అవాంతరాలు లేని హైవే ప్రయాణం అందించడమే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.   ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వార్షిక పాస్‌ను తీసుకువస్తున్నది. ఆగస్టు 15 నుంచి అందుబాటులోనికి రానున్న ఈ సాస్ జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉ:టుంది.     ఈ కొత్త  ఫాస్టాగ్   పాస్ ను 3వేల రూపాయలు చెల్లించి తీసుకుంటే.. దానిని ఉపయోగించి  ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది.  ఈ పాస్టాగ్ పాస్ ను  కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.   ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. రాజ్ మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఈ పాస్ తీసుకోవచ్చునని తెలిపారు. 
అమెరికా అధ్య‌క్షుడు జీ7 నుంచి హ‌డావిడిగా అమెరికా బ‌య‌లు దేరారు. ఇంత‌లో ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మెక్రాన్ ఇరాన్- ఇజ్రాయెల్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కోస‌మేమో  ఈ తొంద‌ర అని అన్నారు. లేదు లేదు అంత‌క‌న్నా మించి అన్నది ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య.  ఇక్క‌డ యూఎస్ కి చేరుకోగానే సిట్యువేష‌న‌ల్ రూమ్ ని ఏర్పాటు చేశారు ట్రంప్. ఇప్ప‌టికే  ఇజ్రాయెల్ టెహ్రాన్ గ‌గ‌న త‌లాన్ని త‌న  కంట్రోల్లోకి తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ట్రంప్ కూడా ట్రెహ్రాన్ లో నివ‌సించేవారంతా ఆ ప్రాంతం వ‌ద‌లి  వెళ్లాల్సిందిగా హెచ్చ‌రించారు. కార‌ణం.. ఇక్క‌డికి 225 కి. మీ ద‌గ్గ‌ర్లో ఇరాన్ కి చెందిన‌ న‌టాంజ్ అణు కేంద్రం ఉంటుంది. ఇక వంద కి. మీ. దూరంలో ఉండేది  ఫార్దో. ఇదీ ఒక‌ అణు కేంద్రమే. ఇక్క‌డ యురేనియం శుద్ధి సుమారు 83 శాతం చేసింది ఇరాన్. యురేనియం 90 శాతం శుద్ది అయితే చాలు ఒక అణుబాంబు త‌యారు చేయ‌డానికి. అంటే దాదాపు ద‌గ్గ‌ర‌కొచ్చేసింద‌న్న‌మాట‌.  ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పే మాట ఏంటంటే  అణ్వాయుధం ఇరాన్ కి ఎట్టి  ప‌రిస్థితుల్లోనూ  ద‌క్క కూడ‌ద‌ని. ఎందుక‌లా? కార‌ణాలు ఏమై ఉంటాయి? అంటే.. మొద‌ట కొన్నాళ్ల  నుంచి ఇరాన్- యూఎస్ మ‌ధ్య అణు ఒప్పందం పెండింగ్ లో ఉంది. ఇందుకు ఇరాన్ ఎట్టి  ప‌రిస్తితుల్లోనూ ఒప్పుకోవ‌డం లేదు. పాయింట్ నెంబ‌ర్ టూ  పాకిస్థాన్ లా మ‌రో ఇస్లామిక్ కంట్రీ  ద‌గ్గ‌ర అణ్వాయుధం ఉంటే  ప‌రిస్థితి  మ‌రోలా మారిపోతుంది. 1960ల నాటి ఆయుధ శ్రేణి ఫైట‌ర్ జెట్లు ఉండ‌గానే ఇరాన్ ఇటు పాల‌స్తీనా హ‌మాస్ కి, అటు లెబ‌నాన్ హిజ్బుల్లాకు నిధులు, ఆయుధాల‌ు అందజేయడంతో పాటు  శిక్ష‌ణ  కూడా ఇస్తోంది. ఇది అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్ కి ఎంత మాత్రం క్షేమ‌క‌రం కాదు. దీంతో ఇస్లామిక్ విప్ల‌వం మ‌రింత ముదిరే అవ‌కాశ‌ముంది. బేసిగ్గా ఇరాన్, ఇజ్రాయెల్ 1979 వ‌ర‌కూ మిత్ర‌దేశాలే. ఎప్పుడైతే 1980ల్లో ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న్ వ‌చ్చిందో  అప్ప‌టి నుంచీ ఇజ్రాయెల్ తో వ‌ర్గ  శ‌తృత్వం ఏర్ప‌రుచుకుంది ఇరాన్. దీంతో అమెరికా  ఇరాన్ అంటేనే భ‌య‌ప‌డుతోంది. ఆ దేశానికి అణ్వాయుధం అంటేనే హ‌డ‌లిపోతోంది. ఇది మ‌రింత ఇస్లామిక‌ర‌ణ‌కు ఆస్కారం ఏర్ప‌రుస్తుంద‌న్న ఆందోళ‌న  చెందుతోంది యూఎస్.  దీంతో ఆగ‌మేఘాల మీద ఈ  యుద్ధంలోకి త‌న వంతుగా ఏర్పాట్లు చేస్తున్నారు ట్రంప్. అయితే ఇరానీ అణు నిల్వ‌లున్న న‌టాంజ్, ఫోర్దోగానీ భూమిలోలోతుల్లో భ‌ద్ర ప‌ర‌చ‌బ‌డ్డాయి. వీటిని బ‌ద్ధ‌లు కొట్టాలంటే అమెరికా ద‌గ్గ‌రున్న బంక‌ర్ బ్లాస్ట‌ర్ల ద్వారా మాత్ర‌మే సాధ్యం. ఇవి ఇర‌వై అడుగుల పొడ‌వుండే జీబీయూ 57 అనే భారీ బంక‌ర్ బ్లాస్ట‌ర్ల ద్వారా మాత్రమేపేల్చాల్సి ఉంటుంది.  ఈ బంక‌ర్ బ్లాస్ట‌ర్లు ఒక్కొక్క‌టీ 13 వేల 600 కిలోల బ‌రువుంటాయి. వీటిని అమెరిక‌న్ బీ2 స్పిరిట్ బాంబ‌ర్ల ద్వారా మాత్ర‌మే ప్ర‌యోగించ‌గ‌లం. వీటిని కొన్ని నెల‌ల క్రిత‌మే ప‌శ్చిమాసియాకు చేర్చింది యూఎస్. విమాన వాహ‌క నౌక యూఎస్ఎస్ నిమిట్స్ ని ఈ స‌రికే  ప‌శ్చిమాసియా తీరానికి  త‌ర‌లించింది  అమెరికా. ఇత‌ర స‌హాయ‌క నౌక‌లు సైతం ఈ దిశగా క‌దిలాయి. అంతే  కాదు బ్రిట‌న్ జెట్ ఫైట‌ర్లు కూడా  మొహ‌రిస్తున్నారు. ఇలా అన్నిర‌కాలుగా  ఇరాన్   అణ్వాయుధ త‌యారీ చేయ‌కుండా క‌ట్ట‌డి చేస్తోంది యూఎస్. అందులో భాగంగా మొద‌ట త‌మ మిత్ర దేశం ఇజ్రాయెల్ ని రంగంలోకి దింపింది. ఇదొక ఎమోష‌న‌ల్ డ్రామా. ఇక్క‌డ గానీ చిక్కితే.. మొద‌ట అణు ఒప్పందం గురించి అడ‌గొచ్చు. లేదంటే త‌ను కూడా ఇదే యుద్ధంలోకి దిగి ఇరాన్ ప‌ని  ప‌ట్టొచ్చ‌ని భావిస్తోంది యూఎస్.. అందుకే ఈ  ఉరుకులు ప‌రుగుల నిర్ణయాలుగా అంచ‌నా వేస్తున్నారు.. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల  నిపుణులు.
చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓవరేక్షన్ బూమరాంగ్ అయ్యింది. ఆలూ లేదు చూలూ లేదు.. అన్న సామెత చందంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి మద్యం కుంభకోణంలో తనను ఇరికించాలన్న కుట్ర జరుగుతోందంటూ నానా యాగీ చేశారు. చెవిరెడ్డి  ఈ యాగీ చేసే సమయానికి అసలు చెవిరెడ్డి పేరు మద్యం కుంభకోణం నిందితులలో లేనే లేదు. ఈ కేసులో అరెస్టైన నిందితులు విచారణలో తన పేరు వెల్లడించి ఉంటారన్న అనుమానంతో చెవిరెడ్డి హడావుడి చేశారు. తన వద్ద పని చేసిన వారినీ, తన స్నేహితులనూ బెదరించి, వేధించి తనకు వ్యతిరేకంగా తప్పుడు స్టేట్ మెంట్లు ఇప్పిస్తున్నారంటూ సిట్ పై ఆరోపణలు గుప్పించారు.  తనను అరెస్టు చేయడమే సిట్ లక్ష్యమైతే.. తానే స్వయంగా సిట్ కార్యాలయానికి వచ్చి స్వచ్ణందంగా అరెస్టౌతాను అంటూ గంభీరమైన ప్రకటనలు చేశారు. మీడియా ముందు సవాళ్లు చేశారు. దాదాపు తొడకొట్టి మీసం మెలేసినంత పని చేశారు. ఇంతా చేసి.. చల్లగా దేశం దాటేయడానికి ప్రయత్నించారు. అయితే బెంగళూరు విమానాశ్రయంలో అడ్డంగా దొరికిపోయారు. లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయనను బెంగళఊరు విమానాశ్రంయలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. సిట్ కు సమాచారం ఇచ్చారు. సిట్ హుటాహుటిన బెంగళురుకు బయలుదేరి వెళ్లింది. ఈ రోజు ఆయనను విజయవాడ తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. ఇక చెవిరెడ్డి కోసం ఆయన వద్ద పదేళ్ల పాటు గన్ మెన్ గా పని చేసిన మదన్ రెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ కోర్టుకెక్కారు. సిట్ తనను చెవిరెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ వేధించిందనీ, మ్యాన్ హ్యాండిల్ చేసిందనీ పిటిషన్ దాఖలు చేశారు.  సరే సిట్ మదన్ రెడ్డి ఆరోపణలు నిర్ద్వంద్వంగా ఖండించింది. ఆ ఆరోపణలపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అసలు మదన్ రెడ్డి తమ విచారణకు సహకరించలేదని పేర్కొంది. అది పక్కన పెడితే.. చెవిరెడ్డి విషయంలో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సహా ఆరుగురిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేసింది.   దీంతో మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి ఓవరేక్షన్  చేసి తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్న చందంగా ముందుగానే అరెస్టు సవాళ్లు విసిరి సిట్ అదుపులోకి వెళ్లిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
రెండు దశాబ్దాల నుంచి తమిళ చిత్ర సీమలో విభిన్న జోనర్ కి సంబంధించిన సినిమాల్లో నటిస్తూ అశేష అభిమానులని సంపాదించుకున్న హీరో ఆర్య(Arya). ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆర్య ఖాతాలో ఉన్నాయి. తాజాగా చెన్నై(Chennai)లోని ఆర్య నివాసంలో  ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆర్య కి సంబంధించి అన్నా నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న   'సీ షెల్' రెస్టారెంట్ ల పై కూడా సోదాలు జరిపి పలు డాక్యుమెంట్స్ ని చెక్ చేస్తున్నారు. పన్ను ఎగవేత కారణమగానే అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆర్య అక్కడి స్థానిక మీడియాతో మాట్లాడుతు 'సీ షెల్'(C shell)రెస్టారెంట్లతో నాకు సంబంధం లేదు. వీటి నిర్వహణ బాధ్యతని నేను కొన్నేళ్ల క్రితం వేరే వ్యక్తికి అప్పగించానని చెప్పడం జరిగింది. ఆర్య ప్రస్తుతం 'అనంతన్ కాదు' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులని అన్వయిస్తూ, సరికొత్త  కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన  ఫస్ట్ గ్లింప్స్ కి అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మూవీపై  అంచనాలు కూడా పెరిగాయి.   
Cast: Kavin, Aparna Das, Bhagyaraj, VTV Ganesh, Master Iyan, and others.   Crew: Music by Jen Martin Cinematography by Elil Arasu Produced by Mrs. Neeraja Kota (NRI) Directed by Ganesh K. Babu   Originally released in Tamil as Dada, this film garnered over ₹40 crores at the box office. Now, it has been dubbed into Telugu as Paapa, and brought to telugu audiences by NRI producer Mrs. Neeraja Kota. Can the magic created in Tamil be recreated for the Telugu audience? Lets discuss at length.    Plot:  Mani (Kavin) and Sindhu (Aparna Das) are in final year of their college and they both are deeply in love. Their relationship and closeness grow with each day. One day, Sindhu reveals that she is pregnant and Mani asks her to contemplate abortion. The couple grow distant over this issue and Sindhu abandons even her kid. Mani takes him away and starts becoming more responsible. Will the couple re-unite? Will their families accept their re-union? Watch the movie to know more.    Analysis: Kavin and Aparna Das have given their career best performances in the film. We can empathise with them individually while we understand why they are going through such painful journey. They both have been able to live as characters. Mainly, Kavin's performance as Mani leaves a mark and he is highly relatable. Aparna Das, while looking cute, she is able to handle the complex emotions brilliantly.  All other actors including seasoned performers like Bhagyaraj and VTV Ganesh also deliver highly nuanced portrayals. The movie excels in portraying a single parent's adjustment with the parenthood and growth of an individual over the period of time with responsibilities on their shoulders. But in falls a little bit short in portraying the same from a woman's point of view.  Also, the comical portions in the second half, slightly drag the movie and almost dilutes its essence. But the strong climax and emotionally moving portrayal of the actors in the moment, gives a fulfilling experience. Writing by director Ganesh Babu could have been better in places where the tormented couple come face to face again and in dad-son relationship portions in second hour.  Still, the movie provides a high-quality visual experience with heart touching music, emotional content. The movie keeps us all hooked throughout the runtime and it is worth a watch for everyone. The coming of age elements and the emotional climax can be stated as the highlights of the film.    Bottomline:  Paapa is a movie that you can watch in theatres without any second thought.  Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. 
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీస్ లో 'ఓజి'(Og)ఒకటి. గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఓజి కి సాహూ ఫేమ్ 'సుజిత్'(Sujeeth)దర్శకత్వం వహిస్తుండగా, 'ఆర్ఆర్ఆర్' మూవీ ఫేమ్ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ తో 'ఓజి'పై పవన్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ హక్కులని పలు ఏరియాల వారీగా పొందటానికి అగ్ర నిర్మాతలు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. సినీ సర్కిల్స్ ల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఓజి సీడెడ్(రాయలసీమ) రైట్స్ కోసం ప్రతిష్టాత్మక  సితార బ్యానర్ అధినేత  నాగవంశీ  భారీ మొత్తంలో ఇచ్చి తన సొంతం చేసుకున్నట్టుగా టాక్  వినపడుతుంది. పవన్ కళ్యాణ్ కి  నాగవంశీ అత్యంత సన్నిహితుడు. పవన్ తో భీమ్లా నాయక్ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా,  గత ఎన్నికల్లో పవన్ గెలుపు కోరుతు పిఠాపురంలో ప్రచారం కూడా చేసాడు. మిగతా ఏపీ మొత్తానికి  మరో టాప్ నిర్మాత 80 కోట్ల రూపాయల దాకా చెల్లించి హక్కులని పొందినట్టుగా తెలుస్తుంది.  ఓజి లో ప్రియాంక మోహన్(Priyanka MOhan)హీరోయిన్ కాగా, ఇమ్రాన్ హష్మీ ప్రతి నాయకుడుగా చేస్తున్నాడు. శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్(Taman)మ్యూజిక్ డైరెక్టర్.    
శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత పది సంవత్సరాలు గ్యాప్‌ తీసుకొని ఖైదీ నంబర్‌ 150 సినిమా చేశారు మెగాస్టార్‌ చిరంజీవి. మధ్యలో కొన్ని సినిమాల్లో కనిపించినా పూర్తి స్థాయి హీరోగా ఖైదీ నంబర్‌ 150లోనే కనిపించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో మెగాస్టార్‌ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్‌ అయింది. అయితే ఈ సినిమా తర్వాత చేసిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్‌ఫాదర్‌ చిత్రాలు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని నిరాశపరిచాయి. ఆ తర్వాత బాబి కొల్లి కాంబినేషన్‌లో చేసిన వాల్తేరు వీరయ్య సినిమా మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి మెగాభిమానులను హ్యాపీ చేసింది. ఆ వెంటనే మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చేసిన భోళాశంకర్‌ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం వశిష్ట కాంబినేషన్‌లో చేస్తున్న ‘విశ్వంభర’పైనే మెగాస్టార్‌తోపాటు ఆయన అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా అద్భుతంగా వస్తోందనే సమాచారం అందుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్‌ సరసన త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌ పైనే ఇప్పటివరకు క్లారిటీ లేదు. ‘విశ్వంభర’ షూటింగ్‌ పూర్తి చేసి అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో చేస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు చిరంజీవి. అయినప్పటికీ విశ్వంభర రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేయకపోవడంతో మెగాభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్‌ చెయ్యాలనుకున్నారు. అదే టైమ్‌లో రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ ఉండడంతో చిరంజీవి తన సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకున్నారనే వార్తలు వచ్చాయి. నిజానికి అది కారణం కాదు. కొంత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మిగిలి ఉండడంతో అది పూర్తి చేయడానికి టైమ్‌ పడుతుందన్న ఉద్దేశంతో రిలీజ్‌ను వాయిదా వేశారు.  ఆమధ్య విడుదలైన టీజర్‌లో విఎఫ్‌ఎక్స్‌ క్వాలిటీగా లేదనే విమర్శలు వచ్చాయి. దీనిపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ కూడా నడిచింది. అందుకే మరింత క్వాలిటీ రావడం కోసం ఆ వర్క్‌ మళ్ళీ చేయిస్తున్నారని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఇదే కారణమని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇది కూడా కాదు అని తాజాగా చక్కర్లు కొడుతున్న వార్త వల్ల తెలుస్తోంది. అదేమిటంటే.. విశ్వంభర సినిమాలోని ఐటమ్‌ సాంగ్‌ వల్ల ఆలస్యం జరుగుతోందట. ఆ పాటను ఎవరితో చేస్తే బాగుంటుందనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారట మేకర్స్‌. తమన్నా, పూజా హెగ్డేలలో ఎవరో ఒకరితో ఆ పాట చేయించే అవకాశం ఉంది. ఆ పాట కూడా కంప్లీట్‌ చేసి ఫస్ట్‌ కాపీ వస్తే అప్పుడు సినిమా రిలీజ్‌ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌ ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 
  మెగాస్టార్ చిరంజీవి అంటే డ్యాన్స్ ఎలా గుర్తుకొస్తుందో.. ఆయన కామెడీ టైమింగ్ కూడా అలాగే గుర్తుకొస్తుంది. చిరంజీవి కామిక్ టైమింగ్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. వింటేజ్ చిరుని మళ్ళీ వెండితెరపై చూడాలని, ఆయన కామెడీ ఎంజాయ్ చేయాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. ఈమధ్య ఒకటి అరా సినిమాల్లో మెగాస్టార్ ఫన్ పంచినప్పటికీ.. ఫ్యాన్స్ కి అది సరిపోలేదు. వారు డబుల్ డోస్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అసలుసిసలైన వింటేజ్ చిరంజీవి కామెడీ చూడాలని కోరుకుంటున్నారు. వారి కోరిక అనిల్ రావిపూడి సినిమాతో తీరబోతుంది. (Chiranjeevi)   చిరంజీవి తన 157వ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్.. 2026 సంక్రాంతి కానుకగా థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. (Mega 157)   చిరంజీవి అసలు పేరు శివ శంకర్‌ వరప్రసాద్‌ అనే విషయం తెలిసిందే. అదే పేరుతో ఈ సినిమాలో కనిపించనున్నారు. డ్రిల్ మాస్ట‌ర్ శివ శంకర్‌ వరప్రసాద్‌ గా సందడి చేయనున్నారు. స్కూల్ నేప‌థ్యంలో వచ్చే కామెడీ సీన్స్ అదిరిపోతాయని, చిరు కామెడీకి థియేటర్లలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఖాయమని అంటున్నారు.   రావిపూడి గత చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'లో బుల్లిరాజుగా మాస్టర్ రేవంత్ పంచిన హాస్యాన్ని అంత తేలికగా మరచిపోలేము. ఇప్పుడు మెగాస్టార్ మూవీ కోసం కూడా బుల్లిరాజుని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. చిరు-రేవంత్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం.    మెగా 157 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమా.. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్ర‌స్తుతం ముస్సోలిలో స్కూల్ నేప‌థ్యంలోని కొన్ని సీన్స్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు నయనతార, కేథ‌రిన్ థ్రెసా కూడా పాల్గొంటున్నారు. ఈ స్కూల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో వస్తోందని, అవుట్ పుట్ పట్ల మూవీ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉందని వినికిడి.  
మంచు విష్ణు(Vishnu)అప్ కమింగ్ మూవీ 'కన్నప్ప'(Kannappa). 'తిన్నడు' అనే నాస్తికుడు శ్రీ కాళహస్తీశ్వరుడికి పరమభక్తుడైన కన్నప్ప' గా మారడానికి గల కారణాలు ఏంటనే ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ పై మోహన్ బాబు, విష్ణు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో 'కన్నప్ప' పై అందరిలో  పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. ప్రభాస్(Prabhas)మోహన్ బాబు(Mohan Babu)మోహన్ లాల్(Mohan Lal)అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి టాప్ స్టార్స్ కూడా కీలక పాత్రల్లో  చేస్తున్నారు. దీంతో  'కన్నప్ప' పాన్ ఇండియా వ్యాప్తంగా సరికొత్త రికార్డులు రాబడుతుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కన్నప్పలో 'పిలక’, ‘గిలక’అనే  బ్రాహ్మణ  క్యారెక్టర్స్ ని ప్రముఖ కామెడీ నటులు బ్రహ్మానందం,సప్తగిరి  పోషించినట్టుగా తెలుస్తుంది. దీంతో వాళ్ళిద్దరి పాత్రల పేర్లు బ్రాహ్మణ సమాజాన్ని,సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉన్నాయని, కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్‌ హైకోర్టులో పిటీషన్ వెయ్యడం జరిగింది. ఈ పిటీషన్ పై మంగళవారం  విచారణ జరిపిన హైకోర్ట్ తన తీర్పులో 'కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, సీబీఎఫ్‌సీ సీఈవో, సీబీఎఫ్‌సీ అధికారి, ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్, కన్నప్ప దర్శకుడు ముఖేష్‌కుమార్‌ సింగ్(Mukeshkumar Singh)నిర్మాతలుగా వ్యవహరించిన మోహన్‌బాబు, విష్ణు తో పాటుగా, బ్రహ్మానందం, సప్తగిరికి నోటీసులు జారీచేసింది.  అనంతరం తన తదుపరి విచారణని ఆగస్టు 1కి వాయిదా వేసింది. ఇక కన్నప్ప మూవీ ఈ  నెల 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో, విష్ణు కెరిరీలోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. విష్ణుకి జోడిగా ప్రీతి ముకుందన్ చెయ్యగా, కాజల్ అగర్వాల్, మధుబాల, రఘుబాబు, ముకేశ్ రుషి కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార చిత్రాల్లో బిజీ గా ఉంది. స్టీఫెన్ దేవసి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు మారుమోగిపోతు ఉన్నాయి.  
