![]() |
![]() |

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో 'శతమానం భవతి' ఒకటి. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా.. బరిలో చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150', బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఉన్నప్పటికీ కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. నేషనల్ అవార్డుతో పాటు పలు అవార్డులు సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదలై ఏడేళ్లు అవుతున్న సందర్భంగా మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు.
'శతమానం భవతి' విడుదలై ఏడేళ్లు అవుతున్న సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. "శతమానం భవతి నెక్స్ట్ పేజి.. లోడింగ్ సూన్.. వచ్చే సంక్రాంతికి కలుద్దాం" అని తెలిపారు. సీక్వెల్ ని అనౌన్స్ చేయడమే కాకుండా, వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు తెలపడం చూస్తుంటే.. మేకర్స్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారని అర్థమవుతోంది.

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించిన 'శతమానం భవతి' చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. మరి సీక్వెల్ కి కూడా ఇదే టీం కొనసాగుతుందా లేదా? అనే దానిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |