![]() |
![]() |

అల్లరి నరేష్ సరసన 'మేడ మీద అబ్బాయి' సినిమాలో నటించిన నిఖిలా విమల్ గుర్తుందా? ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేసింది. 'గాయత్రి'లో మంచు మోహన్బాబు కుమార్తెగా నటించింది. ఇప్పుడీ హీరోయిన్ కరోనా కాల్ సెంటర్లో తన సేవలు అందిస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే... నిఖిలా విమల్ సొంతూరు కేరళలోని తలిపారంబ. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో కన్నూర్ జిల్లా పంచాయత్ ఆఫీసులో కరోనా కాల్ సెంటర్ ఉంది. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంటి నుండి బయటకు అడుగుపెట్టకుండా, ఫోనులో వాళ్లకు అవసరమైన నిత్యావసరాలను సరఫరా చేయడంలో ఈ కాల్ సెంటర్ సహాయం చేస్తోంది. తనకు తాను స్వచ్ఛందంగా కాల్ సెంటర్లో నిఖిల పని చేస్తోంది. తన సేవలు అందిస్తోంది.
"ప్రజలకు వాలంటీర్ల ద్వారా అవసరమైన వస్తువులు అందించడమే కాల్ సెంటర్ మోటో. అందువల్ల, ప్రజలు బయటకు రారు కదా. ఫోన్ చేసిన ప్రజలతో మాట్లాడి, వాళ్లకు కావాల్సిన వస్తువుల లిస్ట్ రాసుకుని ఇవ్వడమే నా పని. ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కరోనా కాల్ సెంటర్లో పని చేస్తున్నా. ప్రయాణాలపై ఆంక్షలు, పరిమితులు విధిస్తుండడంతో రోజూ వెళ్లలేకపోతున్నా" అని నిఖిలా విమల్ తెలిపింది. ప్రముఖులు ఈ విధమైన సేవ చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం వస్తుంది. పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది.
![]() |
![]() |