మ్యాడ్ చిత్రంలో జెన్నీశర్మ అనే క్యారక్టర్ ద్వారా ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి 'అనంతిక సనిల్ కుమార్'(Anathika Sanilkumar). కేరళ కి చెందిన అనంతిక ఈ నెల 20 న '8 వసంతాలు'(8 Vasantalu)అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్రామా అండ్ రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో అనంతిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక రకంగా  లేడీ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఫణింద్ర నరిశెట్టి(Phanindra Narsetti)దర్శకత్వంలో అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్'(Mythri Movie Makers)ఈ చిత్రాన్ని నిర్మించింది. దీంతో  ప్రేక్షకుల్లో '8 వసంతాలు' పై మంచి అంచనాలే ఉన్నాయి. రిలీజ్ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అనంతిక ని ఉద్దేశించి మైత్రి మూవీస్ నిర్మాతల్లో ఒకరైన 'రవిశంకర్' మాట్లాడుతు 8 వసంతాలు మూవీ కోసం అనంతిక చాలా కష్టపడింది. సబ్జెట్ డిమాండ్ ప్రకారం క్లాసికల్ డాన్స్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ వచ్చిన అమ్మాయి కోసం  దేశం మొత్తం వెతికితే అనంతిక మాత్రమే కనపడింది. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ పూర్తయ్యాక, ప్లస్ టూ పరీక్షలు రాసింది. ఆ తర్వాత కేరళ నుంచి తిరిగొచ్చాక షూటింగ్ లో పాల్గొంది. ఒక అమ్మాయి ఎనిమిదేళ్ల జీవితాన్ని ఆవిష్కరించే కథే మా చిత్రమని  చెప్పుకొచ్చాడు. అనంతిక కూడా మాట్లాడుతు  చిన్నప్పట్నుంచి డాన్స్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. నటిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. 8 వసంతాలు చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి, సంజన హ్రదగేరి కీలక పాత్రలు పోషించారు. లాల్ సలాం,రైడ్ వంటి పలు తమిళ చిత్రాల్లో కూడా ప్రాధాన్యత గల పాత్రలని పోషించింది.      
ఆది, నువ్వునేను, సింహాద్రి, విష్ణు, సలీం, ప్రేమంటే మాదే, కోరుకున్న ప్రియుడు వంటి పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులకి దగ్గరైన నటి రమ్యశ్రీ(Ramya Sri)విశాఖపట్నం కి చెందిన రమ్యశ్రీ తన కెరీర్లో   ఎక్కువగా వ్యాంప్ తరహా క్యారెక్టర్స్ ని పోషించి, ఆ తరహా క్యారెక్టర్స్ ని పోషించడంలో తనకి తిరుగులేదని అనిపించింది. 2015 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఓ మల్లి' తో పాటు మరి కొన్ని చిత్రాలకి దర్శకత్వంతో పాటు నిర్మాతగాను వ్యవహరించింది. రమ్యశ్రీ కి హైదరాబాద్(Hyderabad)లోని గచ్చిబౌలి(Gachibowli)పరిధిలో ఉన్న 'ఎఫ్ సి ఏ'(FCA)కాలనీలో ఫ్లాట్ ఉంది. రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ ఆద్వర్యంలోని 'హైడ్రా'(Hydra)కాలనీ లే అవుట్ లో రోడ్లు  మార్ఫింగ్ చేపట్టింది. దీంతో ఫ్లాట్ ఓనర్  రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్  జరుగుతున్న విషయాన్నీ వీడియో తీస్తున్నారు. దీంతో కొంత మంది దుండగులు రమ్యశ్రీ, ఆమె సోదరుడుపై కత్తి, బ్యాట్ తో దాడికి దిగడంతో, గాయాల బారిన పడిన రమ్యశ్రీ తన సోదరుడితో కలిసి గచ్ఛిబౌలి పోలీసులకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై రమ్యశ్రీ మాట్లాడుతు పట్టపగలు పోలీస్ స్టేషన్ ఎదురుగానే, సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర రావు తన అనుచరులతో కలిసి మా పై హత్యా ప్రయత్నం చేసాడు. హైడ్రా ఆఫీసర్స్ పిలిస్తేనే వచ్చాను. నా ప్లాట్ నెంబర్ 144 .  25 సంవత్సరాల క్రితం కొనుక్కొని ఒక బిడ్డలా చూసుకుంటున్నాను. ప్రభుత్వం ఈ విషయంలో కల్పించుకొని శ్రీధర్ రావు ఆగడాలకి అడ్డు కట్ట వేయాలని విజ్ఞప్తి చేసింది.  రమ్యశ్రీ తన కెరీర్ మొత్తంలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ, భోజ్ పురి భాషలలో కలుపుకొని సుమారు నాలుగువందల చిత్రాల దాకా నటించింది. కన్నడలో హీరోయిన్ గా దాదాపు ముప్పై చిత్రాల దాకా చేసి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.    
  తెలుగు నట దిగ్గజం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను దేశ విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా సాగాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్, టీడీపీ పొలిటికల్ సెక్రటరీ టీజీ జనార్థన్, టీఎఫ్ పీసీ సెక్రటరీ, ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో   నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. "తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ తన ప్రత్యేకత చూపించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని నిరూపించారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని దేశ దేశాల్లో ఘనంగా నిర్వహించుకున్నాం. ఆ సక్సెస్ ను పురస్కరించుకుని ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న మా టీడీ జనార్థన్ గారికి ఇతరులకు నా అభినందనలు తెలియజేస్తున్నా. మేము విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి తెలుగు వారు ఎన్టీఆర్ పట్ల చూపించిన అభిమానం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఉన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను, ఆయన స్ఫూర్తిని ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింతగా తెలుగు ప్రజలకు చేరువచేయాలి." అన్నారు.   ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్థన్ మాట్లాడుతూ.. "ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించాం. మొదటి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారితో పాటు ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, దగ్గుబాటి వారి కుటుంబాల నుంచి అతిథులుగా పాల్గొన్నారు. ఆ తర్వాత అమెరికాలో కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం గురించి తెలిసి దేశ విదేశాల్లోని అన్నగారి అభిమానులు మా దేశంలో నిర్వహిస్తాం అంటూ ముందుకొచ్చారు. అలా దుబాయ్, సింగపూర్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి 8 దేశాల్లోని 13 నగరాల్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం జరిపారు. ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో జరిగిన కార్యక్రమాల్లో రామకృష్ణ గారు, చంద్రమోహన్ రెడ్డి, నర్సిరెడ్డి, నారా రోహిత్, బోడె ప్రసాద్  పాల్గొన్నారు. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ వంటి గొప్ప నటుడు లేరు. ఆయన గొప్పదనం ఈతరం వారికి తెలిసేలా మొదట్లో ఒక వెబ్ సైట్ లాంఛ్ చేశాం, ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రసంగాలతో భగీరథ గారు రచన చేసిన బుక్ ప్రింట్ చేశాం. ఇంకా ఆయన చరిత్రను చిరకాలం తెలుగు వారికి అందించేలా మీ దగ్గర ఉన్న ఫొటోస్, వీడియోస్ కూడా మాకు పంపవచ్చు. వాటిని కూడా గ్రంథస్థం చేస్తాం NTR భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్తానికి కమిటీ కృషికి ధన్యవాదాలు." అన్నారు.   టీఎఫ్ పీసీ సెక్రటరీ, ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్.. "ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం దేశ దేశాల్లో ఘనంగా జరగడం సంతోషకరం. నటుడిగా, ప్రజా నాయకుడిగా ఎన్టీఆర్ గురించి ఎన్నేళ్లయినా చెప్పుకోవచ్చు. సినీ రంగంలో హీరోగా వెలుగుతున్నప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా మన తెలుగు సినీరంగం, తెలుగు ప్రేక్షకులకే నా నటన అంకితమని చెప్పి ఆ అవకాశాలు తిరస్కరించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. ఆయన శతజయంతి వేడుకల్ని నిర్వహించేందుకు అప్పటి ఏపీ ప్రభుత్వ పాలకులు అనుమతి ఇవ్వలేదు, ఇక్కడ హైదరాబాద్ లోనూ అనేక ప్లేస్ లు మార్చి చివరకు కైత్లాపూర్ లో అనుమతి ఇచ్చారు. ఎలాంటి సహకారం అందించలేదు. అందుకే అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ప్రజలు ప్రభుత్వాలను మార్చేశారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు గారు ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28ని సెలవు దినంగా ప్రకటించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ప్రకటించారు. మొదటగా బాలకృష్ణ గారికి ఆ అవార్డ్ ఇవ్వడం ఆనందకరం. బాలకృష్ణ గారు నటుడిగా తాతమ్మ కల మూవీ నుంచి చూస్తే 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయనకు పద్మభూషణ్ ఇవ్వడం సముచిత గౌరవం ఇచ్చినట్లయింది." అన్నారు.  
  జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' (RRR) ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల గ్రాస్ రాబట్టింది. గ్లోబల్ స్థాయిలో ఎన్నో పురస్కారాలను, ప్రశంసలను అందుకుంది. తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది.   ఇండీవైర్ అనే ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ 2020లలో ఇప్పటిదాకా వచ్చిన వంద ఉత్తమ చిత్రాల లిస్టుని ప్రకటించింది. ఇందులో ఆర్ఆర్ఆర్.. 75వ స్థానాన్ని సంపాదించుకుంది. మొదటి మూడు స్థానాల్లో 'నికెల్ బాయ్స్', 'ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్', 'ఆఫ్టర్ సన్' చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. ఏడో స్థానంలో 'టాప్ గన్: మావెరిక్', 54వ స్థానంలో 'ఓపెన్‌హైమర్', 58వ స్థానంలో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' నిలిచాయి.   రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఈ యాక్షన్ అడ్వెంచర్ తో మరోసారి గ్లోబల్ వైడ్ గా రాజమౌళి పేరు మారుమోగిపోవడం ఖాయమని చెప్పవచ్చు.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
క్రమ శిక్షణ ప్రతి వ్యక్తి జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతుంది.  క్రమశిక్షణతో ఉన్నవారికి,  క్రమశిక్షణ లేనివారికి మధ్య తేడాను గమనిస్తే ఇది ఇట్టే అర్థమైపోతుంది.  క్రమశిక్షణ  ఉన్న వ్యక్తులు జీవితంలోని ప్రతి విషయంలో ఒక స్పష్టమైన దారిని అనుసరిస్తారు. వీరి ప్రవర్తన, ఆలోచనలు, పనితీరు, ఆచరణ.. all reflect their structured mindset అని చెప్పవచ్చు. క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న వ్యక్తులు బోలెడు మంది ఉంటారు.  వీరిలో ఉండే లక్షణాలు స్పష్టంగా తెలుసుకుంటే.. సమయపాలన (Time Management).. క్రమశిక్షణ గల వ్యక్తులు సమయాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. వారు ఎప్పటికప్పుడు ప్లాన్ ప్రకారమే పనిచేస్తారు. అపాయింట్‌మెంట్లు, డెడ్‌లైన్లు, సమావేశాలు.. ఇవన్నీ సమయానికి ముందుగానే పూర్తి చేస్తారు. లక్ష్యాలు స్పష్టంగా ఉండటం (Clarity of Goals).. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు వారి జీవిత లక్ష్యాలు, దాని చేరుకునే దారులు స్పష్టంగా ఉంటాయి. వీరు చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టి దశల వారీగా సాధించడానికి ప్రయత్నిస్తారు. అంతే తప్ప పెద్ద లక్ష్యాలను ఒకే సారి సాధించాలి అనుకోరు. ఆత్మ నియంత్రణ (Self-Control).. క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఇష్టాయిష్టాలు, ప్రలోభాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. పని సమయాల్లో ఫోన్, సోషల్ మీడియా వంటి ధ్యాసలను దూరంగా ఉంచగలుగుతారు. ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద మాత్రమే ఏకాగ్రత నిలపగలుగుతారు.   స్థిరత్వం (Consistency).. చాలా మంది అదేవిధంగా పని చేయాలంటే ఒత్తిడి లేదా అసహనానికి లోనవుతూ ఉంటారు. కాన క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు మాత్రం ఒకే విధంగా నిరంతరం పని చేయడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇదే  వీరిలో ప్రత్యేకత. అదేవిధంగా రోజూ వ్యాయామం, చదువు, పని మొదలైన వాటిని నిరంతరంగా చేస్తూ ఉంటారు. బాధ్యత (Responsibility).. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఏదైనా పనిని ఇతరులు చెప్పేవరకు అలాగే నిరీక్షిస్తూ కూర్చోరు.  ఇతరులతో చెప్పించుకోకుండా తమ పని తామే చేసుకుంటారు. తప్పులు జరిగినప్పుడు తప్పును ఒప్పుకుని పరిష్కరించడానికి ముందుంటారు. శ్రమతో కూడిన జీవితం (Hardworking Nature).. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఎక్కువగా కష్టాన్ని నమ్ముకుంటారు.  చేయాల్సిన పనులను వెంటనే చేసేతారు తప్ప పనుల్ని వాయిదా వేసే గుణం అస్సలు ఉండదు.  శ్రమించడం వల్ల ఎంత సమయం, శక్తి పోతుందన్న భయం ఉండదు. క్రమబద్ధత (Organization).. క్రమ శిక్షణ కలిగిన వ్యక్తులు తమ వస్తువులను కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు.   టేబుల్, గదులు, డాక్యుమెంట్లు ఇలా చాలా అన్ని సమర్థవంతంగా పెట్టుుంటారు. వీరితో ఏవైనా చర్చలు జరిపితే ఆ చర్చల్లోనూ, రచనలలోనూ స్పష్టత, క్రమబద్ధత కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన శ్రద్ధ (Health Discipline).. ఆహారం, నిద్ర, వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో చక్కగా అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటేనే క్రమశిక్షణగా ఏ పనిని అయినా చేసుకోగలుగుతాం అని వీరు నమ్ముతారు.  అందుకే ఎప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరు. చెడు అలవాట్లు అంటే వీరికి అసహ్యం. అదేవిధంగా సోమరితనంగా ఉండేవారు,  చెడు అలవాట్లు కలిగిన వారు అంటే వీరికి గిట్టదు. ఇలాంటి వారికి దూరంగా ఉంటారు. స్వీయ ప్రేరణ (Self-Motivation).. ఎవరూ చెప్పకుండానే తాము ముందుగా ప్రేరణ పొందడం వీరిలో గొప్ప లక్షణం. ఎవరో వచ్చి వీరిని ఉత్సాహ పరిచి ముందుకు నెట్టాల్సిన అవసరం లేదు.   ఒక పని పూర్తి చేయాలనే ఉత్సాహం లోపల నుంచే వస్తుంది. ఎప్పటికప్పుడు మెరుగుదల (Continuous Improvement).. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఎప్పుడూ చేసే పని  పట్ల ఉదాసీనంగా ఉండరు.  ఈ పనిని ఇంకా బాగా చేయవచ్చా? ఈ పని గురించి ఇంకా విభిన్న కోణాలు ఉన్నాయా?  వంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి. తద్వారా వీరు ఎప్పటికప్పుడు తమ పనితీరును, జీవితాన్ని మెరుగుపరుచుకుంటూనే ఉంటారు.                                             *రూపశ్రీ.
