![]() |
![]() |

ఇటీవల 'కూలీ'తో ప్రేక్షకులకు పలకరించిన సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్-2' చేస్తున్నారు. అలాగే పలువురు దర్శకులు రజినీకాంత్ కి కథలు వినిపిస్తున్నారు. ఇటీవల 'కంగువా' ఫేమ్ శివ దర్శకత్వంలో రజినీ ఓ సినిమా చేయనున్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు తెరపైకి వచ్చింది.
'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. 'మహానటి', 'కల్కి 2898 AD' సినిమాలతో ఎంతో పేరు సంపాదించారు. నిజానికి నాగ్ అశ్విన్ 'కల్కి-2' చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ కోసం చాలా రోజులు ఎదురుచూడాలి. అందుకే ఈలోపు మరో ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు నాగ్ అశ్విన్. ఆ మధ్య అలియా భట్ తో ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల రజినీకాంత్ ను కలిసి నాగ్ అశ్విన్ ఓ స్టోరీ లైన్ వినిపించారట. దానికి ఇంప్రెస్ అయిన రజినీ.. కంప్లీట్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందట.
టాలీవుడ్ కి చెందిన బాబీ, వశిష్ఠ, వివేక్ ఆత్రేయ వంటి దర్శకులు కూడా గతంలో రజినీకాంత్ కి కథలు చెప్పారు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్ లు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ మాత్రం కార్యరూపం దాల్చే అవకాశముందని అంటున్నారు. అదే జరిగి రజినీకాంత్ తో నాగ్ అశ్విన్ సినిమా చేస్తే మాత్రం.. 'కల్కి-2' అనుకున్న దానికన్నా ఎక్కువ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |