![]() |
![]() |

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల జీవిత కథలని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కోవలోనే గత ఏడాది 'మేజర్ ముకుంద్ వరదరాజన్'(Major Mukund varadarajan)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'అమరన్'(Amaran)వచ్చి ప్రతి ఒక్క భారతీయుడిలో దేశభక్తిని మెండుగా నింపింది. దేశం కోసం తల్లితండ్రులని, భార్యా బిడ్డలని వదిలేసి,పోరాడిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి కూడా పెట్టించింది.
ఈ కోవలోనే 'మే' 9 న పాకిస్థాన్ కి చెందిన తీవ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన 'మురళి నాయక్'(Murali Nayak)జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతుంది. టైటిల్ రోల్ ని 'సోలో బాయ్' మూవీ ఫేమ్ గౌతమ్ కృష్ణ(Gautham Krishna)పోషిస్తున్నాడు. ఈ మేరకు మేకర్స్ అధికారంగా తెలపడంతో పాటు, అందుకు సంబంధించి రిలీజ్ చేసిన 'పోస్టర్' బయోపిక్ ఏ స్థాయిలో రూపుదిద్దుకోబోతుందో చెప్తుంది. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై కె.సురేష్ బాబు(K. Suresh Babu)పాన్, ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్లోని 'పహల్ గామ్'(Pahal Gam)దగ్గర పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులు సుమారు 22 మందిని అత్యంత పాశవికంగా హత మార్చారు. ఇందుకు ప్రతిగా మన సైన్యం 'ఆపరేషన్ సిందూర్'(Operation sindoor)ని నిర్వచించి తీవ్రవాదులని మట్టుబెట్టడం జరిగింది. ఈ సంఘటనతో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో మహారాష్ట్రలోని 'నాసిక్' వద్ద విధులు నిర్వహిస్తున్న మురళి నాయక్ ని అధికారులు జమ్మూ కాశ్మీర్ కి పిలిపించారు. అక్కడి చేరుకున్న మురళి నాయక్ పాకిస్థాన్ తీవ్రవాదులని కొంత మందిని మట్టుబెట్టాడు. ఆ తర్వాత కాల్పుల్లో వీరమరణం పొందాడు. మురళి నాయక్ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లి తండా. మురళి నాయక్ జీవిత కథ సినిమాగా రావడం పట్ల తండా వాసులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

![]() |
![]() |