  వేసవికాలంలో తాహతు ఉన్నవారు ఏసీ ఏర్పాటు చేయించుకోవడం,  చల్లని గదులలో సేద తీరడం చాలా సాధారణ విషయం.  పట్టణాలలో ఎండ తీవ్రతలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంటాయి. వేసవి ముగింపుకు వచ్చినా సూర్యుడి ప్రతాపం తగ్గడం లేదు. అయితే చాలామంది ఇళ్లలో లేదా కార్యాలయాలలో ఏసీ వేసిన తరువాత కూడా గది చల్లబడకపోవడం జరుగుతూ ఉంటుంది.  ముఖ్యంగా పై అంతస్తులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.  దీని వెనుక కారణం చాలామంది తమకు  తెలియకుండానే చేసిన చిన్న తప్పు కావచ్చు.  దీని వెనుక కారణం ఏమిటి? ఇలా ఏసీ చల్లబడకపోవడం వల్ల కలిగే నష్టం ఏంటి?  తెలుసుకుంటే.. పై అంతస్తులో ఏసీ వేసినా గది చల్లబడకపోవడానికి కారణం ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వాడటమే. ఒక వైపు ఏసీ  చల్లగాలిని ఇస్తుంటే.. మరొకవైపు   ఫ్యాన్ వేడి గాలిని   వదులుతూ ఉంటుంది. దీనివల్ల నేల,  పైకప్పు మధ్య 5 నుండి 6 డిగ్రీల తేడా ఉంటుంది. తలను పైకప్పు వైపుకు కదిలిస్తే, ఉష్ణోగ్రతలో ఈ వ్యత్యాసాన్ని అనుభూతి చెందవచ్చు.  అయితే థర్మోకోల్ సీలింగ్‌తో పైకప్పును తీసుకుంటే  అది గది ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఏం చేయాలి? ఏసీతో పాటు ఫ్యాన్ కూడా నడపాల్సిన అవసరం లేదనే విషయం తెలుసుకోవాలి. వేసవిలో ఏసీ వేసిన తర్వాత కొంతకాలం ఓపిక పట్టాలి. క్రమంగా ఇల్లు చల్లబడటం ప్రారంభమవుతుంది. ఒకవేళ ఇంకా గది చల్లబడలేదు అనిపిస్తే గది కొంచెం చల్లబడిన తర్వాత ఫ్యాన్‌ను ఆన్ చేయాలి. ఇది గాలిని కలుపుతుంది. కావాలంటే ఫ్యాన్ ఆన్ చేయకుండా కూడా  హాయిగా ఉండవచ్చు. ఇది విద్యుత్తును కూడా ఆదా చేస్తుంది. ఈ లాజిక్ తెలుసుకోండి.. AC  పని ఏమిటంటే గది గాలి నుండి వేడి,  తేమను తీసుకోవడం ద్వారా దానిని చల్లబరుస్తుంది. AC గాలిని చల్లబరుస్తుంది,  దానిని క్రిందికి పంపుతుంది.  ఎందుకంటే చల్లని గాలి భారీగా ఉంటుంది,  అది దిగువగా ఉంటుంది.  కానీ ఫ్యాన్‌ను ACతో పాటు నడిపినప్పుడు, ఫ్యాన్ గదిలోని గాలిని వేగంగా వ్యాపింపజేస్తుంది. దీనివల్ల  చల్లని గాలి గదిలో సరిగ్గా 'స్థిరపడటానికి' అనుమతించదు. ఈ నష్టం తెలుసుకోవాలి.. ఫ్యాన్ చల్లని గాలిని సరిగ్గా సెట్ చేయడానికి అనుమతించనప్పుడు, సెట్ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి AC మళ్లీ మళ్లీ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఇది AC శీతలీకరణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది,  గది అంతగా చల్లబడదు. అదే సమయంలో AC తన పనిని సరిగ్గా చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చినప్పుడు అది ఎక్కువ విద్యుత్తును వినియోగించుకుంటుంది. ఫ్యాన్‌ను నడపడం వల్ల విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ఇవి గుర్తుంచుకోండి.. గదిని చల్లబరచడానికి ఏసీకి తగినంత సమయం ఇవ్వాలి. ఫ్యాన్‌ను ఆన్ చేయడం ద్వారా ఏసీ పనిని పెంచవద్దు. చల్లని గాలి బయటకు వెళ్ళకుండా,  వేడి గాలి లోపలికి రాకుండా తలుపులు,  కిటికీలను సరిగ్గా మూసి ఉంచాలి. పగటిపూట మందపాటి కర్టెన్లు లేదా బ్లైండ్లను వాడాలి. తద్వారా సూర్యుడి నుండి నేరుగా వేడి గదిలోకి ప్రవేశించదు.                         *రూపశ్రీ.
పుట్టినప్పటి నుండి ఎలాంటి పరిచయం లేకుండా పెళ్లి అనే ఒక బంధంతో ఇద్దరూ ఒకటై జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం భార్యాభర్తల బంధం. భార్యాభర్తల బంధం అనేది నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. ఈ బంధాన్ని బలంగా, ఆనందంగా నిలుపుకోవాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను పాటించడం చాలా అవసరం. నేటి కాలంలో వివాహాలు జరిగిన తరువాత చాలా తొందరగా వివాహ బంధాలు విచ్చిన్నం అవుతున్న నేపథ్యంలో వివాహ బంధాలు బలంగా నిలబడటానికి రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన కొన్ని చిట్కాలు ఇవే.. సమయం.. రోజువారీ బిజీ జీవితంలోనూ కనీసం కొంత సమయాన్ని ఒకరికి ఒకరు కేటాయించాలి. కలసి భోజనం చేయడం, ప్రాముఖ్యత ఉన్న విషయాల్లో కలిసి మాట్లాడుకోవడం అవసరం. ఇద్దరూ కలసి చేయగలిగిన పనులను పరస్పరం స్నేహభావంతో చేసుకోవాలి. ఇది ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని పెంచుతుంది. పరస్పర గౌరవం.. ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతూ ఉంటే ఆ బంధం ఎప్పటికీ నిలబడదు.  ఈ కాలంలో అమ్మాయిలు  తమకంటూ ప్రాధాన్యత ఉండాలని, తమకు గౌరవం ఉండాలని అనుకుంటారు. కాబట్టి భర్తలు భార్యలను  అపహాస్యం చేయడం, గౌరవం లేకుండా మాట్లాడటం,  భార్యలు అంటే పని మనుషులు, బానిసలు అన్నట్టు ట్రీట్ చేయడం మానుకోవాలి.    ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని ఇరువురూ గౌరవించాలి .  విషయం పెద్దదైనా, చిన్నదైనా ఇరువురూ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, గౌరవించుకోవాలి. . నమ్మకం.. అబద్ధాలు, దాచిపెట్టిన విషయాలు బంధాన్ని దెబ్బతీస్తాయి.  ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా ఉండాలి.   తప్పు చేసినా సరే.. నిజాయితీగా ఒప్పుకుని సరిదిద్దుకునే అవకాశం అడగాలి. నిజాయితీగా ఉండటం వల్ల విశ్వాసం పెరుగుతుంది. సహనంగా ఉండాలి.. ప్రతి చిన్న విషయం మీద గొడవపడకూడదు.  రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఎప్పుడూ వేర్వేరు అలోచనలతో, వేర్వేరు ప్రవర్తనలతో ఉంటారు.  ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలన్నా,  ఏవైనా తప్పులు జరిగినప్పుడు వాటిని సరి చేసుకోవాలన్నా  సహనం ఉండాలి.  ఏదైనా గొడవ లేదా తప్పిదం జరిగినప్పుడు వెంటనే మాట అనడం లేదా నిందించడం చేయకూడదు. ఇది బంధాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న గొడవలను  మౌనంగా వదిలేయడమూ ఒక తెలివైన పరిష్కారం. మెచ్చుకోవడం.. ఒకరి ప్రయత్నాలను,   ఒకరి గెలుపును, ఒకరి సృజనాత్మకతను మెచ్చుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తలలో ఎవరైనా సరే ఒక విజయం సాధించారు అంటే భాగస్వామి తోడ్పాటు ఎంతో కొంత ఉంటుంది.  అందుకే విజయాలు సాధించినప్పుడు థాంక్స్ చెప్పడం, నీ వల్లే ఈ పని ఫర్పెక్ట్ గా చేయగలిగాను లాంటి మాటలు సంబంధాన్ని సానుకూలంగా ఉంచుతాయి. నిర్ణయాలు.. ముఖ్యమైన విషయాల్లో ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఒకరిపై ఆధిపత్యం చూపడం వలన విభేదాలు వస్తాయి. భార్యాభర్తలలో ఇద్దరిలో ఒకరికి విషయం మీద అవగాహన లేకపోయినా సరే.. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటే అవగాహన పెరుగుతుంది. కలిసి నిర్ణయం తీసుకున్నాం అనే ధైర్యం కారణంగా పనులలో వైఫల్యాలు ఎదురైనా తప్పిదం ఒకరిమీదే ఉండదు. రొమాంటిక్ మూడ్.. చిన్న చిన్న సర్ప్రైజులు, ప్రేమపూరిత సందేశాలు, ఒకరి మీద ఒకరు శ్రద్ధ చూపడం బంధాన్ని చాలా సన్నిహితం చేస్తాయి.  రెండు వేర్వేరు జెండర్ ల మధ్య బంధం కాబట్టి శారీరక బంధం బలంగా ఉంటే అది ఇద్దరినీ ఎప్పటికీ కలిపి ఉంచుతుంది. నిందలొద్దు.. ఎవరి తప్పైనా, ఆరోపణలకన్నా పరిష్కార దిశగా ఆలోచించడం మంచిది.  "నువ్వే తప్పు చేశావు" అనే ఆలోచనను మార్చుకోవాలి. ఆర్థిక విషయాలు.. ఖర్చుల విషయంలో ఓపికగా, పరస్పర అవగాహనతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాలలో దాపరికాలు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడానికి డబ్బుకు అవకాశం ఇవ్వకూడదు. స్నేహం.. జీవిత భాగస్వామిగా కాక, స్నేహితుల్లా ఉండాలి. ఇలా ఉంటే ఏ విషయాలు అయినా ఒకరితో ఒకరు నిస్సంకోచంగా షేర్ చేసుకోగలుగుతారు.  ఇది ఒకరి మీద మరొకరికి నమ్మకాన్ని పెంచుతుంది.                               *రూపశ్రీ.
