే సినిమా అంటే ఆయనకి ఎంత ఫ్యాషనో అర్ధం అవుతుంది. తాజాగా  ఆయన  కుటుంబంలో ఒక  విషాదం చోటు చేసుకుంది  త్రినాథరావు నక్కిన తండ్రి పేరు సూర్యారావు. అనారోగ్య కారణాల వల్ల సూర్యారావు గారు  నిన్న చనిపోయారు. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు  త్రినాధరావు కి తమ సానుభూతుని తెలియచేస్తున్నారు. 2013 లో వచ్చిన ప్రియతమ నేను ఇచట కుశలమా అనే చిత్రం ద్వారా త్రినాథరావు దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత మేము వయసుకొచ్చాం, నువ్విలా నేనిలా, సినిమా చూపిస్త మావ, నేను లోకల్,హలో గురు ప్రేమ కోసమే, ధమాకా  వంటి చిత్రాలకి దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా నేను లోకల్, ధమాకా చిత్రాలు ఆయనకీ మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ రెండింటితో స్టార్ డైరెక్టర్ గా కూడా మారాడు. రవితేజ ప్లాప్ ల పరంపరకి  ధమాకా నే అడ్డుకట్ట వేసింది. దాంతో పలువురు హీరోలు ,నిర్మాతలు  ఆయనతో సినిమాలు చేయడానికి రెడీ గా ఉన్నారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ లో ఒక మూవీకి  కమిట్ అయ్యాడు. రచయితగాను కొన్ని సినిమాలకి వర్క్ చేసాడు. విశాఖపట్నం ఆయన స్వస్థలం   
  రాననుకున్నారా! రాలేననుకున్నారా! ఇంద్ర మూవీలో మెగాస్టార్ చిరంజీవి  చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు ఈ డైలాగ్ ని  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. హరిహర వీరమల్లు రూపంలో సగర్వంగా చెప్పబోతున్నాడు  పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లో హరిహర వీరమల్లు  ఒకటి. 2022 లోనే షూటింగ్ ప్రారంభం అయ్యింది. కానీ రక రకాల కారణాల వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అవుతు వచ్చింది.పైగా ఆ మూవీ  తర్వాత  పవన్ ఒప్పుకున్న  సినిమాలు విడుదల అయ్యాయి. అసలు వీరమల్లు గురించి  అప్ డేట్ కూడా ఎక్కడా రావడం లేదు.మేకర్స్ కూడా సైలెంట్ గా ఉంటు వస్తున్నారు. దీంతో   వీరమల్లు ఇప్పట్లో  ఉండదనే వార్తలు గత కొంత కాలం నుంచి వినిపిస్తు వస్తున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ అదును చూసి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. వీరమల్లు టీజర్ మే  2  ఉదయం తొమ్మిది గంటలకి  విడుదల కాబోతుంది. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ తో  మేకర్స్ అధికారకంగా  ప్రకటించారు.దీంతో పవన్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వచ్చింది మెగా సూర్య మూవీస్ పతాకంపై ఏ ఎం రత్నం అత్యంత భారీ వ్యయంతో వీరమల్లు ని నిర్మిస్తున్నాడు. క్రిష్ దర్శకుడు కావడంతో ప్రాజక్టు పై అందరిలో ఎనలేని  ఆసక్తి నెలకొని ఉంది. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా  అషు రెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తో పాటు ఎన్నో భారీ చిత్రాలకి మాటల్ని     అందించిన  సాయి మాధవ్ బుర్ర వీరమల్లు కి కూడా  డైలాగ్స్ ని అందిస్తున్నారు. పవన్ చేస్తున్న మొట్టమొదటి హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు   
