![]() |
![]() |

కరోనా ఎఫెక్ట్ ఎలా ఉన్నా.. వారం వారం వినోదానికి ఢోకా లేకుండాపోతోంది సినీ ప్రియులకు. ఒకవైపు ఓటీటీలో.. మరోవైపు థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తూ ప్రేక్షకులకు బాగానే ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే.. ఈ డిసెంబర్ 31న కూడా నాలుగు ఆసక్తికరమైన చిత్రాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. వీటిలో మూడు స్ట్రయిట్ మూవీస్ కాగా.. ఒకటి తమిళ డబ్బింగ్. అంతేకాదు.. ఇవన్నీ కూడా విభిన్న తరహా చిత్రాలే కావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన పిరియడ్ డ్రామా `1945` డిసెంబర్ 31న జనం ముందుకు రానుంది. అలాగే అదే రోజున కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో నటించిన `గుడ్ లక్ సఖి` తెరపైకి వస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కీర్తి షూటర్ గా దర్శనమివ్వనుంది. ఇక అదే డిసెంబర్ 31న శ్రీ విష్ణు నటించిన `అర్జున.. ఫాల్గుణ..` రిలీజ్ కానుంది. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని బజ్. అదే విధంగా.. ఆర్య, రాశీ ఖన్నా జంటగా నటించిన కోలీవుడ్ కామెడీ హారర్ `అరణ్మణై 3` తెలుగులో `అంతఃపురం` పేరుతో ఏడాది చివరి రోజే విడుదలకు సిద్ధమైంది.
మరి.. 2021 చివరి రోజైన డిసెంబర్ 31న రాబోతున్న ఈ నాలుగు విభిన్న చిత్రాల్లో వేటికి జనాదరణ దక్కుతుందో చూడాలి.
![]() |
![]() |