  ఎముకలు శరీరానికి ఊతాన్ని ఇస్తాయి.  ఎముకలు ఎంత బలంగా ఉంటే శరీరం అంత బలంగా ఉంటుందని అర్థం.  అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఎముకల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎముకలకు సంబంధించి చాలా వ్యాధులు కూడా ఉన్నాయి.  వాటిలో ఒక వ్యాధి ఎముకలను చెదపురుల్లా తినేస్తుంది. ఇంతకీ ఆ వ్యాధి ఏమిటో.. దాన్నుండి బయటపడే మార్గం ఏమిటో.. ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో.. వివరంగా తెలుసుకుంటే.. ఎముకలు  క్రమంగా బలహీనపడతాయని చాలామందికి తెలియదు. అది కూడా స్పష్టమైన లక్షణాలు లేకుండానే బలహీన పడతాయి.  దీనికి కారణం అయ్యే వ్యాధిని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ వ్యాధి  ఎముకల బలాన్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ లక్షణాలు గుర్తించే సమయానికి, ఎముకలు చాలా బలహీనంగా మారతాయి. చిన్న చిన్న దెబ్బలు కూడా ఎముకల పగుళ్లకు కారణం అవుతాయి. అసలు  ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి?  దానిని ఎలా నివారించాలంటే.. ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలు క్రమంగా సన్నగా,  బలహీనంగా మారే వ్యాధి. అవి లోపల నుండి బోలుగా మారుతాయి.  చెదపురుగులు చెక్కను ఆక్రమించినట్లు. బయట నుండి ప్రతిదీ బాగానే కనిపిస్తుంది, కానీ లోపల ఎముకలు బలహీనమవుతాయి.   మహిళలు, ముఖ్యంగా మెనోపాజ్ దశకు చేరుకున్న వారు, 50 ఏళ్లు పైబడిన వారు తక్కువ కాల్షియం,  విటమిన్ డి ఆహారం తీసుకునేవారు ఎక్కువసేపు నిశ్చలంగా ఉండేవారు,  వ్యాయామం చేయనివారు అధికంగా ధూమపానం చేసేవారు లేదా మద్యం సేవించేవారు ఎక్కువ కాలం కొన్ని మందులు  తీసుకునేవారు.. ఇలా వీరందికి ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. లక్షణాలు.. ఆస్టియోపోరోసిస్ యొక్క అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడమే. ప్రజలు అంతా బాగానే ఉందని అనుకుంటారు కానీ లోపల ఎముకలు బలహీనపడుతుంటాయి. కొన్ని సాధారణ లక్షణాలు కూడా ఉంటాయి. వాటిలో  నిరంతరం వెన్నునొప్పి, నడుము వంగడం ప్రారంభమవుతుంది.  అలాగే  ఎత్తు తక్కువగా మారుతుంద.  చిన్న గాయంలో కూడా చేయి లేదా కాలు ఎముకలు విరిగిపోతాయి. వ్యాధి నిర్థారణ.. ఈ వ్యాధిని BMD (బోన్ మినరల్ డెన్సిటీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు. దీనిని DEXA స్కాన్ అని కూడా అంటారు. ఈ స్కాన్  ఎముకలు ఎంత బలంగా ఉన్నాయో చూపిస్తుంది. నివారణ ఎలాగంటే.. మంచి ఆహారం తీసుకోవాలి.  పాలు, పెరుగు, జున్ను, ఆకుపచ్చ కూరగాయలు, బాదం తీసుకోవాలి. అలాగే వీలైనంత సూర్యకాంతి నుండి విటమిన్ డి లభించేలా జాగ్రత్తలు పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.  ప్రతిరోజూ నడవాలి. తేలికపాటి యోగా చేయాలి. మెట్లు ఎక్కాలి. ఇది ఎముకలను బలపరుస్తుంది . చెడు అలవాట్లను నివారించాలి.  సిగరెట్లు,  ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఇవి ఎముకలను త్వరగా బలహీనపరుస్తాయి. వైద్యులు ఏమంటున్నారంటే.. ఆస్టియోపోరోసిస్ త్వరగా వచ్చే వ్యాధి కాదు. నెమ్మదిగా ప్రభావితం చేస్తుంది. కానీ అది దాని ప్రభావాన్ని చూపించే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుండే  ఎముకలను జాగ్రత్తగా చూసుకోవాలి. రోగం వచ్చాక వైద్యం చేయించుకోవడం కంటే రోగం రాకుండా జాగ్రత్త పడటం మంచిది.                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  వెన్నునొప్పి చాలామంది కంప్లైంట్ చేసే సమస్య. వెన్నునొప్పిని బిజీగా ఉండే రోజులో పెద్దగా పట్టించుకోరు.   ముఖ్యంగా గంటల తరబడి డెస్క్ వద్ద పనిచేసిన తర్వాత లేదా  ఏదైనా బరువులు  ఎత్తిన తర్వాత వెన్నునొప్పి వస్తుంటుంది.  చాలామంది ఈ నొప్పి వచ్చినప్పుడు లైట్ తీసుకుంటారు.  ఓ పది నిముషాలు పడుకుంటే అంతా సర్థుకుంటుంది అని అంటుంటారు.  ఈ వెన్ను నొప్పి పదే పదే వస్తున్నప్పుడు అది కేవలం తాత్కాలిక నొప్పి  అనుకోవడం పొరపాటు అని వైద్యులు అంటున్నారు. పదే పదే వచ్చే వెన్నునొప్పి అసౌకర్యాన్ని కలిగించడం కంటే ఎక్కువ హాని చేస్తుంది.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వెన్ను నొప్పి అనేది చాలా మంది సాధారణ సమస్యే అనుకుంటూ ఉంటారు. అయితే వెన్ను నొప్పి  వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకున్నా ఈ నొప్పి తగ్గడంలో మార్పు కనిపించకపోతే అది ప్రమాదం. ముఖ్యంగా ఏ చిన్న పని చేసినా వెన్ను బిగుసుకుపోవడం జరుగుతూ ఉంటే అది నిర్లక్ష్యం చేయాల్సిన సమస్య కాదని అంటున్నారు వైద్యులు. కాళ్లు చేతులు తిమ్మిర్లుగా ఉండటం, జలధరింపు లేదా దృఢత్వం గురించి జాగ్రత్త వహించాలని అంటున్నారు.  ఇవి నరాల సమస్యలను,  లేదా వెన్నెముక సమస్యలను సూచిస్తాయని అంటున్నారు. అయితే వెన్నెముక సమస్యలు రాకూడదన్నా,  వెన్నెముక సేఫ్ గా ఉండాలన్నా,  వెన్నెముక సమస్యలను సులువుగా తగ్గించాలని అనుకున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే.. బరువు తగ్గడం.. అధిక బరువు వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది.  బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది,  బరువు తగ్గడం వల్ల వెన్నెముక సమస్యనే కాదు.. మరిన్ని సమస్యలను నివారించవచ్చు . పొజిషన్.. వంగి ఉండటం ప్రమాదకరం కాదు. కూర్చున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు  వీపును సమతలంగా ఉంచాలి. వీపుకు మద్దతు ఇచ్చే కుర్చీలను ఉపయోగించాలి. ఎదురుగా ఉన్న పరికరాలపై వంగి ఉండకూడదు. వ్యాయామం.. "నిశ్చల జీవనశైలి వెన్నెముకను బలహీనపరుస్తుంది.  