![]() |
![]() |

సుదీర్ఘ కాలం నుంచే మలయాళ సూపర్ స్టార్ 'మోహన్ లాల్'(MOhanLal)కి పాన్ ఇండియా నటుడుగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. నాలుగున్నర దశాబ్దాలుగా ఎన్నో హిట్ చిత్రాల్లో వైవిద్యమైన పాత్రలని పోషిస్తు అభిమానులని పెంచుకుంటూనే వస్తున్నాడు. రీసెంట్ గా 'హృదయపూర్వం' అనే రొమాంటిక్ కామెడీ మూవీతో వచ్చి విజయాన్నిఅందుకున్న మోహన్ లాల్, అక్టోబర్ 16 న 'వృషభ' అనే ఎపిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'దృశ్యం పార్ట్ 3 ' కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. పాట్రియట్, రామ్ అనే చిత్రాలు కూడా మోహన్ లాల్ లిస్ట్ లో ఉన్నాయి.
ఈ చిత్రాల్ని సెట్స్ పై ఉండగానే జై భీమ్, వేట్టయ్యన్ వంటి విభిన్న చిత్రాల దర్శకుడు 'టిజె జ్ఞానవేల్'(TJ Gnanavel)కి కూడా మోహన్ లాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తమిళనాడుకి చెందిన 'శరవణ భవన్' హోటల్ యజమాని రాజగోపాల్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుందని, ఈ మేరకు మోహన్ లాల్ కి జ్ఞానవేల్ స్టోరీ మొత్తం చెప్పాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకి చెందిన రాజగోపాల్ చదువు లేకపోయినా 1981 లో చెన్నైలో శరవణ భవన్(Saravana Bhavan)పేరుతో హోటల్ స్థాపించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి భారత దేశ వ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్ లని ఏర్పాటు చేసి కస్టమర్ల మన్ననలు పొందాడు. స్టాఫ్ ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుని, వాళ్ల పిల్లలకి చదువుకి సంబంధించిన బాద్యతలని చూసుకునే వాడు.
కానీ జాతకాల్ని విపరీతంగా నమ్మే రాజగోపాల్ తన ఉద్యోగి భార్యని పెళ్లి చేసుకోవాలనుకొని ఆమె భర్తని చంపిన కేసులో అరెస్ట్ అయ్యాడు. 2019 లో జైలులో అనారోగ్యానికి గురయ్యి చనిపోయాడు. ఈ నేపథ్యంలో మోహన్ లాల్, జ్ఞానవేల్ చిత్రానికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. 'దోస కింగ్'(Dosa King)అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. శరవణన్ కి ఇద్దరు భార్యలు.

![]() |
![]() |