హీరోయిన్ అని తక్కువ అంచనా వెయ్యకండి.. హీరోలతో పాటే వాళ్ళకి క్రేజ్ ఉంటుంది.మార్కెట్ లో  సినిమా ఉన్నా లేక పోయినా అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఈ విషయాన్నీ మరోసారి నిరూపించింది ప్రముఖ హీరోయిన్ నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్  లో రామ్ కి ధీటుగా నటించి  రౌడీ హీరోయిన్ అనే ముద్ర కూడా వేయించుకుంది. తాజాగా ఆమె  వీడియో ఒకటి వైరల్ గా మారింది నభా నటేష్ ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ అనంతపురంలోని  ఎస్ వి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ లో జరిగిన ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యింది. స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.పైగా ఇస్మార్ట్ పోరి కావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో వాళ్ళల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించడానికి డాన్స్ కూడా చేసింది.పైగా  ఇస్మార్ట్ శంకర్ లోని చిలక చిలక పెట్టి పోరా చురక  పాట కావడంతో అక్కడున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పలువురు విద్యార్థులతో కలిసి మూవీలో చేసినట్టుగానే డాన్స్  చేసింది. ప్రస్తుతం ఆ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా ఇంటర్నేషనల్ డాన్స్ డే  ని పురస్కరించుకొని నభా తన ఇనిస్టాగ్రమ్ లో ఆ వీడియోని అప్ లోడ్ కూడా చేసింది. ప్రస్తుతం ఆమె ప్రముఖ నటుడు, హీరో అయిన  ప్రియదర్శి  తో కలిసి డార్లింగ్ అనే మూవీ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రియదర్శన్, నభా ల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.ప్రభాస్  టైటిల్  కావడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. గత కొంత కాలంగా హిట్లు లేని నభా కి డార్లింగ్ తో హిట్ వస్తుందేమో చూడాలి.నిఖిల్ స్వయంభు  మూవీలోను చేస్తుంది   
Powerstar Pawan Kalyan’s highly-anticipated period action drama, Hari Hara Veera Mallu, has been in the making for over 2 years now. The Krish directorial has been in all sorts of news of late, with rumors of Krish exiting the project due to unexplained reasons. Lot of rumours were became viral on the film. According to rumours, the film is shelved due to differences, Krish already started another project with Anushka and fans lost all hope on the film. But recently makers wished Happy Sri Rama Navami with a powerful poster. Makers also announced that teaser will be out very soon. We've reported that the teaser will be out in May 1st week. The teaser will have everyone on the edge of their seats. Today makers officially announced that the film's teaser will be out on May 2nd at 9AM. In the movie, Pawan will be seen in the role of a revolutionary bandit hero named Hari Hara Veera Mallu. Produced by AM Rathnan, the film has Nidhhi Agerwal as the leading lady. Oscar winning composer MM Keeravani is scoring the soundtrack.
  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయ్యాయని ఒకప్పుడు చెప్పుకునేవాళ్లం. అది ఇప్పటికీ ఉంది కానీ.. మానవ సంబంధాలు మరికొన్ని కొత్త రూపాలకు దారి మళ్లాయి. ఒకప్పుడు వైవాహిక జీవితంలో ఏ సమస్య వచ్చినా  దాన్ని పరిష్కరించుకోవడం, సర్థుకోవడం చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు.. ఏ సమస్య వచ్చినా దాన్ని తెగెవరకు లాగి అదే సమస్యకు పరిష్కారం అని అనుకుంటున్నారు. ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్న విషయం స్లీపింగ్ డైవొర్స్.. అసలు స్లీపింగ్ డైవొర్స్ అంటే ఏంటి? దీనివల్ల భార్యాభర్తలకు జరిగే నష్టం ఏంటి తెలుసుకుంటే.. పెళ్లైన భార్యాభర్తలు  ఒకే గదిలో ఉన్నప్పుడు వారు కలిసి నిద్రపోతారు.  ఇద్దరూ విడివిడిగా పడుకోవడం ప్రారంభిస్తే వారి మధ్య ఏదో సరిగ్గా జరగడం లేదనే అనుమానం వస్తుంది.  సాధారణంగా భార్యాభర్తలు ఇక ఇద్దరూ కలిసి జీవించలేమని నిర్ణయించుకున్న తరువాత విడాకులు తీసుకుంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ అనేవి బంధాన్ని తెంచుకునే విడాకులు కాదు.. నాణ్యమైన నిద్ర పొందడానికి భాగస్వాములు విడివిడిగా నిద్రపోవడానికి తీసుకునే విడాకులు. సాధారణంగా భాగస్వాములు నిద్రలో చేతులు,  కాళ్లను కదిలించడం వల్ల, గురకకు అలవాటు పడడం వల్ల లేదా ఏదైనా నిద్ర రుగ్మత కారణంగా పక్కవారి నిద్రకు డిస్టర్బ్ కలిగిస్తూ ఉంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ కారణంగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఇద్దరు హాయిగా నిద్రపోతారని  అనుకుంటున్నారు. కానీ  ఇది సమస్యను పరిష్కరించడానికి బదులుగా వారి మధ్య బంధాన్నిబలహీనపరుస్తుంది. నిద్ర కోసం ఈ స్లీపింగ్ డైవొర్స్ తీసుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. అయినా సరే ఈ డైవొర్స్ స్లీపింగ్ వల్ల జంట మధ్య బంధం బలహీనపడుతుందని రిలేషన్షిప్ నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఇద్దరూ విడివిడిగా పడుకోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా వారిని ఎప్పటికీ కలిపి ఉంచేది వారిద్దరి మధ్య శారీరక స్పర్శే.. అది కూడా వారిమధ్య లేనప్పుడు  ఇక ఇద్దరినీ కలిపి ఉంచే మార్గమేదీ ఉండదు. ఒకే ఇంట్లో ఇద్దరూ అపరిచితుల్లా చాలా  కొద్ది కాలంలోనే మారిపోతారు. మరొక విషయం ఏమిటంటే ఇలా ఇద్దరూ విడివిడిగా పడుకోవడం అనేది దీర్ఘకాలం జరిగితే వైవాహిక బంధాలు విచ్చిన్నమై వాటి విలువ కూడా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన నిద్రకోసం భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యకరమైన పద్దతులు ఎంచుకోవాలి. వైద్యుల సలహా తీసుకుని నిద్రకు బంగం కలిగించే సమస్యలను పరిష్కించుకోవాలి.                                              *రూపశ్రీ.  
వేసవికాలం వచ్చిందంటే వామ్మో అంటాము. మండిపోయే ఎండలు, మగ్గబెట్టే ఉక్కపోత, వీటికి తోడు కరెంట్ కోతలు. ఉదయం, సాయంత్రం తప్ప ఏ మధ్యాహ్నపు ఎండలోనో బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందంటే గుండె గుభేలుమంటుంది. అందుకే ఎండ అంటే చెప్పలేనంత మంట అందరికీ. కానీ సమయం గడుస్తూ ఉంటే ఈ కాలాలు అదేనండి వర్షాకాలం, చలికాలం వచ్చినట్టు ఎండాకాలం కూడా రాక తప్పదు. అది తన ప్రతాపం చూపించక తప్పదు. అయితే ఈ వేసవిని చూసి భయపడటానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, దీన్ని ఎంజాయ్ చేయడానికి అన్నే మార్గాలు ఉన్నాయి. ఓసారి తెలుసుకుంటే సమ్మర్ మీద హమ్మర్ తో ఓ మోస్తరు సౌండ్ చేయచ్చు. ఒకప్పుడు!! సంవత్సరకాలం అంతా పిల్లలు ఎదురుచూసేరోజులు ఇవే అంటే ఆశ్చర్యమేస్తుంది. నిజంగానే వేసవి కోసం పిల్లలు అర్రులు చాచేవాళ్ళు. ఒక పూట బడి ముగియగానే ఎండను కూడా లెక్కచేయకుండా బావుల వెంట, చేల వెంట వెల్తూ ఎన్నో మధురస్మృతులను మూటగట్టుకునేవాళ్ళు. ఓ ముప్పై సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళను పిలిచి బాల్యం గురించి చెప్పమంటే కళ్ళు మెరవడం, చిరునవ్వు బయటకు రావడం ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.  