![]() |
![]() |

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత అస్వస్థతకు గురయ్యింది. డిసెంబర్ 12 (ఆదివారం) ఆమె కడపలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. అనంతరం ప్రఖ్యాత కడప దర్గను సందర్శించి, ప్రార్థనలు చేసింది. ఆ కార్యక్రమం తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆమె నిస్సత్తువకు గురయ్యింది. జలుబు, జ్వరంతో బాధపడ్డ ఆమె చికిత్స నిమిత్తం ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మెడిసిన్స్ రాసిచ్చి, ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు.
Also read: 11వ రోజు 'సైరా', 'అల.. వైకుంఠపురములో'ను మించిన 'అఖండ'!
ఈలోగా సమంతకు తీవ్ర అస్వస్థత అంటూ సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూపుల్లో అసత్య వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఆమె మేనేజర్ మహేంద్ర ఖండించారు. సమంత ఆరోగ్యంగానే ఉన్నారనీ, దగ్గు వస్తుండటంతో హాస్పిటల్కు వెళ్లి చికిత్స తీసుకొని వచ్చారని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దనీ ఆయన సూచించారు.
![]() |
![]() |