ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య జరిగే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వర్షం మొదలైంది. ఇప్పుడిప్పుడే అభిమానులు స్టేడియంలోకి  అడుగుపెడుతున్నారు. వర్షం కురుస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే మ్యాచ్ ప్రారంభనికి సాయంత్రం 7:30 గంటలకు సమయం ఉండటంతో అప్పటిలోగా వాన తగ్గే ఛాన్సుంది. కాగా వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే రేపు రిజర్వేడే ఉంది. అప్పుడూ కుడా మ్యాచ్ సాధ్యం కాకపోతే లీగ్ స్టేజీలో టాప్‌లో నిలిచిన పంజాబ్ కింగ్స్  దే టైటిల్. చిరు జల్లులు కాస్త భారీ వర్షంగా మారితే ప్రమాదం అని... గ్రౌండ్ బాయ్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. వెంటనే  మోదీ స్టేడియం మొత్తం కవర్స్ తో కప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇవాళ వర్షం లేదని ఉదయం వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేటి మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది  
  ఐపీఎల్ 2025  ముగింపు వేడుకలు నేటి సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమన్ని నిర్వహిస్తోంది. ముగింపు వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన కుమారులు శివం, సిద్ధార్థ్ మహదేవన్ పాల్గొననున్నట్లు సమాచారం. ఆపరేషన్ సిందూర్‌లో సేవలందించిన భారత త్రివిధ దళాల ప్రతినిధులకు ఈ సందర్భంగా సత్కరించనున్నారు. అంతేకాకుండా, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎలాగైన కప్ గెలిచి తమ అభిమానుల కోరికను నెరవేర్చాలని ఆర్‌సీబీ వ్యూహాలు రచిస్తోంది. ఈ లీగ్‌ ఆవిర్భావం (2008) నుంచీ బరిలో నిలిచి టైటిల్‌ను ముద్దాడే క్షణం కోసం 18 ఏండ్లుగా వేచి చూస్తున్న ఆర్‌సీబీ , పంజాబ్‌ కింగ్స్‌ తమ కలను నెరవేర్చుకునే ప్రయాణంలో ఆఖరి దశకు చేరుకున్నాయి.  సీజన్‌ ఆసాంతం స్ఫూర్తిదాయక విజయాలతో ఫైనల్‌ చేరిన ఈ ఇరుజట్ల మధ్య మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్‌-18 ఫైనల్‌ జరుగబోతున్నది.ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గతంలో 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఫైనల్స్ వరకు చేరినా, విజేతగా నిలవలేకపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత, 2025 సీజన్‌లో మరోసారి ఫైనల్‌కు అర్హత సాధించి, టైటిల్‌పై గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ఒకసారి ఫైనల్‌కు చేరి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇన్నేళ్లకు మళ్లీ ఫైనల్‌ బరిలో నిలిచి, తమ తొలి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.ఫైనల్ ముందు ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ మ్యాచ్‌కు ముందు ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ జట్టుతో చేరాడు.తన భార్య తొలిబిడ్డకు జన్మనివ్వడంతో స్వదేశానికి వెళ్లాడు. తిరిగి మంగళవారం వేకువ జామున 3 గంటల సమయంలో తిరిగి జట్టుతో చేరాడు. యూకేకి వెళ్లిన ఆయన తిరిగి ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీని మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆనారోగ్యం కారణంగా ఇటీవల వంశీకి కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసి మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.    ఈ మధ్యంతర బెయిల్ ఆసుపత్రిలో చికిత్స వరకే కొనసాగుతుందని, చికిత్స పూర్తి కాగానే రద్దు అవుతుందని అప్పుడే  కోర్టు స్పష్టం చేసింది. అంతే కాకుండా  వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను జూన్ 5లోగా   సీల్డ్ కవర్ లో అందించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వంశీని  విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి జైలు అధికారులు తరలించారు.   దళిత యువకుడి కిడ్నాప్, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, భూకబ్జాలు, నకిలీఇళ్ల పట్టాల పంపిణీ, అక్రమ మైనింగ్… ఇలా పలు కేసులలో వల్లభనేని వంశీ నిందితుడిగా కేసులు ఎదుర్కొంటున్న సంగతి విదితమే.  కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీ…ఆ తర్వాత ఈ కేసులనూ ఎదుర్కోక తప్పలేదు. ఒక కేసులో బెయిల్ వస్తే… మరో కేసులో రిమాండ్ పొడిగించడం వంటి కారణాలతో వంద రోజులకు పైగానే వంశీ బెజవాడ జైలులో రిమాండ్ ఖైడీగా ఉంటున్నారు. ఈ క్రమంలో  అనారోగ్యానికి గురైన వంశీ వైద్యం చేయించుకునేందుకు బెయిలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు.  వంశీ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆయనను జైలు నుంచి డిశ్చార్జ్ చేసిన జైలు అధికారులు విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందిన వంశీ సోమవారం (జూన్ 2) సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు వంశీని ఆస్పత్రి నుంచి జైలుకు తరలించారు.  ఇక ఆయుష్ ఆస్పత్రి  వైద్యులు వంశీ ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర నివేదికను గురువారం (జూన్ 5) కోర్టుకు అందించనున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
Pragya Jaiswal has not been overtly busy with films but she has been part of blockbusters like Akhanda, Daaku Maharaj. Now, the actress is part of Akhanda 2 and otherwise, she is not part of any other films. She has been releasing few glamorous photos from her latest photoshoots.  She released a stunning glam meal from her new photoshoot. The actress never went this glamorous while she did wear bikinis and two piece costumes. In white dress, she is looking like a seductress. Showcasing her long legs, she also let go her bossom area as well.    The actress looks like an International model in this costume. Going in this highly glamorous way, she seems to be giving hint to filmmakers to give her more roles and she is ready to play highly glam roles, too. Well, she does look stunning and seems like she can give tips about skin health and body shape.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab). ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.    'రాజా సాబ్' సినిమాని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మూవీ రిలీజ్ డేట్ తో పాటు టీజర్ అప్డేట్ కూడా ఇచ్చారు. జూన్ 16న ఉదయం 10.52 నిమిషాలకు టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ డబ్బులతో నిండి ఉన్న గదిలో ఫెరోషియస్ గా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది.     ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో 'రాజా సాబ్'ను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి నెలకొంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తదితరులు నటిస్తున్నారు.    గతేడాది డిసెంబర్ 5న అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' విడుదలై ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ ఏడాది అదే డేట్ కి 'రాజా సాబ్' రానుండటం ఆసక్తికరంగా మారింది. మరి పుష్ప-2 బాటలోనే రాజాసాబ్ కూడా సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.    
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హరీష్ శంకర్(Harish Shankar)కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉస్తాద్ పై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ పొలిటికల్ బిజీతో పాటు వేరే చిత్రాల కమిట్ మెంట్ ఉండటం వలన ఉస్తాద్ షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. తన అప్ కమింగ్ మూవీ హరిహర వీరమల్లు ఈ నెల 12 న విడుదల కాబోతున్న నేపథ్యంలో, ఆ మూవీ ప్రమోషన్స్ తర్వాత పవన్ తన అప్ కమింగ్ సినిమాల షూటింగ్స్ ని కంప్లీట్ చెయ్యాలనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి.   రీసెంట్ గా హరీష్ శంకర్ మాట్లాడుతు 'ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జూన్ రెండో వారం నుంచి స్టార్ట్ కాబోతుందని చెప్పాడు.. దీంతో ఉస్తాద్  ని పవన్ స్పీడ్ గా పూర్తి చెయ్యాలనుకుంటున్నాడనే వార్తలకి బలం చేకూరినట్టయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన గ్లింప్స్ అందులోని పవన్ డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీలీల(Sreeleela)హీరోయిన్ గా చేస్తున్న ఉస్తాద్ ని  అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  
Kamal Haasan has dragged himself into a big controversy with his remarks that Kannada language has originated from Tamil. Talking about his emotional connect with Shiv Rajkumar, he made these comments at Thug Life audio launch event in Chennai and it triggered Kannada activists. Many claimed that he is wrong in stating that Kannada is a derivative language from Tamil.  They demanded apology from Kamal but the actor stayed adamant on his point. Kannada Film Chamber of Commerce, KFCC, asked Kamal to apologise before 30th May to allow for Thug Life release in Karnataka. With ban threats mounting, Kamal moved to Karnataka High Court and asked them to permit the release.    High Court questioned Kamal Haasan, if he is an historian or a linguist - language expert, to make such remarks. They remarked that with simple apology, he can end the matter amicably and he should do that. Kamal immediately, released a letter from his office stating that his intention has never been to hurt Kannada people.  He further stated that his remarks have been taken out of context and he regerts it. Thug Life is releasing on 5th June and it is directed by Mani Ratnam. After Nayakan, the duo is back with another gangster flick after 38 years. They promise this to be as good as Nayakan and Simbu, Trisha are playing other leading roles.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  తెలుగునాట తిరుగులేని క్రేజ్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సొంతం. పవన్ రాజకీయాలతో బిజీ అయినప్పటికీ, ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూన్ 12న 'హరి హర వీరమల్లు'తో పలకరించనున్న పవన్ కళ్యాణ్.. సెప్టెంబర్ 25న 'ఓజీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ముఖ్యంగా పవన్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న సినిమా కావడంతో 'ఓజీ'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలను తగ్గట్టుగానే.. విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే దిమ్మతిరిగే రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.   'ఓజీ' సినిమా నైజాంలో ఏకంగా రూ.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా నైజాంలో రూ.90 కోట్లకు పైగా బిజినెస్ ఒక్క పుష్ప-2 సినిమా మాత్రమే చేసింది. పుష్ప-2 మూవీ రూ.100 కోట్ల బిజినెస్ చేయగా, రూ.75 కోట్లతో ఆర్ఆర్ఆర్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. అలాంటిది ఇప్పుడు ఓజీ మూవీ.. ఆర్ఆర్ఆర్ మించిన బిజినెస్ చేసినట్లు సమాచారం.    ఓజీ చిత్రానికి సాహో ఫేమ్ సుజీత్ దర్శకుడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.     తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్.  
2000వ దశకంలో  టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుల్లో పూరి జగన్నాథ్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, వి.వి.వినాయక్‌ సంచలన విజయాలు అందుకున్నారు. వీరిలో రాజమౌళి.. ఫెయిల్యూర్‌ అనేది లేకుండా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు.  మరో దర్శకుడు పూరి జగన్నాథ్‌ కెరీర్‌లో హిట్స్‌, ఫ్లాప్స్‌ ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అతను చివరగా గత ఏడాది చేసిన డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో హిట్‌ ట్రాక్‌ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు పూరి. విజయ్‌ సేతుపతి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. టబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తారు.  ఇక వి.వి.వినాయక్‌ విషయానికి వస్తే.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, నితిన్‌ వంటి పెద్ద స్టార్స్‌తో బ్లాక్‌ బస్టర్స్‌ చేసిన తర్వాత ఒక్కసారిగా ఆయన కెరీర్‌ స్తబ్దుగా మారిపోయింది. 2018లో సాయిధరమ్‌తేజ్‌తో చేసిన ఇంటెలిజెంట్‌.. ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఒక్క సినిమా ఫ్లాప్‌తో హీరోలెవరూ వినాయక్‌తో సినిమా చేసేందుకు ముందుకు లేదు. 2023లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో హిందీలో ఛత్రపతి రీమేక్‌ చేశారు. అది కూడా నిరాశనే మిగిల్చింది. దానికితోడు వినాయక్‌ని ఆరోగ్య సమస్యలు వేధించాయి. అయితే ఇటీవల ఆయన కోలుకొని మునుపటి ఉత్సాహంతోనే ఉన్నారని తెలుస్తోంది. మరో సూపర్‌హిట్‌ సినిమా చేసి హిట్‌ ట్రాక్‌లోకి రావాలని వినాయక్‌ ఆశిస్తున్నారు. తన నెక్స్‌ట్‌ సినిమా చేసేందుకు నిర్మాతను కూడా సెట్‌ చేస్తున్నారు. ప్రజెంట్‌ జనరేషన్‌కి కనెక్ట్‌ అయ్యే మంచి కథతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. అయితే హీరో ఎవరు అనేది మాత్రం సస్పెన్స్‌లోనే ఉంది.  ప్రస్తుతం వినాయక్‌ ఫామ్‌లో లేకపోవడం వల్ల ఇప్పుడు టాలీవుడ్‌లో వున్న స్టార్‌ హీరోలెవరూ అతనితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయినప్పటికీ ఇద్దరు, ముగ్గురు హీరోలను అప్రోచ్‌ అయ్యారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో యంగ్‌ హీరోలతో వెళితేనే బెటర్‌ అని భావించి సిద్ధు జొన్నలగడ్డతో సినిమా చేసేందుకు వినాయక్‌ ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ‘డిజె టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’ వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న సిద్ధు.. ఇటీవల భాస్కర్‌తో చేసిన ‘జాక్‌’ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో డైరెక్టర్ల ఎంపిక విషయంలో మరింత కేర్‌ తీసుకోవాలని సిద్ధు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అంతకుముందు భాస్కర్‌ ఎన్నో సూపర్‌హిట్స్‌ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులతో వెనకపడ్డారు. అలాంటి డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇవ్వడం వల్ల తను ఓ డిజాస్టర్‌ చూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 8 సంవత్సరాలుగా హిట్‌ అనేది లేని వినాయక్‌తో సిద్ధు సినిమా చేసే అవకాశం లేదని స్పష్టమవుతోంది. మరి ఇప్పుడు వినాయక్‌ని హిట్‌ ట్రాక్‌లో పెట్టే హీరో ఎవరు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. 