అందుకే అన్ని కాలలను ఒకేలా పుస్తకాల మధ్య కాకుండా కాసింత ప్రత్యేకంగా గడిపేలా మీ పిల్లలకు ఏర్పాటు చేయండి. అది వాళ్లకు ఆసక్తికరమై, వాళ్ళ సంతోషానికి కారణమయ్యేది అయ్యుండాలి సుమా!! ప్రకృతి ఆతిథ్యం!! నిజంగా నిజమే. వేసవిలో ప్రకృతి ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తుందని. అవన్నీ చాలా వరకు ఇప్పటి తరానికి తెలియకుండా ఉన్నాయి. వాళ్లకు ఓసారి పరిచయం చేసి చూడండి. నాచురల్ లైఫ్ మీద లవ్ లో పడతారు వాళ్ళు. పుల్లని విందు!! బలే బలే పసందు ఈ పుల్లని విందు. అదే అదే ఫలాల రాజు మామిడి గారు ఎంతో ఠీవిగా చెట్లలో పెరిగి అందరినీ పలకరించడానికి ఇంటింటికి వస్తాడు. అందరి నోర్లు జలపాతాలు చేస్తాడు.  చెరకు చరిష్మా!! చిన్నప్పటి దంతాల రహస్యం. నోటితోనే చెరకు పొట్టు తీసి, కొరికి, కసకస నమిలి, రసాన్ని జుర్రుకుంటూ పిప్పిని పడేస్తే ఆహా ఉంటుంది ఆ నాలుగు అదృష్టం ఎంతో అనిపిస్తుంది. ఇప్పట్లో అంత సీన్లు లేకపోయినా ఎంచక్కా రోడ్ సైడ్ దొరికే చెరకు రసం తాగేసి హాయి హాయిగా వెళ్లిపోవచ్చు.  ఇవి మచ్చుకు రెండు మాత్రమే. ఇంకా చింతచిగురు వేరే లెవెల్. తాటి ముంజలు మరొక ఎత్తు, చల్ల చల్లటి మజ్జిగ, శరీర తాపాన్ని తగ్గించే పుదీనా శరబత్ ఇవన్నీ హైలైట్.  అయితే మరొక మ్యాజిక్ కూడా ఉంది. అదే కేవలం రాయలసీమ ప్రాంతంలో లభ్యమయ్యే సుగంధి సిరప్. కేవలం కడప జిల్లాలో అడవులలో మాత్రమే పెరిగే సుగంధ మొక్కల వేర్లను ఉడికించి పంచదార కలిపి సిరప్ చేసి అమ్ముతుంటారు. సువాసన అద్భుతంగా ఉంటుంది. చల్లని నీళ్లు, లేదా షోడాతో ఈ సిరప్ కలిపి తీసుకుంటే వేసవి కాలం వెంట తీసుకొచ్చే వడదెబ్బ వంద కిలోమీటర్లు పరిగెత్తి పరిగెత్తి పారిపోతుంది. శరీర వేడిని తక్షణమే తగ్గిస్తుంది.  వేసవి భయం అసలు వద్దు!! ఎవరు ఎన్ని చెప్పుకున్నా బయటకు వెళ్ళేవాళ్లకు అదొక భయం. సర్రుమని కాలిపోతున్న రోడ్లన్నీ నరకంలో యమధర్మరాజు ఏర్పాటు చేసినట్టు అనుభూతి కలుగుతుంది. అందుకే సులువైన, మరియు అందరూ ఆచరించగల జాగ్రత్తలు. బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. మరి నీళ్లు అయిపోతే?? ఏముంది ఏకంగా బాటల్  కొనే పని తప్పుతుంది ఎక్కడో ఒక చోట అయిదు రూపాయల్లో బాటల్ నింపుకోవచ్చు. లేదు కాదు అంటే 20 నుండి 30 పెట్టి వాటర్ బాటిల్ కొనేబదులు ఎంచక్కా ఫ్రూట్ జ్యూస్, లేదా నిమ్మ షోడా వంటివి తాగడం హాయి. వేసవి తాపాన్ని తగ్గిస్తాయి ఇవి. ఇవి కాకుండా మరొక సలహా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కీరా దోస, పుచ్చకాయ వంటి నీరు అధికంగా ఉన్నవి తినడం లేదా జ్యూస్ తాగడం మంచిది. ఉప్పు, కారం, మసాలాలు వంటివి తగ్గించుకోవాలి ఈ కాలంలో. శరీర ఉష్ణోగ్రత మీద అవి ప్రభావం చూపిస్తాయి.  వెంట గొడుగు ఉంచుకోవడం మర్చిపోకండి. లేదంటే టోపి, లేదా స్పార్క్ ఇలా ఎదో ఒకటి నెత్తిని కప్పి ఉంచేలా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలా చూసుకోవాలి. మధ్యలో సమయం అంతా ఇంటి పట్టున లేదా ఉద్యోగాలు చేసే ప్రాంతాలలో ఉండటం మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే వేసవి కోసం బోలెడు మార్గాలు. అయితే మనం ఎంత డాబు చెప్పుకున్నా ఈ ఎండల కొరడా దెబ్బకు ఒళ్ళు చురుక్కుమనడం సాధారణం. అందుకే దాని నుండి జాగ్రత్త మరి. జాగ్రత్తగా షేక్ హాండ్ ఇచ్చి కూల్ గా డీల్ చేసి పంపిద్దాం.                                     ◆వెంకటేష్ పువ్వాడ.
  జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది. వేసవిలో  వేడి,  తేమతో కూడిన వాతావరణంలో శరీరాలు సులభంగా డీహైడ్రేషన్ కు గురవుతాయి.  ఇది మలబద్ధకం, అతిసారం,  ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి  ఆయుర్వేద చెప్పిన  చిట్కాలను అనుసరించడం అన్ని విధాలా మంచిది. జీర్ణ సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ.. ఆహారం మన శరీరానికి ఇంధనం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది, ఔషదంగా పనిచేస్తుంది. శరీరం  సమతుల్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  మంచి ఆహారం తీసుకోవడం సరైన ఫిట్నెస్ మెంటైన్ చేయడానికి మూలం.   వెచ్చని, తాజాగా వండిన,  సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఆయుర్వేదంచే ఎక్కువగా సిఫార్సు చేయబడ్డాయి. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు,  విత్తనాలు అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి మూలికలు,  సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం చాలా మంచిది.  ఆయుర్వేదంలో ఉపయోగించే త్రిఫల వంటి మూలికలు జీర్ణక్రియకు,  జీర్ణశయాంతర వ్యవస్థను క్లియర్ చేయడానికి  బాగా ఉపయోగపడతాయి.  మసాలా దినుసులను పోలి ఉండే అల్లం జీర్ణ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అల్లంను ఆహారంలో చేర్చవచ్చు లేదా తాజా అల్లం టీ వంటివి త్రాగవచ్చు. జీలకర్ర, కొత్తిమీర,  ఫెన్నెల్ టీ, లేదా CCF టీ, జీర్ణక్రియకు,  గ్యాస్,  ఉబ్బరం నుండి ఉపశమనానికి ఉపయోగిస్తారు. పులియబెట్టిన ఆహారాలైన పెరుగు, ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు, మజ్జిగ, అన్నం గంజి,  ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. సరైన జీర్ణక్రియ గట్ బ్యాక్టీరియా  సమతుల్యంగా ఉండటంపై  ఆధారపడి ఉంటుంది. ఇది ప్రోబయోటిక్స్ మద్దతు ఇస్తుంది.  కెఫిన్, స్పైసీ ఫుడ్,  కొన్ని పాల ఉత్పత్తులు కడుపు నొప్పికి కారణం అవుతాయి.  కొన్ని వస్తువులు తీసుకోవడం పరిమితం చేయడం ఉత్తమం. భారీ ఆహారాలు,  వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక కొవ్వు, ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడిన, నిల్వ చేసిన,  సీసాలలో ఉంచిన ఆహారాలను తగ్గించాలి.  ఎందుకంటే అవి జీర్ణం కావడం కష్టం.  జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఒకేసారి ఎక్కువ తినకుండా  రోజంతా చిన్న మొత్తాలలో తినాలి.  ఇది  జీర్ణవ్యవస్థపై  అధిక భారం పడకుండా చేస్తుంది. భోజనం చేస్తున్న సమయంలో  స్పృహతో తినాలి. తినేటప్పుడు గాలి పీల్చుకోకూడదు. ప్రశాంతమైన, రిలాక్స్డ్ వాతావరణంలో తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా,  పూర్తిగా నమలాలి. ఇది ఆహార కణాల విచ్ఛిన్నానికి సహాయపడుతుంది.   రోజంతా తగినంత నీరు త్రాగాలి. నీరు జీర్ణక్రియ,  పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.  అలాగే జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలికలో సహాయపడుతుంది. జీర్ణాశయాన్ని శుభ్రపరచడంలో  గోరువెచ్చని నీరు తాగాలని ఆయుర్వేదం సూచిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి రెగ్యులర్ శారీరక శ్రమ కూడా అవసరం. ఆప్టిమల్ మూవ్మెంట్ థెరపీ ప్రేగు కదలికలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.  మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొన్ని యోగా భంగిమలు,  శ్వాస వ్యాయామాలు ఉదర అవయవాలను ప్రేరేపిస్తాయి, ఇవి విశ్రాంతిని,  మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. పవనముక్తాసనం (గాలి-ఉపశమన భంగిమ),  భుజంగాసనం (కోబ్రా భంగిమ) వంటి ఆసనాలు సహాయపడతాయి. నాడి శోధన (ప్రత్యామ్నాయ నాసికా శ్వాస) వంటి ప్రాణాయామం కూడా జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.  గోరువెచ్చని నువ్వుల నూనెతో సవ్యదిశలో పొత్తికడుపును మసాజ్ చేయడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రసరణను మెరుగుపరుస్తుంది.  నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.  తద్వారా జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. విరేచన (చికిత్సా ప్రక్షాళన),  బస్తీ (ఔషధ ఎనిమా) వంటి పంచకర్మ చికిత్సలు శరీరాన్ని శుభ్రపరచడానికి,  జీర్ణ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పడే దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. క్రమం తప్పకుండా తినడం,  నిద్రపోవడం ద్వారా సిర్కాడియన్ చక్రాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు కీలకం.                                                            *రూపశ్రీ.
మామిడి పండ్ల సీజన్ మొదలైంది. మార్కెట్‌లో వివిధ రకాల మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. మామిడి  పండు తినడమంటే అందరికీ ఇష్టమే.. అయితే కొందరు మాత్రం దీన్ని మినహాయించాలని చెబుతారు. వారే మధుమేహం ఉన్నవారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం మధుమేహం ఉన్నవారు కూడా మామిడి పండ్లను తప్పకుండా తినచ్చని, కానీ అది తగినంత మోతాదులో చాలా కొద్దిగా మాత్రమే తినాలని చెబుతారు. అంతేనా మరికొందరు బాగా పండిన మామిడి పండ్లను మధుమేహం ఉన్నవారు అస్సలు తినకూడదని కూడా అంటున్నారు. అసలు మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తినడంలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? తెలియకుండానే మామిడిపండ్లు తినడంలో వారు చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే.. మామిడి పండ్లను తింటే డయాబెటిక్ పేషెంట్ల పరిస్థితి మరింత దిగజారుతుందనేది పెద్ద అపోహ అని డాక్టర్లు చెబుతున్నారు. మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచివి, కానీ తీపి కారణంగా మధుమేహ రోగులు తరచుగా వాటిని తినకుండా ఉంటారు.లేదా వాటిని తప్పుడు పరిమాణంలో లేదా తప్పుడు పద్ధతిలో తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనం ఏది తిన్నా అది షుగర్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.  ఇది ఏ ఆహారం తినడం ద్వారా చక్కెర స్థాయి ఎంత పెరుగుతుందో చెప్పడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులందరూ క్రమం తప్పకుండా పండ్లు తినాలి. అయితే మామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ ఎక్కువగా ఉంది (51-56). అందుకే తినే పరిమాణం,  విధానంపై మధుమేహ రోగులు శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ పేషెంట్లు మామిడిపండ్లు తినడం మానేయాల్సిన అవసరం లేదు.  ప్రతిరోజూ 100 గ్రాముల చిన్న మామిడిపండును సమతుల్య పరిమాణంలో తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినే విధానంపై శ్రద్ధ వహించాలి.  వాటిని తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. ఒకేసారి 100 గ్రాముల కంటే ఎక్కువ మామిడి తినకూడదు. మామిడికాయ గుజ్జును మాత్రమే తినాలి.  మామిడి రసం లేదా షేక్ రూపంలో తీసుకోకూడదు. పండ్లు తిన్న రెండు గంటల తర్వాత చక్కెర స్థాయిని చెక్ చేసుకోవాలి. పండ్లు తిన్న తర్వాత చక్కెర స్థాయి పెరిగితే పరిమాణాన్ని తగ్గించాలి.  వైద్యుడిని సంప్రదించాలి. భోజనం తర్వాత లేదా రాత్రి మామిడి తినకూడదు. ఎల్లప్పుడూ మామిడికాయను మధ్యాహ్నం సలాడ్‌గా లేదా ఉదయం అల్పాహారంగా తినాలి.                                          *రూపశ్రీ.