![]() |
![]() |

నటరత్న పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు (NTR) నటించిన ప్రప్రథమ చిత్రం "మన దేశం" 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 14వ తేదీన విజయవాడలో ఒక వేడుకను నిర్వహించాలని తెలుగు సినీ పరిశ్రమ నిర్ణయించింది. ఆ వేడుక ఏర్పాట్లను గురించి చర్చించుటకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హైదరాబాద్ కార్యాలయంలో డిసెంబర్ 4 సాయంత్రం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రతినిధులు అందరూ కలిసి వేడుక గురించి వివరముగా చర్చించడం జరిగినది. ఈ వేడుకలో సినీ ప్రదర్శకులు, సినీ పంపిణీదారులు, సినీ నిర్మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు.
![]() |
![]() |