Home  »  News  »  థియేటర్స్ యాజమాన్యానికి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. కీలక ఉత్తర్వులు జారీ  

Updated : May 27, 2025

జూన్ 1 నుంచి థియేటర్స్(Theaters)బంద్ చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన అప్ కమింగ్ మూవీ హరి హర వీరమల్లు(Hari Hara veeramallu)ని అడ్డుకోవడానికే బంద్ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయంపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక కమిటీని కూడా వెయ్యడం జరిగింది. అనంతరం సినీ పెద్దలు థియేటర్స్ బంద్ ని ఎవరు అధికారకంగా అనౌన్స్ చెయ్యలేదని, థియేటర్ బంద్ చెయ్యడం అంత ఈజీ కాదని చెప్పుకొచ్చారు.

తాజాగా ఈ మొత్తం అంశంపై  ఉప ముఖ్యమంత్రి 'పవన్ కళ్యాణ్' కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలయ్యింది. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫు వాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు. ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చెయ్యాలి. కొత్త చిత్రాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు కావాలంటే, నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వానికి అర్జీ    ఇవ్వాలి. నా సినిమా హరిహర వీరమల్లు కి ఇదే రూల్ వర్తిస్తుంది. ఇందులో తనమన బేధాలు పాటించకూడదు. 

 టికెట్ ధర కంటే హాల్స్ లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, మంచి నీళ్ల సీసాల ధరలు ఎంతకు విక్రయిస్తున్నారు, వాటిల్లో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ  చేపట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చినందున విచారణ చేపట్టాలి. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్ కి రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదు.ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్యా పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చేసుకుంటాయి.  

తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం. తదితర అంశాలు కూడా చర్చలకి వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు. ఈ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనకగల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దన్నారు. నిర్మాతలని కావచ్చు, నటులని కావచ్చు, దర్శకులని కావచ్చు. బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించాలనుకొనే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వకుండా, సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందనే  విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.