![]() |
![]() |

ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ పాన్ ఇండియా మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్ కావడంతో కేవలం ప్రకటనతోనే డ్రాగన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు షూటింగ్ కి ముహూర్తం ఖరారైంది. (NTR Neel)
ఫిబ్రవరి 20 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో 'డ్రాగన్' రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. పది రోజుల పాటు జరగనున్న మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనట్లేదని తెలుస్తోంది. 1950 సెటప్ లో దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు మరియు కొందరు ఇతర నటీనటులతో.. ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. మార్చిలో జరగనున్న రెండో షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ పాల్గొంటాడని సమాచారం. (Dragon)
డ్రాగన్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. టోవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు వినికిడి. ఈ సినిమా 2026, జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |