Home

»

Latest News

చిన్న హీరో, పెద్ద సాయం..118 మంది విద్యార్థులకి ఏం సాయం చేసాడో తెలుసా! 

Jun 5, 2026 5:27PM

 

 

కొందరు హీరోలు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను తామేంటో నిరూపించుకుంటూ ప్రజల హృదయాల్లో రియల్ హీరోలుగా నిలిచిపోతారు. అలాంటి వారిలో యువ నటుడు సంజోష్ ఒకరు. ‘బేవార్స్’, ‘సోదర’ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో, సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సమాజంలో వెనుకబడిన, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చదువే అసలైన ఆయుధమని నమ్మిన సంజోష్, అందుకోసం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తున్నారు. తాను సంపాదించిన దానిలో కొంత భాగమైనా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉన్నత ఆశయంతో ఆయన స్థాపించిన ‘సంజోష్ ఫౌండేషన్’ నిరంతరం అద్భుతమైన సేవలను అందిస్తోంది.

ఇటీవల తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరునాగారం పరిసర ప్రాంతాల్లో సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక చారిత్రాత్మక స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. చదువుకోవాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ, ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న గిరిజన, వెనుకబడిన, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. కేవలం ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి మరింత ప్రోత్సహించడమే ఈ సేవా యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం. గిరిజన గూడాల్లో, అటవీ ప్రాంతాల్లో సరైన వనరులు లేకపోయినా కష్టపడి చదివిన విద్యార్థుల ముఖాల్లో ఈ కార్యక్రమం కొండంత ఆనందాన్ని నింపింది.

ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా పరిధిలోని వివిధ గ్రామాలకి చెందిన  118 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి స్కాలర్‌షిప్‌లు అందజేశారు. విద్యార్థులను ఎంపిక చేయడంలో ఫౌండేషన్ పారదర్శకమైన, కఠినమైన ప్రమాణాలను పాటించింది. 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులని, ఇంటర్మీడియట్ విద్యలో 900 కంటే ఎక్కువ మార్కులు సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారిని గుర్తించి ఈ పురస్కారాలకి  ఎంపిక చేశారు. ఇలా అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ విద్యా ప్రమాణాలను చాటిన 118 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి  2,000 చొప్పున నగదు స్కాలర్‌షిప్‌లను హీరో సంజోష్ స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు.

also read: Peddi: పెద్దిపై గాయని సుమంగళి సంచలన వ్యాఖ్యలు

ఈ నగదు పురస్కారం కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, ఉన్నత చదువులు చదవాలనుకునే ఆ పేద గిరిజన బిడ్డల భవిష్యత్తుకు సంజోష్ ఇచ్చిన ఒక నమ్మకం, ఒక పెద్ద భరోసా. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యా దీపాన్ని వెలిగించడానికి సంజోష్ ఫౌండేషన్ చేస్తున్న ఈ కృషీ వలయానికి స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. కేవలం స్కాలర్‌షిప్‌లు ఇవ్వడమే కాకుండా, రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతాలలోని పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం వంటి మరెన్నో విస్తృతమైన సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు సంజోష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com