![]() |
![]() |

అక్కినేని నాగచైతన్య(naga chaitanya)శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)వివాహం ఈ నెల 4 న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.ఆ తర్వాత నూతన జంట నాగార్జునతో కలిసి శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జునుడిని కూడా దర్శించుకోడం జరిగింది.
ఇక చైతు రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వేదికగా టెలికాస్ట్ అవుతున్న 'రానా టాక్ షో'(rana talk show)అనే ప్రోగ్రాం లో మాట్లాడుతు నాకు ఇద్దరు పిల్లలు చాలు.యాభై ఏళ్ళు వచ్చే సరికి వాళ్ళతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను.కొడుకు పుడితే వాడ్ని రేస్ ట్రాక్ కి తీసుకెళ్తాను.కూతురు పుడితే తనకున్న హాబీలని గుర్తించి ప్రోత్సహిస్తాను.వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతు మనం చిన్నప్పుడు పిల్లలుగా ఎంజాయ్ చేసిన క్షణాలని మళ్ళీ వాళ్ళతో కలిసి ఆస్వాదించాలని ఉందని తెలిపాడు.ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి
ఇక చైతు సినీ కెరీర్ విషయాన్ని వస్తే ప్రస్తుతం తండేల్ అనే మూవీ చేస్తున్నాడు.అందులో సాయిపల్లవి(sai pallavi)హీరోయిన్ కాగా ఇటీవలే కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ ని అందుకున్న చందు మొండేటి దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.గీతా ఆర్ట్స్ పతాకం పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న తండేల్ చైతు కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతుండగా ఫిబ్రవరి 7 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
![]() |
![]() |