శ్రీకాంత్(Srikanth)నట వారసుడు రోషన్(Roshan)2016 లో 'నిర్మల కాన్వెంట్' అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2021 లో 'పెళ్ళి సందడి' తో ప్రేక్షకులని అలరించిన రోషన్, ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న  'ఛాంపియన్' అనే మూవీ చేస్తున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి' వృషభ' అనే పాన్ ఇండియా మూవీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. రీసెంట్ గా 'హిట్ 3 ' తో విజయాన్ని అందుకున్న శైలేష్ కొలను(Sailesh Kolanu)దర్శకతంలో రోషన్ ఒక సినిమా చేస్తున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో  వార్తలు వస్తున్నాయి. లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతుందని, ఒక కొత్త రోషన్ ని ఈ చిత్రం ద్వారా చూడబోతున్నారని అంటున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ  సితార ఎంటర్ టైన్ మెంట్ భారీ బడ్జెట్ తో రోషన్ చిత్రాన్ని తెరకెక్కించబోతుందని, త్వరలోనే అధికార ప్రకటన  కూడా రానుందనే వార్తలు సినీ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి.     
2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందం, టాక్సీవాలా వంటి చిత్రాల తర్వాత స్టార్ హీరో 'విజయ్ దేవరకొండ'(VIjay Devarakonda)కెరీర్ లో మరో హిట్ లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో 'కింగ్ డమ్' అనే మూవీ చేస్తున్నాడు. నాచురల్ స్టార్ 'నాని' కి జెర్సీ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri)దర్శకుడు. దీంతో కింగ్ డమ్ పై విజయ్ తో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 4 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. ఇప్పటికే రిలీజై న టీజర్ తో అందరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. నటనకి సంబంధించి విజయ్ లో ఉన్న మరో కొత్త కోణం 'కింగ్ డమ్'(KIngdom)ద్వారా కనువిందు చేయనుందని కూడా టీజర్ తో అర్ధమవుతుంది. దీంతో కింగ్ డమ్ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి అడుగుపెడుతుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తు ఉన్నారు. షూటింగ్ కూడా   కంప్లీట్ అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందనే వార్తలు వచ్చాయి. అలాంటి ఈ టైం లో 'కింగ్ డమ్ కి సంబంధించిన ఫైనల్ కట్ ని గౌతమ్ తిన్ననూరి చూసుకున్నాడని, కొన్ని సీన్స్ విషయంలో సంతృప్తి చెందకపోవడంతో రీ షూట్ చెయ్యాలని భావించి, గోవాలో వాటిని చిత్రీకరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ ఈ విషయాన్నీ బయటకి రాకుండా జాగ్రత్త పడినా కూడా, ఈ న్యూస్ బయటకి వచ్చిందని అంటున్నారు. దీంతో విజయ్ అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. రిలీజ్ కి ఇంకా నెల కూడా టైం లేదు. ఆల్రెడీ మూవీ కంప్లీట్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. విజయ్ అయితే ఒక రకంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. అలాంటి టైంలో ఇప్పుడు రిపేర్లు ఏంటని  సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. ఈ న్యూస్ నిజామా కాదా  అనే విషయంలో చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాలని కూడా కోరుతున్నారు.  విజయ్ దేవరకొండ సరసన 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ 'భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)'హీరోయిన్ గా చేస్తుంది. ఇటీవల ఈ ఇద్దరకీ సంబంధించిన కొన్ని పిక్స్ రిలీజ్ అయ్యాయి. ఇద్దరి ఫెయిర్ చాలా బాగుందనే పేరు వచ్చింది. సత్యదేవ్, కౌశిక్ మెహతా కీలక పాత్రల్లో కనిపిస్తుండగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తుండగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.  
  జూన్ 12న 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. పైగా, పవన్ నటించిన తొలి చారిత్రాత్మక చిత్రమిది. దీంతో వీరమల్లుపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా.. లాక్ డౌన్ రావడం, పవన్ పాలిటిక్స్ తో బిజీ అవ్వడం.. వంటి కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.   'హరి హర వీరమల్లు' సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 12న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 8న తిరుపతిలో ఘనంగా నిర్వహించడానికి మూవీ టీం సన్నాహాలు చేస్తోంది. సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పేలా వీరమల్లు సినిమా ఉండనుంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం.. పవిత్ర నగరం తిరుపతిని ఎంచుకున్నారు. మరోవైపు నిజ జీవితంలోనూ పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలను పవన్ విమర్శించగా.. అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో తిరుపతి ఈవెంట్ లో పవన్ ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలో నెలకొంది.   పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి.. ఆయన ఏ సినిమా వేడుకలో పాల్గొన్నా అది రాజకీయ కార్యక్రమాన్నే తలపిస్తోంది. ముఖ్యంగా గత కొన్ని సినిమా వేడుకల్లో ఆయన స్పీచ్ లు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. అలాంటిది ఇది పవన్ కళ్యాణ్ నటించిన సినిమా. అందునా ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా. అంతేకాకుండా సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమా. ఇన్ని ప్రత్యేకలు ఉండటంతో.. తిరుపతి ఈవెంట్ లో పవన్ స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది. మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు? 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నారు? అనేది జూన్ 8న తేలిపోనుంది.  
