![]() |
![]() |

ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్( gautham vasudev menon)తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచయమే. వెంకటేష్ తో ఘర్షణ,నాగచైతన్యతో ఏ మాయచేసావే,సాహసం శ్వాసగా సాగిపో,నాని తో ఏటోవెళ్లిపోయింది మనసు లాంటి చిత్రాలని తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శకుడుగా మారాడు.
ప్రస్తుతం ఆయన మలయాళంలో మమ్ముట్టి(Mammootty)హీరోగా 'డొమినిక్ అండ్ లేడీస్ పర్స్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 23 న విడుదల కానుంది.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తమిళ చిత్ర పరిశ్రమని ఉద్దేశించి గౌతమ్ మాట్లాడుతు కోలీవుడ్ హీరోలు స్క్రిప్ట్ ల గురించి కంటే భారీ బడ్జెట్ సినిమాల్లో నటించడానికే విలువ ఇస్తారు.100 కోట్లు ఖర్చుపెట్టి ఒక సినిమా తీసేకంటే ఆ డబ్బుతో 10 కోట్ల చొప్పున పది సినిమాలు తెరకెక్కించవచ్చు.

కథల ఎంపిక నాకు ఇస్తే మలయాళ సినీ పరిశ్రమలోకి ఎన్నో కథల్ని తీసుకొచ్చి ఇక్కడ తెరకెక్కిస్తాను.అలాంటి కథలకి తమిళ హీరోలు ఓకే చెప్పరు కానీ, ఇక్కడ విజయం సాధిస్తే మళ్ళీ ఆ సినిమాలని తమిళంలోకి రీమేక్ చేస్తారు.ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను ఇక తమిళ ఇండస్ట్రీ లో కొనసాగకపోవచ్చని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతానికి ఆయన మాటలు వైరల్ గా నిలిచాయి. నటుడుగా కూడా గౌతమ్ చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
![]() |
![]() |