
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్పూర్లో కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది.
మార్చి 4న హైదరాబాద్లో విజయ్-రష్మిక వివాహ రిసెప్షన్ ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. (Virosh wedding reception)

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులను కలిసి తమ వివాహ రిసెప్షన్ కు హాజరు కావాలని రష్మిక ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సతీమణి.. రష్మికకు బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను బహుకరించారు.

ఇదిలా ఉంటే ఆహ్వానం లేకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఇబ్బందులు పడవద్దని అభిమానులను విజయ్, రష్మిక కోరారు. ఈ మేరకు వారి టీమ్ కీలక ప్రకటన చేసింది.
"విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో గెస్ట్ లు రిసెప్షన్ లో పాల్గొననున్నారు. ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీస్ ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావొద్దని విరోష్ జంట కూడా కోరుతున్నారు." టీమ్ తెలిపింది.
?s=20






.webp)
