![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి టాలీవుడ్ లో పలు భారీ చిత్రాలకి మాటలు రాస్తున్న సాయిమాధవ్ బుర్రా పనిచేయబోతున్నారు.
ప్రస్తుతం సాయిమాధవ్ చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్', పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు', పవన్-రానా నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్, శాకుంతలం చిత్రాలతో పాటు పలు భారీ చిత్రాలకు సాయిమాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. తాజాగా ఆయన చేతిలో మరో క్రేజీ ప్రాజెక్టు చేరింది. చరణ్-శంకర్ సినిమాకి డైలాగ్ రైటర్ గా సాయిమాధవ్ ఫిక్స్ అయ్యారు.
ఇటీవల చెన్నయ్ వెళ్ళిన సాయిమాధవ్.. డైరెక్టర్ శంకర్ ను కలిశారు. "జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫోటో దిగితే చాలనుకున్నాను. ఇప్పుడు ఆయన సినిమాకి మాటలు రాస్తున్నాను. అందుకు కారకులైన దిల్ రాజు, చరణ్ కు కృతజ్ఞతలు" అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్న సాయిమాధవ్.. శంకర్ తో దిగిన ఫోటోని షేర్ చేశారు.
![]() |
![]() |