  మూవీ: టూరిస్ట్ ఫ్యామిలీ నటీనటులు:  ఎమ్.శశి కుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, కమలేశ్ తదితరులు ఎడిటింగ్: భరత్ విక్రమన్ సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్ మ్యూజిక్: సీన్ రోల్డన్ నిర్మాతలు: నజిరత్ పసీలియన్, ముగేశ్ రాజ్ పసీలియన్ రచన, దర్శకత్వం: అభిషన్ జీవింత్ ఓటీటీ: జియో హాట్ స్టార్ కథ: ధర్మదాస్ (శశికుమార్) వాసంతి (సిమ్రాన్) భార్యాభర్తలు. వారి సంతానమే నీతూ షాన్( మిథున్) మురళి (కమలేశ్). ఈ ఫ్యామిలీ శ్రీలంక నుంచి భారత్ కి అక్రమంగా వస్తుంది. ఒక పోలీస్ టీమ్ కి దొరికిపోయినా, తెలివిగా తప్పించుకుంటారు. వాసంతి అన్నయ్య ప్రకాశ్ (యోగిబాబు) వాళ్లు ఇక్కడ ఉండటానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తాడు. తాము శ్రీలంక నుంచి వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచుతారు. కేరళ నుంచి వచ్చినట్టుగా అందరికి చెప్తారు. ఎవరితోనూ ఎక్కువగా పరిచయాలు పెంచుకోవద్దని ప్రకాశ్ చెప్పిన మాటలను వాళ్లెవరూ పట్టించుకోరు. ఇదిలా ఉండగా సిటీలో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్, పోలీసులకు తలనొప్పిగా మారుతుంది. అక్రమంగా చొరబడిన శరణార్థులే అందుకు కారణమని వాళ్లు భావిస్తారు. ఆ దిశగా వాళ్లు సెర్చ్ చేస్తూ ఉంటారు. సిటీలోకి ప్రవేశిస్తూ తనకి దొరికిపోయిన ధర్మదాస్ ఫ్యామిలీపై ఆ పోలీస్ కి అనుమానం వస్తుంది. దాంతో ఆ విషయాన్ని పై అధికారికి చెప్తాడు. ఆ తర్వాత ఏమవుతుందనేది కథ. విశ్లేషణ: కొన్ని  సినిమాలు అంచనాలు లేకుండా వస్తాయి. అందరికి నచ్చేస్తాయి. అలాంటివి చాలా అరుదుగా వస్తాయి. సంవత్సరం క్రితం వచ్చిన '90s' , రీసెంట్ గా వచ్చిన  'అనగనగా' ఇలా కొన్ని మాత్రమే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.‌ ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఈ టూరిస్ట్ ఫ్యామిలీ చేరింది.  కథలో ప్రధానంగా కనపడేది అరడజన్ పాత్రలు మాత్రమే కానీ సినిమా అంతా ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరి పాత్ర చిన్నదిగానో పెద్దదిగానో అనిపించదు. ఎందుకంటే ఇది మన చుట్టుపక్కల ఉండే వారి జీవనశైలిలా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు మన వీధిలో ఉండేవాళ్ళని చూసిన ఫీల్ కలుగుతుంది. శ్రీలంక నుండి వచ్చిన ఓ కుటుంబం ఎలా సర్వైవ్ అయ్యారనే చిన్న పాయింట్ తో కథని ముందుకు తీసుకెళ్ళాడు దర్శకుడు. అయితే ఆ పాయింట్ తో పాటు మన చుట్టూ ఉండే వారితో మనం బాగుంటే.. వారు మనల్ని ఎంతలా అభిమానిస్తారో కూడా ఈ కథ చెప్తుంది.  ఒక కుటుంబం కోసం ఓ వీధి అంతా కలిసి సపోర్ట్ చేయడం.. వారికి తోడుగా ఉండటం చూస్తుంటే.. అరెరె ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులున్నారా.. ఇలాంటి అభిమానం ఉంటుందా అనే భావన కలుగుతుంది. ఈ ‌సినిమాలో  ఓ నాన్న, ఓ అమ్మ, పెద్ద కొడుకు, చిన్న కొడుకు.‌. ఇలా అందరి ఎమోషన్స్ ని సమపాళ్ళలో చూపించాడు దర్శకుడు.  సినిమా నిడివి రెండు గంటలే కాబట్టి హ్యాపీగా చూసేయొచ్చు. అడల్ట్ సీన్లు ఏమీ లేవు.. ఎక్కడ అసభ్య పదజాలం వాడలేదు.. చివరి వరకు ఎంగేజింగ్ గా సాగే ఈ ఫ్యామిలీ డ్రామా విత్ సర్వైవింగ్ థ్రిల్లర్ ని హ్యాపీగా చూసేయొచ్చు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. సీన్ రోల్డన్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  నటీనటుల పనితీరు: ధర్మదాస్ గా శశికుమార్, వాసంతిగా సిమ్రాన్, నీతూ షాన్ గా మిథున్, మురళిగా కమలేశ్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. ప్రకాశ్ గా యోగిబాబు తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.  రేటింగ్:  3 /5 ఫైనల్ గా : ఫ్యామిలీతో కలిసి చూసే కథ ఇది. డోంట్ మిస్ . ✍️. దాసరి మల్లేష్
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ప్రేమ జంట అయినా, భార్యాభర్తలైనా  ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో సమయం గడపాలని, మాట్లాడాలని కోరుకుంటారు. అయితే ఒకరికొకరు దూరంగా అంటే  వేర్వేరు ప్రదేశాలలో ఉన్న జంటలు ఒకరితో ఒకరు సమయం గడపడం కొంత కష్టమే. వారి మధ్య కమ్యూనికేషన్ మాత్రమే సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కమ్యూనికేట్ చేయడానికి భార్యాభర్తలు ఒకరికొకరు కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్‌లు చేయవచ్చు లేదా మెసేజ్ లు కూడా  పంపవచ్చు. బిజీ లేదా ఇతర కారణాల వల్ల భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకోలేక పోయినట్లయితే, రోజంతా కొన్ని మెసేజ్‌ల ద్వారా భాగస్వామికి తాను దూరంగా లేడనే భావన కలిగించవచ్చు. అయితే, కొన్నిసార్లు ఈ మెసేజ్లు  భార్యాభర్తల మధ్య వివాదాలకు కూడా కారణం అవుతాయి.  భార్యాభర్తలు పొరపాటున కూడా కొన్ని మెసేజ్ లను తమ భాగస్వామికి  పంపకూడదు. అవేంటంటే.. రెస్పాండ్ కావడం.. భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు వారి మధ్య మెసేజ్ లలో జరిగే కమ్యూనికేషన్ ఎంత సరదాగా ఉంటుందో.. ఏదైనా తేడా జరిగితే చాలా ప్రభావవంతంగా కూడా ఉంటుంది.  ముఖ్యంగా భార్యలు ఏవైనా మెసేజ్ పెట్టినప్పుడు భర్తలు లేదా అబ్బాయిలు ఎక్కువగా రెస్పాండ్ కారు.