రోజువారీ దినచర్యలో కోర్ బలపరిచేటటువంటి వ్యాయామాలను చేర్చాలి. తేలికపాటి కదలిక కూడా సహాయపడుతుంది. ఎర్గోనామిక్ ఫర్నిచర్ .. అన్నింటి కంటే ముఖ్యంగా చేయాల్సిన పని కుర్చీని వెన్నెముకకు మద్దతు ఇచ్చేలా ఉన్నది ఎంచుకోవడం.  అవసరమైతే ఫుట్‌రెస్ట్‌ను జోడించి, స్క్రీన్‌ను కంటి స్థాయికి పెంచుకోవాలి. లిఫ్టింగ్ టెక్నిక్‌..   ఏవైనా బరువులు ఎత్తేటప్పుడు నడుమును కాదు మోకాళ్లను వంచాలి. సడన్ గా  జెర్కీ కదలికలను నివారించాలి.  బరువైన వస్తువును ఎత్తేటప్పుడు ఎప్పుడూ మెలితిప్పకూడదు.  బరువును.. అధిక బరువు వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది.  బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.  మరిన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. నీరు.. హైడ్రేషన్ వెన్నెముక డిస్క్‌ల స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో లేదా వ్యాయామం తర్వాత నీరు తాగాలి.  రోజుకు 6–8 గ్లాసులు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎక్కువసేపు కూర్చోవద్దు..   ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్ను దెబ్బ తింటుంది. ప్రతి 30–45 నిమిషాలకు నిలబడుతూ ఉండాలి.  శరీరాన్ని కాస్త సాగదీయడం,  నడవడం వంటివి ఉపయోగకరంగా ఉంటాయి. నొప్పిని విస్మరించకూడదు.. నొప్పి అనేది శరీరం ఇబ్బందిలో ఉంది అనడానికి ఒక సిగ్నల్. పైన చెప్పిన చిట్కాలు అన్నీ పాటిస్తున్నా అది మళ్లీ మళ్లీ వస్తుంటే వైద్య సహాయం తీసుకోవాలి. ఈరోజు నొప్పిని విస్మరించడం వల్ల రేపు  వెన్నెముక ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు గట్టిగా చెబుతున్నారు.                             *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  భారతదేశంలో COVID-19 కేసులు పెరుగుతున్నాయి.  ఆరోగ్య మంత్రిత్వ శాఖ  COVID డాష్‌బోర్డ్‌లోని డేటా ప్రకారం 7131 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రాలలో కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్,  మహారాష్ట్ర ఉన్నాయి. నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. COVID-19 అనేక దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉంది.  ఇది వచ్చిన మూడు సంవత్సరాల వరకు ఏదైనా కారణం వల్ల గుండెపోటు, స్ట్రోక్,  మరణ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని ఇటీవలి అధ్యయనం కనుగొంది.  టైప్ O తో పోలిస్తే A, B లేదా AB రక్త రకాలు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. COVID-19 ఇన్ఫెక్షన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందా? "COVID తో సంబంధం ఉన్న దీర్ఘకాలిక హృదయ సంబంధ ఆరోగ్య ప్రమాదాన్ని వైద్యులు కనుగొన్నారు. ముఖ్యంగా తీవ్రమైన COVID-19 సమస్య వచ్చి  ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న వ్యక్తులలో ఈ ప్రమాదం అధికం అంటున్నారు.  COVID-19 సంక్రమణ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా గుండెపోటు,  స్ట్రోక్ ప్రమాదం పెరిగింది. విశేషమేమిటంటే కొన్ని సందర్భాల్లో టైప్ 2 డయాబెటిస్ లేదా పరిధీయ ధమని వ్యాధి వంటి  హృదయ సంబంధ ప్రమాద కారకం ఉన్నంత ప్రమాదం పెరిగిందట. పరిశోధనలలో ఏం తేలిందంటే.. పరిశోధకులు చేసిన అధ్యయనాలలో COVID-19 వచ్చిన పెద్దలలో గుండెపోటు, స్ట్రోక్,  మరణాల ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉందని,  COVID-19 తో ఆసుపత్రిలో చేరిన పెద్దలలో ఇన్ఫెక్షన్ చరిత్ర లేని వారితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. దాదాపు 3 సంవత్సరాల ఫాలో-అప్ కాలంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆసుపత్రిలో చేరిన COVID-19 రోగుల ప్రమాదం.. ఈ అధ్యయనంలో హృదయ సంబంధ వ్యాధులు లేదా టైప్ 2 డయాబెటిస్ లేకుండా COVID-19 తో ఆసుపత్రిలో చేరిన వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు,  COVID-19 ఇన్ఫెక్షన్ లేని వ్యక్తులతో పోలిస్తే గుండెపోటు, స్ట్రోక్,  మరణానికి 21% ఎక్కువ ప్రమాదం ఉందని తేలింది. కోవిడ్ ఇన్ఫెక్షన్, రక్త రకం,  గుండెపోటు ప్రమాదం.. O కాని రక్త వర్గాలు COVID-19 కారణంగా ఆసుపత్రిలో చేరేవారి మధ్య జన్యుపరమైన పరస్పర చర్య ఉందని పరిశోధకులు కనుగొన్నారట. తీవ్రమైన COVID-19 ఇన్ఫెక్షన్ ఉన్నవారికి గుండెపోటు,  స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కానీ A, B లేదా AB వంటి O కాని రక్త వర్గాలు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉందని చెబుతున్నారు.  O రకం రక్తం ఉన్నవారితో పోలిస్తే O కాని రక్త వర్గాలు గుండెపోటు,  స్ట్రోక్ వచ్చే ప్రమాదం 65% ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ఒక బిలియన్ మందికి పైగా ప్రజలు ఇప్పటికే COVID-19 సంక్రమణను అనుభవించారు. నివేదించబడిన ఫలితాలు ఒక చిన్న ఉప సమూహంలో చిన్న ప్రభావం కాదు. ఈ ఫలితాలలో దాదాపు పావు మిలియన్ మంది ఉన్నారట.  వ్యాధి పెరుగుదలకు ఇది ముఖ్య కారణం అని అంటున్నారు.  కాబట్టి కోవిడ్-19 వచ్చిన వారిలో  రక్త రకాన్ని బట్టి చాలామంది గుండెపోటుకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.  వీరందరూ జాగ్రత్తగా ఉండటం అవసరం.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...