మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో పాన్ ఇండియా యాక్టర్ సోను సూద్ దేశవ్యాప్తంగా ఆపదల్లో ఉన్నవారికి, అన్నార్తులకు, అభాగ్యులకు, కరోనా బాధితులకు, అవసరం ఉన్నవారికి చేస్తున్న సాయం అపూర్వం. ప్రభుత్వాలు చేసే పనిని తన టీమ్తో ఒక వ్యవస్థగా మారి చేసుకుపోతున్నాడు సోను. టాలీవుడ్లోనూ ఓ చిన్ననటుడు ఆ తరహాలోనే ఆపన్నులకు అండగా నిలుస్తున్నాడు. అతని పేరు జీవన్ కుమార్. అతను చేస్తున్న సాయం చాలా మందికి అండగా నిలుస్తోంది.
గతేడాది కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల, భోజనం పంపిణీ చేసిన జీవన్ కుమార్ అండ్ టీం సేవలు ఇప్పుడుకూడా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. నిరుపేదలు, కరోనా బారిన పడి ఎవరి అండా లేని వారికి జీవన్ కుమార్ అండ్ టీం మేమున్నాం అనే భరోసా నిస్తుంది. మూడు వందల కరోనా పేషెంట్స్ రోజూ కడుపు నింపుతున్నాడు జీవన్. ఎలాంటి సహాయం అయినా తన శక్తికి మించి సాయం అందిస్తున్న ఇతని పెద్ద మనసును అందరూ కొనియాడుతున్నారు.
నటుడిగా 'ఈ నగరానికి ఏమైంది?' నుండి మొదలైన ప్రయాణం సక్సెస్ పుల్ గా సాగుతుంది. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'జాతిరత్నాలు'లో అతని పాత్ర మంచి గుర్తింపు తెచ్చింది. స్వతహాగా రెస్టారెంట్ బిజినెస్ లో అనుభవం కల జీవన్ కుమార్ గత సంవత్సరం తన రెస్టారెంట్ నుండే కరోనా సహాయ కార్యక్రమాలను కొనసాగించాడు. మానవతావాదిగా జీవన్ కుమార్ అందించిన సేవలను సైబర్ బాద్ కమీషనర్ సజ్జనార్ కొనియాడారు.
ఇప్పుడు కూడా జీవన్ తన దాతృత్వాన్ని వదలలేదు. తన టీంతో బద్రాద్రి కొత్తగూడం లో ని ట్రైబల్ ఎరియాలకు ఏకంగా 10వేల కేజీల రైస్ ని పంపిణీ చేశాడు. ఆక్సిజన్ కొరత ఇప్పడు ఎంత పెద్ద సమస్యో అందరికీ తెలిసిందే. ఈ టైంలో ఆక్సిజన్ రీఫిలింగ్ సెంటర్ ల నుంచి 200 సిలెండర్స్ ని అత్యవసర కేసులకు అందించగలిగాడు. మాస్క్ లు, శానిటైజర్స్ అందుబాటులో లేని పేదలకు వాటిని ఇంటి ఇంటికి తిరిగి పంపిణీ చేసి వాటిపై అవగాహన కల్పించాడు. రోజూ మూడు వందల కు పైగా కరోనా పేషెంట్స్ కి పోషకాహారం అందిస్తున్నాడు జీవన్ కుమార్.
కరోనా సెంకండ్ వేవ్ మొదలైన దగ్గర నుండి జీవన్ కుమార్ తన టీంతో కరోనా పేషెంట్స్ కి పోషకాహారం అందిస్తున్నాడు. రోజుకు మూడు వందల కి ఆకలి తీర్చుతున్నాడు. అతని సేవలకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు ప్రశంసలు తెలుపుతున్నారు. జీవన్ తనకున్న సేవా గుణంతో చేస్తున్న సేవలకు చాలా మంది అండగా నిలుస్తున్నారు. జీవన్ నటుడిగా తనదైన ప్రయాణం చేస్తూనే నిజ జీవితంలో హీరో గా నిలిచాడు.