Home  »  News  »  ఢిల్లీలోని ఏపి భవన్ లో విశాఖ ఉక్కు సినిమా గురించి సత్యారెడ్డి కీలక వ్యాఖ్యలు

Updated : Nov 14, 2024

విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదంతో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి(sathya reddy)నిర్మించిన చిత్రం ఉక్కు సత్యాగ్రహం(ukku satyagraham)ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్(gaddar)ఈ చిత్రంలో మూడు పాటలు పాడటమే కాకుండా రెండు పాటలతో పాటు కొన్ని సందేశాత్మక సీన్స్ లో కూడా నటించారు.పైగా ఆయన నటించిన ఆఖరి చిత్రం కూడా ఇదే. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించిన ఈ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది.

ఈసందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత, కథానాయకుడు సత్యారెడ్డి ఢిల్లీ లోని ఏ పి భవన్ లో  మాట్లాడుతువిశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణత్యాగాల తో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా, గద్దర్ అన్న తో కలిసి ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను నిర్మించాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని అన్ని కార్మిక సంఘాలు, సంఘ నాయకులు, భూ నిర్వాసితులు మా సినిమాలో  నటించారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమాను నిర్మించామని సెన్సార్ లేట్ అవ్వడం వల్ల మరియు గద్దర్ గారి మరణం వలన ఈ సినిమా ఇన్ని రోజులు వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని 300కు పైగా థియేటర్లలో ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నాం. ఈ కాలంలో విప్లవానికి సంబంధించిన సినిమాలు తీయడం చాలా కష్టం. సెన్సార్ ఆపేస్తారు సినిమాని విడుదలకుండా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆగకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా విజయాన్ని సాధించిన కారణంగా ఈ సినిమాని ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.

 ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు ఏం జరిగింది? అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ను మద్రాస్ లో పెట్టాలి అని ఇందిరాగాంధీ గారు అనుకున్నప్పుడు ఏం జరిగింది? అనేది చూపించాం. ఈ కథని గద్దర్ అన్నే రాసాడు.నాలుగు పాటలు కూడా  రాసి కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా  నటించారు. తన వారసులు ఎలా ఉండాలి ఉద్యమాలు ఎలా నిర్మించాలి అనేది కూడా ఆయన చనిపోయే ముందు రాసుకున్న చివరి పాట. ఉద్యమకారులు, గద్దర్ గారి అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.పల్సర్ బైక్ ఝాన్సీ, మాజీ ఎం ఎల్ ఏ కరణం ధర్మశ్రీ, ఎంవివి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల.తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. శ్రీ కోటి సంగీతాన్ని అందించాడు.

 

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.