కేవలం ఒక ముక్క లేదా ఒక మాటతో లేదా ఎమోజీలతో, స్చిక్కర్లతో  రిప్లే ఇస్తుంటారు.  ఇది కమ్యూనికేషన్ పట్ల అనాసక్తిని వ్యక్తం చేస్తుంది. అందుకే భార్యాభర్తలు ఒకరికొకరు మెసేజ్ చేసుకొనేటప్పుడు స్పష్టంగా ఉండాలి. కోపం.. కోపం బంధాలను విచ్చిన్నం చేస్తుంది.  భార్యాభర్తలు మెసేజ్ చేసుకొనేటప్పుడు కోపం ప్రదర్శించడం కాదు.  భార్యలు ఎప్పుడూ భర్తల గురించే ఆలోచిస్తారు.  భార్యలు మెసేజ్ చేసినప్పుడు వారికి ఇచ్చే రిప్లే కోపంతో కూడుకుని ఉండకూడదు.  ఒకవేళ కోపంగా ఉన్నప్పుడు మెసేజ్ చేసినా, కాల్ చేసినా కొంచెం సేపటి తరువాత టచ్ లోకి వస్తాను అని చెప్పి కొద్దిసేపు మౌనంగా ఉండిపోవాలి. ఆ తరువాత సహజంగా మాట్లాడాలి. పదే పదే.. భర్త లేదా భార్య ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.  భార్య భర్తకు అయినా,  భర్త భార్యకు అయినా పదే పదే నాన్ స్టాప్ గా మెసేజ్ లు చేయకూడదు.  ఒకసారి మెసేజ్ చేశాక అవతలి నుండి రెస్పాన్స్ లేకపోతే ఏదైనా పనిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి.   ముఖ్యంగా మహిళలు     ఈ విషయంలో కంగారు పడుతూ ఉంటారు.  భర్త తొందరగా స్పందించకపోతే ఏం జరిగిందో అని గాబరా పడతారు. కానీ  అవతల వారిని అర్థం చేసుకోవాలి. భర్తలు కూడా భార్య మెసేజ్ లు చూసిన తరువాత కాల్ చేసి మాట్లాడటం మంచిది. గొడవలు వద్దు.. మెసేజ్ లో ఏ విషయాలు అయినా సాధారణ పలకరింపులు,  బాగోగులు అడిగి తెలుసుకోవడం, ఏవైనా కబుర్లు చెప్పుకోవడం మంచిది.  దేని గురించి అయినా ప్రశ్నించడం, సీరియస్ విషయాల గురించి అడగటం చేయకూడదు.  ఇలాంటివన్నీ నేరుగా మాట్లాడుకోవడం మంచిది.  లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు, అపార్థాలు పెరుగుతాయి.                                                              *రూపశ్రీ.
  ఆఫీసులో పనిచేస్తున్న వారిలో పనిపట్ల శ్రద్ధలేకపోయినా, పని చేయడంలో విసుగు చిరాకు ప్రదర్శిస్తున్నా వారి సమస్య ఒత్తిడికాదు... పని ఒత్తిడి ఎక్కువైందని...! పనితో అలసిపోతున్నామని చెప్పేవారి సమస్య ఏమిటంటే వారికి ఆ పనిపట్ల ఇష్టం లేకపోవడం. అందువల్ల పనిమీద శ్రద్ధ చూపించలేకపోయారు. దాని వలన వారు పని ఒత్తిడి ఎక్కువైందని భావిస్తారు. అయిష్టంతో పనిని చేయడం వలన ఏ వ్యక్తి అయినా, ఆ పనిని రెండుసార్లు చేస్తారు. ఎన్నిసార్లు చేసినా ఆ పనిలో వారు చురుకుదనంగా ఉండరు. ఆ పనిని అంత సమర్థవంతంగా చేయలేరు. ఆ పనిపట్ల అయిష్టతకు కారణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేక వేరే ఇంకేమైనా కావచ్చు. అందువల్ల ఆవ్యక్తి ఆ పని పట్ల ఆసక్తి చూపకపోవచ్చు.  ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినపుడు, మనం మన  వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలి. ఆ ఫీల్డ్కి మనం ఇష్టంతో అంకితమవ్వాలి. అప్పుడు ఆ ఫీల్డ్కి మనం న్యాయం చేసినవారం అవుతాము. వ్యక్తిగత జీవితంలో ఎవరు హుషారుగా ఆనందంగా గడుపుతారో అటువంటివారే ఎంత ఒత్తిడినైనా తట్టుకుని, ఎంత పనైనా చేయగలుగుతారు. జీవితంలో తృప్తిగలవారికే పనిలోనూ తృప్తి లభిస్తుంది. జీవితాన్ని ఆనందించలేనివారు చిన్నచిన్న పనుల్లో కూడా చాలావరకు తప్పులనే చేస్తూ వుంటారు. "పనులు నువ్వు చేయడంలేదు. జరుగుతున్నాయ" అనే మాటను  గ్రహించి నిరహంకారంగా ఎవరి  కర్తవ్యం వారు నిర్వర్తించాలి. ఈ పని తర్వాత ఇంకేం చెయ్యాలి అని ఆలోచించకూడదు కేవలం చరిస్తూ వెళ్ళాలి. అలా ఆచరిస్తూంటే, ఒకదానివెంట మరొకటి అవే వస్తుంటాయి. మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తయితే ఆ పనిపట్ల నీవు ఇష్టతను చూపించావు అని అర్థం. మొదలుపెట్టినపని అవలేదంటే నీవు ఆ పనిపట్ల అయిష్టతను చూపించావు అని అర్థం. కొంతమంది ఇష్టంతో చేసినా ఆ పని ఆపలేదంటే దానికి కారణం ఆ పనిని వాయిదా వేయడం. ఇలా వాయిదా వేయడం వలన క్రమేపీ ఆ పనిపట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. దీని వలన ఆ పనులు పూర్తికావు. అందువలన ఎప్పుడూ పనులను వాయిదా వేయకూడదు. కాబట్టి మనం ఏదైనా పనిని మొదలు పెట్టినపుడు ఆ పనిని ఇష్టంతో వాయిదా వేయకుండా ఆ పనిని త్వరగా పూర్తిచేసుకోవాలి. ఎప్పుడైన ఒక పనిని ఇష్టంతో చేస్తే ఆ పని కష్టమనిపించదు ఆ పనిలో విజయాన్ని పొందుతారు. ఎప్పుడైనా ఒక పనిని కష్టపడి చేస్తే మనకి ఆ పని కష్టంగా వుంటుంది. ఆ పని విజయవంతం కాదు. ఓటమి, విఘ్నం, అనేవి బయటెక్కడో లేవు. నీలోనే వున్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు కొందరు, ఇంకేదో విషయంపై ఉత్సాహంతోనే పనులు మానేస్తారు మరికొందరు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనిని తలపెడితే ఆ పని అయ్యేవరకూ ఆ పనిపట్ల ఇష్టాన్ని చూపించాలి. అప్పుడే ఆ పనిలో ఆనందాన్ని పొందగలం. అలా చేస్తే ఇక విజయం మన  సొంతమవుతుంది. ఒక సాకర్ ఆటలో ఆటగాళ్ళను మారుస్తూ, ఒకరు సరిగ్గా ఆడకపోతే వారికి బదులు ఇంకొకరిని అడటానికి పంపవచ్చు. కానీ - జీవితం అలాకాదు. ఒకసారి ఏదైనా తప్పుచేస్తే, దాన్ని వెనక్కి తీసుకుని, దానిస్థానే ఇంకోపని చెయ్యటం కుదరదు. మీ జీవితంలో సంభవించిన విషాద సంఘటనలని వెనక్కి తిప్పి సరిచూసుకోడానికి మీకు రెండో అవకాశం దొరకదు.                                      ◆నిశ్శబ్ద.
  తల్లిదండ్రుల తో బంధం చిన్నతనం నుంచి ఉంటుంది.  అందుకే వారితో ఏదైనా గొడవ జరిగితే అది కొన్ని గంటలు లేదా రోజులలో క్లియర్ అవుతుందిి. కానీ భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు చాలా వరకు తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుంటాయి.  అసలు భార్యభర్తల మధ్య గొడవలకు కారణాలు ఏంటో తెలుసుకుంటే బంధాన్ని నిలబెట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. భార్యభర్తల మధ్య గొడవలు అనేవి సాధారణంగా వివాహిత జీవితంలో వస్తుంటాయి. ఇవి చిన్నపాటి అభిప్రాయ భేదాల నుంచి తీవ్రమైన సమస్యల వరకు ఉండవచ్చు. గొడవలకు ప్రధానమైన  కారణాలు ఇవే:  ఆర్థిక సమస్యలు డబ్బు ఖర్చులు, ఆదాయం, పొదుపు పై అగ్రిమెంట్ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీస్తుంది.  భర్త తనదే ఆధిపత్యం అని, భార్య తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటాడని ఇలా.. ఇద్దరూ ఆర్థిక విషయాలలో అబిప్రాయ బేధాలతో గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకరి ఖర్చు పద్ధతులు ఇంకొకరికి నచ్చకపోవడం కూడా ఆర్థిక గొడవలకు కారణం అవుతుంది. ఆత్మీయత లోపం లేదా శారీరక సంబంధాల్లో తేడా.. శారీరక సంబంధాలపై అబద్ధపు అంచనాలు,  ప్రేమ లేదా స్పర్శలో లోపం భార్యాభర్తల మద్య పెద్ద గొడవలకు కారణాలు అవుతాయి. సాధారణంగా వివాహం అనేది ప్రేమ, నమ్మకం,  శారీరకంగా ఒకరిని ఒకరు కోరుకోవడంలోనే ఆధారపడి ఉంటుంది. కానీ వివాహం తరువాత ఇవి లోపిస్తే ఇద్దరి మధ్య అసంతృప్తి ఏర్పడి అది కాస్తా గొడవలుగా మారుతుంది. అభిప్రాయ భేదాలు.. కుటుంబపరమైన నిర్ణయాలు, పిల్లల పెంపకం, జీవిత పద్ధతులపై విభిన్న అభిప్రాయాలు ఉంటాయి.  భార్యాభర్తలు ఇద్దరూ కలసి చర్చించి ఈ విషయాలలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ భర్త తను, తన తల్లిందండ్రులు చెప్పినట్టే జరగాలని, భార్య తన మాట నెగ్గాలని పంతానికి పోతే ఇద్దరి మధ్య అబిప్రాయ బేధాలు ఏర్పడి గొడవలు అవుతాయి. ఆత్మగౌరవ సమస్యలు / ఈగో సమస్యలు.. ఒకరి మాటకి మరొకరు విలువ ఇవ్వకపోవడం. చిన్న విషయాల్లోనూ తానెక్కడా తగ్గకూడదన్న భావన భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తుంది.  భార్యాభర్తలు తామరిద్దరూ సమానమే అనే విషయాన్ని తెలుసుకుని ఒకరిని ఒకరు గౌరవించుకుంటే.. ఒకరి మాటకు మరొకరు ప్రాధాన్యత ఇవ్వగలరు. అభిమానాలు / అనుమానాలు.. ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడం, చిర్రెత్తించే ప్రవర్తనలపై అనుమానాలు పెరగడం వల్ల బంధం విచ్చిన్నమవుతుంది. బంధంలో నమ్మకమే కీలక పాత్ర పోషిస్తుంది. అనుసంధానం లోపం (Communication Gap).. సరిగ్గా మాట్లాడుకోకపోవడం, భావాలను పంచుకోకపోవడం వల్ల గొడవలు వస్తాయి. పెళ్లంటే కేవలం ఆర్థికంగా,  ఇంటి పనులలో ఒకరి అవసరం మరొకరికి ఉండటం కాదు.  ఇద్దరి మధ్య మానసిక అనుబంధం కూడా ఉండాలి.  స్నేహితుల్లా మాట్లాడుకోవాలి. బంధువుల జోక్యం.. భార్యాభర్తల తల్లిదండ్రుల  జోక్యం,  తోబుట్టువులు,  స్నేహితులు, బంధువుల జోక్యం వల్ల, వారిచ్చే సలహాల కారణంగా  ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవడం జరిగి గొడవలు వస్తాయి. వ్యక్తిత్వ తేడాలు.. ఒకరు చురుకుగా ఉండగా, ఇంకొకరు అంతగా కాకపోవడం,  జీవితంలో గమ్యం లేదా అభిరుచుల్లో తేడా ఉండటం. వీటి వల్ల  ఇద్దరి మధ్య జీవితానికి సంబంధించిన లక్ష్యాలు,  భవిష్యత్ ప్రణాళికలు వంటివి చేరుకోలేక పోతారు. సమస్యలు తగ్గించడానికి మార్గాలు: ఓపికగా వినాలి, సానుభూతితో స్పందించడం చాలా ముఖ్యం. స్పష్టమైన సంభాషణ  ఉండాలి. దీని వల్ల ఇద్దరి మధ్య అపార్థాలు రావు. పరస్పర గౌరవం ఉండాలి.  గౌరవం లేని బంధం ఎక్కువ కాలం నిలబడదు. చిన్న విషయాల్లో క్షమించటం నేర్చుకోవాలి.  అన్ని విషయాలకు పంతానికి పోతూ ఉంటే తనను గౌరవించట్లేదని భాగస్వామి అర్థం చేసుకునే అవకాశం ఉంది. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. ఇది భార్యాభర్తలు చేస్తున్న తప్పులు తెలియజేసి ఒకరితో ఒకరు ఎలా ఉండాలో తెలుసుకునేలా చేస్తుంది.                                                          *రూపశ్రీ.
