![]() |
![]() |

ఇప్పుడు ఘట్టమనేని అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకుల దృష్టి 'శ్రీనివాస మంగాపురం' పై పడింది. దివంగత రమేష్ బాబు తనయుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణ ఎలా మెప్పిస్తాడనే ఆసక్తినే అందుకు కారణం. యాక్షన్ రొమాంటిక్ అంశాలతో తెరకెక్కగా ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో కల్ట్ హిట్స్ అందుకున్న అజయ్ భూపతి దర్శకుడు. పైగా వైజయంతీ మూవీస్ సమర్పణలో లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రొడ్యూసర్. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
శ్రీనివాస మంగాపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 2న హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న శిల్ప కళావేదికలో జరుగుతుంది. తన అన్న కొడుకు జయకృష్ణని ఆశీర్వదించడానికి మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు అధికారికంగా ఖరారైంది. ఇప్పటికే ఈ టీజర్ని సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేసిన మహేష్, జయకృష్ణ సినిమా ప్రయాణం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ బెస్ట్ విషెస్ తెలిపారు. ఇప్పుడు నేరుగా వేదికపైకి వచ్చి వారసుడిని దీవించనుండటంతో ఘట్టమనేని అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. దీంతో జూలై 2న జరిగే ఈ ఈవెంట్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.పైగా వారాణసి తో బిజీగా ఉన్న మహేష్ బాబు చాలా రోజుల తర్వాత పాల్గొంటున్న ఫస్ట్ ఈవెంట్ కూడా ఇదే.
Also read: Dance master: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రముఖ డాన్స్ మాస్టర్ మృతి
జయకృష్ణకి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. శ్రీను, మంగలుగా వీరిద్దరి మధ్య సాగే లవ్ ట్రాక్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. సినిమాలో మొత్తం 7 పాటలు ఉండగా, దర్శకుడు అజయ్ భూపతి తెలిపిన వివరాల ప్రకారం ప్రతి ట్యూన్ను జి. వి. ప్రకాష్ కేవలం 2 గంటల్లోనే కంపోజ్ చేయడం విశేషం. ఇప్పటికే విడుదలైన ‘అలెల్లే అలెల్లే’ వంటి రొమాంటిక్ నంబర్స్ యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి ఆడియో బ్లాక్బస్టర్గా నిలిచాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్ రోల్ లో కనిపిస్తుండటంతో మూవీపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.
![]() |
![]() |