  మన శరీరంలోని అన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి, అందుకే ఏదైనా ఒక భాగంలో సమస్య తలెత్తితే అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా గుండె-ఊపిరితిత్తుల వంటి అవయవాలలో ఏర్పడే సమస్యల గురించి మనమందరం  అప్రమత్తంగా ఉంటాము. ఆ సమస్యల గురించి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ కళ్ళు,  చెవులు వంటి అవయవాల ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపం. ఆరోగ్య నిపుణులు  కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కానీ ఈ అవయవాలలో సమస్యలు  తీవ్రమైన దుష్ప్రభావాల ప్రమాదాన్ని కూడా కలిగిస్తాయి. చాలామంది చెవులలో ఒకరకమైన శబ్ధం రావడం గమనిస్తుంటారు. ఇదొక టోన్ లాను, సముద్రపు హోరు లానూ, బీప్ వంటి శబ్ధం లాను ఉంటుంది. చాలామంది ఇదేమి చేస్తుందిలే.. తగ్గిపోతుంది. మనకు బాగా వినిపిస్తోంది కదా అనే నిర్లక్ష్యంతో పట్టించుకోరు. కానీ ఈ చెవి సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది  దీర్ఘకాలిక ప్రమాదాలను కలిగి ఉండే ప్రమాదముంది. ఇలా శబ్ధం వినిపించడాన్ని టిన్నిటస్ అని అంటారు.  టిన్నిటస్ సమస్య..  టిన్నిటస్ సమస్యలో  చెవులలో ఒకటి లేదా రెండింటిలో రింగింగ్ లేదా ఇతర శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇవి బయట నుండి వినిపించేవి కాదు. ఈ శబ్దాలు కేవలం ఈ సమస్య ఉన్నవ్యక్తులకే వినిపిస్తుంది . ఇతరులు దీన్ని వినలేదు. టిన్నిటస్ అనేది చాలా సాధారణ సమస్య  15% నుండి 20% మంది వ్యక్తులను ఇది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో ఇది వస్తుంటుంది. సాధారణంగా టిన్నిటస్ అనేది అంతర్లీన సమస్య వల్ల వస్తుందని, దానిని గమనించి చికిత్స చేయవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు.. ఆరోగ్య నిపుణులు, టిన్నిటస్ ను సాధారణంగా వయస్సు-సంబంధిత వినికిడి లోపం, చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్  వంటి అంతర్లీన సమస్య వల్ల సంభవించవచ్చని చెబుతున్నారు. ఈ పరిస్థితులను సకాలంలో గుర్తించకపోతే లేదా చికిత్స చేయకపోతే, దీని కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.  టిన్నిటస్ సమస్యకు  జలుబు వంటి ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు, దీని గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఈ సమస్యకు  సమయానికి చికిత్స చేయకపోతే, ఇది చెవికి సంబంధించి అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది, చెవుడు కూడా వ్వచే అవకాశం ఉంటుంది.  వినికిడి సమస్య శాశ్వతంగా తగ్గిపోవచ్చు.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు, మన చెవి లోపలి భాగంలో చిన్న, సున్నితమైన కణాలు ఉంటాయి, అవి ధ్వని తరంగాలను స్వీకరించినప్పుడు కంపిస్తాయి. లోపలి చెవిలో ఏదైనా సమస్య ఉంటే, అది టిన్నిటస్‌కు కూడా కారణమవుతుంది.  సమయానికి చికిత్స చేయకపోతే, చెవుల శక్తి  తగ్గిపోతుంది. ఇది కాకుండా, చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిలో ఏవైనా అడ్డుపడటం వల్ల కూడా  ఈ సమస్య రావచ్చు. చెవి ఇన్ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స అందకపోతే, మెదడు మాత్రమే కాకుండా ఇతర భాగాలపై కూడా దాని ప్రభావం పడే ప్రమాదం ఉంది.                              *నిశ్శబ్ద.
  కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పటి జీవనవిధానం మారింది. శారీరిక శ్రమ తగ్గిపోయింది, ఎక్కడికక్కడ పని సులువుగా జరిగిపోతోంది. కానీ అందుకు విరుద్ధంగా ఆహారపు అలవాట్లు మాత్రం దిగజారిపోయాయి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటే ‘కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌’. ఏమిటీ కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌! మన ఆహారంలో పిండిపదార్థలు ఓ ముఖ్య పాత్రని వహిస్తాయని తెలిసిందే! అయితే ఈ పిండి పదార్థాలను ఎడాపెడా తీసుకోవడం వల్ల వాటిలోని అధిక చక్కెర మన శరీరాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, స్వీట్లు, తియ్యటి తేనీరు, చాక్లెట్లు, ఐస్ క్రీములు... ఇలా చెప్పుకుంటో పోవాలే కానీ చక్కెర అధికంగా ఉండే పదార్థాల జాబితా చాంతాడుని మించిపోతుంది. కొంతమంది ఈ పదార్థాలను వదిలి లేకపోవడమే కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్. ఏం జరుగుతుంది కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌ ఉన్నవారు చక్కెర అధికరంగా ఉండే పదార్థాలను తినేందుకు ఉబలాడపడిపోతుంటారు. ఒకటి రెండు రోజుల పాటు ఇలాంటి పదార్థాల దొరక్కపోతే వీరికి చాలా చిరాగ్గా ఉంటుంది. పిల్లలైతే ఆ పదార్థాన్ని తీసుకునేదాకా పేచీ పెడుతూనే ఉంటారు. వీరి శరీరం చక్కెరకు అలవాటు పడటం వల్ల, చక్కెర తీసుకున్న వెంటనే వారి ఒంట్లో ‘డోపమైన్‌’ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ డోపమైన్‌ మనసు సంతోషంగా ఉన్న ఒక భావనని కలిగిస్తుంది. మద్యం వంటి వ్యసనాలలో కూడా ఈ డోపమైన్‌దే ముఖ్య పాత్ర. తరచూ ఏదో ఒక చక్కెర పదార్థాన్ని తినాలని నాలుక లాగుతూ ఉంటడం, ఎదురుగుండా ఎంత తీపి పదార్థం ఉంటే... అంతా తినేయడం, ఊబకాయం వస్తున్నా కూడా ఆహారాన్ని నియంత్రించుకోకపోవడం... ఇవన్నీ కూడా కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ లక్షణాలే! ప్రమాదం కార్బొహైడ్రేట్ ఎడిక్షన్‌ అనేది ఆషామాషీగా తీసుకోవల్సిన లక్షణం కాదని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. చిన్నవయసులో ఊబకాయం బారిన పడేవారిలో 75 శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తోందట. కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉన్న వారిలో ఇన్సులిన్‌ చాలా అధికంగా ఉత్పత్తి అవుతుంది. అది కొన్నాళ్లకి అస్తవ్యస్తంగా మారిపోయి, చక్కెర వ్యాధికి దారితీస్తుంది. ఇక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే గుండెజబ్బుల వంటి ఇతరత్రా సమస్యల గురించి చెప్పనే అక్కర్లేదు. పైగా చక్కెర అధికంగా ఉండే చాలా పదార్థాలలో విటమిన్లు, ఖనిజాలు తదితర పోషక పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా కనిపిస్తుందే కానీ, కూర్చుంటే లేవలేనంత నిస్సత్తువ ఉంటుంది. మరేం చేయడం! - ముందుగా తీపి పదార్థాలలోనే కాస్త ఆరోగ్యకరమైనవి ఎంచుకోండి. ఉదాహరణకు పండ్ల రసాలకు బదులుగా పండ్లు, ఐస్‌క్రీంకు బదులుగా పెరుగు... ఇలాగన్నమాట. - ఇంట్లో అదేపనిగా చిరుతిళ్లను నిలువ చేసుకోవడం అపేయండి. మీ ఇంట్లో చిరుతిండి డబ్బాలను ఖాళీ చేయండి. - ఆకలి వేయకపోయినా కూడా ఏదో ఒకటి తినాలని నోరు పీకేస్తుంటే బాదం పప్పులు, టమోటాలు, ఆమ్లెట్లు, మొలకలు... ఇలా తక్కువ పిండి పదార్థాలు ఉండే చిరుతిళ్లని తీసుకోండి. - నీరు తాగడం వల్ల ఆకలి తాత్కాలికంగా ఉపశమిస్తుంది. కడుపు నిండిన భావనా కలుగుతుంది. ఒంట్లోని చెడంతా బయటకి పోవడమూ ఉంటుంది. కాబట్టి కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ నుంచి బయటపడే వరకూ కాస్త మంచినీరుని ఆరారగా తీసుకుంటూ ఉండండి. - వ్యాయామం వంటి శారీరిక శ్రమను అలవాటు చేసుకోండి. దీని వల్ల కొవ్వు కరగడమే కాదు, శరీరంలో ‘నిజమైన’ ఆకలి మొదలవుతుంది. అది తీపి పదార్థాల మీద కాకుండా పోషక పదార్థాలను తీసుకోవాలని కోరుకుంటుంది. - మీ పిల్లల్లో కనుక కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉందని గమనిస్తే, వారిని కూర్చోపెట్టి అందులోని లాభనష్టాల గురించి వివరించండి. - నిర్జర. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇందుకోసం ఏవేవో చెయ్యక్కర్లేదు. తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటుంటే ఆరోగ్యం ఆఫహే చేకూరుతుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తినమని పెద్దలు చెబుతారు. అన్ని రకాల కూరగాయలు తిన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. కానీ చాలామంది కొన్నింటికి స్టిక్ అయిపోయి ఉంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా కొందరు కొన్ని కూరగాయలను, పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి వాటిలో కాకరకాయ కూడా ఒకటి. పిల్లలకు ఏమాత్రం ఇష్టం లేని ఈ కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా విపరీతంగా తింటే చెప్పలేనన్ని సమస్యలు వస్తాయి.  కాకరకాయ తినడం వల్ల బరువు తగ్గవచ్చు, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. గుండె వేగాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కాకరకాయ ఉపయోగపడుతుంది. అయితే కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల బోలెడు నష్టాలు ఫేస్ చేయాల్సిందే.. ఏదైనా మితిమీరితే హానికరం అనే మాట తెల్సిందే కదా.. కాకరకాయను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై పడే చెడు ప్రభావాల గురించి నష్టాల గురించి తెలుసుకుంటే..  కాకరకాయ  తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని అందరూ అనుకుంటారు. అయితే సాధారణ వ్యక్తుల్లో షుగర్ లెవల్స్ సాధాణంగానే ఉంటాయి. ఇలాంటి వారు కాకరకాయను ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ మీద ప్రభావం పడుతుంది. అలాగే అధిక షుగర్ లెవెల్స్ ఉన్నవారు షుగర్ కంట్రోల్ ఉండటానికి మెడిసిన్ వాడుతుంటారు. ఇలాంటి వాళ్ళు కాకరకాయ ఎక్కువ తిన్నా షుగర్ లెవల్స్ డౌన్ అవుతాయి. అలాగే, హిమోలిటిక్ అనీమియా ప్రమాదం కూడా కాకరకాయ ఎక్కువ తినడం వల్ల పెరుగుతుంది. గర్భధారణ సమయంలో కాకరకాయను తినకూడదు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు కాకరకాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.  కాకరకాయను ఎక్కువగా తీసుకునేవారికి కాలేయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  కాకరకాయలో లెక్టిన్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల కాలేయంలో ప్రొటీన్ల కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. అందుకే పొట్లకాయను రెగ్యులర్ గా, ఎక్కువగా తినకూడదు. కాకరకాయ ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు, వాంతుల సమస్య పెరుగుతుంది. కాకరకాయలో బోలెడు ప్రయోజనాలున్నాయని దాన్ని ఇంట్లో వారికి, పిల్లలకు ఎక్కువగా వండిపెట్టే వారు దీనిగురించి తెలుసుకోవాలి. ఆరోగ్యానికి మంచిదే అయినా హాని కూడా కలిగించడంలో కాకరకాయ కూడా ఒకటనే విషయం మరచిపోకూడదు.                                        ◆నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...